21, ఫిబ్రవరి 2023, మంగళవారం

నవ్వుకోండి

 *కాసేపు నవ్వుకోండి. ఆ తర్వాత మన తెలుగు భాష గొప్పదనాన్ని చూసి గర్వపడండి.* 😄👏🙏

-----------------------------------

(FWD)

-----------------------------------

*'చచ్చిన' అనే పదాన్నికూడా బ్రతికించే భాష తెలుగుభాష!!*


తెలుగువాడికి సాటి ఇంకొకడు లేడు. అందరిదీ ఒక దారైతే మనవాడిది ఇంకోదారి! 


అందరూ పొగ  *పీలిస్తే* తెలుగువాడు పొగ *తాగుతాడు.* 


-ఇంతేకాదు తెలుగువాడు దెబ్బలు ‘తింటాడు’. దెబ్బలు ఏమైనా తినే పదార్థాలా? అంటే ఉలకడు పలకడు. 


సంస్కృతం అమరభాష అంటారు. దాని సంగతేమో కానీ తెలుగు మాత్రం కచ్చితంగా అమరభాషే! ఇందుకు ఉదాహరణలు ఉన్నాయి. 

*ఎవరి మీద అయినా ప్రేమ వచ్చినా, కోపమొచ్చినా ‘సచ్చినోడా’ అని తెలుగువాడు పిలుస్తాడు. ‘సచ్చినోడు’ ఎలా పలుకుతాడని ఆలోచించడు. 


*చచ్చినా ఒప్పుకోను అంటాడు. చస్తే ఎలా ఒప్పుకుంటాడు? చచ్చినాక ఒప్పుdకుని చూపించిన వాడు ఒక్కడైనా ఉన్నాడా? 


*ఆశ చావడం లేదంటాడు. చెట్లకే ప్రాణం ఉందని చెప్పుకుని చావనివాళ్లు ఇంకా ఉన్నారు. అలాంటి వాళ్లు ఆశకు ప్రాణం ఉంటుందని ఎలా ఒప్పుకుని ‘చస్తా’రు? 


*తెలుగువాడు కంటి చూపుతో చంపేస్తాడు. అతడి శక్తి అలాంటిది. 


ఇలాంటి అతీత శక్తులు యావత్‌ ప్రపంచంలో తెలుగువాడికి మాత్రమే ఉన్నాయి. 

ఎంత గొప్ప! ఎంత చిత్రం !


 *మత్తు పానీయాలైన సారా, బ్రాందీ, విస్కీలను ‘సేవిస్తున్నా’ నంటాడు. అదే సమయంలో మంచినీళ్లు తాగుతున్నానంటాడు తప్ప సేవిస్తున్నాననడు. 

ఇదేం చిత్రమో! 


*ఇంకా చిత్రమేంటంటే మందు ‘కొడుతున్నా’నంటాడు. కొట్టడానికి మందేమన్నా మనిషా? పశువా? 


*బాతాఖానీ కొట్టకు అంటాడు. దీని పరిస్థితీ ఇదే. 


*అనారోగ్యకరమైన నిషా పానీయాన్ని ఆరోగ్యప్రదాయిని అయిన మందు పేరుతో పిలుస్తాడు! అంతా ‘మందే’ అనుకునేవాడు తప్ప ఇంకెవ్వడైనా ఈ పని చేయగలడా? 


*తెలుగువాడు ఎందులోనైనా ఆటను చూడగలడు. మాట్లాడతానంటాడు. పోట్లాడతానంటాడు. 


*మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటాడు. మనసు పూర్తిగా కాకుండా అందులో ఏభై శాతమో, డెబ్భైఅయిదు శాతమో ఉంచి కోరుకుంటాడా ఏంటి? 


ఇంకోమాట! 


*హృదయపూర్వకంగా అభినందిస్తున్నానంటాడు. కాసేపు హృదయాన్ని పక్కనబెడితే, అభినందించే అవకాశం ఉందా? ఉంటుందా? 


*తెలుగువాడి ‘న్యాయమే’ వేరు. 


బడాయి గానీ మాట మాట్లాడితే ‘మనస్సాక్షిగా’ అంటాడు. మనసుకు ఏమన్నా రూపం ఉందా? మాట ఉందా? వచ్చి సాక్ష్యం చెప్పడానికి! 


*అగ్నిసాక్షిగా పెళ్లాడాను అని కూడా అంటాడు. అగ్ని ఏదో చిటపటలాడుతుంది కానీ ఎవరైనా సంసారంలో చిచ్చుపెడితే అదొచ్చి అడ్డుపడుతుందా ఏంటి? 


*కళ్లలో నిప్పులు పోసుకుంటున్నాడంటాడు! పోసుకోమనండి చూద్దాం! 


*పెళ్లికాని ఆడపిల్లను గుండెల మీద కుంపటి అంటాడు. ఇది ఎంత తప్పు! గుండెల మీద కుంపటి పెట్టుకున్న మొనగాళ్లు యావత్‌ భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? 


*మాటేగా ఏదైనా అంటాడు. గుండె మీద బరువు తగ్గించుకున్నానంటాడు. గుండెల మీద బట్టల బరువు తప్ప ఇంకేం బరువు ఉంటుంది! 


