4, ఫిబ్రవరి 2024, ఆదివారం

పెరుగుతున్న క్యాన్సర్ కేసులు: ఫ్రీ

 *🦀భారత మహిళల్లో వేగంగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు: ఫ్రీజ్‌ను త్వరగా వదిలించుకోండి.*

  🧊ఫ్రీజ్ ఐటమ్స్ మరియు క్యాన్సర్ మధ్య సంబంధం ఏమిటి?

   🧊పాల నుంచి పెరుగు, వెన్న వరకు...

   సాగో సోయా సాస్,

   పిండి,

   రవ్వ,

   ఊరగాయ,

   సుగంధ ద్రవ్యాలు

   బాదం

   కూరగాయలు,

   ఫ్రిజ్‌లో ఏదైనా నింపండి

   ఇది స్త్రీల వైఖరి.

   ఇది మాత్రమే కాదు

   తిన్న తర్వాత సగం పండు మిగిలిపోయింది.

   నిన్న వండిన పప్పు, అన్నం,

   కూరగాయలు,

   సుగంధ ద్రవ్యాలు,

   అన్ని రకములు

   మసాలా ప్యాకెట్లు,

   చల్లని పానీయాలు,

   స్వీట్లు,

   ఖరీదైన వస్తువులు!

   మీ ఫ్రిజ్‌లో ఉన్న ఈ వస్తువులన్నీ చాలా మంచివని మీకు అపోహ ఉంది. కానీ అది క్యాన్సర్‌ వైరస్‌ని సృష్టిస్తోంది.

   మీరు 1,000 మంది వ్యక్తులపై జరిపిన అధ్యయనంలో 1,000 మందిలో 538 మంది క్యాన్సర్‌తో బాధపడుతున్నారని కనుగొన్నారు, వారిలో ఎక్కువ మంది మహిళలు.

   ఇక ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఈ 538 మంది మహిళలపై పైన చెప్పినట్లు ఫ్రిజ్‌లో ఉంచిన వస్తువులో కేన్సర్‌లో సంతోషాలు, బాధలు ఎక్కువయ్యాయి.

   ఫ్రిజ్‌లో భద్రపరచకుండా, మీకు వీలైనంత తెచ్చి చేయండి. సాంబార్, తాజా ఇడ్లీ, దోస, వడ మొదలైనవి,

   కీటకాలు శనగపిండి, ఇతర పిండి మొదలైనవాటిలో చాలా త్వరగా ప్రవేశిస్తాయి. రెండు రోజుల్లో మీకు కావలసినన్ని పండ్లు మరియు కూరగాయలు తీసుకురండి. ఏదైనా అదనపు పాలను 48 గంటలలోపు విసిరేయండి!


   *ధన్యవాదాలు:*

        🩺డా. అమృతం🩺

   *టాటా మెమోరియల్ హాస్పిటల్, ముంబై.*

   *🧊ప్రతి ఇంటిలోని ప్రతి ఒక్కరికీ రిక్వెస్ట్ చేసి పంపండి.*✔️✔️

విష్ణు సహస్ర నామ స్తోత్రం

 💐💐💐విష్ణు సహస్ర నామ స్తోత్రం విశిష్టత💐💐💐


రోజుకు కనీసం ఒక్క సారైనా 

విష్ణుసహస్ర నామ పారాయణం చేయండి.

ఉత్తమ ఫలితాలు పొందండి..


మంత్రాల ఘనికి మూల మంత్రం శ్రీ విష్ణుసహస్రనామం

ఓం నమో నారాయణాయ .

ఓం నమో భగవతే వాసుదేవాయ.

ఫలితం మీకే స్పష్టంగా తెలుస్తుంది...


విష్ణు సహస్ర నామ స్తోత్రము పారాయణ చేసిన 

అశ్వ మేధ యాగం చేసినంత పుణ్యం కలుగును ఆయురారోగ్యము కలుగును, 

పాపములు తొలగును. 


స్తోత్రము లో ప్రతి నామము అద్భుతం. 

మన నిత్య జీవితంలోని అన్నీ సమస్యలకు పరిష్కరాలు ఇందులో వున్నాయి


విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు నిష్ఠతో పఠించే వారికి ఎలాంటి ఇబ్బందులైనా తొలగిపోతాయి. కష్టనష్టాలు ఒక్కసారిగా మీదపడి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో విష్ణు సహస్ర నామపారాయణం అన్నింటికీ విరుగుడులా పనిచేస్తుందని వారు సూచిస్తున్నారు. 


అనునిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా కష్టాలు, వ్యాధులు తొలగిపోయి, అష్టైశ్వర్యాలు శుభాలు చేకూరుతాయి. విష్ణు సహస్రనామ పఠనం వలన పుణ్యరాశి పెరుగుతుందనీ.. ఉత్తమగతులు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. ఇంకా ఇంటి దేవతా పూజతో, ఇష్టదేవతా పూజతో కూడా ఇబ్బందులను తొలగించుకోవచ్చునని వారు సూచిస్తున్నారు. 


అయితే విష్ణు సహస్రనామాన్ని అనునిత్యం ఏడాది పాటు పఠించడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయంటే..?


1. అదృష్టం


2. ఆర్థిక ఇబ్బందులు వుండవు 


3. గృహంలో ఆహ్లాదకరమైన వాతావరణం 


4. కోరిన కోరికలు నెరవేరుతాయి


5. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది


విష్ణు సహస్రనామాన్ని పఠించే ముందు శుచిగా స్నానమాచరించడం చేయాలి. ఆపై పూజగదిలో కూర్చుని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. లేకుంటే వినడమైనా చేయాలి. ఈ విష్ణు సహస్ర నామం నుంచి వెలువడే శబ్ధం దుష్ట ప్రభావాన్ని దూరం చేస్తుంది. అలాగే ఇంటి ముందు తులసిని పెంచడం ద్వారా మంచి ఫలితాలు వుంటాయి. అలాగే తులసీ మొక్క ముందు నేతి దీపం వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందిన వారవుతారు.


అభీష్టసిద్ధికి ఈ క్రింద సూచించిన శ్లోకములను 

108 మార్లు జపించవలెను. 

పిల్లల క్షేమార్థము తల్లిదండ్రులు జపము చేయవచ్చును:


1. విద్యాభివృద్ధికి :-

      14వ శ్లోకం.

సర్వగ సర్వవిద్భాను ర్విష్వక్సేనో జనార్దనః |

వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ||


2. ఉదర రోగ నివృత్తికి:-

       16వ శ్లోకం.

భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః |

అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ||


3. ఉత్సాహమునకు:-

       18వ శ్లోకం.

వేద్యో వైద్య స్సదాయోగీ వీరహా మాధవో మధుః |

అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః ||


4. మేధాసంపత్తికి:-

       19వ శ్లోకం.

మహాబుధ్ధి ర్మహావీర్యో మహాశక్తి ర్మహాద్యుతిః |

అనిర్దేశ్య వపుః శ్రీమా నమేయాత్మా మహాద్రిధృక్ ||


5. కంటి చూపునకు:-

       24వ శ్లోకం.

అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేత సమీరణః |

సహస్రమూర్థా విశ్వాత్మ సహస్రాక్ష స్సహస్రపాత్ ||


 6. కోరికలిడేరుటకు:-

         27వ శ్లోకం.

అసంఖ్యేయో2ప్రమేయాత్మ విశిష్ట శ్శిష్ట క్రుచ్ఛిచిః |

సిద్ధార్థ స్సిధ్ధసంకల్పః సిద్ధిద స్సిధ్ధిసాధనః ||


7. వివాహ ప్రాప్తికి:-

       32వ శ్లోకం.

భూతభవ్య భవన్నాధః పవనః పావనో2నలః |

కామహా కామక్రుత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ||


8. అభివృద్ధికి:-

       42వ శ్లోకం.

వ్యవసాయో వ్యవస్థానః సంస్థాన స్స్థానదో ధ్రువః |

పరర్థిః పరమ స్పష్ట: స్తుష్ట: పుష్ట శ్శుభేక్షణః ||


9. మరణ భీతి తొలగుటకు:-

        44వ శ్లోకం.

వైకుంఠ: పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః ప్రుథుః |

హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజః ||


10. కుటుంబ ధనాభివ్రుద్ధికి:-

         46వ శ్లోకం.

విస్తారః స్థావర స్స్తాణుః ప్రమాణం బీజ మవ్యయం |

అర్థో2నర్థో మహాకోశో మహాభోగో మహాధనః ||


 11. జ్ఞానాభివ్రుద్ధికి:-

           48వ శ్లోకం.

యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతు స్సత్రం సతాం గతిః |

సర్వదర్సీ నివృతాత్మ సర్వజ్ఞో జ్ఞాన ముత్తమం ||


12. క్షేమాభివ్రుధ్ధికి:-

           64వ శ్లోకం

అనివర్తీ నివృత్తాత్మ సంక్షేప్తా క్షేమక్రుచ్ఛివః |

శ్రీవత్సవక్షా శ్శ్రీవాస శ్శ్రీపతిః శ్శ్రీమతాం వరః ||


13. నిరంతర దైవ చింతనకు:-

          65వ శ్లోకం.

శ్రీద శ్శ్రీశ శ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః |

శ్రీధరః శ్రీకర శ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ||


14. దుఃఖ నివారణకు:-

           67వ శ్లోకం.

ఉదీర్ణ స్సర్వత శ్చక్షు రనీశ శ్శాశ్వత స్థిరః |

భూశయో భూషణో భూతి ర్విశోక శ్శోక నాశనః ||


15. జన్మ రాహిత్యమునకు:-

          75వ శ్లోకం.

సద్గతి స్సత్క్రుతి స్సత్తా సద్భూతి స్సత్పరాయణః |

శూరసేనో యదుశ్రేష్ఠ స్సన్నివాస స్సుయామునః ||


16. విద్యా ప్రాప్తి కి :-

       80వ శ్లోకం.

అమానీ మానదో మాన్యో లోకఃస్వామీ త్రిలోకధృత్|

సుమేధా మేధజో ధన్యః సత్యమేథా ధరాధరః||


 17. శత్రువుల జయించుటకు:-

            88వ శ్లోకం.

సులభ స్సువ్రత సిద్ధ శ్శత్రుజి చ్ఛత్రు తాపనః !

న్యగ్రోధో దుంబరో2శ్వత్ఠ శ్చాణూరాంధ్ర నిషూధనః ||


18. భయ నాశనమునకు:-

           89వ శ్లోకం.

సహస్రార్చి స్సప్తజిహ్వ స్సప్తైధా స్సప్తవాహనః |

అమూర్తి రణఘో2చింత్యో భయక్రు ద్భయ నాశనః ||


19. సంతాన ప్రాప్తి కి :-

       90వ శ్లోకం.

అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్|

అధృత స్స్వధృత స్య్సాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్థనః||


20. మంగళ ప్రాప్తికి:-

         96వ శ్లోకం.

సనాత్సనాతన తమః కపిలః కపి రవ్యయః |

స్వస్తిద స్స్వస్తిక్రుత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ||


21. ఆపదలు తొలగుటకు, లోక కల్యాణమునకు:-

          97 & 98వ శ్లోకం.

అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః |

శబ్దాదిగ శ్శబ్దసహ శ్శిశిర శ్శర్వరీకరః ||

అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః |

విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ||


22. దుస్వప్న నాశనమునకు:-

            99వ శ్లోకం.

ఉత్తారణో దుష్క్రుతిహా పుణ్యోదుస్వప్న నాశనః |

వీరహా రక్షణ స్సంతో జీవనం పర్యవస్తితః ||


23. పాపక్షయమునకు:-

           106వ శ్లోకం.

ఆత్మయోని స్స్వయం జాతో వైఖాన స్సామగాయనః |

దేవకీ నందన స్స్రష్టా క్షితీశః పాపనాసనః ||


24.సర్వ రోగ నివారణకు:-

     103వ శ్లోకం.

ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః

తత్త్వం తత్త్వ విదేకాత్మా జన్మమృత్యు జరాతిగః||


25. సుఖ ప్రసవమునకు:-

    107వ శ్లోకం.

శంఖభృత్ నన్దకీ చక్రీ శారంగధన్వా గదాధరః|

రథాంగపాణి రక్ష్యోభ్యః సర్వ ప్రహరణాయుధః||

శ్రీ స్సర్వ ప్రహరణాయుధ ఓమ్ నమ ఇతి


విష్ణు సహస్ర నామము మొత్తం చదివిన తదుపరి మీకు ఇందులో కావలసిన శ్లోకం 108 సార్లు పఠించవలెను.

ఆదివారం / రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*04-02-2024 / ఆదివారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


విద్యార్థుల కృషి ఫలించదు. గృహమున చికాకు తప్పవు. ఆదాయం తగ్గి నూతన ఋణాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో కొంత నిరుత్సాహం తప్పదు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. బంధువులతో వివాదములకు దూరంగా ఉండటం మంచిది.

---------------------------------------

వృషభం


చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో అంచనాలు తప్పుతాయి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం చేపట్టిన పనులలో కష్టపడ్డా ఫలితం కనిపించదు. స్థిరస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు.

---------------------------------------

మిధునం


ఉద్యోగాలలో అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో మీ ప్రతిభ చాటుకుంటారు. మిత్రులతో  శుభకార్యాలలో పాల్గొంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విలువైన వస్తు లాభాలు పొందుతారు.

---------------------------------------

కర్కాటకం


బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. అందరిలోనూ మీ విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది.

---------------------------------------

సింహం


ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలు వాయిదా పడుతాయి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. బంధు, మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. కుటుంబ విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.

---------------------------------------

కన్య


ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. చేపట్టిన పనుల్లో  ఆటంకాలు ఉంటాయి.  వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడుతాయి. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. మిత్రులతో స్వల్ప వివాదాలు తప్పవు.

