13, ఆగస్టు 2024, మంగళవారం

Panchaag


 

శ్రీ రుద్రం

 ll శ్రీ రుద్రం ll


మరణాన్ని సహితం అధిగమించగలిగిన సాధనం!


శ్రీ రుద్రాన్ని రుద్రప్రశ్న అని కూడా అంటారు. శత రుద్రీయం, యజుర్వేదంలో భాగం. ఇది శివునికి అంకితం చేయబడిన శ్లోకం. మరణాన్ని సహితం అధిగమించగలిగిన సాధనం. ఇది జన్మకూ, మృత్యువుకూ అతీతంగా ఉండే తత్వాన్ని సూచిస్తుంది. 


మనిషిలో శ్వాస నింపేదీ, మరల దానిని తీసుకుపోయేది కూడా, ఆ పరమాత్మేనని తెలియజేస్తుంది. వేద శ్లోకాలలో గొప్పదైన రుద్రం, అన్ని రకాల ప్రయోజనాల కోసం, అన్ని దోషాలనూ, కష్టాలనూ తొలగించడానికి సహకరిస్తుంది. 


పూజలు, హోమాలలో, దీనిని వేద పండితులు పఠిస్తారు. శ్రీ రుద్రం రెండు భాగాలుగా ఉంటుంది. 


మొదటి భాగం, యజుర్వేదంలోని 16వ అధ్యాయంలోనిది. 'నమో' అనే పదాన్ని పదే పదే ఉపయోగించడం వల్ల, నమకం అని పిలుస్తారు. 


రెండవ భాగం, యజుర్వేదంలోని 18వ అధ్యాయంలోనిది. 'చమే' అనే పదాలను పదే పదే ఉపయోగించడం వల్ల, దీనిని చమకం అని పిలుస్తారు.


ll నమకం చమకం చైవ పురుష సూక్తం తథైవ చ |

నిత్యం త్రయం ప్రయుంజనో బ్రహ్మలోకే మహీయతే ||


నమకం చమకం ఎవరైతే మూడు సార్లు, పురుష సూక్తంతో ప్రతి దినం చదువుతారో, వాళ్లకు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది.


నమక, చమకాలలో 11 భాగాలు ఉంటాయి. ఒక్కో భాగాన్ని, “అనువాకం” అని అంటారు. మొదటి అనువాకం, పరమ శివుడిని తన రౌద్ర రూపాన్ని వదిలి, తన అనుచరులనూ, ఆయుధాలనూ త్యజించమని, ప్రసన్నం చేసుకుంటూ ప్రార్ధించేది. 


శాంతించిన స్వామిని దయదలచమని ప్రార్ధించే భావం ఉంటుంది. ఈ పంక్తులలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని ఆయుర్వేద మందులు తయారుచేసే విధానాలు కూడా కనిపిస్తాయి.


మొదటి అనువాకం: తమ పాపాలను పోగొట్టి, ఆధిపత్యాన్నీ, దైవం యొక్క ఆశీర్వచనాన్నీ పొందేటట్లుగా చేసి, క్షామం, భయం పోయేటట్లు చేసి, ఆహార, గో సంపద సమృద్ధి గావించి, గో సంపదను చావు నుండీ, ఇతర జంతువుల నుండీ, జబ్బుల నుండీ కాపాడుతుంది. 


జ్వర బాధ, జబ్బులు, పిండ-మరణాలు, చెడు కర్మ, గ్రహ నక్షత్ర చెడు ప్రభావాలను తప్పించి, కోర్కెలు తీర్చి, సకాలంలో వానలు కురిపించి, కుటుంబాన్ని పరిరక్షించి, సంతానాన్ని ఆశీర్వదించి, ఐహిక సుఖాలను ప్రసాదించి, శత్రువులను నాశనం చేస్తుంది.


రెండవ అనువాకం: ప్రకృతిలో, సర్వ ఔషధాలలో, సర్వాంతర్యామి అయిన రుద్రుడికి సంసార బంధాలను సడలించమని ప్రార్ధన. శత్రు వినాశనానికీ, సంపద, మరియు రాజ్యప్రాప్తికీ, జ్ఞాన సాధనకూ, ఈ అనువాకాన్ని చదువుతారు.


మూడవ అనువాకం: ఈ అనువాకంలో రుద్రుడిని ఒక చోరునిగా వర్ణించబడింది. ఆయన సర్వాత్మ. ఈ విషయంలో మనిషి ఆ మహా స్వరూపాన్ని అర్ధం చేసుకోక, నిమిత్త బుద్ధిని అలవరుచుకుంటాడు. ఈ అజ్ఞానాన్ని చౌర్యం చేసి, జ్ఞానం అనే వెలుగును మనలో ప్రతిష్టిస్తాడు. ఈ అనువాకం, వ్యాధి నివారణకు కూడా చదువుతారు.


నాలుగవ అనువాకం: ఇందులో రుద్రుడు సృష్టి కర్త, కారకుడు. చిన్నా, పెద్దా ప్రతీదీ ఆయన చేసిన సృష్టే. ఈ అనువాకాన్ని క్షయ, మధుమేహం, కుష్టు వ్యాధి నివారణకై చదువుతారు.


అయిదవ అనువాకం: ఈ అనువాకంలో, పారే నీట ఉండే రూపంగా, రుద్రుడు కొనియాడబడతాడు. ఆయన పంచ తత్వాలు వర్ణించబడతాయి. అంటే, సృష్టి జరపడం, పరిరక్షించడం, నశించడం, అజ్ఞానంలో బంధింపబడడం మరియు మోక్షప్రదానం.


ఆరవ అనువాకం: ఇందులో రుద్రుడు కాలరూపుడు. ఆయన అన్ని లోకాల కారణం, వేద రూపం మరియు వేదాంత సారం.


ఐదు ఆరు అనువాకాలు, ఆస్తుల పెంపునకూ, శత్రువుల మీద విజయానికీ, రుద్రుని వంటి పుత్రుడిని కోరుకుంటూ, గర్భస్రావం నివారించడానికీ, సుఖ ప్రసవానికీ, జ్యోతిష పరమైన ఇబ్బందులను నివారించడానికీ, పుత్రుల పరిరక్షణకు కూడా చదువుతారు.


ఏడవ అనువాకం: నీటిలో, వానలో, మేఘాలలో, ఇలా అన్ని రూపాలలో ఉన్న రుద్రుని వర్ణిస్తుంది. ఈ అనువాకాన్ని తెలివితేటలకూ, ఆరోగ్యానికీ, ఆస్తినీ, వారసులను పొందడానికీ, పశు సంపద, వస్త్రాలు, భూములు, ఆయుష్షు, మొక్షం కోసం కూడా చదువుతారు.


ఎనిమిదవ అనువాకం: ఇందులో శివుడు, ఇతర దేవతల కారకుడిగానూ, వారికి శక్తి ప్రదాతగానూ వర్ణింపబడ్డాడు. ఆయన అన్ని పుణ్య నదులలో ఉన్నవాడు, అన్ని పాపాలనూ పోగొట్టేవాడు. శత్రువులను నాశనము చేసి, సామ్రాజ్యాన్ని సాధించడానికి, ఈ అనువాకాన్ని చదువుతారు.


తొమ్మిదవ అనువాకం: ఈ అనువాకంలో రుద్రుని శక్తీ, ప్రకాశం, సకల దేవతలకూ శక్తినిచ్చేవిగా ప్రస్తుతించ బడ్డాయి. సృష్టిలో సర్వ శక్తులనూ శాసించే శివ శక్తిని మించి ఇంకొకటి లేదు. ఈ అనువాకాన్ని బంగారం కోసం, మంచి సహచరి కోసం, ఉద్యోగం, ఈశ్వర భక్తుడైన పుత్రుని కోసం చేస్తారు.


పదవ అనువాకం: ఈ అనువాకంలో మరలా, రుద్రుడిని తన ఘోర రూపాన్ని ఉపశమించి, పినాకధారియైన అమ్ములను విడిచిపెట్టి, వ్యాఘ్ర జీనాంబరధారియై, ప్రసన్న వదనంతో దర్శనమివ్వవలసిందిగా ప్రార్ధన ఉంటుంది. 


ఈ అనువాకాన్ని ఐశ్వర్యం కోసం, వ్యాధినివృత్తికై, శక్తిమంతులతో వైరం పోగొట్టటానికీ, భైరవ దర్శనార్ధమై, అన్నిరకాల భయాలను పోగొట్టటానికీ, అన్ని పాపాలనూ పోగొట్టటానికీ చదువుతారు.


పదకొండవ అనువాకం: ఈ అనువాకంలో రుద్రుని గొప్పదనాన్ని ప్రస్తుతించి, ఆయన కరుణా ప్రాప్తికై, నిర్బంధమైన నమస్సులు అర్పించబడతాయి.


ఈ అనువాకాన్ని సంతాన సౌఖ్యంకోసం, ఆయురారోగ్య వృద్ధి కోసం, పుణ్య తీర్థ దర్శన ఆకాంక్షతో, పూర్వ, ప్రస్తుత, వచ్చేకాలం యొక్క జ్ఞానానికై చదువుతారు.


ఇక చమకం విశిష్టత: నమకం చదివిన తర్వాత, భక్తుడు తనే శివ రూపంగా భావించి, దేవదేవుడిని తనకు సర్వం ప్రసాదించమని ప్రార్ధన చేసేది, చమకం. 


ఇది ప్రతి ఒక్కరికీ పనికి వచ్చేది. జ్ఞానం నుండి మోక్షం కలిగే మార్గంలో, ప్రతి పనినీ మనిషి ఆస్వాదించి, చివరకు అంతులేని ఆనందాన్ని కలుగచేసే మంత్రమిది. 


సృష్టికర్తకు ఒక ప్రాణి నుండి, ఇంకో ప్రాణికి విభేదం లేదు. సమస్తం ఆయన నుండి ఉద్భవించినదే గనుక, మోక్షాకాంక్ష దైవత్వానికి సూచనే..


చాలామందికి సహజంగా కలిగే సందేహం ప్రకారం, ఇక్కడ మరణాన్ని అధిగమించడం అంటే, చిరంజీవిత్వం పొందడం కాదు. అకాల మృత్యువును జయించడం అనే వాస్తవాన్ని గమనించాలి.


ll ఓం నమః శివాయ ll

ll సర్వే జనాః సుఖినోభవంతు ll

శివ ధర్మాలు

 *శివ ధర్మాలు*

⚜️🔱⚜️🔱


🔱 *1 మహాదేవుని పూజిస్తే మరుజన్మ ఉండదు.* 🌈


💫 పుట్టిన ప్రతి ఒక్కరూ ఒకనాటికి గిట్టవలసిందే. అలా గిట్టిన ప్రతి ఒక్కరూ... వారి కర్మఫలాన్ననుసరించి తిరిగి జన్మెత్తుతారు. మరి జనన-మరణ చక్రాన్ని దాటి మనిషికి మరో మార్గం లేదా? దీన్నుంచి విడుదల లేదా?


*సాగరాణాం క్షయం వ్యంతి క్షీయతే హిమవా నపి* 

*రుద్రలోకే క్షయో నాస్తి, శంకరే శరణం గతే* 


💫 సముద్రాలన్నీ ఇంకిపోవచ్చు. హిమాలయ పర్వతం కూడా కరిగిపోవచ్చు. శంకరుడి శరణు పొందినవాడు చేరుకునే రుద్రలోకంలో మాత్రం దేనికీ నాశం లేదు. ఎందుకంటే రుద్రలోకం నశించదు. అక్కడికి చేరుకున్నవాళ్లకు కూడా నాశం లేదు. శివుని శరణాగతి వేడితే, సేవిస్తే పునర్భవం (మరు పుట్టుక) ఉండదు. శాశ్వతంగా శివలోకంలోనే ఉంటారు.


꧁┉┅━❀🔯❀━┅┉꧂

🔱 *2. ఉత్తమగతులు పొందాలంటే మార్గం ఏది?* 🌈


 ఏ చోటు చేరుకుంటే మరెక్కడికీ వెళ్లాల్సిన అవసరం రాదో.. ఏది అన్నిటికంటే ఉత్తమమైనదో దాన్ని ఉత్తమగతి అంటారు. దాన్ని పొందే మార్గం కావాలా? తెలుసుకోండి.


*ఏష్టవ్యా బహవః పుత్రాశ్శివధర్మానుసారిణః,*

*సముద్ధరన్తి తే గోత్రం, రజ్జుః కూపాద్ ఘటం యథా*


💫 శివధర్మాన్ని ఆచరించే కొడుకులను ఎంతో మందిని కనాలి. ఆ పుత్రులు వారి వంశాన్ని ఉద్ధరిస్తారు. తాడు నూతిలోనుండి కుండను బయటికి లాగినట్లుగా శివధర్మపరాయణులైన సంతానం ఆ వంశంలోని వారిని అధోలోకాలనుంచి, ఊర్ధ్వలోకాలలోకి లాక్కొని వెళ్తుంది. అంతేకాదు అధోలోకాలలో పడకుండా చేయడమే కాక, అంతకు ముందు నరకాదిలోకాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడ ఉత్తమగతులు కల్పిస్తారు. శివధర్మపరులు తాము ఉత్తమస్థానాలలో ఉండి, తమవంశంలోని వారికి కూడ ఉత్తమగతులకు తీసుకువెళ్తారు.


꧁┉┅━❀🔯❀━┅┉꧂


🔱 *3 ఒక్క పని చేస్తే వందపనులు చేసినట్లే!* 🌈 


💫 మనం ఓ పని చేస్తే దానికి ఆ ఫలితం మాత్రమే లభిస్తుంది. రెండు పనులు చేస్తే రెండింతలు ఫలితమే లభిస్తుంది. మరి ఒక్క పని చేసి వందరెట్లు ఫలితం రావాలంటే ఏం చేయాలి? 


