27, ఫిబ్రవరి 2024, మంగళవారం

హనుమంతుడి సంగీతం

 🎻🌹🙏హనుమంతుడి పరిపూర్ణ సంగీతం...!!




దేవలోకంలో సంగీత విద్వాంసులుగా తుంబుర నారదులు సుప్రసిద్ధులు.


 తుంబురుడి వద్ద కళావతి అనే వీణ ఉండేది. నారదుడి వీణ మహతి. ఇద్దరూ ముల్లోక సంచారం చేసేవారు.


 ఇంద్రాది దేవతలను తమ గానంతో, వీణానాదంతో అలరించేవారు. మహావిష్ణువును స్తుతిస్తూ కీర్తనలను గానం చేసేవారు. 


తమ గానానికి దేవతలు పొగుడుతూ ఉండటంతో ఇద్దరికీ గర్వం పెరిగింది. ఎవరు గొప్ప అనే విషయంలో ఇద్దరికీ స్పర్థలు కూడా మొదలయ్యాయి.  

 

ఎవరు గొప్పో సాక్షాత్తు మహా విష్ణువు వద్దే తేల్చుకోవాలనే పట్టుదలతో తుంబుర నారదులిద్దరూ నేరుగా వైకుంఠానికి వెళ్లారు.


 పోటాపోటీగా గానం చేశారు. నారదుడు తనకు ఎంతటి భక్తుడైనా, విష్ణువు మాత్రం తుంబురుడి గానానికి పరవశుడై, అతడిపై పొగడ్తల వర్షం కురిపించారు. 


నారదుడు చిన్నబోయాడు. సంగీతంలో విద్వత్తు సాధించడానికి ఏం చేయాలంటూ విష్ణువునే సలహా అడిగాడు.


 ‘గానబంధు’ అనే గుడ్లగూబ వద్ద సంగీతం నేర్చుకోమని సూచించాడు విష్ణువు. 


‘గానబంధు’ వద్ద సంగీతం నేర్చుకున్న నారదుడు సంగీత సమరానికి సిద్ధం కావాలంటూ తుంబురుడిని సవాలు చేసేందుకు అతడి నివాసానికి వెళ్లాడు.


అక్కడ గాయపడ్డ స్త్రీలు విలపిస్తూ కనిపించారు. ఎవరు మీరని ప్రశ్నించాడు నారదుడు.


 ‘నీ గానంతో గాయపడ్డ రాగాలం మేమంతా’ అని బదులిచ్చారు వారు. ‘ఇక్కడికెందుకొచ్చారు?’ అని ప్రశ్నించాడు నారదుడు.


 ‘తుంబురుడు గానం చేస్తే స్వస్థత పొందుదామని వచ్చాం’ అని బదులిచ్చారు. ఆ సమాధానంతో చిన్నబోయిన నారదుడు ఈసారి సంగీతం నేర్చుకోవడానికి శ్రీకృష్ణుడి పెద్ద భార్య రుక్మిణీదేవిని ఆశ్రయించాడు.


 ఆమె శిక్షణలో సంగీతంలో అపార విద్వత్తును సాధించాడు.

ఎవరు గొప్ప విద్వాంసులో సాక్షాత్తు మహావిష్ణువు వద్దే తేల్చుకుందామంటూ తుంబురుడిని సవాలు చేశాడు నారదుడు.


 ఇద్దరూ వైకుంఠానికి బయలుదేరారు. ఇద్దరి గానాన్నీ విష్ణుమూర్తి సంతృప్తిగా ఆలకించాడు. అయితే, ఎవరు గొప్పో తాను తేల్చలేనన్నాడు. 


ఈ విషయంలో తీర్పు చెప్పగల దిట్ట హనుమంతుడు ఒక్కడేనని చెప్పాడు. దీంతో దేవతల సమక్షంలో పోటీ ఏర్పాటుకు సిద్ధమైన తుంబుర నారదులిద్దరూ హనుమంతుని వద్దకు వెళ్లారు.


 హనుమంతుడు న్యాయనిర్ణేతగా రాగా, దేవతల సమక్షంలో పోటీ ఏర్పాటైంది. మొదట తుంబురుడు వీణ వాయిస్తూ గానం చేశాడు.  