*నవ్వితే నవరత్నాలు రాలతాయంటాడు. రత్నాలా పాడా? మరీ గట్టిగా నవ్వితే పళ్లు రాలిపోతాయేమో! చిటికెలో పని అయిపోతుందంటాడు. 


*అతిశయం కాకపోతే చిటికె వేస్తే శబ్దం అవుతుంది కానీ పని ఎలా అవుతుంది !

 

*ఒట్టిమాటలు కట్టిపెట్టోయ్‌ అని గురజాడ చెప్పినా మనవాళ్లు వినరు. 


*అప్పు తీసుకునేటప్పుడు ‘నీ డబ్బు వడ్డీతో సహా పువ్వుల్లో పెట్టి ఇస్తా’నంటారు. వడ్డీ ఇస్తే ఇవ్వచ్చుగానీ పువ్వుల్లో పెట్టి ఇచ్చినవాడు ఎవడైనా ఉన్నాడా? ఇది అప్పిచ్చిన పిచ్చివాడి చెవిలో పువ్వు పెట్టడం కాదూ! 


*ఎవరో చిన్నచూపు చూస్తున్నారని తెలుగువాడు ఆక్షేపిస్తాడు. దూరపు చూపు, దగ్గరి చూపు ఉంటాయి తప్ప చిన్న చూపు, పెద్ద చూపు అని ఎక్కడైనా ఉంటాయా? 


*వంట చేయడాన్ని చేయి కాల్చుకోవడం అంటాడు. ఇదే నిజమైతే ఆడవాళ్ల చేతులన్నీ ఏమైపోయేవి !

 

 *సంగీతమంటే చెవి కోసుకుంటానని ఒక్కొక్కరు వంకర్లు తిరిగిపోతుంటారు. అయితే అతడు ఎంతసేపు పాటలు వింటున్నా కోసుకున్న చెవి కిందపడదే అని నిరాశ పడ్డవాళ్లూ ఉన్నారు. 


*తప్పు చేసినవాడు అడ్డంగా దొరికిపోయాడు అంటారు. దొరికినవాడెవడైనా అడ్డంగా దొరుకుతాడా? నిలువుగా దొరుకుతాడు తప్ప. 


*అన్నట్టు గిట్టనివాణ్ని అడ్డమైనవాడు అని తిడతారు. అదేంటి? దాని భావ మేంటి? పండితార్థం ఏమైనా పిండితార్థం ఒకటుంది. 


*పశువా అని తిట్టినట్టు. మనుషులు నిలువుగా ఉంటారు. పశువులు అడ్డంగా ఉంటాయి. అదీ సంగతి! 


*ఎవడి మీదైనా కోపం వస్తే ఏ మొహం పెట్టుకుని వచ్చావంటాడు తెలుగువాడు. ఎవడికైనా ఒకటే ముఖం ఉంటుంది కానీ బ్రహ్మలాగా నాలుగు ముఖాలు, రావణబ్రహ్మలాగా పది ముఖాలు ఉండవు కదా! 


*ఫలానావాడు తలలు మార్చేరకం అనేది కూడా తెలుగువాడి వాడుక. ఇదెలా సాధ్యం? వినాయక వృత్తాంతంలోలాగా తలలు మార్చేశక్తి సామాన్య మానవులకు ఉంటుందా ?


*తెలుగువాడు బండ చాకిరీ చేస్తానంటాడు. బండ దాని మొహం! ఎక్కడ పడేస్తే అక్కడే ఉంటుంది కానీ అది చేసే చాకిరీ ఏముంటుంది? 


*ఏముంది ఎడమ చేత్తో చేస్తానంటాడు. ఎడమ చేత్తో చేసే పనులేంటో అందరికీ తెలుసు. దానితో అన్ని పనులూ అతివేగంగా చేస్తానంటే ఎలా కుదురుతుంది? 


*అన్నం ఉడకలేదా అంటాడు. ఇదేంటి? ఉడికితే కానీ అన్నం కాదు కదా! 


*జోకులు పేల్లేదు అంటాడు. జోకు ఏమైనా బాంబా? పేలడానికి! 


*వీపు విమానం మోత మోగుతుందని అంటాడు. విమానం మోత మోగితే ఆ వీపు అసలు ఉంటుందా? మనిషి అసలు ఉంటాడా? 


*లేస్తే మనిషిని కానంటాడొకడు. మరి లేచినవాళ్లందరూ ఏంటి? అలాంటప్పుడు కూర్చుని ఉంటేనే మేలు కదా! 


*శక్తిని కూడా భక్తికి ముడి పెట్టడం తెలుగువాడికి రివాజు. 


*ఉన్న పూజలు చాలక బడితెపూజ ఒకటి.


  *జంతువుల్లో కూడా దేవుళ్లను చూసుకుని భారతీయులు ఆరాధిస్తారు. ఇందుకు తెలుగువాడు కూడా మినహాయింపు కాదు. ఎటొచ్చీ మనుషుల్లో జంతువుల్ని చూడటం అతగాడి ప్రత్యేకత. 


*గిట్టనివాళ్లను పంది, కుక్క, గాడిద అని తిట్టే తెలుగువాడు, ఇష్టమైనవాణ్ని పులి, సింహం, గుర్రం అని అభిమానంగా చూస్తాడు. పిలుస్తాడు.