*సర్వయజ్ఞతపోదాన తీర్థవేదేషు యత్ఫలమ్,* 

*తత్ఫలం కోటిగుణితం, స్థాప్య లింగ లభేన్నరః*


💫 సమస్తయజ్ఞాలు ఆచరిస్తే, అనేక తపస్సులు చేస్తే, ఎన్నో దానాలు ఇస్తే, అనేక పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తే, నాలుగు వేదాలూ పఠిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది. కానీ వీటివల్ల కలిగే ఫలితానికి కోటిరెట్లు అధికమైన ఫలితం శివలింగాన్ని స్థాపించిన మానవుడు పొందుతాడు.


꧁┉┅━❀🔯❀━┅┉꧂

🔱 *4. ఒకదానికంటే మరోటి గొప్పదైతే...ఏం చేయాలి?* 🌈


💫 మన సంప్రదాయంలో చేసే ప్రతి ఒక్క కార్యం గొప్పదే. కానీ కొన్నింటికంటే మరికొన్ని గొప్పవి. మరి మనమేం చేయాలి?


*లింగస్య దర్శనం పుణ్యం* 

*దర్శనాత్ స్పర్శనం శుభం,* 

*స్పర్శనా దర్చనం శ్రేష్ఠం,* 

*ఘృతస్నానం సమాచరేత్* 


💫 శివలింగాన్ని దర్శించుకోవడమే పుణ్యం. దర్శనంకంటే స్పర్శనం (తాకటం) వల్ల ఎక్కువ పుణ్యం, స్పర్శనం కంటే శివలింగాన్ని పూజించటం ఇంకా ఉత్తమం. శివార్చనం కంటె గూడ శివలింగానికి (ఆవు) నేతితో అభిషేకం చేయడం ఇంకా పరమోత్తమం. 


💫 కనుక, భగవంతుడు వారికిచ్చిన స్థితి.. స్తోమతను బట్టీ వాటిని ఆచరించి ఆయా ఫలితాలు పొందవచ్చు. మనకు ఇదే ఫలం అని బాధపడనక్కర్లేదు. శివుడిపై భారం వేసి వాటిని ఆచరిస్తే ఉత్తమమైన కార్యాలు ఆచరించే ఫలితాన్ని ఆ శివుడే కలిగిస్తాడు.


꧁┉┅━❀🔯❀━┅┉꧂


🔱 *5 రేపుమాపని ఆలసించకు... త్వరపడు..* 🌈 


💫 ఏదైనా ఓ పని చేస్తే మనకు మంచి జరుగుతుందని ఎవరైనా చెప్తే మనం వెంటనే ఉత్సాహంగా వింటాం. వెంటనే చేద్దామనుకుంటాం. కానీ ఇంతలోనే బద్ధకిస్తాం. రేపు చేయొచ్చులే... మాపు చేయొచ్చులే... అని ఆలస్యం చేస్తాం. మామూలు పనులైతే ఆలస్యం చేసినా తప్పు లేదు. మరి జన్మను తరింపజేసేదైతే? 


*త్వరిత జీవితం యాతి, త్వరితం యాతి యౌవనం,* 

*త్వరితం వ్యాధి రభ్యేతి, తస్మాత్ పూజ్య సదాశివః.* 


💫 బ్రతుకు త్వరగా ముగిసిపోతుంది. యౌవనం అంతకంటే వేగంగా ముగిసిపోతుంది. శరీరం మీదికి రోగాలు వేగంగా వచ్చిపడతాయి. మరి మనకు ఉత్తమగతులనిచ్చే శివపూజ వెంటనే చేయాలి. తరువాత ఎప్పుడో చేద్దాం లెమ్మని కాలం గడిపేసి ముసలితనము, రోగాలూ, మరణము వచ్చేసాక అప్పుడాలోచిస్తే ఉపయోగం ఏమిటి?


🙏 *శివధర్మాలను ఆచరిద్దాం. జన్మను తరింపచేసుకుందాం* 🙏


🙏 *సర్వే జనాః సుఖినోభవంతు*

🌹🌹🌹🌹🌹

⚜️🔱⚜️🔱⚜️🔱⚜️🔱⚜️🔱

మంగళవారం సాయంత్రం

 *ప్రతి మంగళవారం సాయంత్రం 7:00 నుండి 7:30 మధ్య, మీరు ఎక్కడ ఉన్నా ఆలయానికి చేరుకోవాలి.*


క్రైస్తవులు ఆదివారాల్లో చర్చికి వెళ్లినట్లు 


మరియు ముస్లింలు ఖచ్చితంగా శుక్రవారం రోజున మసీదుకు వెళతారు.     

                                  మనం హైందవులం మంగళవారం రోజు, బలం మరియు బుద్ధి రోజు, శక్తి రోజు, హనుమాన్ జీ రోజును నిర్ణయించుకోవాలి.


హిందువు ఎప్పటికీ హిందువు కోసం నిలబడలేడని మీరందరూ ఫిర్యాదు చేస్తున్నారు.  


మీరు కనీసం వారానికి ఒకసారి ఒకరినొకరు కలుసుకోలేని వారు అలాంటి పిర్యాదు ఎలా చేస్థారు.


ఎడారిగా ఉన్న మన దేవాలయాలను శక్తి మరియు సంస్థాగత ప్రదేశాలుగా అభివృద్ధి చేసుకుందాం.


 *ప్రతి మంగళవారం సాయంత్రం 7:00 నుండి 7:30 మధ్య, మీరు ఎక్కడ ఉన్నా ఆలయానికి చేరుకోవాలి.*


ఇది హనుమాన్ చాలీసా మరియు హారతి సమయం.



 మీ ఇంట్లో ఉంటే ఇంటి దగ్గర ఉన్న గుడిలో..


షాపులో ఉంటే షాప్ దగ్గర ఉన్న గుడిలో..


ఆఫీస్ దగ్గర ఉన్న గుడిలో.. 


ప్రతి మంగళవారం సాయంత్రం 7:00 గంటలకు ఆలయానికి చేరుకోవాలి. 7:00 నుండి 7:30 వరకు.

భారతదేశంలో లక్షలాది దేవాలయాలు ఉన్నాయని ఊహించుకోండి,


కేవలం 50 నుండి 100 మంది మాత్రమే ప్రతి ఆలయానికి చేరుకుని, శంఖం మరియు హారతి శబ్దాలు వారి గంటలతో ప్రతిధ్వనించి నట్లయితే, 


భారతదేశం మొత్తంలో ప్రతి మంగళవారం సరిగ్గా 7:00 గంటలకు మిశ్రమ సంగీతం. 7 .

 30 నిమిషాల మధ్యలో ప్రతిధ్వనిస్తే, 


ఈ స్వరం ప్రపంచం మొత్తానికి వెళుతుంది, 


దాని ప్రభావం చాలా విస్తృతంగా ఉంటుంది. నన్ను నమ్మండి, ఈనాటి సమస్యలన్నీ కర్పూరంలా ఎగిరిపోతాయి, 


హిందువులు ఇంత పెద్ద సంఖ్యలో తమ దేవాలయాలకు చేరుకున్నప్పుడు, 


అది కూడా ప్రతి వారం, హిందువులను ఆటపట్టించే ధైర్యం ఎవరికి ఉండదు.

