10, నవంబర్ 2020, మంగళవారం

బ్రతుకు బండి

 బ్రతుకుమీద భ్రాంతి లేదు

మృత్యువంటే భయం లేదు

మనుగడ .. మృత్యువుల మధ్య

బ్రతుకు బండి సాగుతోంది

భారంగా !


భోగించాలన్న ఆశాలేదు

యోగి కావాలన్నధ్యాసాలేదు

భోగి.. యోగిల మధ్య

జీవితం జరిగిపోతుంది

జారుకుంటూ!


జ్ఞానికావాలన్న వాంఛాలేదు

అజ్ఞానిగా మిగలాలనీ లేదు

జ్ఞానం.. అజ్ఞానం మధ్య

జీవనం సాగిపోతుంది

పడుతూ.. లేస్తూ !


సంపాదనపై అనురక్తీలేదు

సంపద అంటే విరక్తీలేదు

అనురక్తీ.. విరక్తుల మధ్య

కాలం గడిచిపోతుంది

యధావిధిగా !


చావంటే భయం లేదు

చచ్చిపోవాలనీ లేదు

ఉఛ్వాశ.. నిశ్వాసల మధ్య

ఊపిరి సాగిపోతుంది

నిశ్శబ్దంగా!


ఆకలని  ధ్యాసా లేదు

అన్నం మానాలనీ లేదు

తినటం .. తిరగటం మధ్య

తనువు సాగిపోతుంది

యాంత్రికంగా !


కీర్తి కావాలని కోరుకోవటంలేదు

అపకీర్తి మూటకట్టాలనుకోవటంలేదు

అన్నీ.. అశాశ్వతమని

అందుకోసం ఆరాటమెందుకని

బ్రతుకు సాగుతోంది.. మామూలుగా!


భౌతిక వాంఛలను కాదన్నదీలేదు

ఆధ్యాత్మికతపై విరక్తీలేదు

భౌతికత .. ఆధ్యాత్మికతమధ్య

ఆవిరైపోతుంది ఆయువు

అయోమయంగా!


పాపం చేయాలనీలేదు

పుణ్యం మూట కట్టాలనీలేదు

పాప పుణ్యాల మధ్య

పుణ్యకాలం కరిగిపోతుంది

దిశారహితంగా!

👏👏👏

సింగినాదం - జీలకర్ర

 “సింగినాదం - జీలకర్ర*


కొన్ని సందర్భాల్లో 

మనకు తెలియకుండానే 

తెలుగుల కొన్ని నానుడులు 

 అసంకల్పితంగా 

 అనేస్తూ ఉంటాము....


కాని వాటి వెనుక 

ఉన్న అసలు 

అర్ధం చాలామంది కి 

తెలియదు...


ఈ రోజు 

సింగినాదం జీలకర్ర 

అనే నానుడి వెనుక 

దాగి ఉన్న అంతరార్ధం 

 తెలుసుకుందాం....


ఒకప్పుడు 

ఓ రాజ్యంలో 

జీలకర్రకు 

విపరీతమైన 

కొరత ఏర్పడింది...


ప్రజలందరూ 

జీలకర్ర లేక చాలా

ఇబ్బందులు పడ్డారు..


ఇదే అదనుగా 

వ్యాపారస్తులు 

ఇతర దేశాల నుండి 

జీలకర్రను దిగుమతి 

చేసుకుని ఎక్కువ రేట్లకు 

అమ్మడం మొదలు పెట్టారు....


ఈ విషయమై ప్రజలందరూ 

తమ గోడును రాజు గారికి 

 విన్నవించుకున్నారు...


అప్పుడు రాజు గారు 

మంత్రివర్గం తో 

అత్యవసర సమావేశం 

ఏర్పాటు చేసి 

విదేశాలనుండి ఓడల 

మీద జీలకర్రను తెప్పించి 

 మధ్యవర్తుల ప్రమేయం 

లేకుండా డైరెక్ట్ గా ప్రజలకు 

అమ్మే ఏర్పాటు చేశారు...


అయితే జీలకర్ర తో 

కూడిన ఓడ...

రేవుకు చేరుకున్నవెంటనే 

ఆ విషయం ప్రజలకు 

 తెలియచేయడానికి 

ఓ ఏర్పాటు చేశారు...


అదే శృంగ నాదం...


శృంగ నాదం

అంటే ఒక సంగీత 

వాయిద్య పరికరం... 


ఒక విధంగా ఇది 

బాకాను పోలి ఉంటుంది....

ఓడ,  రేవుకు చేరగానే 

శృంగనాదం గట్టిగా ఊదడం 

ద్వారా ప్రజలకు ఆ విషయాన్ని 

 తెలియ చేసెడి వారు...


ప్రజలు వెంటనే 

ఓడ రేవుకు చేరుకుని 

డైరెక్ట్ గా జీలకర్రను 

కొనుక్కునే వారు...


మధ్య దళారుల 

ప్రమేయం 

లేక పోవడంతో 

జీలకర్ర తక్కువ 

రేటుకి లభించి ప్రజలు 

 ఆనందించారు...


ఇక అసలు 

విషయానికి వస్తాను...


జీలకర్ర లేకపోవడం వల్ల 

జనజీవనం అస్త వ్యస్తం 

అయ్యే అంత పరిస్థితి 

 ఏమి ఉండదు...


అయినా రాజు గారు 

దానికి అధిక ప్రాధాన్యాన్ని 

ఇచ్చి లేనిపోని హడావిడి చేశారు...


అందుకే అప్పటి నుండి 

ఎవరైనా అనవసర 

విషయాలకు అధిక 

ప్రాధాన్యాన్ని ఇస్తే 


ఆ చేశావులే 

శృంగానాదం జీలకర్ర 

అనడం పరిపాటి అయినది...


కాలక్రమంలో 

శృంగానాదం 

కాస్త సింగినాదం గా 

మారి....


సింగినాదం జీలకర్ర గా 

మారింది...


ఈ విషయం చెప్పడానికి 

నేను ఇంత మేటర్ ను 

తెలుగులో తయారు చేసి 

మీకు 

పోస్ట్ చేయడం అంత 

అవసరం అంటారా...


*ఆఁ... సింగినాదం జీలకర్ర....*😊😃🥳

మంత్రానికి శక్తి ఉందా?

 మంత్రానికి శక్తి ఉందా?


