10, డిసెంబర్ 2020, గురువారం

సుహేల్ దేవ్ పాసి అనే రాజు

 సుహేల్ దేవ్  పాసి అనే రాజు పేరు తెలుసా - 

బహుశా తెలియకపోవచ్చు...  కానీ  మీకు మొహమ్మద్ గజని పేరు తెలుసా , maximum అందరికీ తెలియవచ్చు... 


ఈ మొహమ్మద్ గజని సైన్యాన్ని ఓడించి అతడిని ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి రాకుండా 20 సంవత్సరాలు ఆపిన ఆ మహా వీరుడే సుహేల్ దేవ్ పాసి అనే రాజు, 

ఈ రోజున ఉత్తరప్రదేశ్ లో  దళితులు అని పిలవబడే పాసి కులానికి చెందిన రాజు. 


ఆనాటి కాశి లోని బ్రాహ్మణులచే ఇంద్రుడి అవతారం గా కొలవబడిన ధర్మాత్ముడు ఆయన, 

మరి మనం చదుకున్న మన దేశ చరిత్ర లో ఈయన లేకుండా కేవలం గజని నే ఎందుకున్నాడు, మనం చదివింది అసలు మన చరిత్రేనా.


గజని కి చెందిన 6  మంది సేనాధ్యక్షులని వారి సైన్యం తో సహా మట్టుబెట్టి గజని ని అవధ్ ప్రాంతాల్లోకి రాకుండా చేసిన మొదటి రాజు ఈ పాసి వీరుడు.


అలాంటి సుహేల్ దేవ్ పాసి ని గెలవడానికి గజని సైన్యం వాడిన ఆయుధం ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు అది ఏమిటో తెలుసా...

                           "ఆవులు"

                    మీరు విన్నది నిజమే.

సుహాల్ దేవ్ పాసి కి గల గోభక్తి ని తెలుసుకున్న గజని తన సైన్యానికి ముందుగా ఆవులను అడ్డుగా పెట్టుకుని, తాము బాణాలు వేస్తె ఎక్కడ గోవులు చనిపోతాయేమో అని ఆగిన సుహాల్ దేవ్ పాసి ని దగ్గరగా వచ్చి దాడి చేసి జయించారు.


ఇంతటి గొప్ప వీరుడి చరిత్ర మనకు ఈరోజున ఇరాన్ వాళ్ళ చరిత్ర పుస్తకాలలో కనబడుతుంది. వారు ఒక గొప్ప వీరుడిగా గౌరవిస్తున్న ఈ పాసి వీరుడిని మన మాత్రం ఎప్పుడో మరచిపోయాము, 


ఇలాంటి వీరుడిని గౌరవించడానికి భారత్ దేశానికి 2018  లో తీరిక దొరికింది. 2018  లో మోడీ ప్రధానిమంత్రి అయ్యాక  సుహాల్ దేవ్ పాసి పేరుమీద స్టాంపు విడుదల చేసారు.   


 2017  లో యోగి ఆదిత్య నాథ్ RSS వాళ్ళు నిర్వహిస్తున్న రాజా సుహాల్ దేవ్ పాసి సూర్య మందిర్ ని ప్రభుత్వ పరంగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుని ఆయనకు ఒక గొప్ప స్మారకం కట్టాలనే కోరికతో  50  కోట్లతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి  చేస్తున్నారు.  


మనకు, మన ముందు తరాలకు మన నిజమైన చరిత్ర ఎప్పుడు తెలుస్తుందో.

కామెంట్‌లు లేవు: