FLAT FOR SALE in JANAPRIYAMAHANAGAR, Meerpet.
Flat no:2343
2nd block
West facing
545 Sq ft ,double bed room
Price:@12.50 lacs.
Negotiable
Only interested call me
No brokers please
Call. Bharhava
9848647145
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
*వరంగల్లో 13వ తేదీ ననే చద్దుల బతుకమ్మ*
*అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి భద్రకాళి దేవస్థానం వరంగల్*
ఈ సంవత్సరం బతుకమ్మ పండుగ ఏ రోజున చేసుకోవాలి అనే మీమాంస నెలకొంది. నిజానికి బతుకమ్మ పండుగ గురించి ధర్మ శాస్త్ర గ్రంథాలలో ఎక్కడా చెప్పబడినట్టుగా లేదు. ఇది వారి వారి ఆచారాన్ని అనుసరించి పితృ అమావాస్య ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభం చేసుకుని కొన్ని ప్రాంతాలలో ఐదు రోజులు, ఏడు రోజులు, తొమ్మిది రోజులు నిర్వహించుకునే పండుగగా వ్యవహరింపబడుతుంది. గురు మదనానంద సరస్వతీ పీఠాధిపతులు అయిన పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారు గత నాలుగైదు సంవత్సరాల క్రితం తెలంగాణ విద్వత్ సభలో మాట్లాడుతూ.. చద్దులబతుకమ్మ పండుగను నిర్ణయం చేస్తూ, బతుకమ్మ పండుగను ఎవరు ఎన్ని రోజులు ఆడిన దుర్గాష్టమి లోపే పూర్తి చేయాలని నిర్ణయం చేసినారు. దుర్గాష్టమి రోజున రాత్రివేళలో బలిప్రదానములు ఇచ్చే సంప్రదాయం మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నందున. పుష్పగౌరి వ్రతం చేసుకున్న వాళ్లంతా దుర్గాష్టమి రోజుననే పూల గౌరమ్మను నిమజ్జనం చేయాలని. దుర్గాష్టమి రోజున బలిప్రదానములు చేసి బతుకమ్మను నిమజ్జనం చేయకుండా ఉంటే శ్రేయస్కరమని తెలియజేసినారు. ఇట్టి విషయాన్ని ఆనాడు పండితులు, పామరులు, సిద్ధాంతులు కూడా ఆమోదించారు. ఈ ప్లవనామ సంవత్సరంలో జరుపబడిన విద్వత్ సభలో పండితులు సిద్ధాంతులు ఏకీకృతమై ఈ నెల 13వ తేదీ బుధవారం రోజుననే చద్దుల బతుకమ్మ పండుగను ఆచరణ చేసుకోవాలని నిర్ణయం చేయడం జరిగింది. కావున యావన్మంది ప్రజలు ఈ నెల 13వ తేదీ బుధవారం రోజుననే చద్దుల బతుకమ్మ పండుగను చేయవలసిందిగా తెలియజేయుచున్నాము.
*శ్రీ ప్లవ - శరన్నవరాత్రులు - నవావరణ పద్యార్చన*
రచన: శ్రీశర్మద - స్వర్ణపురి (పొన్నూరు)
ఆశ్వయుజ - శుక్ల అష్టమి: ది.13-10-2021
శార్దూలము:
కాదంబోజ్జ్వలవాటికావృతము శృంగారాంచితారామముల్
మోదంబొప్పెడు రత్ననిర్మితసభాస్ఫూర్తింకరుల్ కుడ్యముల్
వేదీమధ్యసువర్ణశిల్పవళులున్ పీయూషసింధ్వంతరం
బా దివ్యాయతనమ్మున న్మహితయౌ నమ్మాతకున్ మ్రొక్కెదన్
✍️శ్రీశర్మద
మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి లీలలు..
*నడిపించే దైవం..*
అవధూతల, సద్గురువుల చరిత్రలు చదివేటప్పుడు, కొన్ని కొన్ని సంఘటనలు మన మనసులో ముద్ర వేస్తాయి..
మొదట్లో ఇది నిజమా అనే సందేహం తో మొదలయ్యి, క్రమంగా బలమైన నమ్మకాన్ని కలిగిస్తాయి..
అలా సందేహం నుంచి మన మనసు సమాధాన పడే దాకా మన వెనుక వుండి నడిపేది కూడా ఆ సద్గురువే అన్న నిజం కాలక్రమేణా అవగతం అవుతుంది..
మన కళ్ళెదుటే దైవాన్ని త్రికరణశుద్ధి గా నమ్మి, బాగుపడే వ్యక్తులను చూసినప్పుడు ఏ సందేహాలకు తావుండదు..
అటువంటి ఓ సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాము..
పిల్లి మాల్యాద్రి అనే వ్యక్తిని, (రోళ్ళపాడు గ్రామం, వలేటివారి పాలెం మండలం, ప్రకాశం జిల్లా) సుమారు ఒక సంవత్సరం క్రిందట అతని భార్య మొగలిచెర్ల గ్రామంలో సిద్ధి పొందిన శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి తీసుకొని వచ్చింది..
మాల్యాద్రి నడువలేడు..మాట్లాడలేడు.. అంతకు 6నెలల ముందు జబ్బు చేసింది..ఒంగోలు లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ లో వైద్యం చేయించారు..డబ్బూ ఖర్చు అయింది..ఫలితం కనబడలేదు..
ఆ ఇల్లాలికి దిక్కు తోచలేదు..మరో రెండు మూడు వైద్యశాలల్లో చూపించింది..ఎక్కడికి వెళ్లినా..చేతిలో ఉన్న డబ్బు ఖర్చు అవుతున్నది కానీ..భర్త పరిస్థితిలో మార్పులేదు.కాలం గడిచి పోతోంది..ఆవిడ మనో వేదన తీరడం లేదు..
ఒకనాడు, మొగలిచెర్ల గ్రామంలో సిద్ధి పొందిన శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి తీసుకొని పోయి, కొన్నాళ్ళు అక్కడ వుండి స్వామి వారిని నమ్మి కొలవండి మంచి జరుగుతుంది అని ఆవిడకు తెలిసిన వాళ్లలో ఒకరు చెప్పారు..ఆ మాటలు ఆ తల్లికి మనసులో నాటుకున్నాయి.."స్వామీ! అన్ని విధాలా నేను ప్రయత్నం చేసాను..చిట్ట చివరి ఆశగా నీ చెంతకు నా భర్తను తీసుకొని వస్తున్నాను..నీదే భారం.."అని మనసులో ప్రార్ధించి..నేరుగా మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి సమాధి సన్నిధి చేరుకున్నది..
క్రమం తప్పకుండా శ్రీ స్వామి వారి మందిరం చుట్టూరా ప్రదక్షిణాలు భర్తను పట్టుకుని నడిపించుకుంటూ చేసింది..ఓ పదిహేను రోజులు గడిచేసరికి క్రమంగా మార్పు కనబడసాగింది..మాల్యాద్రి మెల్లగా ఒకొక్క అడుగూ వేయసాగాడు.. మరో వారం కల్లా..భార్య సహాయం లేకుండానే తానే నడిచే స్థాయికి వచ్చాడు..అలాగే మాటలు కూడా కూడబలుక్కుని మాట్లాడసాగాడు..ఇంకొక పక్షం రోజులు గడిచేసరికి..మాల్యాద్రి తానొక్కడే వరుసక్రమం లో నిలబడి..క్యూ లైన్ లో నడచివచ్చి..శ్రీ స్వామివారి తీర్ధ ప్రసాదాలు తీసుకోసాగాడు.. సరిగ్గా మండలం రోజులు గడిచేసరికి..మాల్యాద్రి కి ఉన్న జబ్బులో డెబ్భై శాతం నయమై పోయింది....ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు!..
శ్రీ స్వామివారి సన్నిధిలో వుండే మేము ఎన్ని సార్లు, యెంతో మందిని చూసినా, ప్రతి భక్తుని అనుభవమూ మాకు పాఠమే..
ఆ స్వామి నమ్మినవారికి నేనున్నాను అనే అభయం ఇస్తూనే ఉన్నాడు...నిష్కల్మష భక్తీకి తాను లొంగుతానని, పదే పదే ఋజువు చేస్తూనే ఉన్నాడు..
సర్వం..
శ్రీ దత్తకృప!.
(శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం... ప్రకాశం జిల్లా.. సెల్..94402 66380 & 99089 73699).
గౌరీపూజ ఎందుకు చేయాలి ?
(జగద్గురుబోధల నుండి)
ఆంధ్రదేశంలోనూ, ఉత్తరదేశంలోనూ వివాహకాలంలో గౌరీపూజచేసే అలవాటొకటి చాలాకాలంనుంచీ వస్తున్నది. రుక్మిణీదేవి కృష్ణునే వివాహంచేసుకోవాలని సంకల్పించుకొని తనకోరిక నెరవేరడంకోసం గౌరీపూజచేసి కృష్ణుని భర్తగా పొందినట్లు భాగవతంలో మనం చదువుతున్నాం.
అయితే రుక్మిణీదేవి ఏ సరస్వతినో, లక్ష్మినో ఆరాధించక అందుకు అంబికనే ఎందుకు ఎన్నుకొంది? అవివాహితలైన కన్యలు పెండ్లికాగానే పాతివ్రత్యం పరిపాలించాలంటే, అన్నివిషయాలలోనూ భర్తకు అనుగుణంగా నడుచుకోవాలి. ఎంతో చిత్తదార్ఢ్యం ఉంటేకాని అది జరిగేమాట కాదు. పతీత్వపాతివ్రత్యాల ఆకృతియే అంబిక. ఆమె దక్షునకు కూతురైనపుడు తన తండ్రి భర్తను దూషించినాడన్న కారణంచేత శరీరమే త్యాగంచేసింది. పార్వతిగా పుట్టినపిదపకూడా ఆపరమేశ్వరునే పెళ్లాడాలని ఉగ్రతపం చేసింది. తాను అనుకొన్న కార్యం సాధించింది.
లక్ష్మీదేవి పతివ్రతగా ఉన్నదంటే అందు పెద్దవిశేషమేమీ లేదు. అందమూ, చందమూ, అలంకారమూ, ఐశ్వర్యమూ ఉన్న మహాప్రభువు మహావిష్ణువు. అట్టివాడు భర్త అయితే ఎవరయినా పతివ్రతయే అయిపోతుంది. మాధవుని తీరు ఒకటి, మహాదేవుని తీరు మరొకటి. ఈయన ఉనికి వల్ల కాట్లో, పాములు మెడలో, కపాలం చేతిలో, ఇట్లా ఈయనది ఘోరమైన స్వరూపం.
యాతే రుద్ర శివాతనూ రఘోరాపాపకాశినీ,
అఘోరేభ్యో థఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః
(రుద్రము)
ఈమహాఘోరస్వరూపాన్ని భర్తగా వరించి, పాతివ్రత్యాన్ని అనుష్ఠిస్తూ, భర్తను తండ్రి దూషించినాడన్న కారణంగా శరీరత్యాగంచేసి, మరల అతనికై తపస్సుచేసి, అతనినే పెళ్ళిచేసుకొన్న పరమసతి సర్వమంగళను ఆరాధిస్తే పాతివ్రత్యమూ లభిస్తుంది, ఆమె అనుగ్రహమూ స్థిరంగా ఉంటుంది. స్త్రీకి పాతివ్రత్యం ఎంత ముఖ్యమో, పురుషులకు గురుభక్తి అంత ముఖ్యం.
ఓంకార పంజరశుకీ ముపనిష దుద్యానకేళి కలకంఠీం
ఆగమ విపినమయూరీ మార్యా మంతర్విభావయేగౌరీం
దయమాన దీర్ఘనయనాం దేశికరూపేణ దర్శితాభ్యుదయాం.
అని కాళిదాస మహాకవి అంబికాస్తవం చేశాడు. అందులో ఆచార్యస్వరూపము సాక్షాదంబికయే అని వ్రాశాడు.
అవటుతటఘటితచూలీం తాడితపలాశ తాటంకాం,
వీణావాదనవేలా కంపిత శిరసం నమామి మాతంగీమ్||
అనేది ఆయన వ్రాసినదే మరొకశ్లోకం. తాళీపలాశం అనగా తాటాకు. మాతంగికి తాటాకులే తాటంకాలట. అందుచేతనే గౌరీపూజలో నల్లపూసలూ, తాటాకు ఈనాటికిన్నీ వినియుక్తమవుతున్నవి. అందుచేత పెండ్లి చేసుకొనే కన్నెపడుచులు నిత్యకల్యాణంగా ఆనందంగా ఉండాలని కోరుకొనేటట్లయితే సర్వమంగళను ఆరాధించవలె.
అంబికను ఆరాధించేవారికి గురుభక్తీ పతిభక్తీ సులభము లయిపోతవి. రుక్మిణీదేవి గౌరీపూజ చేయడంకూడా అందుకోసమే. అంబిక తాటంకములను కాళిదాసు వర్ణించినట్లే శంకర భగవత్పాదులవారున్నూ వర్ణించినారు.
పురా రాతే రంతః పురమసి తత స్త్వ చ్చరణయో
స్సపర్యా మర్యాదా తరళ కరణానామ సులభా,
తథాహ్యేతే నీతా శ్శతమఖముఖా స్సిద్ధి మతులాం
తవ ద్వారోపాస్త స్థితిభి రణిమాద్యాఖిరమరాః
(సౌందర్యలహరి)
శ్రీచక్రము మహామేరు స్వరూపమైనది. అందు పలు ఆవరణ లున్నవి. ప్రతి ఆవరణకున్నూ అధిదేవత లున్నారు. బిందుస్థానమే పరాశక్తి. అది అన్నిటికంటె ముఖ్యమైనది. తక్కినవన్నీ చిన్న చిన్న శక్తిస్వరూపాలు. అంబిక ఉండే చింతామణి గృహంలో నవావరణ లున్నవి (తొమ్మిది ఆవరణలు). ఇవి ఒకదానికొకటి కోటియోజనాలదూరంలో ఉన్నవి. కడపటి ద్వారం అణిమాది అష్టసిద్ధులకై ఏర్పడినది. ఆద్వారానికిన్నీ అంబిక ఉన్న స్థానానికిన్నీ ఎంతో దూరము అయినప్పటికిన్నీ ద్వారోపాంతంలో నిలబడేసరికి ఆణిమాదిశక్తుల అనుగ్రహం చేత ఐశ్వర్యం లభిస్తుంది.
ఇంద్రాదిదేవతలు ఈతొమ్మిదవ ఆవరణనే దాటలేదు. అక్కడకు వచ్చేసరికి వాళ్లు అష్టవిభూతిశక్తుల అనుగ్రహం పొందుతున్నారు. వీళ్ళకు పరదేవతను చూడగల ఇంద్రియ నిగ్రహం లేదు. అసలు సనకాది యోగివర్యులకే లేదు. అంతఃపురంలోకి వెళ్ళవలెనంటే ఎంత ఇంద్రియనిగ్రహం ఉండాలి?
అట్టి అనుత్తరమైన శక్తి అంబికది. ఆమెయొక్క పరిపూర్ణచైతన్యము ముందు కలికాలపు జనులు ఆగలేరనియే, ఆచార్యులవారు జంబుకేశ్వరక్షేత్రానికి వెళ్ళినపుడు, అఖిలాండేశ్వరిని ప్రార్థించి, ఆమె శక్తిని ఆకర్షించి, రత్నమయమైన శ్రీచక్రాన్ని ఒక కర్ణంలోనూ, పంచాక్షరీయంత్రాన్ని మరొక కర్ణంలోనూ తాటంకాలుగా ప్రతిష్ఠచేసి ఆమెను సౌమ్య స్వరూపిణిగా చేశారు.
ఇంత మహిమ పరమేశ్వరునికి సిద్ధించిందంటే, దానికి మూలం నీ తాటంకమహిమే కదా అంటూ అఖిలాండేశ్వరి తాటంకాలను స్మరిస్తూ ఆచార్యులవారు ఈక్రిందిశ్లోకాన్ని సౌందర్యలహరిలో వ్రాసినారు.
సుధామప్యాస్యాద్యా ప్రతిభయ జరామృత్యు హరిణీం
విపద్యంతే విశ్వే విధిశత మశాద్యా దివిషదః,
కరాళం యత్వేక్షళం కబళిత వతః కాలకలనా
నశం భో స్తన్మూలం జనని తాటంక మహిమా||
తమకు జరామరణాలుండరాదని అమృతం త్రాగారు. కాని ప్రళయకాలంలో వాళ్ళుకూడా విపత్తుపొందుతున్నారు. భయగ్రస్తులవుతున్నారు. కాని హాలాహలాన్ని మింగికూచున్న పరమేశ్వరుడుమాత్రం చెక్కుచెదరకఉన్నాడు. విషం తిని విశ్వేశ్వరుడు ఏ అభిప్రాయమూలేక సురక్షితంగా ఉంటే, అమృతపానం చేసిన అమరులు దిక్కులేక చస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే, నీ తాటంకమహిమే అని ఆచార్యుల వారన్నారు.
యాతే రుద్ర శివాతనూః శివా విశ్వాహ భేషజీ,
శివా రుద్రస్య భేషజీ తథానో మృడజీవసే
(రుద్రము)
'పరమేశ్వరా నీవు పుట్టినావు సరే నీకు మందు ఎవరిస్తున్నారు? రెండురకాలయిన శరీరాలున్నాయి నీకు. అందులో ఒకటి ఘోరమైనది. మరొకటి మంగళకరమైనది. ఘోర స్వరూపము నీది. పరమమంగళస్వరూపముతో విలసిల్లుతున్న దేహమున్నదే అది అంబికది. ఈవిశ్వానికంతా ఆ విశ్వేశ్వరి ఔషధప్రాయంగా ఉన్నది. ఆమె కటాక్షముంటే చాలు. అకాలమృత్యువనే మాట ఆ చుట్టుప్రక్కల ఎక్కడా వినబడదు. నీకున్నూ ఆమెయే భేషజియై, వైద్యం చేస్తున్నది కాబోలు. పరమమంగళకరమైన ఆమె శరీరం నిన్ను అంటిపెట్టుకొని ఉండటం వల్లనే జీవిస్తున్నావు'.
శివః శక్త్యా యుక్తో యదిభవతి శక్తః ప్రభవితుం
నచే దేవం దేవో నఖలు కుశలః స్పందితు మపి,
అత స్త్యా మారాధ్యాం హరిహరవిరించాదిభి రపి
ప్రణంతుం స్తోతుం వా కథ మకృతపుణ్యః ప్రభవతి.
(సౌందర్యలహరి)
శివుడు శక్తితో కలిస్తేనే జగన్నిర్మాణశక్తి కల్గినవాడవుతాడు. లేకపోతే ఆయనకు కదలటానికి కూడా సత్తువ ఉండదు. పరాశక్తి పరమేశ్వరునికే మూలశక్తిగా ఉన్నది. అటువంటి అంబికను ఆరాధించాలంటే ఎంత పుణ్యం చేసుకొని ఉండాలి? భర్తయొక్క ఘోరస్వరూపంవల్ల అంబికా పాతివ్రత్యం మరింత ప్రకటితమవుతున్నది. అందుచే ఆమెను ఆరాధించేవారికి ప్రాతివ్రత్యమూ, మంగళమూ, దృఢచిత్తమూ సులభంగా లభిస్తవి.
🙏🙏🕉️🕉️🙏🙏
*13.10.2021 ప్రాతః కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*ఏకాదశస్కంధము - పదునాలుగవ అధ్యాయము*
*భక్తియోగమహిమ - ధ్యానవిధి వర్ణనము*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*శ్రీభగవానువాచ*
*14.32 (ముప్పది రెండవ శ్లోకము)*
*ఆసన ఆసీనః సమకాయో యథాసుఖమ్|*
*హస్తావుత్సంగ ఆధాయ స్వనాసాగ్రకృతేక్షణః॥12760॥*
*శ్రీకృష్ణుడు వచించెను* "ఉద్ధవా! అంతగా ఎత్తైనదిగాని, నిమ్నమైనదిగాని గాక, సమప్రదేశమున ఆసనముపై కూర్చుండవలెను. శరీరమును నిటారుగానుంచి, సుఖముగా ఆసీనుడైయుండవలెను. చేతులను ఒడిలో (ఉత్సుంగమునందు) చేర్చుకొని, నాసికాగ్రమునందు దృష్టిని నిలిపియుంచవలెను.
*14.33 (ముప్పది మూడవ శ్లోకము)*
*ప్రాణస్య శోధయేన్మార్గం పూరకుంభకరేచకైః|*
*విపర్యయేణాపి శనైరభ్యసేన్నిర్జితేంద్రియః॥12761॥*
పిమ్మట సాధకుడు పూరక, కుంభక, రేచకములద్వారాను, మరల విపర్యయముగను ప్రాణాయామముద్వారా నాడీమండలమును శోధింపవలెను. జితేంద్రియుడై తిన్నతిన్నగా ప్రాణాయామమును అభ్యసింపవలెను.
*14.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*
*హృద్యవిచ్ఛిన్నమోంకారం ఘంటానాదం బిసోర్ణవత్|*
*ప్రాణేనోదీర్య తత్రాథ పునః సంవేశయేత్స్వరమ్॥12762॥*
*14.35 (ముప్పది ఐదవ శ్లోకము)*
*ఏవం ప్రణవసంయుక్తం ప్రాణమేవ సమభ్యసేత్|*
*దశకృత్వస్త్రిషవణం మాసాదర్వాగ్జితాఽనిలః॥12763॥*
మూలాధార చక్రమునుండి కమలనాళములోని దారమువలె అవిచ్ఛిన్న భావముతో ప్రాణవాయువును హృదయము వరకు చేర్చి, అచట ఘంటానాద సదృశమైన ఓంకారమును దానితో కలుపవలెను. ఈ విధముగా ప్రాణాయామమును ప్రతిదినము మూడు సమయములందు ఓంకార సహితముగా పదేసిమార్లు అభ్యసింపవలెను. ఇట్లు ఒకమాసము అభ్యసించినచో ప్రాణవాయువు వశమగును.
*14.36 (ముప్పది ఆరవ శ్లోకము)*
*హృత్పుండరీకమంతఃస్థమూర్ధ్వనాలమధోముఖమ్|*
*ధ్యాత్వోర్ధ్వముఖమున్నిద్రమష్టపత్రం సకర్ణికమ్॥12764॥*
*14.37 (ముప్పది ఏడవ శ్లోకము)*
*కర్ణికాయాం న్యసేత్సూర్యసోమాగ్నీనుత్తరోత్తరమ్|*
*వహ్నిమధ్యే స్మరేద్రూపం మమైతద్ధ్యానమంగళమ్॥12765॥*
శరీరమునందు స్థితమైయున్న హృదయమును కమలమునువలె చింతనచేయవలెను. దాని నాళము ఊర్ధ్వభాగమునకును, ముఖము అధోభాగమునకును ఉన్నట్లు భావింపవలెను. దాని ముఖము పైవైపునకు మరల వికసించినట్లు ధ్యానింపవలెను. ఆ పద్మమునకు ఎనిమిదిదళములు, మధ్యభాగమున పసుపుపచ్చని సుకుమారమైన కర్ణిక ఉండును. ఆ కర్ణికయందు క్రమముగా సూర్యచంద్రాగ్నులను స్మరింపవలెను. ఆ అగ్ని మధ్యభాగమునందు మంగళకరమైన నా రూపమును ధ్యానింపవలెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదునాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*452వ నామ మంత్రము* 13.10.2021
*ఓం తేజోవత్యై నమః*
సూర్యుడు, చంద్రుడు, అగ్ని వంటి తేజోమూర్తులకు తేజస్సును ప్రసాదించిన తేజస్స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *తేజోవతీ* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం తేజోవత్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను స్మరించు భక్తులు తేజోవంతులై, సదా ఆరోగ్యపరిపూర్ణతతో విరాజిల్లుదురు.
జగన్మాత సోమసూర్యాగ్ని తేజస్సులకు ఆధారమైన తేజస్సుగలిగియున్నది.
వేదములందు *ఓ గార్గీ! ఈ పరమాత్మయందు సూర్యచంద్రులిద్దరును ధరింపబడియుండిరి* అని గలదు. అనగా సూర్యుడు, చంద్రుడు, అగ్ని వంటి తేజోమూర్తులకు తేజస్సును అమ్మవారే ప్రసాదించినది అని భావింపదగును.
శంకరభగవత్పాదులవారు సౌందర్యలహరియందు పదునాలుగవ శ్లోకంలో వివరించిన విధానం ఇలా ఉన్నది.
*క్షితౌ షట్పంచాశ - ద్ద్విసమధిక పంచాశ దుదకే*
*హుతాశే ద్వాషష్టి - శ్చతురధిక పంచాశ దనిలే |*
*దివి ద్విఃషట్త్రింశ - న్మనసి చ చతుఃషష్టిరితి యే*
*మయూఖాస్తేషామప్యుపరి తవ - పాదాంబుజయుగమ్ || 14 ||*
*షట్చక్రాలలోని సహస్రారములో ఉండు దేవి పాదప్రకాశ వైభవం.*
*భావము*
అమ్మా...భగవతీ..యోగసాధనలో సాధకుడు షట్చక్రాలనూ అధిగమించి,సహస్రారములో ఉన్న నీపాదపద్మాలు చేరాలంటే తన దేహంలో ఉన్న పృధివీతత్వంతో కూడిన మూలాధార చక్రంలో 56 కిరణాలను దాటి, జలతత్వాత్మికమైన మణిపూరక చక్రంలో 52 మయూఖములను దాటి, అగ్నితత్వాత్మికమైన అనాహత చక్రంలో54 కాంతిరేఖలు దాటి,ఆకాశతత్వాత్మికమైన విశుద్దచక్రమునందు 72 కాంతికిరణాలు దాటి, మనస్తత్వంతో కూడిన ఆజ్ఞాచక్రము నందు 64 కిరణపుంజాలు దాటి, ఈ ప్రకారముగా ప్రసిద్ధములైన ఈ మయూఖములు దాటి పైకి చేరుకోగా అచట సహస్ర దళ మధ్యగత చంద్రబింబాత్మకమైన బైందవ స్థానమున, సుధాసింధువునందు నీయొక్క పాదపద్మముల జంట గోచరమగుచున్నది.
*ఈ శ్లోకములో ఆది శంకరులు చెప్పిన ప్రకారం*
శ్రీ చక్రమునందు మూలాధార, స్వాదిష్టాన, మణిపూర. అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రములును, సహస్రారము కలవు. ఈ ఆరు చక్రములును సోమ, సూర్య, అనలా(అగ్ని)త్మకములుగా మూడు ఖండములు. ''మూలాధార, స్వాదిష్టాన యుగళమైన ప్రథమ ఖండమునకు పై భాగమున ''అగ్నిస్థానము'' అదియే (రుద్రగ్రంథి). మణిపూర, అనాహత చక్రములు రెండోవ ఖండము. ''సూర్యస్థానము'' అదియే (విష్ణుగ్రంథి). విశుద్ధ, అజ్ఞాచక్రములు మూడవ ఖండము ''చంద్రస్థానము'' అదియే (బ్రహ్మగ్రంథి)
ప్రథమఖండము పైనున్న అగ్ని తన జ్వాలలచేత ప్రథమఖండమును వ్యాపింపజేయును. రెండవ ఖండము పైనున్న సూర్యుడు తన కిరణముల చేత రెండవ ఖండమును వ్యాపింపజేయును.
మూడవఖండము పైనున్న చంద్రుడు తన కళలచేత మూడవఖండమును వ్యాపింపజేయును. పృథ్వీ తత్త్వాత్మిక మూలాధార చక్రమున (పృథ్వీ అగ్ని జ్వాలలు 56), మణిపూర చక్రమున (ఉదక తత్త్వాత్మిక జ్వాలలు 52) కలిపి 108 అగ్ని జ్వాలలు.
అట్లే స్వాధిష్టాన (అగ్ని తత్త్వాత్మిక కిరణములు 62), అనాహత చక్రమున (వాయు తత్త్వాత్మిక కిరణములు 54) కలిపి 116 సూర్య కిరణములు.
ఆకాశ తత్త్వాత్మకమగు (విశుద్ధ చక్రమున 72), మనస్తత్త్వాత్మకమగు (ఆజ్ఞా చక్రమున 64) కలిసి 136 చంద్రుని కళలు అగుచున్నవి. ఇవి 108+116+136 మొత్తం 360 కిరణములు అగును. ఈ కిరణాలన్నియు అమ్మవారి పాదములనుండి వెడలినవే. సూర్యుని ప్రకాశం వలన పగలు, చంద్రుని ప్రకాశం వలన రాత్రి, అగ్ని వలన సంధ్యాసమయములు ఈ జగత్తునందలి సకల వ్యాపారములు సాగుచున్నవి. ఈ కిరణములు శ్రీచక్రమునందలి తొమ్మిది ఆవరణములనుండి ప్రసరించుచున్నవి. సాక్షాత్తు శ్రీచక్రస్వరూపిణియైన పరమేశ్వరి, అందుచేతనే *తేజోవతీ* యని అనబడినది.
జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం తేజోవత్యై నమః* అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*451వ నామ మంత్రము* 13.10.2021
*ఓం విఘ్ననాశిన్యై నమః*
విద్యా (జ్ఞానమునకు కలుగు) విఘ్నములను పోగొట్టు జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *విఘ్ననాశినీ* యను అయిదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం విఘ్ననాశిన్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ధ్యానించు భక్తులను ఆ తల్లి సర్వకాల సర్వావస్థలయందును శుభములను కలిగించుచూ, శాంతిసౌఖ్యములతో సుఖజీవనము కొనసాగునటులనుగ్రహించును.
పరమేశ్వరి తన భక్తులలోని అవిద్య (అజ్ఞానము) కు సంబంధించిన విఘ్నములను రూపుమాపి విద్యా (జ్ఞాన) స్వరూపులుగా పరివర్తింపజేయును. ఆ తల్లిని ఆరాధించు సమయంలో చిత్తచాంచల్యము అనునది ఒక మహావిఘ్నము. అటువంటి విఘ్నములు కలుగకుండా నిర్మలచిత్తముననుగ్రహించును. పరిపూర్ణమైన మనసుతో ధ్యానముచేయు సమయంలో అప్రస్తుత శబ్దములు, అనావస్యక అవరోధములు కలుగకుండా, ధ్యాననిమగ్నతను ఏర్పరుచును. విఘ్నములు అనునవి అనేకవిధములుగా ఆయా సందర్భములను బట్టి ఏర్పడుచుండును. *ఓం విఘ్ననాశిన్యై నమః* అని తలచినతోడనే, దైవకార్యములు, గృహసంబంధ శుభకార్యములు, ప్రయాణములు మొదలైన సందర్భములలో ఏర్పడు విఘ్నములను ఆ తల్లి నిరోధించి సర్వశుభములను అనుగ్రహించును. గనుకనే అమ్మవారు *విఘ్ననాశినీ* యని అనబడినది.
*మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా* యను (78వ) నామ మంత్రమునందు రాక్షసులు ప్రయోగించిన విఘ్నయంత్రాలను నశింపజేసే మహాగణేశుణ్ణి చూసి అమ్మవారు సంతసించినది అనిగలదు. ఆ మహాగణేశుడు ఎవరు? సాక్షాత్తు తన కుమారుడు. ఈమె విఘ్ననాశిని అయినది గనుకనే తన కుమారుడు అయిన గణేశ్వరుడు విఘ్నేశ్వరుడై, విఘ్నములను నిరోధించువాడు అయినాడు. భండాసురాది రాక్షసులంటేనే విఘ్నములను కలుగజేయు దుష్టులు. అమ్మవారు వారితో యుద్ధముచేయు సమయములో అమ్మవారిని నిరోధించడానికి ఎక్కడికక్కడే అనేక విఘ్నయంత్రములను ప్రతిష్టించి ఆ తల్లిని నిరోధించాలని ప్రయత్నించారు. గణేశ్వరుడు అమ్మకు సాయంగా నిలిచి రాక్షసుల విఘ్నయంత్రాలను ఛిద్రంచేయగా, తనకుమారుని ప్రతిభను చూసి తనంతటివాడు తన కుమారుడని ఆ పరమేశ్వరి సంతసించినది. పరమేశ్వరి తన భక్తులకు తాము తలచిన కార్యములయందు అంతరాయము లేర్పడకుండా కాపాడుతుంది గనుకనే *విఘ్ననాశినీ* యని అనబడినది.
జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం విఘ్ననాశిన్యై నమః* అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*12.10.2021 సాయం కాల సందేశము*
*వేదవ్యాసుల వారి *12.10.2021 సాయం కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*ఏకాదశస్కంధము - పదునాలుగవ అధ్యాయము*
*భక్తియోగమహిమ - ధ్యానవిధి వర్ణనము*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*14.23 (ఇరువది మూడవ శ్లోకము)*
*కథం వినా రోమహర్షం ద్రవతా చేతసా వినా|*
*వినాఽఽనందాశ్రుకలయా శుధ్యేద్భక్త్యా వినాఽఽశయః॥12751॥*
నిశ్చలమైన భక్తిచే వ్యక్తియొక్క శరీరము పులకాంకితము గావలెను. హృదయము ద్రవింపవలెను. ఆనందాశ్రువులు స్రవింపవలెను. అట్లుకానినాడు అతని అంతఃకరణము పూర్తిగా పరిశుద్ధముకాదు.
*14.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*
*వాగ్గద్గదా ద్రవతే యస్య చిత్తం రుదత్యభీక్ష్ణం హసతి క్వచిచ్చ|*
*విలజ్జ ఉద్గాయతి నృత్యతే చ మద్భక్తియుక్తో భువనం పునాతి॥12752॥*
భక్తిప్రభావములో మునిగినవానికి కంఠము గద్గదమగును. చిత్తము ద్రవించును. ఆ స్వామి దర్శనమునకై గట్టిగా పిలుచుచు అతడు ఏడ్చును. తనలోతాను నవ్వుకొనును. ఆ పారవశ్యములో ఏమాత్రమూ సిగ్గుపడక బిగ్గరగా ఆ ప్రభువును కీర్తించును. ఒడలు మరచి నృత్యము చేయును. అట్టి దృఢభక్తిచిత్తుడు ఈ లోకమునే పునీతమొనర్చును.
*14.25 (ఇరువది ఐదవ శ్లోకము)*
*యథాగ్నినా హేమ మలం జహాతి ధ్మాతం పునః స్వం భజతే చ రూపమ్|*
*ఆత్మా చ కర్మానుశయం విధూయ మద్భక్తియోగేన భజత్యథో మామ్॥12753॥*
అగ్నిలో పుటము పెట్టిన పిదప బంగారములోని మాలిన్యము లన్నియును తొలగిపోవును. అనంతరము అది తన సహజమైన వన్నెతో ప్రకాశించును. అట్లే భక్తియోగముద్వారా సాధకుని కర్మవాసనలు అన్నియును రూపుమాయును, అంతట స్వస్వరూపసాక్షాత్కారముతో అతడు నన్ను సేవించుచు తరించును.
*14.26 (ఇరువది ఆరవ శ్లోకము)*
*యథా యథాఽఽత్మా పరిమృజ్యతేఽసౌ మత్పుణ్యగాథాశ్రవణాభిధానైః|*
*తథా తథా పశ్యతి వస్తు సూక్ష్మం చక్షుర్యథైవాంజనసంప్రయుక్తమ్॥12754॥*
కాటుక పెట్టుకొనుటచేత తిన్నతిన్నగా నేత్రమునందలి దోషములు తొలగిపోవును. అందువలన సూక్ష్మములైన వస్తువులు స్పష్టముగా కనబడును. అట్లే పరమపవిత్రములైన నా పుణ్యగాథలను వినుటవలనను, నామ సంకీర్తనవలనను క్రమక్రమముగా సాధకునిలోని చిత్తమాలిన్యములు అన్నియును దూరముకాగా, అతనికి సూక్ష్మమైన నా వాస్తవతత్త్వము బోధపడును.
*14.27 (ఇరువది ఏడవ శ్లోకము)*
*విషయాన్ ధ్యాయతశ్చిత్తం విషయేషు విషజ్జతే|*
*మామనుస్మరతశ్చిత్తం మయ్యేవ ప్రవిలీయతే॥12755॥*
పురుషుడు నిరంతరము శబ్దాది విషయములనే చింతించుచున్నచో అతని చిత్తము వాటిలోనే చిక్కుకొని పోవును. నన్ను ధ్యానించు చుండువాని చిత్తము నాలోనే లీనమగును.
*14.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*
*తస్మాదసదభిధ్యానం యథా స్వప్నమనోరథమ్|*
*హిత్వా మయి సమాధత్స్వ మనో మద్భావభావితమ్॥12756॥*
అసద్వస్తువుల (నశ్వరవస్తువుల) చింతనము స్వప్నమనోరథములవలె మిథ్యయే యగును. కావున వాటిని చింతించుటమాని, సద్వస్తువునైన (శాశ్వతుడనైన) నన్నే ధ్యానించుచు, మనస్సును నాయందే లగ్నమొనర్పుము.
*14.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*
*స్త్రీణాం స్త్రీసంగినాం సంగం త్యక్త్వా దూరత ఆత్మవాన్|*
*క్షేమే వివిక్త ఆసీనశ్చింతయేన్మామతంద్రితః॥12757॥*
*14.30 (ముప్పదియవ శ్లోకము)*
*న తథాస్య భవేత్క్లేశో బంధశ్చాన్యప్రసంగతః|*
*యోషిత్సంగాద్యథా పుంసో యథా తత్సంగిసంగతః॥12758॥*
స్త్రీల సాంగత్యమువలన గాని, స్త్రీల సాంగత్యముగల వారితోడి సాంగత్యమునగాని క్లేశములు, బంధములు పరంపరగా పెరుగును. కనుక వారినుండియు, ఇతర లంపటములనుండియు దూరముగా తొలగిపోవలయును. కనుక సాధకుడు పవిత్రమైన ఏకాంతప్రదేశమున కూర్చొని, జితేంద్రియుడై సావధానముతో నన్ను ధ్యానింపవలెను. తత్ప్రభావమున క్లేశములు నశించును, బంధములు తొలగును.
*ఉద్ధవ ఉవాచ*
*14.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*
*యథా త్వామరవిందాక్ష యాదృశం వా యదాత్మకమ్|*
*ధ్యాయేన్ముముక్షురేతన్మే ధ్యానం త్వం వక్తుమర్హసి,12759॥*
*ఉద్ధవుడు పలికెను* "కమలనయనా! ముముక్షువు నీయొక్క ఏరూపమును ధ్యానింపవలెను? ఎట్లు ధ్యానింపవలెను? ఈ విషయములను నాకు విపులముగా తెలుపుము"
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదునాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235*
*ఏకాదశస్కంధము - పదునాలుగవ అధ్యాయము*
*భక్తియోగమహిమ - ధ్యానవిధి వర్ణనము*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*14.23 (ఇరువది మూడవ శ్లోకము)*
*కథం వినా రోమహర్షం ద్రవతా చేతసా వినా|*
*వినాఽఽనందాశ్రుకలయా శుధ్యేద్భక్త్యా వినాఽఽశయః॥12751॥*
నిశ్చలమైన భక్తిచే వ్యక్తియొక్క శరీరము పులకాంకితము గావలెను. హృదయము ద్రవింపవలెను. ఆనందాశ్రువులు స్రవింపవలెను. అట్లుకానినాడు అతని అంతఃకరణము పూర్తిగా పరిశుద్ధముకాదు.
*14.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*
*వాగ్గద్గదా ద్రవతే యస్య చిత్తం రుదత్యభీక్ష్ణం హసతి క్వచిచ్చ|*
*విలజ్జ ఉద్గాయతి నృత్యతే చ మద్భక్తియుక్తో భువనం పునాతి॥12752॥*
భక్తిప్రభావములో మునిగినవానికి కంఠము గద్గదమగును. చిత్తము ద్రవించును. ఆ స్వామి దర్శనమునకై గట్టిగా పిలుచుచు అతడు ఏడ్చును. తనలోతాను నవ్వుకొనును. ఆ పారవశ్యములో ఏమాత్రమూ సిగ్గుపడక బిగ్గరగా ఆ ప్రభువును కీర్తించును. ఒడలు మరచి నృత్యము చేయును. అట్టి దృఢభక్తిచిత్తుడు ఈ లోకమునే పునీతమొనర్చును.
*14.25 (ఇరువది ఐదవ శ్లోకము)*
*యథాగ్నినా హేమ మలం జహాతి ధ్మాతం పునః స్వం భజతే చ రూపమ్|*
*ఆత్మా చ కర్మానుశయం విధూయ మద్భక్తియోగేన భజత్యథో మామ్॥12753॥*
అగ్నిలో పుటము పెట్టిన పిదప బంగారములోని మాలిన్యము లన్నియును తొలగిపోవును. అనంతరము అది తన సహజమైన వన్నెతో ప్రకాశించును. అట్లే భక్తియోగముద్వారా సాధకుని కర్మవాసనలు అన్నియును రూపుమాయును, అంతట స్వస్వరూపసాక్షాత్కారముతో అతడు నన్ను సేవించుచు తరించును.
*14.26 (ఇరువది ఆరవ శ్లోకము)*
*యథా యథాఽఽత్మా పరిమృజ్యతేఽసౌ మత్పుణ్యగాథాశ్రవణాభిధానైః|*
*తథా తథా పశ్యతి వస్తు సూక్ష్మం చక్షుర్యథైవాంజనసంప్రయుక్తమ్॥12754॥*
కాటుక పెట్టుకొనుటచేత తిన్నతిన్నగా నేత్రమునందలి దోషములు తొలగిపోవును. అందువలన సూక్ష్మములైన వస్తువులు స్పష్టముగా కనబడును. అట్లే పరమపవిత్రములైన నా పుణ్యగాథలను వినుటవలనను, నామ సంకీర్తనవలనను క్రమక్రమముగా సాధకునిలోని చిత్తమాలిన్యములు అన్నియును దూరముకాగా, అతనికి సూక్ష్మమైన నా వాస్తవతత్త్వము బోధపడును.
*14.27 (ఇరువది ఏడవ శ్లోకము)*
*విషయాన్ ధ్యాయతశ్చిత్తం విషయేషు విషజ్జతే|*
*మామనుస్మరతశ్చిత్తం మయ్యేవ ప్రవిలీయతే॥12755॥*
పురుషుడు నిరంతరము శబ్దాది విషయములనే చింతించుచున్నచో అతని చిత్తము వాటిలోనే చిక్కుకొని పోవును. నన్ను ధ్యానించు చుండువాని చిత్తము నాలోనే లీనమగును.
*14.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*
*తస్మాదసదభిధ్యానం యథా స్వప్నమనోరథమ్|*
*హిత్వా మయి సమాధత్స్వ మనో మద్భావభావితమ్॥12756॥*
అసద్వస్తువుల (నశ్వరవస్తువుల) చింతనము స్వప్నమనోరథములవలె మిథ్యయే యగును. కావున వాటిని చింతించుటమాని, సద్వస్తువునైన (శాశ్వతుడనైన) నన్నే ధ్యానించుచు, మనస్సును నాయందే లగ్నమొనర్పుము.
*14.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*
*స్త్రీణాం స్త్రీసంగినాం సంగం త్యక్త్వా దూరత ఆత్మవాన్|*
*క్షేమే వివిక్త ఆసీనశ్చింతయేన్మామతంద్రితః॥12757॥*
*14.30 (ముప్పదియవ శ్లోకము)*
*న తథాస్య భవేత్క్లేశో బంధశ్చాన్యప్రసంగతః|*
*యోషిత్సంగాద్యథా పుంసో యథా తత్సంగిసంగతః॥12758॥*
స్త్రీల సాంగత్యమువలన గాని, స్త్రీల సాంగత్యముగల వారితోడి సాంగత్యమునగాని క్లేశములు, బంధములు పరంపరగా పెరుగును. కనుక వారినుండియు, ఇతర లంపటములనుండియు దూరముగా తొలగిపోవలయును. కనుక సాధకుడు పవిత్రమైన ఏకాంతప్రదేశమున కూర్చొని, జితేంద్రియుడై సావధానముతో నన్ను ధ్యానింపవలెను. తత్ప్రభావమున క్లేశములు నశించును, బంధములు తొలగును.