తుంబురుడి సంగీతానికి దేవతలందరూ మంత్రముగ్ధులయ్యారు. లోకమంతా చేష్టలుడిగి సంగీతంలో లీనమైంది.  

 

తుంబురుడు తన గానాన్ని ఆపిన తర్వాత నారదుడు ప్రారంభించాడు. మహతి మీటుతూ గానాన్ని సాగించాడు.


 నారదుడి గమకాల గారడీలకు ప్రకృతిలో చలనం మొదలైంది. తుంబురుడి గానానికి గడ్డకట్టిన సముద్రాలన్నీ తిరిగి కెరటాల హోరుతో సహజత్వాన్ని సంతరించుకున్నాయి.


 నింగిలో నిలిచిపోయిన విహంగాలన్నీ స్వేచ్ఛగా ఎగరసాగాయి. ప్రకృతిలో జీవకళ ఉట్టిపడసాగింది.


 దేవతలందరూ తన్మయత్వంతో తలలూపసాగారు. నారదుడు తన గానాన్ని ముగించడంతో వారందరూ తేరుకున్నారు.


హనుమంతుడి తీర్పు ఎలా ఉంటుందోనని ఆత్రంగా చూడసాగారు. ‘ఇద్దరూ సమ ఉజ్జీలుగానే ఉన్నారు.


 ఇంకో పరీక్ష పెడతాను. మీ వీణలు ఇలా ఇవ్వండి’ అడిగాడు హనుమంతుడు. ఇద్దరూ తమ వీణలను అతడి చేతికి అందించారు.


 హనుమంతుడు రెండు వీణలనూ తీసుకుని, రెండింటిలోని చెరో మెట్టును ఊడదీసి వారికి ఇచ్చాడు. 


‘ఇప్పుడు వీణ వాయిస్తూ గానం చేయండి’ అన్నాడు. దీంతో తుంబుర నారదులిద్దరూ అసహనానికి గురయ్యారు.


‘వీణలో అన్ని మెట్లూ ఉంటేనే కదా వాయించగలం. చెరో మెట్టు తీసేసి ఇప్పుడు వాయించమంటే ఎలా?’ అని అడిగారు.


 హనుమంతుడు చిరునవ్వు నవ్వాడు. ఎదురుగా కనిపించిన ఒక వెదురు బొంగును తీసుకుని, దాన్ని చీల్చాడు. దానికి తీగలు తగిలించాడు.


 ఎలాంటి మెట్లులేని వీణను తయారు చేశాడు. ఇక దానిని వాయిస్తూ గానం చేయడం మొదలుపెట్టాడు. మంద్రంగా మొదలైన స్వరఝరి క్రమంగా ఉధృతి అందుకుంది.


ఆ గానానికి వైకుంఠం నుంచి మహావిష్ణువే పరుగున అక్కడికి వచ్చినా, అతడి రాకను గుర్తించలేనంతగా అక్కడి దేవతలందరూ తన్మయులయ్యారు.


 హనుమంతుడు తన గానాన్ని ముగించిన తర్వాత తుంబుర నారదులిద్దరూ సంగీతంలో తమ విద్వత్తు ఇంకా పరిపూర్ణం కాదని అంగీకరించారు. 


హనుమద్గానంతో తమ కళ్లు తెరుచుకున్నాయని అన్నారు. వారి మాటలతో బాహ్యస్పృహలోకి వచ్చిన దేవతలు అక్కడకు వచ్చిన మహావిష్ణువును గమనించారు.


 ఆయన అభిప్రాయం కోరారు. తుంబుర నారదులిద్దరూ తన భక్తులే అయినా, ఇద్దరిలోనూ ఇంకా అహం పూర్తిగా నశించలేదని, అందుకే వారు తమ విద్యలో ఇంకా పరిపూర్ణత సాధించలేక పోయారని, అహాన్ని వీడటం వల్లనే హనుమంతుడు పరిపూర్ణత సాధించగలిగాడని వివరించాడు విష్ణువు..