మంత్రం ఒక శబ్దం. మౌనంగా మనోవల్మీకంలో జరిగే మంత్రజపాలకి చింతకాయలు రాలుతాయా? ఈ ఆధునిక యుగంలో,బిజీలో, గజిబిజీలో మనోభావాలకి తావెక్కడ అనిపిస్తుంది! కానీ ఆశ్చర్యమేమిటంటే ఒకపక్కన మన భారతీయ సంస్కృతి గురించి మనమే యోచిస్తుంటే ఇంకో పక్క ప్రపంచమంతటా రోజురోజుకి వెలుస్తున్న యోగ ధ్యాన కేంద్రాలు, వాటినిండా ఎందరో దేశ విదేశాల వారు మన అష్టాంగ మార్గాన్ని, ఆసనాలని, మంత్ర సాధనలని నేర్చుకుంటున్నారు. ఈ రంగాలలో బహుశా మనకన్నా వారే పురోగమిస్తున్నారేమో అనిపిస్తుంది. Art of living, Transcendental Meditation, ఇంకా ఎన్నో విశేషమైన పద్ధతులు ప్రపంచ వ్యాప్తమవుతున్నాయి.


మంత్రాలని గురించి మనం మాట్లాడే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు పరిశీలించాలి. మనం ఈ రోజు పాల సీసా నించి ప్లాస్మా టీవీ దాకా వాడుతున్నాం, ఆనందిస్తున్నాం. అందుకు మూలం రసాయనశాస్త్రంలో (Chemistry) మనం సాధించిన ప్రగతి అని అందరికీ తెలుసు. విచిత్రమేమిటంటే రసాయనశాస్త్రం ఒకప్పుడు రసవాదంతో (Alchemy) మొదలైంది. లోహాలని బంగారంగా మార్చాలన్న మానవ తపన తన చుట్టూవున్న మూలకాలని, లోహ సం యోగ ధర్మాలని అధ్యయనం జరిగేలా చేసింది, బంగారం చేయలేక పోయినా అదే ఈ రోజు బంగారం కన్నా విలువైన వైజ్ఞానిక ప్రగతిని ఇచ్చింది, మానవాళిని ఖండాంతర, గోళాంతర గతిలో తీసుకు వెడుతోంది. అందుకే అనిపిస్తుంది ఏ శాస్త్రాన్ని, విజ్ఞాన రంగాన్ని తక్కువ అంచనా వేయలేము అని.


మంత్రం మనోనిర్మితం.మనస్సుకి ఇంత శక్తి వుందా అని ఆశ్చర్యపోనక్కర్లేదు. మామూలుగా పెన్ను పక్కన పెట్టుకుని మర్చిపోయే మనుషులు హిప్నటైజ్ చేయబడ్డపుడు ఎంతో కాలం క్రితం జరిగిన చిన్న చిన్న సంఘటనలని జ్ఞాపకం చేసుకోగలగడం, పూస గుచ్చినట్లు చెప్పగలగడం పైగా మంచు గడ్డల మీద మంచం మీద పడుకున్నట్లు పడుకోగలగడం ఇవన్నీ మనసుకి సహజంగా వుండే మహాశక్తికి అతిచిన్న మచ్చు తునకలు. మనిషి అంతరంగంలో ఆ మేధస్సులో (Subconscious) ఎన్ని రహస్యాలున్నాయో అనిపిస్తుంది. మనలో దాగిన ఈ శక్తి కనీసం 5% ఐనా మనం వాడుతున్నమా అనిపిస్తుంది. Math Bee,Spelling Bee లాంటి వాటిలో చిన్నారుల ప్రతిభ చూస్తే వారి మేధస్సుకి వారికే కాదు ఒక్కొసారి మానవ జీవితాన్ని, తెలివిని ఇచ్చిన ఆ దేవుడికి కూడా నమస్కరించాలనిపిస్తుంది.


ఒకప్పుడు భూమి గుండ్రంగా వుంది అంటే నవ్వారు. అది ఇప్పుడు శాస్త్రమైంది. యోగం, ధ్యానం పాతచింతకాయ్ పచ్చడి అనుకున్నాం. ఇప్పుడు వాటిని అందరూ శాస్త్రీయంగా భావిస్తున్నారు. విచిత్రమేమిటంటే ప్రపంచ చరిత్రను మార్చిన అనేకమంది శాస్త్రవేత్తలు., వేదాంతులు, సాధకులు, యోగులు కూడా. ఫ్లాటో నించి నీల్స్ బోర్ దాకా అధిభౌతిక తత్వం కనిపిస్తూనే వుంది.


మనస్తత్వ శాస్త్రంతో పరిచయం వున్న చాలా మందికి ఫ్రాయిడ్ తెలుసు. ఫ్రాయిడ్ కి సమకాలికుడైన ఒక మహా మనోవైజ్ఞానికుడు కార్ల్ జంగ్. మతాన్ని,దేవుడిని శాస్త్ర దృక్పధంలోంచి చూపిన ఒక మహానుభావుడు. ఆయన శ్రీ చక్రాన్ని,మంత్ర ఉపాసకుల మండలాలని గురించి యధాతధంగా ఇలా అన్నారు


"Things reaching so far back into human history (like yantras and mandalaas) naturally touch upon the deepest layers of the unconsciousness, and can have a powerful effect on it. Even when our conscious language proves itself to be quite impotent such things can not be thought up but must grow again from the forgotten depths..(from book: Word and Image on Carl Jung"


(మండలం, యంత్రం లాంటివి మానవ చరిత్రలో భాగంగా వున్న సహజ భావాలు.ఇవి మనోప్రవృత్తిలో ఏకమై మన తరతరాలుగా వస్తున్న ఆలోచనా పరంపరలో భాగం. వీటి శక్తి,ప్రభావం అపరిమితం. మన వాడుక భాషకూడా వీటిని వివరించడంలో విఫలమవుతుంది. ఎందుకంటే, వీటిని మనం కల్పించలేం, మళ్ళీ మనం మనావాళిగా మరిచిపోయిన,మస్తిష్కంలో దాగిన ఆ నిక్షిప్త రహస్యాలని మళ్ళీ వెలికి తీసి వృద్ధి చేసుకోవడం తప్ప.. స్వేచ్చానువాదం).


అంతేకాదు మంత్రాన్ని, తరతరాలుగా మానవ పురోగమనంతో బాటు వస్తున్న సం స్కృతి చిహ్నంగాను, అతీతమైన ఓ సృష్టి శక్తి మనిషికిచ్చిన చిన్న సంతకం అని కూడ చెప్పుకో వచ్చు. లోకకల్యాణమే ఆశయంగా పెట్టుకున్న, తపస్సుకే జీవితాన్ని అంకితం చేసిన ఏ యోగికో ఆ మంత్రాన్ని ప్రకృతి మాత అందిస్తే దాన్ని మనం మంత్రం అంటున్నాం, ఆయన్ని మంత్రద్రష్ట అంటున్నాం.అటువంటి మంత్రాలని నిరంతరం ఉపాసించడం ద్వారా అనేకమంది సాధకులు యోగులయ్యారని,లోకోపకారానికి తమ తపస్సుని వినియోగించారని పురాణ ఇతిహాసాలు, వేదాలు చెపుతున్నాయి.అన్ని సంవత్సరాల కృషిని,విజ్ఞాన సంపదని కేవలం ఒక మామూలు విషయంగా చూడలేము కదా!


"Let noble thoughts come from all directions" అంది ఋగ్వేదం.


ఫ్రణవమే సృష్టికి మూల శబ్దమట. "సృష్టి ఆదిలో శబ్దము పుట్టెను" అని బైబిలు కూడా చెబుతోంది.అంతెందుకు మన జీవితంలో ప్రతి కోణం పదాలతో నిండి వుంది. "బాగున్నరా" అనడానికి "బడుద్ధాయి" అనడానికి ఎంతో తేడా వుంది. మనం శబ్దాన్ని విన్నపుడు మనకి అది మనసులో శక్తిగా, దృశ్యంగా రూపం కనిపిస్తుంది. అందుకే గాయత్రి మంత్రాన్ని జపించినపుడు ఆ తేజో రూపశక్తిని బుద్దిని ప్రదీప్తం చెయ్యమని ప్రార్ధిస్తారు. దేవతలని పూజించాలన్నా, ఆవాహన చేయాలన్నా, దర్శించాలన్నా అది కేవలం మంత్రాల వల్లే సాధ్యం అనడానికి అందరికి తెలిసిన ఎన్నో కధలున్నయి. మంత్రాన్ని జపిస్తూ పునరావృతం చేయటం వల్ల మంత్రం సిద్ధించి దేవత అనుగ్రహిస్తుందిట. ఒక రామ మంత్రం బోయ వాణ్ణి వాల్మీకిగా మార్చింది. ఒక కాళీ మంత్రం తెనాలి రామలింగడిని తయారు చేసింది. మంత్రాలు వేదాలలో, పురాణ ఇతిహాసాలలో అస్త్రాలుగా, అమృతతుల్యమైన మహా శక్తులుగా కీర్తింప బడ్డాయి.


అనేక లక్షల సార్లు జపించబడ్డ మంత్రము శక్తిగా, ఆరాధించే దేవత రూపంగా మారుతుంది. పలు మార్లు అయస్కాంతానికి తాకించిన ఇనుప ముక్క అయస్కాంతంగా ఎలా మారుతుందో అలాగే సాధకుని సూక్ష్మ దేహం, ధ్యాన మండలం దేవతాశక్తి క్షేత్రంగా మంత్ర జపం వల్ల మారతాయి. క్రమంగా కన్నులు రెండూ మూసి తదేక దృష్టితో చెసిన మంత్ర జపం వల్ల మూడో కన్ను తెరుచుకుని జ్ఞానాన్ని, కొందరికి దివ్య దృష్టిని ప్రసాదిస్తుంది అని మంత్రశాస్త్రవేత్తలు చెపుతున్నరు. మంత్ర సాధన చేసేవారు అప్పుడప్పుడు ధ్యానంలొ మెరుపులని, దృశ్యాలని అనుభూతి చెందుతారుట. సాధన చెయ్యగా చెయ్యగా చివరికి ఆరాధించే దేవుడు లేక దేవతకి దగ్గరై, సాధకునికి దేవతకి మధ్య ఒక సమతాస్థితి ఏర్పడుతుంది. కొందరు దీక్షాబద్ధులై నిరంతర సాధన వల్ల ఆ దేవత తాలూకు శక్తిని పొంది, కార్య సాధకులుగా, సిద్ధులుగా, జీవన్ముక్తులుగా, పరాముక్తులుగా అవుతారు.


“మననాత్ త్రాయతే ఇతి మంత్రః” అని మంత్రాన్ని నిర్వచించారు ఋషులు. మననం చెయటం వల్ల రక్షించేది మంత్రము అని అర్ధము.జపం వల్ల, మనసులొ పునరావృతం చేయటం వల్ల మంత్రం శక్తి వంతమై సాధకునికి కవచంగా, కల్పతరువుగా అవుతుంది.


వైఖరి,మధ్యమ, పశ్యంతి అని మూడు విధాలుగా మంత్ర జపం చెయ్య వచ్చునని శాస్త్రాలు చెబుతున్నాయి. వైఖరి అంటే గట్టిగా జపం చెయ్యడం. ఇది అంత శక్తివంతం కాదు. మధ్యమ అంటే రహస్యంగా పెదవుల కదలికతో మత్రం వుందేలా జపం చేయడం. ఇది వైఖరి కన్నా మంచి పద్ధతి. ఆఖరిది పశ్యంతి - పూర్తిగా మనసులో చేసే ధ్యానం. అన్నిటికన్నా మంచి పద్ధతి. ఇందులో సాధకులు కేవలం మనసులోనే జపం చేస్తారు. ఈ పద్ధతి జపాన్ని తపస్సుగా, సాధకుడిని యోగిగా మారుస్తుంది. అందుకే కొందరు సాధకుల, స్వాముల సమీపంలో మంచి శాంతం, వారిలో తేజస్సు అనుభూతి చెందుతాము.మంచి సాధన చేసేవారు మరింత ఆనందంగా తయారవుతూ అందరిని ఒకేలా భగవత్స్వరూపంగా ప్రేమగా చూడగలరు.


ఆరాధించే దేవతా స్వరూపాన్ని బట్టి ఆయా తత్వం సాధకుడిని ప్రభావితం చేస్తుంది, అతనిలో ప్రవేశిస్తుంది. కృష్ణుడిని పూజిస్తే కృష్ణతత్వము, కాళిని పూజిస్తే కాళిశక్తి వస్తాయి. అంటే దాని అర్ధం మనిషి కాళి అవుతాడని కాదు, సాధకుని సూక్ష్మ దేహం చుట్టూ కాళిశక్తి వలయం ఏర్పడి అతన్ని అనుగ్రహిస్తూ వుంటుంది. ఎక్కడో కొందరు మహానుభావులకి ఇంకా కొన్ని అపురూపమైన అనుభవాలు కలుగుతాయి. రామకృష్ణ పరమహంస ఆంజనేయ ఉపాసన చేస్తుంటే చిన్న తోక వచ్చిందట. సర్వాంతర్యామి పరబ్రహ్మ స్వరూపాన్ని 'నేను 'గా,సర్వ-ఆత్మగా ఉపాసించే రమణ మహర్షుల వారికి పక్కనే వున్న గడ్డిపై ఎవరో నడుస్తుంటే మహర్షులవారికి నొప్పి కలిగేదట.ప్రసిద్ధులైన అనేకమంది కవులు, పండితులు ఉపాసనల మూలంగా శక్తిని పొందినవారే. మనలొ చాలమందికి పరిచితులైన ఒక మహాత్మునికి అమ్మవారు అనుగ్రహించగా ఆకాశమునుండి అద్భుతంగా ఒక దేవి విగ్రహం ప్రత్యక్షమైందిట. ఆ విగ్రహం ఇప్పటికీ గుంటూరులో వుంది.


కీ||శే|| అద్దంకి కృష్ణమూర్తిగారు మంత్రశక్తితో ఎన్నో చిత్రాలు చూపించేవారు. గాలిలోంచి వస్తువులు సృష్టించడం,దేవుడికి నైవేద్యం పెడితే ప్రసాదం పళ్ళెంతో సహా మాయమవడం లాంటి ఎన్నో సంఘటనలు చూడడం జరిగింది. 'ఆటోబయోగ్రఫి ఆఫ్ ఎ యోగి ' (ఒక యోగి ఆత్మకధ) గ్రంధంలో సాధన గురించి, సిద్ధిని గురించి,భగవదనుగ్రహాన్ని గురించి ఎన్నో విశేషాలు శ్రీ పరమహంస యోగానంద వివరించారు. సూక్షంగా చెప్పాలంటే మంత్రం ఆధ్యాత్మిక ప్రపంచానికి ఒక పాస్ వర్డ్ లాంటిది.మంత్రం దేవతాశక్తికి తాళంచెవి లాంటిది. మంత్రం దివ్యలోకాలకి 'యూ ఆర్ ఎల్ '(web URL) లాంటిది. మంత్రం నిక్షిప్తమైన రహస్యం లాంటిది. మంత్రం సాధకునికి దేవతకి మధ్య వంతెనగా శక్తిని, భక్తిని అందచేస్తుంటుంది అని గురువులంటున్నారు. జపించిన ప్రతిసారి సాధకుని తపన, కష్టం, సాధన స్థితి అన్నీ దేవతకి మంత్రం ద్వారా అందచేయబడతాయి. మామూలు పూజకన్న త్వరగా మంత్రం పై లోకాలకి ప్రయాణం చేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.అందుకే గాయత్రి మంత్రం 'తత్ సవితుర్ వరేణ్యం 'అంటుంది. అంటే 'ఆ సూర్యుడిని అర్ధిస్తున్నాం ' అని అర్ధం. ఏ సూర్యుడిని అని ప్రశ్నిస్తే 'ఏ సూర్యుడయితే భూ లోక, భువర్లోక, సువర్లోకాలలో సంచరిస్తున్నాడో - ఆ సూర్యుడన్న మాట '.


ప్రతి మంత్రానికి అర్ధం వుండాలని నియమం ఏమీ లేదు.ఊన్నా ఆ అర్ధం మన మామూలు అర్ధాలలో ఇమడాలని లేదు. ఉదాహరణకి ఒక లక్ష్మీ మంత్రాన్ని చూస్తే,'హ్రీం శ్రీం మహా లక్ష్మియై స్వాహా ' - ఈ మంత్రము ఓం తో ప్రారంభమవలేదు, నమః అని తుదిలోను లేదు. హ్రీం కి ఎన్నో అర్ధాలున్నాయి. హ్రీం అనేది మాయా బీజం. (అంటే మాయమవుతామని కాదు)మాయ బీజం కావటం చేత, ఈ మంత్రం చేయువారికి సర్వ వ్యాపకమైన శ్రీం లభిస్తుంది. అంటే కేవలం పైసలలో వుండే డబ్బు కాకుండా, ఏ లక్ష్మి శ్రీసూక్తంలో విశెషంగా కీర్తించబడిందో అది లభిస్తుంది.


'ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుః '


మంత్రమును ఏకాగ్రతతో చేయడం అవసరం అని అందరు అంటారు. నిజమే, కాని అంత తీవ్రమైన ఏకాగ్రత కుదరకపోయినా సాధనలో ప్రగతిని సాధించవచ్చు. మన మంత్రాన్ని మనమే వినడం ద్వారా ఏకాగ్రత పెంపొందించుకోవచ్చును. కొందరు సాధకులు ఏ దేవతని ఉపాసిస్తున్నరో ఆ దేవతని ఎదురుగా వున్నట్లు ఊహించుకుని సాధన చేయడంవల్ల భక్తితో, శ్రద్ధగా మరింత ముందుకి వెడతారు.


మంత్రాలు బీజాక్షరాల సముదాయం. 'బీజాక్షరాలు ' అంటే విత్తనాల లాంటివి అన్నమాట.బీజాక్షరాలు కూడ విత్తనాల లాగే ధ్యానభూమికలలో వుంచడం వల్ల మహావృక్షాల్లా పెరిగి అనుగ్రహం కలుగచేస్తాయి. గోల్ఫ్ ఆడేవారికి క్లబ్ ఎలాగో, మంత్ర జపానికి మాల అలా అవసరం. రుద్రాక్షమాలని జ్ఞానానికి, మనోశక్తికి, సిద్ధశక్తులకి వినియోగిస్తారు. తులసి మాలని ఆరోగ్యానికి, శాస్త్రజ్ఞానానికి, నిర్మలత్వానికి వుపయోగించవచ్చును. ఎర్రచందనం మాలతో కామ్యసిద్ధి, తామరపూస మాలతో జపం చెస్తే లక్ష్మి ప్రసన్నత కలుగుతాయని మంత్ర మహోదధి, మేరు తంత్రము, రుద్రయామళము వంటి గ్రంధాలు చెబుతున్నాయి. ఆవిధంగా మాల కేవలం జపం లెక్కించటానికే కాక మంత్రసిద్ధిలో కూడా ఉపయోగిస్తుంది.


ఇలా మంత్రసాధనలని చేసి ఈ ఆధునిక యుగంలోనూ అతీంద్రియ శక్తులను సాధించవచ్చునని అనేక గ్రంధాలే కాక నిజమైన జ్ఞానాన్ని, నిర్మలమైన ధ్యానాన్ని నమ్మిన గురువులు సూచిస్తున్నారు. ఐతే అంత గొప్ప స్థితులకి నేను వెళ్ళగనా? గురువులు ఖరీదై, సత్-గురువులు కరువైన ఈరోజుల్లో, ఎక్కడో ప్రాచీనమైన ఈ శాస్త్రాలని నేను అర్ధం చేసుకోగలనా? ఎప్పుడో వచ్చే స్వర్గం కాదు ఇక్కడే ఈ నేలపై నా జీవితాన్ని గురించి మన శాస్త్రాలు ఏమంటున్నాయ్? ఇవన్నీ వచ్చే సంచికలలో చర్చించ ప్రయత్నిద్దాం.