 

వీలైతే 

భార్యాబిడ్డలను తీసుకుని గుడికి వెళ్లండి, 


ప్రతి మంగళవారం ఈ విధంగా క్రమం తప్పకుండా గుడికి చేరుకుంటే మీ ఇరుగుపొరుగు వారు కూడా మిమ్మల్ని కలుస్తారని మీకే తెలుస్తుంది, 


మీ బాంధవ్యం పెరుగుతుంది. 


ఆపై మీరు కూడా ఒకరికొకరు సుఖ దుఃఖాలలో పాలుపంచుకుంటారు, 


అదే విధంగా మనమందరం ఐక్యత అనే దారంలో కట్టుబడి ఉంటాము.


మీకు సందేశం నచ్చినట్లయితే, 

దానిని అన్ని సమూహాలకు విస్తరించండి. (అన్ని గౄపులకు పంపండి) 


మరియు ఈరోజే ప్రతిజ్ఞ చేయండి, 


మనం ఏమి చేస్తున్నా, ప్రతి మంగళవారం 7:00 నుండి 7:30 వరకు, 


మేము ఖచ్చితంగా ఆలయానికి చేరుకుంటాము, 

మన కోసం కాదు, మన సమాజం మరియు మన కుటుంబాల భద్రత కోసం.  


ఇప్పుడు ఇది అవసరం అయిందని గుర్తుంచుకోండి, మీరు ఇంకా వాయిదా వేస్తే, మీరు చాలా ప్రమాదంలోకి వెళ్ళాల్సి వస్తుంది.  


మీరు దీన్ని ఎంత త్వరగా ప్రారంభిస్తే, అంత త్వరగా మీరు ఐక్యత యొక్క దారంలో ఒకరికొకరు ముడిపడి ఉంటారు.


 *ఈ సందేశాన్ని కనీసం ఐదు గ్రూపులకు పంపండి*

 *కొందరు పంపరు కానీ మీరు తప్పకుండా పంపుతారని నేను నమ్ముతున్నాను ఆశిస్తున్నాను*

భోజన సమయంలో

 *హిందూ సాంప్రదాయంలో భోజన సమయంలో పాటించవలసిన నియమాలు*


1. భోజనానికి ముందు, తరువాత తప్పక కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. తడికాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి.


2. తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది.


3. ఆహార పదార్థాలు (కూర, పప్పు, పచ్చళ్ళు, మొ.) తినే పళ్ళానికి తాకించరాదు. అలా చేస్తే అవి ఎంగిలి అవుతాయి. ఎంగిలి పదార్థాలు ఎవ్వరికీ పెట్టరాదు. అది చాలా పెద్ద దోషం.


4. అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి కాచడం చేయరాదు. మెతుకులు నేతిలో పడరాదు.


5. భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు.


6. ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు, తాకరాదు.


7. ఎడమచేతితో తినే కంచాన్ని ముట్టుకోకూడదు. ఒకవేళ కంచాన్ని ముట్టుకుంటే వెంటనే ఎడమచేతితో నీటిని ముట్టుకోవాలి.


8. సొట్టలు ఉన్న కంచం, విరిగిన కంచం భోజనానికి పనికిరాదు.


9. నిలబడి అన్నం తింటూ ఉంటే క్రమంగా దరిద్రులు అవుతారు. బఫే పద్దతి పూర్తిగా మన సనాతన హైందవ ధర్మానికి విరుద్ధం. దయచేసి దీనిని వీలైనంత వరకు పాటించవద్దు. పాదరక్షలు తో పొరపాటున కూడా భోజనం చేయవద్దు.


10. భగవదార్పితం చేసి,భగవన్నామము ఉచ్చరించి భోజనం చేయాలి.


11. అన్నం తింటున్నప్పుడు వంట బాగాలేదని దూషించడం, కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టడం చేయరాదు.


12. పరిషేచనము అయ్యాక ఉప్పు వడ్డించుకోరాదు. ఏవైనా పదార్థాలలో ఉప్పు తక్కువైతే ఆ పదార్థాలు ఉన్న గిన్నెలలో ఉప్పు వేసుకుని వడ్డించుకోవాలి.


13. కంచం ఒడిలో పెట్టుకుని భోజనం చేయరాదు. పడుకునే మంచం మీద భోజనం చేయరాదు. (ఇది వృద్ధులకు, వికలాంగులకు, అనారోగ్యంతో ఉన్నవారికి వర్తించదు)


14. మాడిన అన్నాన్ని నివేదించరాదు. అతిథులకు పెట్టరాదు. మన ఇంటి చాకలి వారికి పొరపాటున కూడా పెట్టకూడదు.


15. భోజనం అయ్యాక క్షురకర్మ చేసుకోరాదు (వెంట్రుకలు కత్తిరించడం).


16. గురువులు లేదా మహాత్ములు ఇంటికి వస్తేమనం తినగా మిగిలినవి పెట్టరాదు. వారికి మళ్ళీ ప్రత్యేకంగా వంటచేయాలి.


17. భోజనం వడ్డించేటప్పుడు పంక్తిబేధం చూపరాదు. అనగా ఒకరికి ఎక్కువ వడ్డించడం మరొకరికి తక్కువ వడ్డించడం చేయరాదు. 


18. భోజనం చేస్తున్నప్పుడు తింటున్న పదార్థాలలో వెంట్రుకలు, పురుగులు వస్తే తక్షణం విడిచిపెట్టాలి. 


19. వడ్డన పూర్తి అయ్యాక విస్తరిలో లేదా కంచంలో ఆవునెయ్యి వేసుకుంటే ఆహారం శుద్ధి అవుతుంది.


20. భగవన్నామము తలుచుకుంటూ లేదా భగవత్ కథలు వింటూ వంట వండడం, భోజనం చేయడం చాలా ఉత్తమం.


21. ఉపాసకులను, ఏదైనా దీక్షలో ఉన్నవారిని ఎక్కువ తినమని బలవంతపెట్టరాదు ముఖ్యముగా అయ్యప్ప దీక్షల వద్ద ఈ చెడు అలవాటు ఇటీవల కాలములో మితి మీరుచున్నది. అతిగా ఆహారం స్వీకరిచడం వారి అనుష్ఠానానికి ఇబ్బంది అవ్వచ్చు


22. భోజనం చేస్తున్నవారు (అనగా భోజనం తింటూ మధ్యలో) వేదం చదువరాదు.


23. పళ్ళెం మొత్తం ఊడ్చుకుని తినరాదు. ఆహార పదార్థాలను కాళ్ళతో తాకరాదు.


24. భోజనం చేస్తున్నప్పుడు నీళ్ళ పాత్రను కుడివైపు ఉంచుకోవాలి.


25. స్త్రీలు బహిష్టు కాలంలో వంట వండరాదు, వడ్డించరాదు. వారు ఆ 4 రోజులు ఎవరినీ తాకరాదు. వడ్డన సమయంలో అక్కడ ఉండరాదు.