---------------------------------------

తుల


వ్యాపార నిర్వహణలో లోపాలు అదిగమిస్తారు. సోదరుల నుండి శుభ వర్తమానాలు అందుతాయి నిరుద్యోగుల అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగమున ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఆదాయం గతం కంటే మెరుగుపడుతుంది. ఇంటా బయట చిత్రమైన  సంఘటనలు చోటుచేసుకుంటాయి.

---------------------------------------

వృశ్చికం


వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. నిరుద్యోగుల శ్రమ ఫలించదు ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. దూరప్రయాణాలు వలన శ్రమధిక్యత పెరుగుతుంది.

---------------------------------------

ధనస్సు


ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన విషయాలు పై దృష్టి సారిస్తారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన ఫలితం పొందుతారు.

---------------------------------------

మకరం


సోదరులతో స్థిరస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కొన్ని పనులలో కష్టపడ్డా ఫలితం ఉండదు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

---------------------------------------

కుంభం


గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.  నూతన పనులకు శ్రీకారం చూడతారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. ఉద్యోగమున నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. దీర్ఘ కాలిక సమస్యలు కొన్ని పరిష్కారమౌతాయి.

---------------------------------------

మీనం


స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభ కార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. నిరుద్యోగులకు చాలకాలంగా వేచిచూస్తున్న అవకాశములు అందుతాయి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

మూత్రపిండములలో నొప్పి

 5 నిమిషములలో మూత్రపిండములలో నొప్పి తగ్గుటకు నేను ప్రయోగించిన సిద్ద ఔషధం - 


    మూత్రపిండములలో రాళ్లు ఉన్నట్టు చాలమందికి తెలియదు. వారికి ఒక్కసారిగా వీపు భాగంలో విపరీతమైన నొప్పి మొదలై విలవిలలాడిపోతారు . చాలా భయంకరంగా నొప్పి వస్తుంది . ఈ విధమైన నొప్పితో బాధపడుతున్న ఒక వ్యక్తి కి నేను 5 నిమిషములలో నొప్పి తగ్గించాను. 


      మూసామ్బరం ని కంది గింజ అంత పరిమాణం లో తీసుకుని ఒక ద్రాక్ష పండు తీసుకుని దానిలో గింజలు తీసివేసి లొపల మూసామ్బరం పెట్టి మింగించి నీటిని త్రాగించాను. కేవలం 5 నిమిషములలో నొప్పి నుంచి విముక్తి లభించినది. 


          బొడ్డుకింద బాగంలో నొప్పి వచ్చినను ఇదే యోగం ఉపయోగపడుతుంది 


 గమనిక - 


      మూసామ్బరం మీకు ఆయుర్వేద దుకాణాలలో లభ్యం అగును. కలబంద ఆకులోని గుజ్జుని ఎండించి తయారుచేస్తారు. చంటిపిల్లలకు పాలు మాన్పించడానికి తల్లి యొక్క చనుమొనలు కు రాస్తారు. 


       ఏయే సమస్యలకు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి మరియు రోగములకు చేయవల్సిన చికిత్సలలో అత్యంత సులభమైనవి అన్నింటిని నేను రచించిన గ్రంథాలలో సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించగలరు.


 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

🪐శ్రీ కృష్ణావతారం

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

.                *పురాణ పఠనం*

.        *🪐శ్రీ కృష్ణావతారం🪐*

.               *79వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


శివకృష్ణులకు యుద్ధమగుట 


వరదుడు, ఉదారుడు, భక్తజనవత్సలుడు అయిన పరమేశ్వరుడు బాణాసురుని తన కన్నకొడుకుల కన్నా అధికంగా అభిమానిస్తాడు. కనుక, బాణుని పక్షాన యుద్ధం చేయాడానికి ప్రమథులు, గుహుడూ, తన అనుచర భూతకోటి వెంటరాగా భయంకరమైన శూలాన్ని ధరించి బయలుదేరాడు. అలా విలాసంగా కదలివస్తున్న కైలాసపర్వతంలాగ మహోన్నతమైన నందీశ్వరునిపై ఎక్కి శంకరుడు యుద్ధరంగానికి వచ్చాడు. నందీశ్వరుని కాలిగిట్టల తాకిడికి పైకిలేచిన దుమ్ము సూర్యబింబాన్ని క్రమ్మివేసింది; తోక కదలిక వలన పుట్టిన గాలిదెబ్బకు మేఘాలు చెదరిపోయాయి; వాడి కొమ్ముల ధాటికి బ్రహ్మాండభాండం బ్రద్దలయింది; ఖణిల్లని విలాసంగా వేసిన రంకెకు రోదసీకుహరం దద్దరిల్లింది; మెడలోని గంటల గణగణ ధ్వనులకు సర్వదిక్కులూ పెటపెటలాడాయి. పరమశివుడు ఇలా బయలుదేరి యుద్ధోత్సాహంతో ప్రతిపక్షంతో తలపడ్డాడు. అప్పుడు ఇరుపక్షాలవారికీ ద్వంద్వయుద్ధం జరిగింది. ఆ పురాతన యోధుల యుద్ధాన్ని చూడడానికి బ్రహ్మాది దేవతలు, మునీంద్రులు, యక్ష, రాక్షస, సిద్ధ, చారణ, గంధర్వ, కిన్నరాదులు తమ తమ విమానాలు ఎక్కి ఆకాశంలో గుమికూడారు. అప్పుడు శివ కేశవులూ; కుమార ప్రద్యుమ్నులూ; కూపకర్ణ కుంభాండులూ; బలరాముడూ సాంబుడూ; బాణనందనుడు బలుడూ బాణసాత్యకులూ; ఒండొరులతో తలపడ్డారు. రథికులు రథికులతోనూ; అశ్వికులు అశ్వికులతోనూ; గజారోహకులు గజారోహకులతోనూ; పదాతులు పదాతులతోనూ యుద్ధం ప్రారంభించారు. ఖడ్గాల రాపిడికి నిప్పులు రాలుతున్నాయి; సింహనాదాలతో, ధనుష్టంకారాలతో, ఏనుగు ఘీంకారాలతో, గుఱ్ఱాల సకిలింపులతో, పటహము భేరి కాహళము మృదంగము శంఖమూ మున్నగు వాయిద్యాల సంకుల ధ్వనులతో బ్రహ్మాండం దద్దరిల్లి పోయింది.

శ్రీకృష్ణుడు సింహనాదంచేసి శార్జ్గమనే తన ధనస్సును ఎక్కుపెట్టి, బాణవర్షాన్ని కురిపించి, యుద్ధవిశారదు లైన ప్రమథగణాలనూ, భూత, పిశాచ, ఢాకినీ వీరులను దిగ్భ్రాంతి చెంది పారిపోయేలా చేసాడు. ఇలా బాణప్రయోగం చేసి విజృంభించిన శ్రీకృష్ణుడి పరాక్రమాన్ని సహించలేక, పరమేశ్వరుడు నిప్పులు క్రక్కే శరపరంపరలను పీతాంబరుడైన కృష్ణుడిమీద ప్రయోగించాడు. ఆ బాణాలు అన్నింటిని, మధ్యలోనే శ్రీకృష్ణుడు చూర్ణం చేసాడు. నుదట అగ్నిని కురిపించే కనులు గల ఆ పరమశివుడు, పరిస్థితిని గమనించి, త్రిలోకపూజ్యమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. శ్రీకృష్ణుడు కూడ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి, శివుడు వేసిన బ్రహ్మాస్త్రాన్ని మరలించాడు. ఇది చూసిన దేవేంద్రాది దేవతలు ఆశ్చర్యచకితులై శ్రీకృష్ణుని స్తుతించారు. అంతట ఉమాపతి ఉపేంద్రుడిమీద వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. అసురారి ఆ అస్త్రాన్ని పర్వతాస్త్రంతో నివారించాడు. ఉగ్రుడు మహోగ్రుడై ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించగా, కృష్ణుడు ఐంద్రబాణంతో దానిని అణచివేశాడు. ఇంకా.....అనంతరం మిక్కిలి కోపంతో పరమేశ్వరుడు పాశుపతాస్త్రాన్ని వింట సంధించాడు. చక్రాయుధుడు లోకభయంకరమైన నారాయణాస్త్రాన్ని ప్రయోగించి పాశుపతాన్ని మరలించాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు పరమశివుని అస్త్రాలు అన్నింటినీ రూపుమాపాడు. రాజా! అంతట పరమేశ్వరుడు నిరుత్సాహం చెందాడు. ఆ సమయం కనిపెట్టి జయశీలి అయిన శ్రీకృష్ణుడు సమ్మోహనాస్త్రం ప్రయోగించాడు. అలా ప్రయోగించడంతో.....ఆ సమ్మోహనాస్త్రం యొక్క ప్రభావం వలన శరీరం స్వాధీనం తప్పి, శంకరుడు నందీశ్వరుని మూపురంపైకి వ్రాలిపోయాడు. శూలపాణి స్పృహ తప్పుట చూసి, చక్రధారి అయిన కృష్ణుడు శత్రుసైన్యాన్ని శరపరంపరలతో చిందరవందర చేసాడు. కొందరిని గదాఘాతాలతో తుత్తుమురు చేసాడు. ఈవిధంగా శత్రుసైన్యాన్ని హతమార్చాడు. ఆ సమయంలో ప్రద్యుమ్నుడు అనివార్య శౌర్యంతో కుమారస్వామిని ఎదుర్కున్నాడు. పట్టుదలతో తీవ్రమైన బాణాలను ప్రయోగించాడు. అంతట, నెత్తురు ముద్దగా మారిన కుమారస్వామి శత్రువులు సింహనాదాలు చేస్తుండగా యుద్ధరంగం నుండి పరాజితుడై నెమలివాహనం మీద వెనుదిరిగాడు. శత్రు భయంకరుడైన సాంబుడు విజృంభించి తీవ్రక్రోధంతో వాడి బాణాలను ప్రయోగించగా, బాణుడి కొడుకు బెదరి శౌర్యం కోల్పోయి శత్రువీరులు హేళనచేస్తుండగా పలాయనం చిత్తగించాడు. పరాక్రమశాలియైన బలరాముడు వజ్రాయుధంతో సమానమైన తన రోకలిని చేపట్టి, కుంభాండక కూపకర్ణులను ఎదురుకొన్నాడు. ఆ ఆయుధం దెబ్బలకు వారిద్దరూ నెత్తురు కక్కుకుని అసువులు వీడారు. ఆ సమయంలో, బాణుడి సైన్యం దీనత్వంతో అనాథ యై, పారిపోసాగింది, అది చూసి బాణాసురుడు సాత్యకిని అలక్ష్యం చేసి ప్రళయాగ్ని వలె విజృంభించి తన సైన్యాన్ని పురికొల్పి తానే సేనకు నాయకత్వం వహించాడు. అప్పుడు ఉభయసైన్యాలూ అన్యోన్య జయకాంక్షతో తలపడిన ఉత్తర దక్షిణ సముద్రాలవలె విజృంభించి యుద్ధానికి సిద్ధపడ్డాయి. సంకులయుద్ధం సాగింది. గదలు, ఖడ్గాలు, సురియలు, శూలాలు, చక్రాలు, శక్తులు, బల్లెములు, పట్టిసములు మున్నగు ఆయుధాలతో ఇరుపక్షాల సైనికులు యుద్ధం చేసారు; కొందరు భయంతో పారిపోయారు; కొందరు ధైర్యంతో ఎదిరించారు; కాళ్ళు, వేళ్ళు, తలలు, చేతులు తెగిపోయాయి; ఎముకలు ముక్కలు అయ్యాయి; ప్రేగులు కుప్పలు పడ్డాయి; చెవులు తెగిపోయాయి; కళ్ళు విచ్ఛిన్నమయ్యాయి; మాంసఖండాలు కొండలవలె యుద్ధరంగంలో


పడ్డాయి; రథాలు


కుప్పకూలాయి; గజాలు నేలవ్రాలాయి; గుఱ్ఱాలు కూలబడ్డాయి; కాల్బలం మట్టికరచింది; యుద్ధరంగంలో పడిన ఈ శవాల మాంసాన్ని భక్షించడానికి గుమికూడిన భూత, పిశాచ, బేతాళుల భయంకర ధ్వనులతో సకల దిశలు మారుమ్రోగాయి. ఆ రణరంగం ఈతీరున మహాభీషణమై ఘోరాతిఘోరంగా మారిపోయింది. బాణాలు కలువపూలుగా; చామరాలు నురుగు తెట్టెలుగా; గొడుగులు తెల్లతామరలుగా; రక్తము నీరుగా; ఎముకలు ఇసుకతిన్నెలుగా; భుజాలు సర్పాలుగా; కేశాలు నాచుగా రణరంగం ఒక రక్తపుటేరులా ఆ సమయంలో భాసించింది. అప్పుడు బాణాసురుడు మిక్కిలి కోపంతో తన రథాన్ని ముందుకు నడిపించి, సహస్ర బాహువులు ఉన్నాయనే అహంకారంతో, శ్రీకృష్ణుడిని ఎదుర్కొన్నాడు. బాణాసురుడు తన ఐదువందల చేతులతో ఐదువందల ధనుస్సులను ధరించి తక్కిన ఐదువందల హస్తాలతో రెండేసి చొప్పున బాణాలను సంధించబోతుంటే, అంతలోనే, శ్రీకృష్ణుడు అవక్రవిక్రమంతో విజృంభించి ఆ ధనుస్సులను ధ్వంసం చేసాడు; సంకోచించకుండా సారథిని సంహరించాడు; బాణుని రథాన్ని నుగ్గునుగ్గు గావించాడు. అలా చేసిన శ్రీకృష్ణుడు, ప్రళయకాలం నాటి మేఘగర్జనం అంత గట్టిగా తన పాంచజన్య శంఖాన్ని పూరించాడు. ఆ శంఖారావం వినిన సమస్త జనులు భయభ్రాంతులు అయ్యారు. రాక్షస స్త్రీల గర్భాలు భేదిల్లాయి. శ్రీకృష్ణుని భయంకర పరాక్రమానికి దైన్యము చెంది, బాణాసురుడు ఏమీచేయలేక చిన్నబోయి ఉండగా.....బాణుడు అలా కృష్ణవిజృంభణకు ప్రతికృతి చేయలేకపోతున్న ఆ సమయంలో, బాణాసురుడి తల్లి అయిన కోటర, తన కుమారుడిని రక్షించుకో దలచి వీడినజుట్టుతో వివస్త్రయై శ్రీకృష్ణుని ఎదుట నిలబడింది. ఆమెను చూడడానికి అసహ్యించుకుని మాధవుడు ముఖము త్రిప్పుకున్నాడు. ఆ సమయంలో బాణాసురుడు తలపాగ వీడిపోగా; భూషణాలు రాలిపోగా; యాదవులు పరిహసిస్తుండగా; తన పట్టణానికి పారిపోయాడు. అప్పుడు భూతగణాలు కూడా యుద్ధరంగం వీడిపోయాయి.