అహం ఉన్నంత కాలం ఏ విద్యలోనూ పరిపూర్ణత లభించదు. . అహం విడనాడితేనే పరిపూర్ణత సాధ్

జై శ్రీమన్నారాయణ...(సేకరణ)..🚩🌞🙏🌹🎻

మనుస్మృతి

! మనుస్మృతి ఈనాటిది కాదురా పాడయిన మొద్దు రాచ్చిప్ప మొహమా! ..మనం కొలిచే శ్రీరాముడు ఎన్నో యుగాల క్రితం ఒక కోటీ డెబ్భై అయిదు లక్షల సంవత్సరాలు క్రితం జన్మించిన వాడు అయితే..అతనికి అత్యంత పూర్వం ఆచరించబడిన వ్యవస్థ మను స్మృతి.ఇది సత్యయుగం లో ఆచరించినది.అంటే 27 మహా యుగాల క్రితం సంగతి ఇది. ఆనాటివి ఈనాటి వరకూ ఎలా వస్తున్నాయన్న తింగరి ప్రశ్నలు వేశావో తిత్తి తీస్తా! ఆ కాలములో వారి ధారణా శక్తి అద్భుతంగా ఉండేది.ఒకరి నుండి ఒకరికి మౌఖికంగానే ఇవన్నీ వచ్చాయి. మధ్యలో ఏవైనా కాలగతిలో అంతరాయాలు ఏర్పడితే ఎవరో ఒకరు తపస్సంపన్నులు తిరిగి వాటిని ఉద్ధరించారు. ప్రస్తుతం ఈ కలియుగములో.. ఆచరించదగ్గది పరాశర స్మృతి. మనకు పద్దెనిమిది పురాణాలు ఉన్నట్టే మనకు పద్దెనిమిది స్మృతులు ఉన్నాయి.అసలు స్మృతి అంటే ఏమైనా తెలుసుట్రా మిరప తోటలో పిడత మొహాలూ మీరూనూ.

స్మృతులు అంటే ఆయాకాలాలకు అనుగుణంగా ఏర్పాటు చేయబడ్డ ధర్మశాస్త్రములు. ఇవి వేదార్థ ప్రతిపాదక గ్రంథములు. వాటిలో మను స్మృతి ఒకటి. ఈమానవ ధర్మశాస్త్రమున విశ్వ సృష్టి నుండి అన్ని విషయాలూ చెప్పబడి ఉన్నాయి. ఇందు బ్రహ్మ,క్షత్రియ,వైశ్య, శూద్రులు అను చాతుర్వర్ణ్యాశ్రమ ధర్మములు, వివాహక్రమఉరేయ్ నికృష్ట అక్కుపక్షీ! మనుస్మృతి ఈనాటిది కాదురా పాడయిన మొద్దు రాచ్చిప్ప మొహమా! ..మనం కొలిచే శ్రీరాముడు ఎన్నో యుగాల క్రితం ఒక కోటీ డెబ్భై అయిదు లక్షల సంవత్సరాలు క్రితం జన్మించిన వాడు అయితే..అతనికి అత్యంత పూర్వం ఆచరించబడిన వ్యవస్థ మను స్మృతి.ఇది సత్యయుగం లో ఆచరించినది.అంటే 27 మహా యుగాల క్రితం సంగతి ఇది. ఆనాటివి ఈనాటి వరకూ ఎలా వస్తున్నాయన్న తింగరి ప్రశ్నలు వేశావో తిత్తి తీస్తా! ఆ కాలములో వారి ధారణా శక్తి అద్భుతంగా ఉండేది.ఒకరి నుండి ఒకరికి మౌఖికంగానే ఇవన్నీ వచ్చాయి. మధ్యలో ఏవైనా కాలగతిలో అంతరాయాలు ఏర్పడితే ఎవరో ఒకరు తపస్సంపన్నులు తిరిగి వాటిని ఉద్ధరించారు. ప్రస్తుతం ఈ కలియుగములో.. ఆచరించదగ్గది పరాశర స్మృతి. మనకు పద్దెనిమిది పురాణాలు ఉన్నట్టే మనకు పద్దెనిమిది స్మృతులు ఉన్నాయి.అసలు స్మృతి అంటే ఏమైనా తెలుసుట్రా మిరప తోటలో పిడత మొహాలూ మీరూనూ.