26. అరటి ఆకుల వంటి వాటిలో భోజనం చేసిన వ్యక్తి వాటిని మడవకూడదు తిన్న విస్తరిని మడవడం అనాచారం తన ఇంటిలో ఒక్కడు ఉన్నప్పుడు ఈ నియమం వర్తించదు.


27. ఎంగిలి విస్తరాకులను తీసేవాడికి వచ్చే పుణ్యం అన్నదాత కు కూడా రాదని శాస్త్రం. జగద్గురువైన శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజు చేసిన రాజసూయయాగంలో లక్షలాది మంది తిన్న ఎంగిలి ఆకులు ఎత్తాడని మహాభారతం చెబుతోంది


28. భోజనం అయ్యాక రెండు చేతులూ, కాళ్ళూ కడుక్కోవాలి. అవకాశం లేనప్పుడు రెండు చేతులైనా తప్పక కడుక్కోవాలి. నోరు నీటితో పుక్కిలించుకోవాలి.


29. భోజనం అయ్యాక నేలను లేదా బల్లను శుద్ధి (మెతుకులు తీసేసి, తిన్న చోట తడిగుడ్డతో శుభ్రం) చేసి మాత్రమే అక్కడ వేరేవారికి భోజనం వడ్డించాలి ఇప్పటికీ సదాచారాలు పాటించే కొందరి ఇళ్ళల్లో గోమయం లేదా పసుపు నీళ్ళు చల్లి మరీ శుద్ధి చేస్తారు


30. స్నానం చేసి మాత్రమే వంట వండాలని కఠోర నియమము. పెద్దలు, సదాచారపరాయణులు హోటళ్ళలో మరియు ఎక్కడంటే అక్కడ భోజనం చేయకపోవడాని కి ఇదే ముఖ్యకారణం. అక్కడ వంట చేసే వారు స్నానం చేసారో లేదో తెలియదు, పాచిముఖం తో వంట చేసినా, రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించి వంటచేసినా దోషం. అవి తిన్న వారికి మెల్లగా వారి మనసుపై ప్రభావం చూపుతుంది. పుణ్యం క్షీణిస్తుంది.


31. ఒకసారి వండాక అన్నము, కూర, పప్పు వంటి ఇతర ఆహార పదార్థాలను మళ్ళీ వేడి చేసి తినరాదు. ద్విపాక దోషం వస్తుంది.


32. ఆడవారు గాజులు ధరించకుండా భోజనం చేయరాదు. వడ్డించరాదు.

వృద్దాశ్రమం

 #వృద్దాశ్రమం

-----------------------------------

యశోదమ్మకు రాత్రంతా నిద్ర పట్టలేదు.. కొడుకు అన్న మాటలు విని నెత్తిన పిడుగు పడ్డట్టయిందీ.. పాపం.. మరి నిద్ర ఐనా ఎలా వస్తుంది... అక్కడ, ఇక్కడ కొన్నిచోట్ల తాను కూడా విన్నది.. పిల్లలు తమ తల్లిదండ్రులను వృద్దాశ్రమంలో వదులుతారని... 


       కానీ తనకు కూడా అటువంటి రోజు వస్తుందని కలలో కూడా ఊహించుకోలేదు.. కొడుకు చాలా మంచివాడు.. కోడలిదే అంతా పెత్తనం.. ఐనా వీళ్ళు ఇన్ని రోజులు చూపించిన ప్రేమ అంతా నాటకమా...? అనుకుంది.. 

 

    రాత్రి భోజనం సమయంలో కొడుకు తల్లితో చెప్పాడు.. అమ్మా.. రేపు ఉదయం తొందరగా తయారవ్వు..వృద్దాశ్రమానికి వెళ్ళాలి..అన్ని ఏర్పాట్లు చేసాను.. వాళ్లు కూడా తొందరగా రమ్మన్నారు... అని చెప్పాడు.. యశోదమ్మకు గొంతులో ముద్ద దిగలేదు.. ఆ రాత్రంతా ఒక యుగంలా గడిచింది యశోదమ్మకు... 


      ఉదయం కోడలు యశోదమ్మ దగ్గరకు వచ్చి అత్తయ్య తొందరగా రెడీ అవ్వండి.. నేను అన్ని సర్దేశాను.. తొందరగా బయలుదేరాలి అని చెప్పింది.. యశోదమ్మకు గట్టిగా ఏడ్వాలనిపించింది.. కానీ కోడలి ముందు తన దౌర్బల్యము చూపించడం ఇష్టం లేక., తనను తాను సముదాయించుకుని.. వాళ్ళకు ఇష్టం లేనప్పుడు నేను ఎక్కడ ఉంటే ఏంటి ? అని మనసు ధృడం చేసుకుంది.. మనసు భారంగా ఉంది... నాలుగు సంవత్సరాల క్రితం మరణించిన భర్త గుర్తుకు వచ్చి కళ్ళలో నీళ్లు పెట్టుకుంది.. 


      ఇంతలో కొడుకు వచ్చి అమ్మా.. పద వెళదాం... ఇప్పటికే ఆలస్యం అయింది అంటూ పిలిచినపుడు యశోదమ్మ మనసు భారంతో బయలుదేరింది.. ఇంతలో కోడలు ప్యాక్ చేసిన అన్నింటినీ కారు డిక్కీలో సర్దేశింది.. అరగంటలో ఆశ్రమానికి చేరుకున్నారు.. 


     వెనక సీట్లో కూర్చున్న యశోదమ్మను దించి భుజాలపై చేతులు వేసి ప్రేమగా పదమ్మా.. అంటూ ఆఫీస్ రూం వైపు నడిచారు.. ఆ సమయంలో యశోదమ్మకు ఈ ప్రేమంతా నాటకమా... అనుకుంది.. కళ్ళలో నీళ్లు తిరిగాయి.. 


     ఆఫీసు రూంలో కొడుకు వాళ్ళతో ఏవేవో మాట్లాడాడు... అంతా ఇంగ్లీష్ లోనే.. యశోదమ్మకు అర్థం కాలేదు.. 


   అక్కడినుండి అందరూ ఆశ్రమంలోనికి వెళ్ళారు.. అక్కడ ఒక పెద్ద హాలు.. సుమారు నూటయాబై మందికి పైగా తనలాంటి వృద్దులు ఉన్నారు.. బహుశా తనని వాళ్ళకు పరిచయం చేస్తారేమో అనుకుంది.. 


    కానీ తన ఊహకు భిన్నంగా అక్కడ ఉన్న వాళ్లందరూ ఒక్కసారిగా "హ్యాపీ బర్త్ డే టూ యూ" అంటూ రాగయుక్తంగా అనేసరికి ఆశ్చర్యపోయింది.. 


      వెంటనే కొడుకు తేరుకొని అమ్మ కాళ్లకు నమస్కరించి... 