(సేకరణ)

_పుష్కరాలు_

 🙏 *_పుష్కరాలు_* 🙏


పుష్కరుడు అనే మహా భక్తుడు మహేశ్వరుని గురించి ఘోర తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఎం వరం కావాలో కోరుకొమ్మన్నాడు.


అందుకు పుష్కరుడు...


" స్వామీ నదులన్నీ జీవులు చేసిన పాపాలతో నిండిపోయాయి. ఆ నదులని పునీతము చేయుటకై నీ జలమైన శరీరమును నాకిమ్ము , నీ స్పర్శ తో నదులన్నీ పునీతమౌతాయి అని వరం కోరాడు.


ఆ తరువాత బృహస్పతి( గురుడు) కూడా శివుని తనువుని పుష్కరుని వలె పొంది సర్వులకు ఆధారము కావాలని తపము చేసాడు. 


బృహస్పతి తపసుకు మెచ్చి శివుడు, తనకిచ్చిన వరాన్ని గురునికి ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఆపై బ్రహ్మ గురించి గురుడు తపము చేసి తన కోరికను తెలియజేశాడు. 


అప్పుడు బ్రహ్మ 12 జీవనదులలో సంవత్సరానికొక్కసారి 12 రోజులు పుష్కరుడుండునట్లు , గురుడు ఒక్కో రాశిలో సంచారము బట్టి జరుగుతుందని చెప్పి ఇద్దర్ని శాంతపరిచాడు .


గురుడు

1 మేష రాశిలో ఉంటే గంగా నది పుష్కరాలు

2 వృషభ రాశిలో ఉంటే నర్మదా నద పుష్కరాలు

3 మిధునంలో ఉంటే సరస్వతీ నది పుష్కరాలు

4 కర్కాటకం లో ఉంటే యమునా నది పుష్కరాలు

5 సింహ రాశిలో ఉంటే గోదావరి నది పుష్కరాలు

6 కన్యా రాశిలో ఉంటే కృష్ణ నది పుష్కరాలు

7 తులా రాశిలో ఉంటే కావేరి నది పుష్కరాలు

8 వృశ్చికంలో ఉంటే భీమా నది పుష్కరాలు

9 ధనూరాశి లో ఉంటే తపతి నద పుష్కరాలు

10 మకరం లో ఉంటే తుంగభాద్ర నది పుష్కరాలు

11 కుంభ రాశిలో ఉంటే సింధూ నది పుష్కరాలు

12 మీన రాశిలో ఉంటే ప్రాణహిత పుష్కరాలు


మనిషి తాను జన్మించిన దగ్గర్నుంచి ఎన్నో పాపాలు తెలిసి తెలియక చేస్తుంటారు. పుష్కర స్నానం చెయ్యడం ద్వారా సమస్త పాపాలు పోతాయని మహాభారతం లో వ్యాసభగవానుడు చెప్పారు.


*జన్నప్రభృతి యత్పాతం స్త్రియా వా పురుషేణ వా౹౹ పుష్కరే స్నాతమాత్రస్య సర్వమేవ ప్రణశ్యతి ౹౹*


స్త్రీ చేత కానీ పురుషుని చేత కానీ పుట్టినప్పటి నుంచి చేయబడిన పాపమంతా పుష్కర సమయంలో స్నానం చేస్తే తొలగిపోతుంది.


పుష్కర సమయంలో మనమే కాదు,

ముక్కోటి దేవతలూ భూమిమీదకొచ్చి పుష్కర స్నానం చేసి తరిస్తారు.


పుష్కర స్నానం వల్ల, అహల్యను భంగం చేసిన దోషాన్ని ఇంద్రుడు పోగొట్టుకున్నాడు.


బ్రహ్మ శిరస్సు ఖండించిన దోషం వలన పొందిన బ్రహ్మహత్యా పాపం నుంచి శివుడు విముక్తుడయ్యాడు.


🙏 *_ఓం నమో నారాయణాయ_* 🙏

వృద్ధాశ్రమాలెందుకు

 వృద్ధాశ్రమాలెందుకు :-


టీ కప్పు హాండిల్ విరిగింది దానిని ఏ బడ్స్ దాయటానికో ,పిన్నీసులు పెట్టుకోవడానికో ఉపయోగిస్తున్నాము !

.

దుప్పటి చిరిగిపోయింది ..దానిని నాలుగుమడతలు వేసి కాళ్ళు తుడుచుకునే పట్టా క్రింద వాడుతున్నాం !

.

కుండ చిల్లిపడింది ! దానిని పూలకుండీక్రింద వాడుతున్నాం !

.

మరి సంపాదించే శక్తిఉడిగిపోయిందంటూ వృద్ధులను వృద్ధాశ్రమాలలో ఎందుకు పెడుతున్నాం ?

.

కండరాల శక్తి వలననేఉపయోగమా ?

.

 వారి అనుభవాన్ని జ్ఞానాన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం ?

.

పైగా వృద్ధాశ్రమాలలో పండ్లు పంచిపెట్టడం చేసి వారి మీద సానుభూతి చూపి ఏదో దైవకార్యం చేసినట్లు ఫోజులిస్తున్నాం !

.

మన దేశంలో వృద్ధులపట్ల ఒక ఉదాసీన భావం బాగా ప్రబలిపోయింది ! 

.

అమెరికా అధ్యక్షపదవికి పోటీ పడిన ఇద్దరు అభ్యర్థుల వయస్సు చూస్తే 79 ఒకాయనకు ,75 ఒకాయనకు ! వారు ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించగలిగే కీలకపదవికి పోటీదారులు ! 

.

నోబెల్ ప్రైజు గెలుచుకున్న వారి వయస్సు ఒకసారి అందరిదీ పరిశీలించండి అందరూ వృద్ధులే దాదాపుగా !  

.

మనకు అర్ధం కావడంలేదు మనదేశంలో ఏం పోగొట్టుకుంటున్నామో ! 

.

ఒక వృద్ధులైన డాక్టర్ వద్దకు వెళ్ళు ఏం లాభమో తెలుస్తుంది

ఒక వృద్ధులు అనుభవజ్ఞుడైన లాయర్ వద్దకు వెళ్ళు ఎంతో విజ్ఞతతో కూడిన సలహా లభిస్తుంది

ఒక వృద్ధులైన కళాకారుడిని అడిగిచూడు మెలకువలు తెలుస్తాయి ! 

అసలు ఏ రంగంలో వృద్ధులు ఆ రంగంలో ఒక నిధి

వారిని సేవించండి జ్ఞానం లభిస్తుంది !!

.

వారి అనుభవాన్ని ఉపయోగించుకుంటే వారు ఎంతో ఉత్సాహంగా ఉపయోగపడతారు పైగా వారి ఆరోగ్యమూ మెరుగుపడుతుంది ! 

.

అసలు  వారే దేశ సంపద ! వారి అనుభవం, విజ్ఞత దేశానికి ,సమాజానికి ,కుటుంబాలకు ఉపయోగపడవద్దా ? 

.

అసలు వృద్ధాశ్రమాలెందుకు ?


!! ఆలోచించండి !!

దుర్గా సప్తశతి

 *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 10  / Sri Devi Mahatyam - Durga Saptasati - 10 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


*అధ్యాయము 3*

*🌻. మహిషాసుర వధ - 1 🌻*


1. ఋషిపలికెను : 

2. అంతట తన సైన్యం నాశనమవడం చూసి సేనాని అయిన చిక్షురమహాసురుడు అంబికతో యుద్ధం చేయడానికై కోపంతో వచ్చాడు. 


3. మేరుపర్వతశిఖరంపై మేఘం ఎలా వర్షం కురిపిస్తుందో అలా యుద్ధంలో అసురుడు ఆ దేవిపై బాణవర్షం కురిపించాడు.


 4. అంతట దేవి అవలీలగా ఆ బాణసమూహాన్ని ఛేదించివేసి, తన బాణాలతో అతడి గుజ్జలను, గుజ్జాలను తోలేవాణ్ణి చంపింది.


5. వెంటనే ఆమె అతని ధనుస్సును, మిక్కిలి ఎత్తైన ధ్వజాన్ని ఛేదించి, విరిగిపోయిన ధనుస్సు గల అతని శరీరాన్ని బాణపు పోటులచేత గ్రుచ్చివేసింది.


6. విల్లు త్రుంపబడి, రథం లేక, గుజ్రాలూ సారథి చంపబడగా ఆ అసురుడు ఖడ్గాన్ని, డాలును ధరించి ఆ దేవిపైకి ఉరికెను.


7. అతివేగంగా అతడు మిక్కిలి పదను గల తన కత్తివాదరతో సింహం తలపై కొట్టాడు. దేవిని కూడ ఆమె ఎడమభుజంపై కొట్టాడు.


8. రాజకుమారా! అతని ఖడ్గం ఆమె భుజాన్ని తాకడంతోనే ముక్కలుగా విరిగిపోయింది. అతడు అంతట కోపంతో కళ్ళు ఎఱ్ఱబారి శూలాన్ని తీసుకున్నాడు.


9. ఆ మహాసురుడు అంతట ఆ శూలాన్ని, జాజ్వల్యమాన తేజోయుక్తమైన దానిని, ఆకాశం నుండి సూర్యబింబాన్ని విసరినట్టు, భద్రకాళి పై  విసిరాడు. 


10. తన మీదికి వస్తున్న ఆ శూలాన్ని చూసి దేవి తన శూలాన్ని విసరగా అది ఆ శూలాన్ని, ఆ మహాసురుణ్ణి నూరు ముక్కలుగా ఖండించింది.


11. మహిషాసురుని సేనానియైన మహావీరుడు వధితుడవడం వల్ల వేల్పులను నొప్పించడానికై చామరుడు ఏనుగునెక్కి (దేవిని) మార్కొనెను. 


12. అతడు కూడా తన భల్లాన్ని అంబికాదేవిపై విసిరాడు, ఆమె వెంటనే ఒక హుంకారంతో (“హుమ్” అను శబ్దంతో) దాన్ని ఎదిరించి అది కాంతివిహీనమై నేలపై పడిపోయేటట్లు చేసింది.


13. తన భల్లం విరిగి నేలకూలడం చూసి చామరుడు కోపంతో ఒక శూలాన్ని విసిరాడు. ఆమె దాన్ని కూడా తన అమ్ములతో త్రుంచివేసింది.


14. సింహం అప్పుడు పైకి ఎగిరి ఏనుగు కుంభస్థలమధ్యలో కూర్చొని, ఆ సురవైరితో బాహు యుద్ధం చేసింది. 


15. పోరాడుతూ వారిరువురూ ఏనుగుపై నుండి దూకి మహా ఘోరంగా యుద్ధంచేస్తూ ఒకరినొకరు మిక్కిలి భయంకరంగా కొట్టుకున్నారు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ సత్యనారాయణస్వామి వ్రతమహాత్మ్యము

 శ్రీ సత్యనారాయణస్వామి వ్రతమహాత్మ్యము 


            మొదటి అధ్యాయము 


తే  1

శ్రీకరంబైన నైమిశక్షేత్రమందు 

శౌనకాదిగ  వరలెడి సకలమునులు 

వివిధకథలను సూతుచే వినుచునుండి 

వినయమొప్పగ నడిగిరి వేడు కొనుచు 

               

తే   2

"ఎట్టి వ్రతమును జనములు నిలను సేయ 

కామితార్థంబు కల్గును కలియుగమున 

వినగ కోరిక జనియించె  విబుధవర్య ! 

తెలియపరచుడు వినెదము తీరు గాను      

 

కం   3

మునిసంఘము లీరీతిగ 

ఘను సూతును నడిగినంత కడుయుత్చుకతన్ 

విని సూతుడు చిఱునగవుతొ  

ననెమునులతొ నంతటిటుల యానందముతోన్ ;


ఆ   4

నారదుండు దొల్లి  నారాయణుని జూచి 

యివ్విధంబు నడుగ నెరుగ దలచి

మునిని గాంచి యపుడు ముదమంది శ్రీహరి 

నుడివినట్టి  నుడులు నుడివె దిపుడు      

                     

కం.    5

సురముని నారదు డొకపరి 

హరినామము బాడుకొనుచు నవనకి జనియున్   

నరు లచ్చట పలువెతలతొ 

కరమరుదుగబ్రతుకుచుండ  గాంచెను వ్యధతోన్ 


సీ.   6

ఈతి బాధలతోడ నిక్కట్లు పడుచును

                 నకనకలాడెడి నరుల గాంచె 

తనురుగ్మతలతోడ తల్లడిల్లుచు మిగుల 

                 నడయాడుచుండెటి నరుల గాంచె 

ఆత్మశాంతియులేక  నలమట నొందుచు 

                 నలుగుచుండెడి పెక్కు నరుల గాంచె 

ఋణ విత్త బాధల కృశియించి బ్రతుకున

                 నానా వెతలనున్న నరుల గాంచె 

    తే

    నరులు పడియెడి బాధలు నారదుండు 

    కన్నులారంగ జూచియు కడు వ్యదొంది 

    మానవుల బాధ పోగొట్ట మదిని దలచి 

    కదలె వైకుంఠపురముకు గాంచ హరిని 


కం.   7

నారదు డట జని కాంచెను 

నారాయణు శేషతల్పు నవ్యామ్బరునిన్ 

నీరద తను సంకాసుని 

శ్రీరమ సంసేవ్య పాదు శ్రీత మందారున్ 


కం.   8

నారద సంయమి యంతట 

నారాయణు నెదుట నిలిచి నతమస్తకుడై 

ధారాళ మైన నుడులతొ 

యీ రీతిగ ప్రస్తుతించె యీప్సిత మదితోన్ 


మ ద్వి.  9

"శ్రీకరా !శుభకరా !శ్రీచిద్విలాస!

శ్రీ లక్ష్మి సంసీవ్య ! శ్రీ వత్స చిహ్న ! 

కామితార్థ ప్రదాత ! కౌస్తుభ భూష !

వాసుదేవా ! హరీ ! వైకుంఠ వాస  !

శంఖ గదా చక్ర శార్ఙ్గ సంకాశ !

యభయ వరద హస్త యాస్రితపోష !

దేవదేవ ! వరద ! దివ్య ! జీవాత్మ !

దేవవంద్య ! వినుత ! తేజితదేహ !

పరమపురుష ! విష్ణు ! పావననామ !

జయము నారాయణా ! జగదీశ ! విష్ణు !

మాధవా ! కేశవా ! మధుకైటబారి !

శ్రీధరా !గోవింద! శ్రీహృషీకేశ !

వాసుదేవా ! హరే ! వామన ! విష్ణు ! 

యనిరుద్ధ ! ప్రద్యుమ్న ! యచ్యుతా ! దేవ !

నారాయణా ! విష్ణు ! నళినాయ తాక్ష !

పురుషోత్తమా ! దివ్య ! పుండరీకాక్ష !

పాహిమాం పాహిమాం పరమాత్మ! దేవ !

గో విప్ర రక్షకా ! గురుమీన రూప !

కౌస్తుభ మణిహార ! కచ్ఛప రూప !

గోపాల పాలకా ! క్రోడంబ రూప !

నారాయణా ! హరీ ! నరహరి రూప !

వందిత విక్రమా ! వామన రూప !

పృధివీశబలహరా  ! భృగురామ రూప !

రాజీవలోచనా ! రఘురామ రూప !

పాలితయాదవా !బలరామ రూప !

శ్రీచిద్విలాస యో శ్రీకృష్ణ రూప !

వినుతింతు మనసార విష్ణు స్వరూప !

కామితార్థప్రదాత !కరుణించు మమ్ము 

జయము నారాయణా ! జయము యో దేవ !"


కం.   10

సురముని నారదు స్తుతులను 

సిరినాథుడు విష్ణు వినియు స్థిఱ నగవులతోన్ 

పరికించుచు యాతని గని 

కరుణతొ యిట్లనియె నపుడు కడు శాంతమునన్ 


తే.   11

"విమలమానస నారదా ! యేల యిపుడు *

కూర్మితోడను నీవిట కొచ్చినావు ? 

తెల్పు నీకోర్కె యేదైన దీర్తు నిపుడె 

తేటతెల్లంబుగా నీవు దెల్పవయ్య "


కం.   12

నారాయణు డా విధముగ 

కారుణ్యము తోడ బలుక, కడు పులకితు డై 

నారదు డన్తట  భక్తితొ 

యీ రీతిగ బలికె మిగుల వినయము తోడన్ 


సీ  13

"సర్వజ్ఞు డవునీవు సర్వేశ !పరమేశ !

              నీ వెఱుంగని దేది నీరజాక్ష !

మర్త్య లోకమునందు మనుజులుపెక్కురు 

              పలుయోనులందున ప్రభవమొంది 

వివిధ యిడుములందు విధిదప్పి పడుచుండి 

               యనుభవించుచునుండె యమితవగపు 

పాపకర్మలతోడ పలురోగములతోడ 

               పీడింప బడుచుండె పెక్కురీతి 

యమిత బాధల క్లేశాల యనుభవమున 

మహిని జీవించుచున్నట్టి మానవులకు 

బాధలను బాప నేదైన పరమపథము 

బోధజేయగ గోరుదు పురుషశ్రేష్ఠ !"


కం 14

ముని నారదు డావిధముగ 

వినయంబున ప్రభునిగాంచి వేదన తోడన్ 

జనముల బాధలు దెలుపగ 

విని మనమున మెచ్చుకొనియు విష్ణుండనియెన్ 


కం  15

"మునివర ! నీ యభిమతమును 

విని సంతస మొందినాను వేడుక యయ్యన్ 

జగముల క్లేశము బాపగ 

మనమందున దలచు నిన్ను మది శ్లాఘింతున్ 


తే గీ 16

లోక కల్యాణమును గోరి తేకువగను 

యమిత యావేదనంబున యడుగ జూచి 

సంతసంబయ్యె నాకెంతొ సంయమీంద్ర ! 

వినుము దెల్పెద నీకొక్క విమల పథము 


కం 17

వినుమో నారద ! తెల్పెద 

మనమందున కలతమాని మదిస్థిమితమునన్ 

జనులందఱు సుఖ శాంతుల 

మనగల రీ పుణ్య వ్రతము మఱి చేయంగన్ 


తే గీ  18

కామితార్ధ ప్రదాయిని కల్పతరువు 

"సత్యనారాయణస్వామి సద్వ్రతంబు"

యిహమునందున సుఖశాంతు లిచ్చితుదకు 

పరమునందున మోక్షపుప్రాప్త మిచ్చు

ధార్మికగీత - 76

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲 

                          *ధార్మికగీత - 76*

                                    *****

      *శ్లో:- అరా  వప్యుచితం కార్యం ౹*

             *ఆతిథ్యం  స్వయమాగతే  ౹*

             *ఛేత్తు:  పార్శ్వగతాం ఛాయామ్ ౹*

             *నోపసంహరతే  ద్రుమః  ౹౹*

                                  *****

*భా:- అల్పులకు తన, పర అనే భావం నరనరాన జీర్ణమై ఉంటుంది. ఉదారచరితులు లోకమంతటిని తమ కుటుంబంగా భావిస్తుంటారు. శత్రువైనా సరే ఈర్ష్యాద్వేషాలను, భేషజాన్ని ప్రక్కన పెట్టి, మన ఇంటికి తనంతట తానుగా ఒక మెట్టు దిగి వచ్చినపుడు చుట్టంగా భావించి, చక్కని అతిథి మర్యాద చేయడం మంచిపని. అది విజ్ఞతకు, విచక్షణకు శుభసూచకము. ఎలా అంటే  మహావృక్షం కూడా తనను పెద్దగొడ్డలితో  కట్టెలనిమిత్తం నరకడానికి వచ్చిన వాడికి కూడ ప్రక్కనే బాసటగా ఉన్న తన   నీడను ఉపసంహరించుకోవడం లేదు. చల్లదనాన్ని  ఇవ్వడం మానుకోదు. ఫలాలను తినవద్దనడం లేదు. పూలను కోసుకోవద్దనడం లేదు.  కర్ణుడు తన ప్రాణాలకు ముప్పని తెలిసినా కవచ కుండాలాలను శత్రుభావనతో వచ్చిన  ఇంద్రునికి ఇవ్వడం మానుకోలేదు. ఆవులు, గేదెలు తమను చంపే వాడికి కూడా పాలివ్వడం మానుకోవుగదా! లోకంలో ఉదారులకు తన,పర భేదం లేకుండా సాయపడడమే సహజగుణమని సారాంశము. చంపదగినవాడికి కూడా మేలు చేసి పంపడమే మేలని వేమన ఉద్భోధించడం  గమనార్హము*.