స్మృతులు అంటే ఆయాకాలాలకు అనుగుణంగా ఏర్పాటు చేయబడ్డ ధర్మశాస్త్రములు. ఇవి వేదార్థ ప్రతిపాదక గ్రంథములు. వాటిలో మను స్మృతి ఒకటి. ఈమానవ ధర్మశాస్త్రమున విశ్వ సృష్టి నుండి అన్ని విషయాలూ చెప్పబడి ఉన్నాయి. ఇందు బ్రహ్మ,క్షత్రియ,వైశ్య, శూద్రులు అను చాతుర్వర్ణ్యాశ్రమ ధర్మములు, వివాహక్రమ పంచమహాయజ్ఞాతిథిపూజా పార్వణవిధి శ్రాద్ధవిధాన భోజననియమాదులు, స్త్రీ,పురుషధర్మములు, రాజధర్మములు, వ్యవహార ధర్మములు, ప్రాయశ్చిత్త నియమములు మొదలగు హిందువుల వైదిక లౌకిక విషయములు అన్నియూ ఆకాలములో ఆచరించినవి ఉంటాయి.

మనుస్మృతి

బృహస్పతిస్మృతి

దక్షస్మృతి

గౌతమస్మృతి

యమస్మృతి

అంగీరసస్మృతి

యాజ్ఞవల్క్యస్మృతి

ప్రచేతస్స్మృతి

శాతాతపస్మృతి

పరాశరస్మృతి 

సంవర్తస్మృతి

ఔశనసస్మృతి

శంఖస్మృతి

లిఖితస్మృతి

ఆత్రేయస్స్మృతి

విష్ణుస్మృతి

ఆపస్తంబస్మృతి

హరీతస్మృతి 

మళ్లీ వీటిలో ఉపస్మృతులు పదునెనిమిది ఉన్నాయి.

కణ్వస్మృతి

కపిలస్మృతి

లోహితస్మృతి

దేవలస్మృతి

కాత్యాయనస్మృతి

లోకాక్షిస్మృతి

బుధస్మృతి

శాతాతపఉపస్మృతి

అత్రిస్మృతి

ప్రచేతస్మృతి

దక్షఉపస్మృతి

విష్ణుస్మృతి

వృద్ధవిష్ణుస్మృతి

వృద్ధమనుస్మృతి

ధౌమ్యస్మృతి

నారదస్మృతి

పౌలస్త్యస్మృతి

ఉత్తరాంగిరసస్మృతి

అసలు వీటి గూర్చి ఏ మాత్రమూ తెలియని ప్రతీ అక్కుపక్షీ అశుద్ధం తిన్న కాకిలా మను స్మృతి, మనువాదులు అంటూ అరుస్తారేమిట్రా పగిలిపోయిన పింగాణీ జాడీ మొహమా!!

భాగవతము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*చతుర్ధ స్కంధం*


*సరసిజనాభ! సత్పురుషసంగ సమంచిత భక్తి యోగ వి*

*స్ఫురణ ననుగ్రహింపబడి శుద్ధము నొందినవాని చిత్త మ*

*స్థిర బహిరంగముం గనదు; చెందదు భూరి తమస్స్వరూప సం*

*సరణ గుహన్ జిరంబు గనఁజాలు భవన్మహనీయ తత్త్వమున్.*


బ్రహ్మగారి సృష్టికి కారణమైన పద్మం నాభియందు విరాజిల్లే నారాయణా! సత్పురుషుల సాంగత్యం వలన మరింత ఉజ్జ్వలంగా ప్రకాశించే భక్తియోగంతో మానవుని చిత్తం నిర్మలం అవుతుంది. అప్పుడు అది చంచలమైన వెలుపలి ప్రపంచాన్ని చూడదు. లెక్కకు అందని అజ్ఞానస్వరూపమైన సంసారమనే గుహలోనికి చేరుకోదు. అంతేకాదు, నీదైన మహనీయతత్త్వాన్ని నిత్యమూ పొందగలుగుతుంది.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

. *🌹శ్రీమద్భగవద్గీత🌹*

. *రెండొవ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

. *సాంఖ్య యోగము*

. *శ్లోకము 35*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*భయాద్రణాదుపరతం మంస్యంతే త్వాం మహారథాః ।*

*యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్ ।।*



*భావము:* 

ఏ మహారథుల దృష్టిలో నీవు గొప్పవాడివో, వారే, నీవు యుద్ధభూమి నుండి భయముతో పారిపోయావనుకుంటారు. అలా వారికి నీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకుంటావు.