అమ్మా.. క్షమించమ్మా.. నీకొక చిన్న సర్ ప్రైజ్ ఇవ్వాలనే ముందుగా నీకు తెలుపలేదు.. నీ కోడలుకు విషయం చెప్పవద్దని మాట తీసుకున్నా.. అంటూ ఆప్యాయంగా హత్తుకున్నాడు.. ఇంతలో కోడలు కూడా వచ్చి "జన్మదిన శుభాకాంక్షలు అత్తయ్య" అంటూ ఆప్యాయంగా హత్తుకుంది.. 


     అమ్మా.. నీ జన్మదినాన్ని వృద్దాశ్రమంలో చేసుకుని.. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నీ చేతులతో కొత్త బట్టలు ఇచ్చి, స్వీట్లు ఇచ్చి.. వారితో పాటు మనమూ ఇక్కడే భోంచేసి వెళదామని ప్లాన్ చేసానమ్మా అంటూ కొడుకు అనేసరికి యశోదమ్మకు ఎక్కడ లేని సంతోషంతో కళ్ళలో ఆనంద భాష్పాలు రాలాయి... 


      ఆ రోజంతా అందరూ అక్కడే గడిపి హాయిగా ఇంటికి చేరుకున్నారు.. 

        

#తల్లిదండ్రులు_దైవంతో_సమానం.. #వాళ్ళను_ప్రేమగా_చూసుకోవాలి….

ఆధ్యాత్మిక సౌరభం

 శ్రీ గురుభ్యో నమః 


సద్గురు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి శ్రీ పాదుకాం పూజయామి నమః 


శ్రావణ మాసం లక్ష్మీ, గణపతి, సుబ్రహ్మణ్య, ఈశ్వర, నారాయణ ప్రాధాన్య మాసం. ఈ మాసం లో వచ్చే శుక్ల పక్ష పంచమి శ్రీ వర మహాలక్ష్మి ఆవిర్భావ దినోత్సవం గా ప్రసిద్ధి.


శ్రావణ శుక్ల పక్ష సప్తమి విశేష మైన  మంత్ర ప్రాధాన్య తిథి గా ప్రసిద్ధి.


కామాఖ్య దేవి ఆలయం లో చేసుకున్న శత చండి హోమం పిదప zఆ క్షేత్ర పాలిక అయిన శ్రీ భగళముఖి అమ్మ వారి క్షేత్రం లో అమ్మ వారి అనుగ్రహం, ధర్మ రక్షణ, ఏర్పడిన ప్రభుత్వము ధర్మ రక్షణ లో భాగస్వామ్యం అవ్వాలి అని, విదేశీ వ్యూహ రచన పటిమ నిర్వీర్యం అయి మన దేశం లో ధర్మం ఆచరించి క్షేమంగా కాపాడాలి అని ప్రార్థన తో మన దేశం లో నివసిస్తున్న యతి వరేణ్యులు, గోవులు సంరక్షింప బడాలి అన్న సంకల్పంతో జగద్గురువులు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థానం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ శ్రీ మదభినవోద్ధండ శ్రీ విద్యా శంకర భారతీ స్వామి వారి అనుగ్రహం మరియు అనుజ్ఞ తో ఛందోలు గ్రామం లో వేంచేసి యున్న శ్రీ భగళముఖి అమ్మవారి ఆలయ ప్రాంగణం లో మూల మంత్ర హవనం విశిష్ట ద్రవ్యం లతో చేయుట జరిగినది. 


ముందుగా ఆలయం లో అమ్మ వారి మూల విరాట్టునకు నాచే పూజ చేయించి అమ్మవారి శ్రీ చక్రమునకు కుంకుమ పూజ చేయించి పిదప నివేదన ఇచ్చే విధంగా అవకాశం ఇవ్వడం అమ్మ ఇచ్చిన అనుగ్రహం గా భావిస్తున్నాను. అటు పిమ్మట శ్రద్ధ ఆసక్తి తో విశేష సంకల్పం తో మూల మంత్ర హోమం చేయడం జరిగినది. ఆలయం EO గారు శ్రీ నరసింహమూర్తి గారు చక్కటి భోజన ప్రసాదం ఏర్పాటు చేయడం తో అమ్మ సన్నిధి లో ప్రసాదం స్వీకరించి అటు నుండి శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి ఇంటిని దర్శనము చేసుకుని విజయవాడ మీదుగా తాడేపల్లిగూడెం చేరుకున్నాము. ఒక అద్భుతమైన భావన తో ఆనందం తో చేసుకున్న ప్రయాణం గా భావన. ఈ హోమం చేసే సమయం లో కొన్ని ద్రవ్యాలు కోసం ఎంత వెదికినా దొరకక పోవడం మిగిలిన విశిష్ట ద్రవ్యములతో ఈ హోమం చేయడం జరిగినది.


మన సమూహం లో శ్రీ జగన్నాథ శ్రీ చరణ్ మరియు శ్రీ శ్రీపాద భాస్కర శర్మ గారు అనుకోని అవాంతరం రావడం తో చందోలు గ్రామ హోమానికి రాలేకపోయారు. వారు మరుసటి ఉదయం తాడేపల్లిగూడెం ఉదయమే చేరుకోవడం కడు ఆనంద దాయక విషయం.


తాడేపల్లిగూడెం లో శ్రీ లలితాదేవి ఆలయ యాజమాన్యం నూతనం గా నిర్మించిన యాగశాల ప్రారంభం శ్రావణ మాసంలో జరగాలి అని అమ్మ సంకల్పం. ఇతః పూర్వం తాడేపల్లిగూడెం లో రాజకీయ వ్యవస్థ అర్హులైన వారికి రావడం కోసం ఇదే ఆలయం లో.చేసిన విశేష మైన హోమం అందుకు అమ్మ వారు ఇచ్చిన శుభ ఫలితం నకు అమ్మ వారికి కృతజ్ఞత తెలుపుకునే ఒక బాధ్యత లో ఈ శ్రావణ మాసం లో భాను సప్తమి శుభ పర్వదినం నాడు అమ్మవారి ఆశీస్సులతో విశేషమైన తామర పూవులతో లక్ష్మీ యాగం, పంచ సూక్త హోమం మరియు నవగ్రహ మరియు నక్షత్ర హోమం సంకల్పం చేయడం జరిగినది. అయితే అనూహ్యంగా ముందు రోజు మేము వెతికిన విశిష్టమైన పసుపు సంపెంగ పూవులు అక్కడికి వచ్చిన భక్తులు తీసుకు రావడం ఆశ్చర్యంనకు లోను చేసింది. అందుకు తోడుగా స్వాతి నక్షత్రం అవ్వడం చేసి నవగ్రహ, నక్షత్ర, పంచ సూక్త సహిత మూల మంత్ర సంపుటిత శ్రీ లక్ష్మీ యాగం, అమ్మ వారి మూల మంత్ర హోమం మరియు లక్ష్మీ నృశింహ మూల మంత్ర హోమం చేయడం ఎంతో తృప్తి ఆనందం కలిగించింది.