                                  *****

                   *సమర్పణ  :  పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

*బ్రౌన్ పుట్టినరోజు 10.11.1798*



 *బ్రౌన్ పుట్టినరోజు 10.11.1798* 


ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌ 1817, ఆగస్ట్‌ 13. ఇంగ్లండ్‌ నుంచి భారతదేశానికి ఓడ ఒకటి బయల్దేరింది. దాని పేరు కర్ణాటక్‌. వందలాది ప్రయాణికులున్నారు అందులో. ఆ వందల్లో ఓ అనామకుడు. 19 ఏళ్లవాడు. పేరు.. ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌. భవిష్యత్తులో మరణశయ్యపై ఉన్న తెలుగు సాహిత్యాన్ని.. శాస్త్రీయతా అనే గంగతో బతికించే సాహితీ భగీరథుడు. 'కానీ ఆ ఓడ ఎక్కేటప్పుడు అసలు 'తెలుగు' అనే మూడక్షరాల మాట విన్లేదు' అంటాడతను నిజాయతీగా. కానీ అతని జీవితం మొత్తాన్ని ఆ మూడు అక్షరాలే శాసించాయి. అతని మాటల్లో చెప్పాలంటే 'పిచ్చెక్కించాయి'. అతని వూపిరున్నంత వరకు వూడిగం చేయించుకున్నాయి!


(నవంబర్ 10, 1798 ) తెలుగు సాహిత్యమునకు విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు. తొలి తెలుగు శబ్దకోశమును ఈయనే పరిష్కరించి ప్రచురించాడు. బ్రౌన్ డిక్షనరీని ఇప్పటికి తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు. తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ఆంగ్లేయులలో ఒకరిగా బ్రౌన్ ను పరిగణిస్తారు. మిగతా ముగ్గురి పేర్లు ఆర్థర్ కాటన్, కాలిన్ మెకెంజి, థామస్ మన్రోలు. ఆంధ్ర భాషోద్ధారకుడు అని గౌరవించబడిన మహానుభావుడు.వేమన పద్యాలను సేకరించి, ప్రచురించి, ఆంగ్లంలో అనువదించి ఖండాంతర వ్యాప్తి చేశాడు.


12 డిసెంబర్‌ 1884న అవివాహితుడిగానే తన 87వ యేట లండన్‌లోనే కన్ను మూశారు.

కుటుంబం - సంసారం వంటి బంధనాల్లో ఇరుక్కోకుండా స్వేచ్ఛగా తెలుగు భాషా సాహిత్యాలకు, తెలుగు ప్రజలకు తనను తాను అర్పించుకున్న మహనీయుడు ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌! డాక్టర్‌ జానుమద్ది హనుమచ్ఛాస్త్రి కడపలో బ్రౌన్‌ స్మారక గ్రంథాలయం నెలకొల్పారు. బ్రౌన్‌ జీవితం - సాహిత్య కృషి గురించి పరిశోధించి, విషయాలు తరువాతి తరాలవారికి అందించారు. జానుమద్దిగారితో గతంలో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం, కొన్ని సాహిత్య సభల్లో ఆయన్ని కలుసుకోగలగడం మరువలేని జ్ఞాపకాలు! బ్రౌన్‌ను తనలో ఆవహింపజేసుకున్నవాడిగా ఆయన కనబడేవారు. ప్రతి రంగంలోనూ త్యాగధనులు ఉంటారు. వారి కృషిని కనీసం స్మరించుకోవడం మనుష్యులైన వారి కనీస కర్తవ్యం.


Stay Safe. 👍

Ghanta Surender 😊

శివానందలహారీ

 🙏శివానందలహారీ 🙏


ఉపేక్షా నోచేత్కింన హరసి భవద్ధ్యాన విముఖాం

దూరాశాభూయిష్టా0 విధిలిపి మశక్తో యది భవాన్

శిరస్తద్వైధాత్రం స నఖలు సువృత్త0 పశుపతే

కథంవా నిర్యత్నం కరనఖముఖే నైవ లులితమ్ 



తాత్సార మేలయ్య ? తరుణేందుశేఖరా !

             కరుణేక్షణలనన్ను గావుమయ్య  

త్వన్మధు నామంబు తలపని దుష్టుడన్

             నా లలాటము మీది నలువ లిపిని

భవదీయ కరముచే బలవంతముగ నైన

              విశ్వేశ ! తుడువుము వేగిరముగ

సర్వేశ ! యారీతి సాధ్యంబు కాదని

              భక్తుడౌ నాతోడ బలుక బోకు

మటుల గాకున్న నాడు దురాగ్రహమున

 ధాతృ పంచమ శిరమును తగు బలాన 

చేతి గోటితో  నేరీతి చెండి తీవు ?

నీకు సాధ్యంబు గానిదింకేమి యుండు ?   15 # *




విరించిర్దీర్ఘాయు ర్భవతు భవతా తత్పరశిర

శ్చతుష్కం సంరక్ష్యం న ఖలు భువి దైన్యం లిఖితవాన్ 

విచార: కో వా మాం విశద కృపయా పాతి శివ దే 

కటాక్షవ్యాపార  స్స్వయ మపి చ దీనావనపరః 



తరగగా మిగిలిన తలలు నాలుగు గల్గి

             బ్రహ్మ  నీచేతిలో బ్రతికి పోయి

దీర్ఘాయువును పొంది తేజరిల్లుచు నుండి

             సృష్టి కార్యంబును చేయుచుండె

మావంటి కొందఱి మనుజుల నొసట తా

              వదలక దైన్యమున్ వ్రాయుచుండె

నరయగా మాకది నుపకార మెట్లగు ?

              నుపకారముగ మాకు నుండు నెపుడు

దైన్య మొందియు మేమున్న తరుణ మందె

దీన రక్షణ జేసెడి దీక్ష నున్న

విమలమౌ తావక కటాక్ష వీక్షణంబు

రక్షణము సేయు మమ్ముల తక్షణంబు  16 #



✍️ గోపాలుని మధుసూదన రావు