 

*వివరణ:* 

ఏ మహారథుల దృష్టిలో నీవు గొప్పవాడివో, వారే, నీవు యుద్ధభూమి నుండి భయముతో పారిపోయావనుకుంటారు. అలా వారికి నీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకుంటావు.ఏ మహారథుల దృష్టిలో నీవు గొప్పవాడివో, వారే, నీవు యుద్ధభూమి నుండి భయముతో పారిపోయావనుకుంటారు. అలా వారికి నీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకుంటావు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

అశాశ్వతమునకై ఆరాటమా?

 శు భో ద యం🙏


"అశాశ్వతమునకై ఆరాటమా?


"తరగల్,పిప్పలపత్రముల్,మెఱుగుటద్దంబుల్,

మరుద్దీపముల్,/

కరికర్ణాంతము లెండమావులతతుల్,ఖద్యోతకీటప్రభల్,/

సురవీధీలిఖితాక్షరంబు లసువుల్,జ్జ్ోస్నామయః పిండముల్/

సిరు,లందేల మదాంధులౌదురుజనుల్?శ్రీకాళహస్తీశ్వరా!


శ్రీకాళహస్తీశ్వర శతకము-ధూర్జటిమహాకవి:


భావము:-ప్రాణములు, సముద్రకెరటములను,రావియాకులయంచులవలెను,తళుకుటద్దములవలెను,మెఱపులవలెను,కరికర్ణాంతములవలెను,(ఏనుగుచెవి తుదలు)ఎండమావులవలెను,మిణుగురుపురుగులకాంతివలెను,ఆకాశపువ్రాతలవలెను,చెచలమైనవి.

       సంపదలా వెన్నెలగుళికలవంటివి.మరి వానినిజూచుకొని నరులేల మదాంధులౌదురో అనూహ్యముగదా!


విశేషములు:కవి యీపద్యమున నరులప్రాణములుగానీ,సిరులుగానీ శాశ్వతమైనవి కావనిచెప్పుచు,చెంచెలమైన విషయములనుపమానములుగా చెప్పుచున్నాడు.

నదీతరంగములు,రావియాకులు,అద్దాలమెఱపులు,ఏనుగుచెవులు,ఎండమావులు,మిణుగురులకాంతి,మెఱుపులు,ఆకాశపువ్రాతలు(శూన్యంలోవ్రాత)ఇవిమిగులయస్థిరమైనవి.

        ఇక సిరులా,(భాగ్యములు) వెన్నెలగుళికలవంటివి.కొంతకాలముమాత్రమే వెన్నెలకాంతులు.అదియు శాశ్వతము గానిదే!

మరి యస్థిరమైన వీనిని నమ్ముకొని గర్వమున సంచరించు నరులు శాశ్వతుడవగు నిన్నేల మరచుచున్నారని తన ఆశ్చర్యమును ప్రకటించుచు.ప్రజలయజ్ఙానమునకు విచారమునువ్యక్త

ము చేయుచున్నాడు.🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

అరణ్యవాసమునందే

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


   *||శ్లోకము||*


*అత్యన్తవిముఖే దైవే వ్యర్థే యత్నే చ పౌరుషే*।

*మనస్వినో దరిద్రస్య వనాద్యన్యాత్ కుతస్సుఖమ్*॥


*||తాత్పర్యము||*


"పురుష ప్రయత్నం - {సమస్త ప్రయత్నములూ} వ్యర్థమైపోయి దైవము ప్రతికూలంగా వున్న వానికి అరణ్యవాసమునందే సుఖముగానీ మరొక చోట లేదు".....