వచ్చిన భక్తులు అందరూ ఎంతో శ్రద్ధ ఆసక్తి తో కార్యక్రమం లో భాగ స్వామ్యం తీసుకోవడం... అంతే శ్రద్ధ గా అక్కడ ఏర్పాట్లు చేయడం చక్కటి భోజన ప్రసాద వితరణ జరగడం మొత్తం వేసిన విశేష ద్రవ్యములు అన్నీ ఆహుతి కావడం, మూల మంత్ర హోమం ప్రారంభం అయిన పిదప అఖండ తేజస్సు తో వేడి ఆ ప్రాంతాన్ని ఆ అవహించడం అమ్మ ఉనికి కి సోపానంగా భావన చేసుకుంటూ...


ఇంతే శ్రద్ధ, అనురక్తి, ఆధ్యాత్మిక సౌరభం తో మరిన్ని లోక కళ్యాణ హిత కార్యక్రమాలు చేసే శక్తి గురుదేవులు మరియు అమ్మ వారు ఇవ్వాలి అని ప్రార్థిస్తూ...


ఈ కార్యక్రమం లో అనూహ్యంగా చెన్నై నుండి సకుటుంబ సమేతంగా అటు శని ఆదివారాల్లో జరిగిన రెండు హోమాలకి వచ్చిన శ్రీ వేంకట రామ శర్మ గారు మరియు శ్రీమతి జయంతి గారి దంపతులకి పిల్లలకి, మా బ్రహ్మ గారు శ్రీ తారక రామ శర్మ గారు, ఉపాసకులు శ్రీ సుందర రామారావు గారు, శ్రీ వేంకట రాధాకృష్ణ శర్మ గారు ఆదివారం హోమానికి శ్రమ అని భావించకుండా భాగ్యనగరం నుండి ప్రత్యేకంగా వచ్చి కార్యక్రమం దిగ్విజయం అవ్వడం లో సహకారం ఇచ్చిన శ్రీ శ్రీపాద భాస్కర శర్మ గారు మరియు శ్రీ జగన్నాథ శ్రీ చరణ్ గారికి తాడేపల్లిగూడెం ఆలయ యాజమాన్యం నకు శతధా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ... మహత్తర సత్కార్య నిర్వహణ శక్తి అమ్మవారు ప్రసాదించాలని ప్రార్థిస్తూ



సూర్య కిరణ శర్మ మల్లాది 

హరితస ధార్మిక సేవా సంస్థ 


బాబాయి,చిన్నాన్న'

 

1.'బాబాయి,చిన్నాన్న' రెండూ తెలుగు పదాలే.'బాబాయి' అనేది కోస్తా ప్రాంతంలోనూ, 'చిన్నాన్న,చిన్నాయన' అనేవి ఎక్కువగా తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలలోనూ వాడుకలో ఉన్నాయి.

2.హిందీ/ఉర్దూ ప్రభావాలతో తెలంగాణలో తండ్రిని

'బాపు' అని,చిన్నాయనను 'చినబాపు'అనీ, పెదనాన్నను 'పెదబాపు'అనీ, నాయనమ్మను 'బాపమ్మ' అనేవాళ్ళు ఇంకా ఉన్నారు.

3.ఈ క్రమంలోనే 'బాపూ కా

భాయీ'(తండ్రి సోదరుడు) 

అనే అర్థంలో 'బాబాయి' వచ్చి ఉంటుందేమో! అని నా ఆలోచన.

4.అయితే ఇక్కడ ఒక చిక్కు ఉంది. ఒకవేళ 'బాపూ కా భాయీ' అనే పదాలలోంచే 'బాబాయి' వచ్చిఉంటే అది 'పెదనాన్న' కు కూడా వర్తించాలి.కానీ వర్తించదు. కేవలం పిన తండ్రి-అనే అర్థానికి మాత్రమే ఇది పరిమితం అయింది.ఇదీ సమస్య.

5.దీనికి తోడు ఉర్దూ,హిందీ ప్రభావం తక్కువగా ఉండే కోస్తా జిల్లాలలోనే 'బాబాయి' పదం వ్యవహారంలో ఉండడం ఆశ్చర్యకరం.

6.బాబాయి,చిన్నాయన పదాలకు‌ సమానార్థకంగా ఉత్తరాంధ్రలో ఏమంటారో తెలియదు.రావిశాస్త్రి గారి రచనలను చదివితే ఇవి తెలిసే అవకాశం ఉంది. మరోసారి చదువాలి. 

7.ఉర్దూలో తండ్రిని 'అబ్బా/ అబ్బాజాన్'అని, తల్లిని 'అమ్మి/ అమ్మీ జాన్' అని, సోదరుడిని 'భాయీ జాన్'అని గౌరవంగా పిలవడం ఉంది. 

8.ఈ ప్రభావంతోనే కావచ్చు -తెలంగాణ ప్రాంతంలో కూడా కొద్దిమందిలో తండ్రిని 'అబ్బా!' అని పిలవడం ఉంది.

9.'నీ అయ్య=నీయబ్బ' అని వాడుకలో ఉంది కదా!

10.తిరుపతి ప్రాంతంలో కాబోలు కొన్నిచోట్ల 'చిన్నబ్బి/సినబ్బి' అనడం విన్నాను.

అయితే ఈ పదాలకు 'చిన్నవాడు' అనే అర్థం కూడా ఉంది.

11.తెలంగాణలో హిందీ/ఉర్దూ ప్రభావంతో ఇప్పటికీ కొంతమంది చిన్నాయనను 'కాకా' అని అంటున్నారు. కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి గారిని 'కాకా'

అనడం అందరికీ తెలిసిందే కదా!

12.ఉత్తరాదిలో చిన్నమ్మను 'కాకీమా'(కాకా భార్య) అనీ, మేన'మామ' భార్యను 'మామీ' అని అంటారు/

పిలుస్తారు.

-మోతుకూరు నరహరి

చాలా చక్కటి విషయం బాగ విశదీకరించారు...

గుజరాత్ లో. ఉత్తరప్రదేశ్ లో బాబాయ్ చిన్నని  కాక అనీ సంబోధన చేస్తారు. పెదనాన్న ని  తావుji అని అంటారు. చిన్నాన్న అబ్బాయి ని    

bhateeja   అని .మామయ్య ని మామji అని తండ్రి అక్క చెల్లెలిని  చోటిఫuphi  అనీ  బడిphoophi అని  అక్కయ్య చెల్లెల కొడుకు ని bhanjha  అని అమ్మాయిని bhanjhi అని అంటారు..గుజరాత్ లో కూడా ఈ పదాలనే వాడుకలు ఉన్నాయి కానీ sourastra ప్రాంతమంతా కొంచం karachi పాకిస్తాన్ ఉర్దూ పదాలు వాడే అలవాట్లు అలాగే ప్రతి పేరు వెనకాల  ని అనే సంబోధన సింధి భాష ప్రయోగం చేస్తారు. ఉదాహరణకు Adani. AMBANIS. అద్వానీ. వారు sourastra ke చెందిన వారు పటేల్ లు మోడీ అని సంబోధన లో ఉన్నాయి..మన శ్రీకాకుళం  Vishakha .విజయనగరం లో చిన్ననా.గారు. పెదనాన్న గారు అనీ sane సంబోధన లు ఉన్నాయి...

తల్లి చెల్లెలు అక్కయ్య లను  పిన్ని గార ని చిన్న పిన్ని పెద్ద పిన్ని గారు అనే సంబోధన ఉన్నది...ప్రతి ప్రాంతాలను భారత దేశం లో చూస్తే అనుసరిస్తున్న విధానాలు పూర్వకాలం నుంచే వస్తున్నాయి.కానీ వారి మాటలు ఉచ్చారణలో సంబోధన లో వ్యత్యాసం 

చూడవచ్చు..గురువులకు ధన్యవాదాలు.  Kritagnatalu 

ప్రభాకర్ భట్


*శ్రీ ప్రసన్న సోమేశ్వరాలయం*

 🕉 *మన గుడి : నెం 407*


⚜ *కర్నాటక  :  మగడి - రామనగర*


⚜ *శ్రీ ప్రసన్న సోమేశ్వరాలయం*



💠 మగడిని 1139లో చోళ రాజు స్థాపించాడని నమ్ముతారు. 

ఈ ఆలయాన్ని 1712 లో ముమ్మడి కెంపేవీరే గౌడ నిర్మించాడు, ఆలయ సముదాయం యొక్క నాలుగు మూలల్లో ఎత్తైన గోపురాలు మరియు మంటపాలు ఉన్నాయి. 


💠 శ్రీ సోమేశ్వర దేవాలయం మాగడి పట్టణంలో ఉన్న పురాతన మరియు ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం 16వ శతాబ్దానికి చెందినది. 


💠 కర్ణాటకలోని చారిత్రాత్మక పట్టణం మగడిలో నెలకొని ఉన్న శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం ఈ ప్రాంతం యొక్క గొప్ప సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది. 

ఈ పవిత్రమైన నివాసం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, దాని క్లిష్టమైన వివరాలు మరియు చారిత్రక ప్రాముఖ్యతతో సందర్శకులను కట్టిపడేసే నిర్మాణ అద్భుతం కూడా.


💠 శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం శతాబ్దాల చరిత్రను కలిగి ఉంది, పురాతన కాలం నుండి దాని మూలాలను గుర్తించింది. 


💠 సోమేశ్వర ఆలయాన్ని 1569 లో అధికారంలోకి వచ్చిన తరువాత కెంపె గౌడ II నిర్మించారు అయితే, ఈ ఆలయాన్ని నిజానికి అతని వంశస్థుడైన కెంపవీర గౌడ III నిర్మించాడని మరొక అభిప్రాయం ఉంది. 

 1712 పెద్ద ఆలయ సముదాయంలోని ప్రముఖ నిర్మాణాలలో ఎత్తైన బురుజులు మరియు మంటపాలు విశాలమైన లోపలి ప్రాకార (ప్రాంగణం ) ఉన్నాయి, అవి నిర్లక్ష్య స్థితిలో ఉన్నాయి.


💠 ఈ ఆలయాన్ని 1512వ సంవత్సరంలో శ్రీ నాద ప్రభు కెంపే గౌడ నిర్మించారు. 

ఈ ఆలయం పెద్ద విస్తీర్ణంలో ఉంది మరియు ఎత్తైన దిగువన మరియు అనేక చక్కటి మంటపాలతో కూడిన విశాలమైన లోపలి ప్రాకారాన్ని (ప్రాంగణం) కలిగి ఉంది. 

ఈ మంటపాలు పట్టించుకోకపోవడం, నిర్వహణ లేకపోవడంతో ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి.


💠 శ్రీ సోమేశ్వరాలయం శివునికి అంకితం చేయబడింది. హొయసల నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయ స్తంభాలను అలంకరించే మానవులు, పక్షులు, జంతువులు మొదలైన వాటి యొక్క అందమైన శిల్పాలు ఉన్నాయి మరియు స్తంభాలపై సింహాలు, సైనికులు మరియు నృత్య బాలికల విలక్షణమైన చిహ్నాలు ఉన్నాయి. 


💠 ప్రధాన ఆలయానికి ఎడమ వైపున పార్వతికి అంకితం చేయబడిన ఒక చిన్న ఆలయం ఉంది, ఇది ఆవరణ యొక్క నాలుగు రాళ్ల వద్ద చిన్న గోపురాలు మరియు ముందు భాగంలో కొంత దూరంలో పెద్ద చెరువును కలిగి ఉంది. ఆలయం నుండి కొంచెం దూరంలో నంది మంటపం ఉంది.


💠 మాగడి బస్ స్టేషన్ నుండి 2 కి.మీ దూరంలో మరియు బెంగుళూరు సిటీ జంక్షన్ నుండి 47.5 కి.మీ దూరం

శారీరక బలాన్ని పెంచే

 శారీరక బలాన్ని పెంచే సులభ ఆయుర్వేద యోగం - 


    ఇప్పుడు నేను చెప్పబోవు ఈ ఆయుర్వేద యోగం శరీరానికి అమితమైన బలాన్ని చేకూర్చును . బూస్ట్ , హార్లిక్స్ వంటి వాటిని పిల్లలకు పాలల్లో కలిపి ఇచ్చినను ఎటువంటి ఉపయోగము లేదు . 


      నేను వివరించబోయే ఈ ఆయుర్వేద చిట్కా మీకు , మీ పిల్లలకు ,వృద్దులకు అత్యంత ఉపయోగకారిగా ఉండును . 


  బాదం 250 గ్రాములు .

 

  సోంపు 250 గ్రాములు .


 పటికబెల్లం 250 గ్రాములు చిప్స్ 


  బాదం రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే పొట్టు తీసి ఎండించాలి . బాగా ఎండిన తరువాత మెత్తటి పౌడర్ కొట్టవలెను.


  సోంపు కొంచం వేయించి మెత్తగా పౌడర్ కొట్టవలెను.


 పటికబెల్లం మెత్తటి పౌడర్ కొట్టవలెను.


   మూడింటిని కలిపి ఉదయం , సాయంత్రం ఒక గ్లాసు పాలలో కలుపుకుని తాగవలెను. 


  చిన్నపిల్లలకి 1 స్పూన్ , పెద్దవారికి 2 స్పూన్స్ చొప్పున వాడవలెను. 


  షుగర్ లేనివారు పటికబెల్లం 50 గ్రాములు పెంచుకొన్నా పర్వాలేదు .


      శరీరంలో  నీరసం, నిస్సత్తువ పోయి శరీరానికి చాలా బలం కలుగును . 6 నెలలు విడవకుండా వాడిన అద్భుత ఫలితాలు వస్తాయి. ఇది నా అనుభవ యోగం 


    పక్షవాతం వంటి మనిషిని బలహీనపరిచే రోగాలలో ఔషధాలతో పాటు ఇది ఇచ్చుచున్న శరీరంలో శక్తి ఉత్పత్తి జరిగి రోగులు త్వరగా కోలుకొంటారు . 


 

   మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


    గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034