*ఏదైనా కళ్లారా చూస్తే తప్ప నమ్మకూడదు. తెలుగు భాష ఇందుకు ఇంపు అయిన మినహాయింపు. 

*గుండె జారిపోయింది అంటారు. ఇప్పటివరకు ఎవరికైనా జారిపోయిందా? లేదే! 


*నీ నోరు పడిపోను అని తిట్టిపోస్తారు. ఎవరి నోరు అయినా ఎప్పుడైనా పడిపోవడం చూశామా? 


*పాడమని అడిగితే గాయకులు గొంతుపోయింది అంటారు. గొంతు ఎక్కడికి పోతుంది? పోతే ఎవరు తీసుకురాగలరు? 


*నోరు పారేసుకోవడం అంటారు. అది ఎలా సాధ్యం? 


*మా ఆయనకు నోట్లో నాలుకలేదని ఓ ఇల్లాలు వాపోతుంటుంది. నోట్లో నాలుక లేకుండా మనిషి ఎలా ఉంటాడు? 


*‘వాసన చూడు’ అంటారు. వాసనను పీలుస్తారు కానీ ఎలా చూస్తాం? 


*రుచి చూడటం కూడా అంతే. ఎవరు చూడగలరు? 


 *పత్రికలు చదివి చదివి వాటిలోని పడికట్టు మాటలను కంఠస్థం చేసేశాడు తెలుగువాడు. 


*ఫలానావాడు బాధకు గురయ్యాడు అంటాడు. మధ్యలో గురి ఎందుకు? బాధపడ్డాడు అనొచ్చుగా. 


*దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడంటారు. దిగ్భ్రాంతి చెందాడు అనడు. దిగ్భ్రాంతిని ఎలా వ్యక్తం చేస్తాడంటే చెప్పడు. 


*తప్పు చేస్తే పాపం అంటాడు సరే. ఎదుటివాడు కష్టాల్లో ఉంటే అయ్యో ‘పాపం’! అంటాడు. తెలుగు భాష ఏమన్నా పుణ్యానికి వచ్చిందా ఏంటి?


 *దేశ భాషలందు తెలుగు లెస్స*

*తెలుగు భాష జిందాబాద్‌*

💐💐💐

ఫాల్గుణ మాసం

 *"ఫాల్గుణ మాసం" ప్రాముఖ్యత!*


(నేటి నుండి ఫాల్గుణ మాసం ప్రారంభం)


శ్రీమహావిష్ణువుకు ఇష్టమైన మాసాల్లో "ఫాల్గుణం" ఒకటి. పూర్ణిమ తిథిలో చంద్రుడు పూర్వ ఫల్గుణి లేదా ఉత్తర ఫల్గుణి నక్షత్ర సమీపంలో సంచరిస్తే, ఆ మాసాన్ని ‘ఫాల్గుణి’ గా పరిగణిస్తారు. గోవింద వ్రతాలను విరివిగా చేస్తుంటారు. విష్ణుపూజకు ‘పయోవ్రతం’ విశిష్టమైంది. దీన్ని శుద్ధ పాడ్యమినాడు ప్రారంభించి పన్నెండు రోజుల పాటు కొనసాగిస్తారు.

సమీపంలోని నదుల్లో స్నానమాచరించి, సూర్యుడికి అర్ఘ్యమిచ్చి, విష్ణువును షోడశోపచారాలతో పూజించి, పాలను నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం. 


"పయస్సు" అంటే పాలు. అదితి ఈ వ్రతం ఫలితం వల్లే వామనుడు జన్మించాడట. లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరుల్ని శుద్ధ తదియనాడు పూజించి నైవేద్యం సమర్పిస్తారు. ఈ మాసంలో రెండు రోజులు వినాయకుణ్ని ఆరాధిస్తారు. కాశీ, ద్రాక్షారామంలో వెలసిన డుండి గణపతికి సంబంధించిన పూజ ఇది. శుక్ల పాడ్యమి, చతుర్థినాడు అవిఘ్న, పుత్ర గణపతి వ్రతాల్ని ఆచరిస్తారు. శుద్ధ ద్వాదశి పయోవ్రతానికి చివరిరోజు. ఈ రోజున నరసింహస్వామిని పూజిస్తారు.


దివ్యౌషధంగా భావించే ఉసిరిని శుద్ధ ఏకాదశినాడు పూజించి, ఆ చెట్టు వద్దనే ‘అమలక ఏకాదశి’ వ్రతం నిర్వర్తిస్తారు. దీన్ని ‘అమృత ఏకాదశి’ గా పరిగణిస్తారు. మదురైలోని మీనాక్షీ సుందరేశ్వరుల కల్యాణం రోజు ఇది. అందుకే శివపూజ చేస్తారు. ఈ నెలలో విష్ణుపూజకు ప్రాధాన్యత ఉంటుంది. ఫాల్గుణ మాసంలో అతి ముఖ్యమైంది వసంతోత్సవం. ఇది కాముని పండుగ, హోలికా పూర్ణిమ, కామ దహనం పేరుతో ప్రఖ్యాతి చెందింది. శుద్ధ త్రయోదశి- కాముని పండుగగా ప్రసిద్ధి చెందింది. ఈ పర్వదినాన శివుడు, మన్మథుడు, కృష్ణుడు, లక్ష్మీదేవి పూజలందుకుంటారు.


ఫాల్గుణమాసంలో ప్రతి తిథికీ ఒక ప్రత్యేకత ఉంది. చవితినాడు ‘సంకట గణేశ’ వ్రతం ఆచరిస్తారు. బహుళ అష్టమినాడు సీతాదేవి భూమి నుంచి ఆవిర్భవించింది. అందుకే ఆ రోజున రామాయణాన్ని చదివి, సీతారాముల్ని కొలుస్తారు. బహుళ అమావాస్యనాడు పితృదేవతలకు పిండప్రదానం చేసి, అన్నదానం చేస్తారు.

*కర్మ అనేది

 *కర్మ అనేది గోడకు కొట్టిన బంతి లాంటిది. ఎంత గట్టిగా కొడితే తిరిగి అంతే గట్టిగా మన వైపు వస్తుంది. ఏ దెబ్బ నుండి అయినా తప్పించుకోవచ్చునేమో కానీ కర్మ దెబ్బ నుండి మాత్రం తప్పించుకోలేం ఎంతటివరైనా సరే తాను చేసిన ప్రతీ కర్మకు ఇప్పుడో మరెప్పుడో ఫలం అనుభవించాలి*

*కనుక  కర్మ  చేసినపుడు                               మంచిదా? చెడ్డదా? అని ఆలోచించి చేయాలి. లాభం వస్తుంది కదా అని ఏది పడితే అది చేసేస్తే కర్మ కూడా తన పని తాను చక్కగా చేసుకు‌ పోతుంది. కనుక విచక్షణతో కర్మలను ఆచరించాలి. దేవుణ్ణి మనసు నిండుగా నింపుకోవాలి. నిజముగా దేవుణ్ణి  ప్రేమించినవాడే   కర్మకు భయపడి ఉంటాడు.*

మనుస్మృతి

 మనుస్మృతి ఇలా చెబుతోంది: "త్రిభ్య ఏవ తు వేదేభ్యః పదం పదమదుదుహం".


గాయత్రీ యొక్క ప్రతి పదం (మూడు) వేదాలలో ఒకదాని నుండి తీసుకోబడింది. 

వేదసంబంధమైన అన్నిటినీ విడిచిపెట్టాము. 

గాయత్రీ మంత్రాన్ని కూడా వదులుకుంటే మన గతి ఏమవుతుంది?


శాస్త్రాల ప్రకారం చేసే అన్ని ఆచారాలకు గాయత్రీ-జపం చాలా అవసరం.

[20/02, 06:53] *Mcp Rajanala Phanibabu/Srivatsa: Says the Manusmriti: "Tribhya eva tu Vedebyhah padam padamaduduham". 

It means that each pada of Gayatri is taken from one of the (three) Vedas. We have forsaken all else that is Vedic. What will be our fate if we give up the Gayatri mantra also?

Gayatri-japa is essential to all rites performed according to the sastras.

ఏడు అద్భుతాలు

 *మన చుట్టూ ఉన్న ఏడు అద్భుతాలు*


 *1* . *తల్లి* 


మనల్ని ఈలోకానికి  పరిచయం చేసిన వ్యక్తి... మనకు జననం ఇవ్వడానికి మరణం దాకా వెళ్లివచ్చిన...  తల్లి మొదటి అద్భుతం. 


 *2* . *తండ్రి* 


మన కళ్ళల్లో  ఆనందాన్ని చూడాలని  తన కన్నీళ్లను దాచేస్తాడు.మన పెదవులపై  చిరునవ్వును చూడాలని తన కష్టాలను దాచేస్తాడు.దుఃఖాన్ని  తాను అనుభవిస్తూ.. సంతోషాన్ని  మాత్రమే మనకు ఇచ్చే తండ్రి రెండో అద్భుతం.....


 *3* . *తోడబుట్టిన*  *వాళ్ళు* 


మన తప్పులను వెనుకెసుకురావాడానికి...  

మనతో పోట్లాడడానికి...  మనకు నేను ఉన్నా అనే ధైర్యం ఇవ్వడానికి వచ్చే బంధమే వీళ్ళు... 

తోడబుట్టినవాళ్లు మూడో అద్భుతం......


 *4* . *స్నేహితులు*  


మన భావాలను పంచుకోడానికి..  

మంచిచెడు అర్థం అయ్యేలా చెప్పడానికి...

ఏది ఆశించకుండా..  మనకు దొరికిన స్నేహితులు  నాలుగో  అద్భుతం....


 *5* . *భార్య* / *భర్త* 


ఈ ఒక్క బంధం కోసం అన్ని బంధాలను... ఎదిరించేలా 7 చేస్తుంది.కలకాలం తోడు ఉంటూ... ఇన్నిరోజులు తోడు ఉన్న అన్ని బంధాలకంటే...  ఈ బంధం ఇంకా గొప్పదని నిరూపిస్తుంది .....భార్య/భర్త అర్థం చేసుకునేవారు దొరికితే  ఐదో అద్భుతం మన సొంతం .


 *6* . *పిల్లలు* 


మనలో స్వార్థం మొదలవుతుంది..  మన పిల్లలు బావుండాలని పదే పదే మనసు ఆరాటపడుతుంది...  

వారి ఆలోచనలే  ఎప్పుడూ చుట్టూ ఉంటాయి..  

వారికోసం మాత్రమే గుండె  కొట్టుకుంటూ  ఉంటుంది.. 

వారి కోసం ఏదో ఒకటి త్యాగం చేయని... తల్లి తండ్రులు  అసలు ఉండరు...  పిల్లలు ఆరో అద్భుతం.


అన్ని అయిపోయాయి ఇంకా 7 అద్భుతం ఏంటా అని అనుకుంటున్నారా?


 *7* . *మనవళ్ళు* *మనవరాళ్లు* 


వీరికోసం ఇంకా కొన్నిరోజులు  బతకాలనే  ఆశపుడుతుంది.. వీరితో కలిసి ఆడుకోవడానికి వయసును మరిచి, అద్భుతం మళ్ళీ పసిపిల్లలం... అయిపోతాం.వీరు మన జీవితానికి  దొరికిన.. ఏడో అద్భుతం....


ఇలా అద్భుతాలన్నీ  మన చుట్టూ ఉంటె అక్కడెక్కడో వెళ్లి వెతుకుతుంటాం... 

కాసింత ప్రేమ చాలు... ఇంకెన్నో అద్భుతాలు  మన సొంతం అవుతాయి  

చిన్న పలకరింపు  చాలు... మనల్ని ఆ అద్భుతంగా  చూడడానికి.  

అందుకే అందరిని చిరునవ్వుతో స్వాగతించి  మరో అద్భుతాన్ని  సృష్టించేద్దాం ...


ఇప్పుడు మన మధ్య ఉన్న మనిషి తెల్లవారేసరికి వుంటాడో లేదో తెలియని కాలం ఇది అందుకే ఉన్న దానిలో సర్దుకుపోయి హాయిగా జీవించడం లోనే ఆనందం.

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

సెల్ ఫోన్*

 

*మన ఆరోగ్యం…!


                      *సెల్ ఫోన్*

                     ➖➖➖✍️


#BecarefulChildren.....


*పిల్లలు సెల్ ఫోన్ తో ఆదుకోవడం గొప్పగా భావించకండి.. తరువాత బాధపడేది మనమే... పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే...అవగాహనా కోసం*


*Naveen Nadiminti సలహాలు* 


సెల్ ఫోన్ వికరణాల ప్రభావం , Cell phone radiation effects


సెల్ ఫోన్ వికరణాల ప్రభావం


Cell phone radiation effects


మనిషి ఆరోగ్యం మీద సెల్ ఫోన్ వికరణాల ప్రభావం


మొబైల్ ఫోన్ వాడకం ద్వారా ప్రమాదకరమైన రేడియో ధార్మిక దుష్ప్రభావాలకు గురయ్యే అవకాశం ఉంది . ప్రజల దైనందిన జీవితాలలో సెల్ ఫోన్లు ముఖ్యమైన ఉపకరణము గా ఈరోజు మారాయి. సెల్ ఫోన్లు మానవ శరీరానికి రోగాలని కలగచేసే లేదా మన ఆరోగ్యానికి హాని కలగచేసే సూక్ష్మ తరంగాలని ప్రసరిస్తాయి .


పిల్లలో సెల్-ఫోన్‌ ప్రభావము :


మన దేశంలో సెల్ ఫోన్ ల వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. రింగ్ టోన్లు, కాలర్ ట్యూన్లు, ఎస్ ఎం ఎస్ లు అంటూ ఎన్నో రకాలుగా సెల్ ఫోన్ ల వాడకం పెరిగిపోతుంది. ఇది బాగానే ఉందిగాని, ఈ సెల్ ఫోన్ల వల్ల వచ్చే అనార్థల గురించి ఎవరూ పట్టించుకోక పోవడం విచారకరమని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ల పిల్లలు ఎక్కువగా అనారోగ్యం పాలు అవుతున్నారని వారు పేర్కొంటున్నారు. గేమ్స్ ఆడడం, పాటలు వినడం , సినిమాలు చూడడంలో పిల్లలు సెల్ ఫోన్స్ ని ఎక్కువగా వాడుతున్నారు. మూడు సంవత్సరాల వయసు కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకి సెల్ ఫోన్స్ ని దూరంగా ఉంచడం చాలా మంచిదని నిపుణులు, డాక్టర్లు చెబుతున్నారు. సెల్ ఫోన్ లు రిసీవ్ చేసుకునే సిగ్నల్స్ కారణంగా రేడియో ధార్మికత వల్ల చిన్న పిల్లల్లో మెదడుకి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాలు ఎక్కువగా ఉన్నాయి. వారి ఆలోచనా శక్తి క్రమేపీ మోద్దుబారే ప్రమాదం ఏర్పడుతోందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఓ బ్రిటీష్ శాస్త్రవేత్త ఈ సెల్ ఫోన్ల్ వల్ల వస్తున్న అనర్థాల గురించి కొన్ని హెచ్చరికలు చేసారు. ముఖ్యంగా వైర లెస్, సెల్ ఫోన్ లు, విల్ ఫోన్ లు నుంచి విడుదలయ్యే రేడియో ధార్మిక కిరణాలు సున్నితమైన మెదడు కణజాలాన్ని నాశనం చేస్తున్నాయని, చిన్న పిల్లల్లో ఇది బాగా ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేసారు. బ్రిటన్ హెల్త్ ప్రొడక్షన్ ఏజన్సీకి చెందినా సర్ విలియం స్టీవార్డ్ ఫిన్క్ష్లన్ద్లొ జరిపిన పరిశోధనలో పాలు విభ్రాంతికరమైన సంగతులు వెలుగు చూశాయి.


సెల్ ఫోన్ లు బాగా వాడే యువకుల రోజువారీ ప్రవర్తనను పరిశీలించిన బృందం వారు తీవ్రమైన మానసిక వత్తిడికి, చిరాకుకీ గురవుతున్నారని తెల్సింది. సెల్ ఫోన్ ల ప్రభావం వల్ల చిన్న పిల్లలు వత్తిడికి గురవ్వడంతో పాటు సరిగా చదవలేక పోతున్నారని, తలనొప్పికి గురవుతున్నట్లుగా కూడా వెల్లడైంది. సెల్ ఫోన్ లతో పాటు మ్యూజిక్ సిస్టమ్స్ వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన వెల్లడించారు. ముభావంగా ఉండడం, ఆకలి మందగించడం, ఎక్కువసేపు మెలకువగా ఉండడం, సరిగా చదవలేకపోవడం, చదివింది గుర్తుంచుకోకపోవడం వంటి లక్షణాలు చిన్నారుల్లో కనిపించినట్లు స్టీవార్డ్ తన పరిశోధన ఫలితాలు వివరించారు. అందుకే ఆస్ట్రేలియా మెడికల్ అసోసియేషన్, పాఠశాలల్లో మ్యూజిక్ సిస్టమ్స్, సెల్ ఫోన్ వాడకాన్ని నిషేదించాలని సూచించింది. ఆస్ట్రేలియా, చైనా అమెరికాలోనూ చిన్నారుల్లో ఇలాంటి లక్షణాలు అధికంగా నమోదవుతున్నాయి. భారత్ లో ఈ అనారోగ్య లక్షణాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మన దేశంలో వివిధ సెల్ ఫోన్ కంపెనీలు అందిస్తున్న ఆఫర్ల వలలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా చిక్కుకుంటున్నారు. క్రమేపీ మనదేశంలో కూడా చిన్నారుల ఆరోగ్యాన్ని ఈ సెల్ ఫోన్ రేడియో ధార్మికత కబళించే ప్రమాదం ఉందని స్వచ్చంద సంస్థలు హెచ్చరిస్తున్నాయి. అందుకే సెల్ ఫోన్ లు మీ చిన్నారులకు అందుబాటులో లేకుండా చూసుకుంటే వారి ఆరోగ్యానికి ఎంతో మంచిది.


పెద్దవారిలో-- మొబైల్ ఫోన్ వికరణాలు వల్ల కలిగే అనారోగ్యాలు : ->


హై బ్లడ్ ప్రెజర్,


తలనొప్పులు,


మెదడు వాపు వ్యాధి,


ఆల్జీమెర్,


క్యాన్సర్


మరియు అంతకన్నా ఎక్కువ ఆరోగ్య సమస్యల్ని కలగచేస్తాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అయినా, సెల్ ఫోన్ ఉపయోగం , కలిగే హాని గురించి పూర్తిగా ఏ ఒక్కరికీ తెలియదు


ఇక్కడ ఇచ్చిన కొన్ని చిట్కాల్ని చూడండి:


1. వీలైనంత వరకు చాలా తక్కువగా వికరణాలకి మాత్రమే గురికావాలి. దీని అర్థం ఏమిటంటే తెలివిగా వీలైనంత తక్కువ ఫోన్ లో మాట్లాడడము, అతి దీర్ఘమైన సంభాషణల్ని జరగకుండా మీరు ప్రయత్నించడం. రెండు నిమిషాల కాల్ తరువాత, మెదడు యొక్క ఎలక్ట్రికల్ ఏక్టివిటీస్/పనితీరు ఒక గంటవరకు మార్పుచేస్తుందని కనుగొన్నారు.


2. సెల్ ఫోన్ ని అత్యవసర పరిస్థితులలో మాత్రమే పిల్లలు ఉపయోగించడాన్ని అనుమతించాలి.


3. మీ మొబైల్ ఫోన్ని ఉపయోగించనప్పుడు, వీలైనంతవరకు మీ శరీరానికి దూరంగా ఉంచాలి. కొంతమంది సెల్ ఫోన్ ఉన్నవారు సెల్ ఫోన్ పనిచేస్తూ ఉండగా తమ పేంటు జేబులో పెడతారు. మానవ శరీరము యొక్క క్రింది భాగము, పై భాగము కన్నా చాలా త్వరగా వికరణాలని లీనం చేసుకుంటుంది.


4. హెడ్ ఫోన్లని ఉపయోగించాలని అనుకున్నట్లైతే, వైర్డు హెడ్ సెట్ల కన్నా వైర్ లెస్ హెడ్ సెట్లని వాడండి. వైరు వికరణాన్ని ప్రసరించడమే కాకుండా ఏంటీనాలా కూడా పనిచేసి చుట్టుప్రక్కల ఉన్న ఎలక్ట్రోమేగ్నెటిక్ ఫీల్డులను (EMFs) ఆకర్షిస్తుంది. హెడ్ సెట్ లేకుండా మీరు సెల్ ఫోన్ ఉపయోగించినప్పుడు, మీ చెవి దగ్గరికి తీసుకునే ముందు కాల్ వచ్చే వరకు వేచి చూడాలి.


5. మీరు సెల్ ఫోన్, హోల్ సేల్ లేదా ఒకొక్కరిగా అమ్మే వారి దగ్గర కొనేటప్పుడు తక్కువ ఎస్ ఎ ఆర్ (నిర్దుష్టమైన విలీన రేటు) ఉన్నది చూసుకుని ఎంచుకోవాలి.ఇన్సట్రక్షన్ మేన్యువల్ లో ఇచ్చిన ఎస్ ఎ ఆర్ నంబరుని చూడండి ఎంత తక్కువ ఎస్ ఎ ఆర్ విలువ ఉంటే అంత మంచిది.


6. ఎలివేటర్లు/ లిఫ్టులు లేదా వాహనాలు వంటి, మూసివేసిన మెటల్ స్పేసులలో వికరణం ఉధృతంగా ఉంటుంది కాబట్టి కాల్స్ ని తీయకుండా ఉండండి.


మీ సెల్‌ఫోన్‌ హాని చేయనిదేనా..తెలుసుకోండిలా ..!


బ్రాండెడ్‌ సెల్‌ఫోన్లతో ఎక్కువసేపు మాట్లాడినా ఇబ్బందేమీ ఉండదు. అదే అన్‌బ్రాండెడ్‌ మొబైల్‌తో 5 నిమిషాలు మాట్లాడినా.. చెవి దగ్గర వేడెక్కుతుంది. ఫోన్‌ నుంచి అధిక రేడియేషన్‌ వెలువడటమే ఇందుకు కారణం. అందుకే సెల్‌ఫోన్‌ కొనేటప్పుడు కెమేరా, వీడియో ప్లేయర్‌, ఎంపీ 3, ఇంటర్నెట్‌ వంటి ఫీచర్లతో పాటు రేడియేషన్‌ ఎంత వెలువరిస్తుందో కూడా తెలుసుకోవడమూ అవసరమే.


మొబైల్‌ ఫోన్‌ రేడియో తరంగాలను ప్రసారం చేయడంతో పాటు గ్రహిస్తుంది కూడా. అందుకే ఫోన్‌ నిర్దిష్ట శోషణ సూచి (ఎస్‌ఏఆర్‌) అంటే రేడియో తరంగాల నుంచి ఎంత శక్తిని మన శరీరం గ్రహిస్తుందో కూడా తెలుసుకోవాలి.


* 'కిలోగ్రాముకు 2 వాట్ల కంటే తక్కువ రేడియేషన్‌ వెలువరించేవి మంచి ఫోన్లు' అని స్వతంత్ర సాంకేతిక సంస్థ ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ నాన్‌ అయొనైజింగ్‌ రేడియేషన్‌ ప్రొటెక్షన్‌ (ఐసీఎన్‌ఐఆర్‌పీ) తేల్చింది. 10 గ్రాముల కణజాలాన్ని సగటుగా తీసుకుని లెక్కించారు. దీనినే అంతర్జాతీయంగా అనుసరిస్తున్నారు. అయితే చెవి దగ్గర ఫోన్‌ ఉంచి మాట్లాడేందుకు ఎస్‌ఎఆర్‌ 1.29 వాట్లు/కిలోగ్రామ్‌ ఉండాలని ఐసీఎన్‌ఐఆర్‌పీ నిర్దేశించింది.


* ఎస్‌ఏఆర్‌ పరిమాణం నిర్ధరించిన అత్యధిక విలువ కంటే తక్కువే ఉండాలి. ఎందుకంటే నెట్‌వర్క్‌ను చేరేందుకు మాత్రమే సెల్‌ఫోన్‌ తన బ్యాటరీ నుంచి శక్తిని వినియోగించాల్సి ఉంటుంది. నెట్‌వర్క్‌ బేస్‌ స్టేషన్‌ నుంచి మనం ఎంత దూరాన ఉన్నాం అనే అంశంపై సెల్‌ఫోన్‌ శక్తి వినియోగం ఆధారపడుతుంది.