మౌనం వహించడమే

 *శ్లోకం*:


తావన్మౌనేన నీయంతే

కోకిలశ్చైవ వాసరాః|

యావత్సర్వజనానంద

దాయినీ వాక్ప్రవర్తతే||


తనకు కూత వచ్చేవరకు కోయిల మౌనంగా ఉండి, రోజులు గడుపుతుంది. కాలక్రమంలో మధురమైన స్వరంతో అందరినీ ఆకర్షించును. అదే విధంగా, సమయం వచ్చినప్పుడే సందర్భోచితమైన మాట పలికి అందరినీ మెప్పించాలి.  సమయం సందర్భం‌ రానంతవరకు మౌనం వహించడమే ఉత్తమం.

సంకల్పము

 *శుభోదయం*

16.2291923113

Xxxxxx

 సంధ్యా వందన 

మరియు ఇతర పూజాకార్యక్రమాల 

సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.27.02.2024

మంగళ వారం (భౌమ వాసరే) 

 *******

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే

శిశిర ఋతౌ 

మాఘ మాసే కృష్ణ పక్షే

తృతీయాయాం (సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

భౌమ వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

*ఇతర పూజలకు*

 *శ్రీ శోభకృత్  నామ సంవత్సరే ఉత్తరాయణే*

*శిశిర ఋతౌ* 

*మాఘ మాసే* 

*కృష్ణ పక్షే  తృతీయాయాం*

*భౌమ వాసరే అని చెప్పుకోవాలి*.

*ఇతర ఉపయుక్త విషయాలు*

సూ.ఉ.6.26

సూ.అ.6.01

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

శిశిర ఋతువు

మాఘ మాసం 

కృష్ణ పక్షం తదియ రా. 11.25.వరకు. 

మంగళ వారం. 

నక్షత్రం హస్త రా.తె.5.25 వరకు. 

అమృతం రా.10.48 ల  12.34 వరకు. 

దుర్ముహూర్తం ఉ.8.43 ల 9.29 వరకు.

దుర్ముహూర్తం రా.10.58 ల 11.48 వరకు. 

వర్జ్యం ప.12.13 ల 1.59 వరకు. 

యోగం శూల మ.3.19 వరకు.  

కరణం వనజి ప. 10.26 వరకు.  

కరణం భద్ర రా. 11.25 వరకు. 

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం మ. 3.00 ల 4.30 వరకు. 

గుళిక కాలం మ.12.00 ల 1.30 వరకు. 

యమగండ కాలం ఉ.7.30 ల 9.00 వరకు. 

*****************

పుణ్యతిధి మాఘ బహుళ తదియ. 

*****************

గమనిక* :౼

మా సంస్థ *శ్రీ పద్మావతీ శ్రీనివాస బ్రాహ్మణ వివాహ సమాచార సంస్థ*(రి.జి.నెం.556/2013) *వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

బ్రాహ్మణ పరిచయ వేదిక  *పరిచయం - పరిణయం*

*26/05/2024* (ఆదివారం) రోజు *వనస్థలిపురం హైదరాబాద్* లో ఏర్పటు చేశాము. *రిజిస్ట్రేషన్* మరియు ఇతర వివరాలు కై దిగువ ఇవ్వబడిన ఫోన్ నెం లను సంప్రదించండి

*80195 66579/98487 51577*.

*************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏

.

నువ్వు తక్కువ వాడివి కావు సామీ...

 *👏నువ్వు తక్కువ వాడివి కాదు సామీ*👏

*🤣పుల్లమామిడి, నిమ్మ, ఉసిరి, ఉప్పు, కారం సృష్టించావు. ఊరగాయ పెట్టుకునే తెలివి ఇచ్చావు. కానీ ఆశపడి తింటే అల్సర్, బి.పి బహుమతిగా ఇస్తావు.🤣* 


*👏నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...👏*

*🤪పంచదార, బెల్లం, తియ్యటి పళ్ళు ఇచ్చావు.  కానీ, ఆత్రపడి తింటే షుగర్ వ్యాధి బహుమతిగా ఇస్తావు.🤪*


*👏నువ్వు తక్కువ వాడివి కాదు సామీ.👏*

*😃మా కాలి గోటికి సరిపోని దోమలను సృష్టించావు. శుచి శుభ్రత లేకపోతే, మా చెమట వాసనతోనే గుర్తుపట్టి మా నెత్తురు తాగుతూ మాకు నిద్రపట్టని స్థితి కల్పించావు.😃*