*ఉద్ధవ ఉవాచ*
*14.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*
*యథా త్వామరవిందాక్ష యాదృశం వా యదాత్మకమ్|*
*ధ్యాయేన్ముముక్షురేతన్మే ధ్యానం త్వం వక్తుమర్హసి,12759॥*
*ఉద్ధవుడు పలికెను* "కమలనయనా! ముముక్షువు నీయొక్క ఏరూపమును ధ్యానింపవలెను? ఎట్లు ధ్యానింపవలెను? ఈ విషయములను నాకు విపులముగా తెలుపుము"
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదునాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
*12.10.2021 సాయం కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*ఏకాదశస్కంధము - పదునాలుగవ అధ్యాయము*
*భక్తియోగమహిమ - ధ్యానవిధి వర్ణనము*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*14.23 (ఇరువది మూడవ శ్లోకము)*
*కథం వినా రోమహర్షం ద్రవతా చేతసా వినా|*
*వినాఽఽనందాశ్రుకలయా శుధ్యేద్భక్త్యా వినాఽఽశయః॥12751॥*
నిశ్చలమైన భక్తిచే వ్యక్తియొక్క శరీరము పులకాంకితము గావలెను. హృదయము ద్రవింపవలెను. ఆనందాశ్రువులు స్రవింపవలెను. అట్లుకానినాడు అతని అంతఃకరణము పూర్తిగా పరిశుద్ధముకాదు.
*14.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*
*వాగ్గద్గదా ద్రవతే యస్య చిత్తం రుదత్యభీక్ష్ణం హసతి క్వచిచ్చ|*
*విలజ్జ ఉద్గాయతి నృత్యతే చ మద్భక్తియుక్తో భువనం పునాతి॥12752॥*
భక్తిప్రభావములో మునిగినవానికి కంఠము గద్గదమగును. చిత్తము ద్రవించును. ఆ స్వామి దర్శనమునకై గట్టిగా పిలుచుచు అతడు ఏడ్చును. తనలోతాను నవ్వుకొనును. ఆ పారవశ్యములో ఏమాత్రమూ సిగ్గుపడక బిగ్గరగా ఆ ప్రభువును కీర్తించును. ఒడలు మరచి నృత్యము చేయును. అట్టి దృఢభక్తిచిత్తుడు ఈ లోకమునే పునీతమొనర్చును.
*14.25 (ఇరువది ఐదవ శ్లోకము)*
*యథాగ్నినా హేమ మలం జహాతి ధ్మాతం పునః స్వం భజతే చ రూపమ్|*
*ఆత్మా చ కర్మానుశయం విధూయ మద్భక్తియోగేన భజత్యథో మామ్॥12753॥*
అగ్నిలో పుటము పెట్టిన పిదప బంగారములోని మాలిన్యము లన్నియును తొలగిపోవును. అనంతరము అది తన సహజమైన వన్నెతో ప్రకాశించును. అట్లే భక్తియోగముద్వారా సాధకుని కర్మవాసనలు అన్నియును రూపుమాయును, అంతట స్వస్వరూపసాక్షాత్కారముతో అతడు నన్ను సేవించుచు తరించును.
*14.26 (ఇరువది ఆరవ శ్లోకము)*
*యథా యథాఽఽత్మా పరిమృజ్యతేఽసౌ మత్పుణ్యగాథాశ్రవణాభిధానైః|*
*తథా తథా పశ్యతి వస్తు సూక్ష్మం చక్షుర్యథైవాంజనసంప్రయుక్తమ్॥12754॥*
కాటుక పెట్టుకొనుటచేత తిన్నతిన్నగా నేత్రమునందలి దోషములు తొలగిపోవును. అందువలన సూక్ష్మములైన వస్తువులు స్పష్టముగా కనబడును. అట్లే పరమపవిత్రములైన నా పుణ్యగాథలను వినుటవలనను, నామ సంకీర్తనవలనను క్రమక్రమముగా సాధకునిలోని చిత్తమాలిన్యములు అన్నియును దూరముకాగా, అతనికి సూక్ష్మమైన నా వాస్తవతత్త్వము బోధపడును.
*14.27 (ఇరువది ఏడవ శ్లోకము)*
*విషయాన్ ధ్యాయతశ్చిత్తం విషయేషు విషజ్జతే|*
*మామనుస్మరతశ్చిత్తం మయ్యేవ ప్రవిలీయతే॥12755॥*
పురుషుడు నిరంతరము శబ్దాది విషయములనే చింతించుచున్నచో అతని చిత్తము వాటిలోనే చిక్కుకొని పోవును. నన్ను ధ్యానించు చుండువాని చిత్తము నాలోనే లీనమగును.
*14.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*
*తస్మాదసదభిధ్యానం యథా స్వప్నమనోరథమ్|*
*హిత్వా మయి సమాధత్స్వ మనో మద్భావభావితమ్॥12756॥*
అసద్వస్తువుల (నశ్వరవస్తువుల) చింతనము స్వప్నమనోరథములవలె మిథ్యయే యగును. కావున వాటిని చింతించుటమాని, సద్వస్తువునైన (శాశ్వతుడనైన) నన్నే ధ్యానించుచు, మనస్సును నాయందే లగ్నమొనర్పుము.
*14.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*
*స్త్రీణాం స్త్రీసంగినాం సంగం త్యక్త్వా దూరత ఆత్మవాన్|*
*క్షేమే వివిక్త ఆసీనశ్చింతయేన్మామతంద్రితః॥12757॥*
*14.30 (ముప్పదియవ శ్లోకము)*
*న తథాస్య భవేత్క్లేశో బంధశ్చాన్యప్రసంగతః|*
*యోషిత్సంగాద్యథా పుంసో యథా తత్సంగిసంగతః॥12758॥*
స్త్రీల సాంగత్యమువలన గాని, స్త్రీల సాంగత్యముగల వారితోడి సాంగత్యమునగాని క్లేశములు, బంధములు పరంపరగా పెరుగును. కనుక వారినుండియు, ఇతర లంపటములనుండియు దూరముగా తొలగిపోవలయును. కనుక సాధకుడు పవిత్రమైన ఏకాంతప్రదేశమున కూర్చొని, జితేంద్రియుడై సావధానముతో నన్ను ధ్యానింపవలెను. తత్ప్రభావమున క్లేశములు నశించును, బంధములు తొలగును.
*ఉద్ధవ ఉవాచ*
*14.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*
*యథా త్వామరవిందాక్ష యాదృశం వా యదాత్మకమ్|*
*ధ్యాయేన్ముముక్షురేతన్మే ధ్యానం త్వం వక్తుమర్హసి,12759॥*
*ఉద్ధవుడు పలికెను* "కమలనయనా! ముముక్షువు నీయొక్క ఏరూపమును ధ్యానింపవలెను? ఎట్లు ధ్యానింపవలెను? ఈ విషయములను నాకు విపులముగా తెలుపుము"
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదునాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235