సశేషం🙏


*🙏 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

.           *🌹శ్రీమద్భగవద్గీత🌹*

.          *రెండొవ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

.             *సాంఖ్య యోగము*

.                  *శ్లోకము 11*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*శ్రీ భగవానువాచ ।*

*అశోచ్యానన్వశోచస్త్వం*

*ప్రజ్ఞావాదాంశ్చ భాషసే ।*

*గతాసూనగతాసూంశ్చ*

*నానుశోచంతి పండితాః ।।*


*భావము:*

భగవంతుడు ఇలా అన్నాడు: నీవు ప్రాజ్ఞత తో కూడిన మాటలు మాట్లాడుతున్నావు కానీ శోకింప కూడని దాని కోసం శోకిస్తున్నావు. చనిపోయిన వారి గురించి గానీ బ్రతికున్న వారి గురించి గానీ, వివేకవంతులు శోకింపరు.

 

వివరణ: ఈ శ్లోకంతో మొదలిడి, శ్రీ కృష్ణుడు తన ప్రసంగమును ఒక మహోత్కృష్టమైన ప్రారంభ ప్రతిపాదన తో ఆరంభిస్తున్నాడు. అర్జునుడు, తనకు మాత్రం సరియే అనిపించే కారణాల వలన శోకిస్తున్నాడు. కానీ, కృష్ణుడు అతనిపై జాలి పడలేదు, సరికదా, అతని వాదనని నీరుగార్చాడు. కృష్ణుడు అంటున్నాడు, "అర్జునా, నీవు ప్రాజ్ఞత తో మాట్లాడావనుకుంటున్నావు, కానీ నీవు అజ్ఞానం తో ప్రవర్తిస్తున్నావు, మాట్లాడుతున్నావు. ఎంత పెద్ద కారణం ఉన్నా శోకం అనేది మాత్రం తగదు. పండితులు - వివేకము కలిగినవారు - ఎప్పుడూ శోకింపరు, అది బ్రతికున్నవారి కోసమైనా లేదా చనిపోయిన వారి కోసమైనా సరే. కాబట్టి బంధువులను సంహరించడంలో నీవు అనుకునే దుఃఖం నిజానికి ఒక భ్రమ, మిథ్య మాత్రమే, అది నీవు పండితుడవు కావు అని నిరూపిస్తున్నది."

శోకానికి అతీతంగా ఉన్న జ్ఞాని ని చూడాలంటే గీతా శాస్త్రం లో ఎక్కువ దూరం వెళ్ళనవసరం లేదు, ఎందుకంటే స్వయంగా భీష్మ పితామహుడే దీనికి చక్కటి ఉదాహరణ. అతను జనన-మరణ రహస్యాలను లోతుగా తెలుసుకుని, ద్వంద భావాలకు అతీతంగా ఎదిగిన ఋషి. ఎలాంటి పరిస్థితి లో నైనా నిర్మలమైన మనస్సు తో ఉండగలిగి, చివరికి భగవత్ సేవ కి ఉపకరించేది అయితే అధర్మ పక్షాన యుద్ధం చేయటానికి కూడా ఒప్పుకున్నాడు. భగవంతునికి శరణాగతి చేసిన వారు, ఫలితాల చేత ప్రభావితం కాకుండా, అన్ని సందర్భాలలో తమ విధిని నిర్వర్తిస్తూ పోతుంటారు, అని ఉదాహరణగా చూపించాడు. అలాంటి వ్యక్తులు ఎప్పటికీ శోకింపరు ఎందుకంటే వారు ప్రతీదాన్నీ ఈశ్వర అనుగ్రహం లా స్వీకరిస్తారు.


*సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

వేమన పద్యములు

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

. *🌹వేమన పద్యములు🌹* 

. *అర్థము - తాత్పర్యము*

. *Part - 19*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*💥వేమన పద్యాలు-- 52*


*అక్షయాత్మకంబు నర్థింప గురిగని*

*నిశ్చయంబుగాను నిలిపి మనసు*

*రక్ష గట్టినట్లు రట్టడి మాన్చరా* 

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*

మనసు నిబ్బరము చేసుకుని , చక్కని లక్ష్యముతో ముందుకు సాగువాడే వివేకిగా చెప్పబడును.


*💥వేమన పద్యాలు -- 53*


*అక్షరంబు జదివి యందున గనలేక*

*హెచ్చు తక్కువనుచు యేపుమీరి*

*యక్షరాత్ముడన్న యతనికి ఫలమేమి* 

*నిశ్చయంబు దెలుపు నీవు వేమా*


*🌹తాత్పర్యము --*

ఎన్ని అక్షరాలు చదివినా , ఎంత పండితుడైనా దైవమును చూడలేనివాడు అక్షరాత్ముడు కాలేడని తెలియవలెను.


*💥వేమన పద్యాలు -- 54*

      

*అక్షరంబెరుగని యాచార మదియేల* 

*తాను దినని యట్టి ధన మదేల*

*నొరుల మేలుజూచి యోర్వని తనువేల* 

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*

చదువు అన్నిటికిని ఆచార సాంప్రదాయములకును మూలము.

ఆ చదువే లేనిచో ఇక ఆచారమేమిటి ?

సాంప్రదాయమేమిటి ?

ధనవంతుడైన తాను తిని , ఇతరులకింత పెట్టవలెను.

కుదువబెట్టిన , నేలపాలో , దొంగపాలోయగును.

మనిషన్న తరువాత ఇతరులకు ఉపయోగపడాలి.

ఉపకారం చేయాలి.

ఇతరుల బాగోగులు చూసి ఈర్షపడు వాడు నిరర్ధకుడుగా నుండును.



*పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి* 


*సర్వేజనా సుఖినోభవంతు*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

భాగవతము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

**తృతీయ స్కంధము*


*భరమగుచున్న దుర్వ్యసనభాజనమై, ఘనదుఃఖ మూలమై*

*యరయగ పెక్కుతూంట్లు గలదై క్రిమిసంభవమైన యట్టిదు*

*స్తరబహుగర్భవాసముల సంగతి మాన్పుటకై భజించెదన్*

*సరసిజనాభ భూరిభవసాగరతారక పాదపద్మముల్*


అయ్యయ్యో! తల్లిగర్భంలో ఉండటం ఎంత ఘోరమైన విషయం! ఎందుకంటే దానిని భరించటం చాలాకష్టం. అది చాలాచాలా వ్యసనాలకు పాదు. గొప్పదుఃఖాలకు మూలం. అన్నీ చిల్లులే. అంతేనా అక్కడ అసహ్యమైన సూక్ష్మజీవులు పుట్టి తనచుట్టూ తిరుగుతూ బాధిస్తూ ఉంటాయి. దానినుండి తప్పించుకోవటం తేలిక పని కాదు. పైగా అటువంటవి లెక్కపెట్టటానికి కూడా సాధ్యంకానివి. అటువంటి మహాభయంకరమైన దుఃఖాన్ని తొలగించుకోవటంకోసం శ్రీ మహావిష్ణువు పాదపద్మాలను నిరంతరంగా సేవించుకొంటూ ఉంటాను. అవేకదా చాలా పెద్దది అయిన సంసారమనే సముద్రంనుండి జీవుణ్ణి తరింపజేసేవి!


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం - హేమంత ఋతువు - పుష్య మాసం - కృష్ణ పక్షం -‌ నవమి - విశాఖ/ అనూరాధ -‌ భాను వాసరే* (04.02.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/7HUrByC2lpE?si=NAllmPCCX6Ju_iaJ



.🙏🙏 u

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

నిండుతుంది

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


 శ్లో𝕝𝕝

*జలబిన్దు నిపాతేన*

*క్రమశః పూర్యతే ఘటః*౹

*స హేతుః సర్వ విద్యానాం*

*ధర్మస్య చ ధనస్య చ*॥


తా𝕝𝕝 ఒక్కొక్క నీటిబొట్టు పడటం వల్ల క్రమంగా కుండ నిండుతుంది.... అలాగే...

*అన్ని విద్యలు, ధర్మము, ధనము కొద్దికొద్దిగా ఆర్జన చేస్తే సంపూర్ణమౌతాయి*....