*👏నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...👏*

*🥱సంపదలు, ఆస్తులు మా చేత కల్పించి మాలో మేము తన్నుకునేటట్లు, చంపుకునేటట్లు చేస్తున్నావు.🥱*


*👏నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...👏* 

*🤣రాజ్యాలతో పాటు రాజకీయాలు సృష్టించి ఆప్తమిత్రులకు, అన్నదమ్ములకు, భార్యాభర్తలకు ఎడబాటు చేస్తున్నావు.🤣* 

*👏నువ్వు తక్కువ వాడివి కాదు సామీ..👏*

*🫢నేను, నాది అనే అహం కలిగిస్తావు. అది  వదిలితే గాని నీ దగ్గరకు రానీయనంటావు🫢*. 


*👏నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...👏*

*🤪ఇంద్రియాలను ఇచ్చావు. వాటికి రుచులు పుట్టించావు. అన్నిటిని వదిలితేగాని నీ దగ్గరకు రానీయనంటావు.🤪* 

*👏నువ్వు తక్కువ వాడివి కావు సామీ...👏* 

*😭నిన్నర్థం చేసుకోవడం మా వల్లకాదని నీకు తెలిసి ఈ నాటకాలు మాచే ఆడిస్తూ ఉంటావు.😭*


*🫡కానీ సామీ!* 

*నేనూ తక్కువవాణ్ని కాదు. నాకు బాగా తెలుసు, నీ కాళ్ళట్టుకుంటే, నీవే నన్నెత్తుకుంటావని🫡*

పరిజ్ఞానం

 *పరిజ్ఞానం* 


" *తృటి* లో తప్పిన ప్రమాదం "  అని.. అసలీ *తృటి* అంటే ఏమిటి? 


తృటి =సెకండ్ లో 1000 వంతు

100 తృటులు =1 వేద

3 వేదలు=1 లవం

3 లవాలు=1 నిమేషం అంటే రెప్ప పాటుకాలం (నిముషం కాదు..)

3 నిమేషాలు=1 క్షణం,

5 క్షణాలు=1 కష్టం

12 కష్టాలు = ఒక నిముషం 

15 కష్టాలు=1 లఘువు

15 లఘువులు=1 దండం

2దండాలు=1 ముహూర్తం

2 ముహూర్తాలు=1 నాలిక

7 నాలికలు=1 యామము,ప్రహారం

4 ప్రహరాలు=ఒక పూట

2 పూటలు=1 రోజు

15 రోజులు=ఒక పక్షం

2 పక్షాలు=ఒక నెల.

2 నెలలు=ఒక ఋతువు

6 ఋతువులు=ఒక సంవత్సరం.

10 సంవత్సరలు=ఒక దశాబ్దం

10 దశాబ్దాలు=ఒక శతాబ్దం.

10 శతాబ్దాల=ఒక సహస్రాబ్ది

100 సహస్రాబ్ది=ఒక ఖర్వ..లక్ష సంవత్సరాలు

4లక్షల 32 వేల సంవత్సరాలు= కలియుగం

8లక్షల 64 వేల సంవత్సరాలు=త్రేతాయుగం

12లక్షల 96 వేల సంవత్సరాలు=ద్వాపర యుగం

17లక్షల28 వేల సంవత్సరాలు=కృత యుగం

పై 4 యుగాలు కలిపి=చక్రభ్రమణం.(చతుర్ యుగం)

71 చక్రభ్రమాణాలు=ఒక మన్వంతరం

14 మన్వంతరాలు=ఒక కల్పం

200 కల్పాలు ఐతే=బ్రహ్మరోజు

365 బ్రహ్మరోజులు =బ్రహ్మ సంవత్సరం

100 బ్రహ్మ సంవత్సరాలు=బ్రహ్మసమాప్తి

ఒక బ్రహ్మసమాప్తి=విష్ణు కు ఒక పూట

మరో బ్రహ్మఉద్బవం=విష్ణువు కు మరో పూట


వేల సంవత్సరాల క్రితమే కాలాన్ని ఇంత సూక్ష్మంగా, స్థూలంగా విభజన చేసిన మన పూర్వీకుల విజ్ఞానం ఇది