ఎస్‌ఏఆర్‌ ప్రమాణాలు ఆయా దేశాల్లో


అమెరికాలో 1.6 వాట్స్‌/కిలోగ్రామ్‌


కెనడాలో 1.6 వాట్స్‌/కిలోగ్రామ్‌


ఐరోపాలో 2 వాట్స్‌ / కిలోగ్రామ్‌


ఆస్ట్రేలియాలో 2 వాట్స్‌ / కిలోగ్రామ్‌


కంపెనీల ప్రత్యేక వెబ్‌సైట్లు


కంపెనీలు తాము తయారుచేసిన సెల్‌ఫోన్లు విక్రయించే ముందు రేడియేషన్‌ పరీక్షను అమలు చేస్తాయి. అందులో అర్హత పొందిన వాటినే మార్కెట్లోకి విడుదల చేస్తాయి. ఈ సమాచారం ఫోన్‌తో పాటు ఇచ్చే యూజర్‌ గైడ్‌లో ఉంటుంది. దీంతోపాటు బ్రాండెడ్‌ కంపెనీలన్నీ ప్రత్యేక వెబ్‌సైట్లు కూడా నిర్వహిస్తున్నాయి. కంపెనీ, ఫోన్‌ మోడల్‌, దేశాన్ని ఆయా సైట్లలో నమోదు చేస్తే, ఎంత రేడియేషన్‌ వెలువరిస్తుందో తెలుస్తుంది. కొన్ని వెబ్‌సైట్లు ఇవీ..


సెల్‌ఫోన్లకు రేడియేషన్‌ షీల్డులు విక్రయించే ఎస్‌ఎఆర్‌ షీల్డ్‌ వెబ్‌సైట్‌ www.sarshield.comలో కూడా పూర్తి సమాచారం లభిస్తుంది


ఈ జాగ్రత్తలు పాటిస్తే


* ఎస్‌ఏఆర్‌ తక్కువగా ఉండే సెల్‌ఫోన్లు కొనాలి.


* సాధ్యమైన చోట్ల ఫోన్‌ చెవి దగ్గరకు చేర్చకుండా, స్పీకర్‌ ఆన్‌ చేసి మాట్లాడాలి


* హెడ్‌సెట్‌ (ఇయర్‌ఫోన్లు) వినియోగించినా సెల్‌ఫోన్‌ రేడియేషన్‌ ప్రభావం పూర్తిగా పోదు


* అవసరమైన కాల్స్‌ మాత్రమే మాట్లాడి, మిగిలిన వాటికి టెక్ట్స్‌ మెసేజ్‌ (ఎస్‌ఎంఎస్‌) వినియోగించాలి


* సెల్‌ఫోన్‌ తీసుకెళ్లేటప్పుడు మన శరీరానికి కనీసం అంగుళం దూరాన ఉండేలా చూసుకోవాలి


* నెట్‌వర్క్‌ బలహీనంగా ఉన్నచోట, సిగ్నల్‌ కోసం ఫోన్లు అత్యధిక రేడియేషన్‌ను వెలువరించే అవకాశముంది. అలాంటి ప్రదేశాల్లో ఫోన్‌ వినియోగం తగ్గించాలి


* నిద్రించేటప్పుడు తలగడ వద్ద ఫోన్‌ ఆన్‌చేసి ఉంచవద్దు.



సెల్‌తో ఎముకలకు ముప్పు


ఈమధ్య కాలంలో సెల్‌ఫోన్‌ వాడనివారు పాపాత్ములు. టెక్నాలజీని మేం మాత్రం వాడుకోకూడదా అనే పంథాలో. కానీ దేన్నైనా అవసరాన్ని మితిమీరి వాడితే ముప్పులు తప్పవ్ఞ. కొంతమంది హోదాకోసమో, హుందా కోసమో ఎప్పుడూ సెల్‌ఫోన్‌ను బెల్టుకో, జేబులోనో ధరిస్తుంటే వాటి నుంచి వెలువడే విద్యుదయస్కాంత కిరణాలు కటి ప్రాంతంలోని ఎముక సాంద్రతను దెబ్బతీస్తున్నాయని టర్కీ పరిశోధకులు చెబుతున్నారు.


ఆరేళ్లుగా రోజుకి 15 గంటల పాటు ఇలా బెల్టుకి సెల్‌ఫోన్‌ ధరిస్తున్న వారి ఎముకల సాంద్రతను పరీక్షించినపుడు తుంటి ఎముక పైభాగంలోని వంపు (ఇలియాక్‌ వింగ్స్‌) దగ్గర అవతలి వైపు ఎముక కన్నా బలహీనంగా ఉంటున్నట్టు గుర్తించారు. కాబట్టి సెల్‌ఫోన్‌ ప్రియులూ తస్మాత్‌ జాగ్రత్త!


సెల్‌ఫోన్లతో బ్రెయిన్‌ క్యాన్సర్‌


        యూత్‌లో సెల్‌ ఫోన్ల వాడ కం పెరగడంపై ఆమె హెచ్చరికలు చేస్తున్నారు. మొబైల్‌ ఫోన్ల వాడకంతో రాబోయే మూడు సంవత్సరాల్లో యువతలో పలు ఆరోగ్య సమస్యలు ఎదుర య్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. వీటి ఉపయోగంతో మగ వారిలో వ్యంధత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఆమె యుఎస్‌, చైనా, ఆస్ట్రేలియా తదితర ఏడు దేశాల్లో పరిశోధనలు నిర్వహించారు. యువ కులు స్విచాన్‌ చేసిన మొబైల్‌ ఫోన్స్‌ను ప్యాంట్‌ జేబుల్లో పెట్టుకొనే వారిలో స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. కొత్తగా తండ్రులు కావాలనుకునే యువకులు ప్రతిరోజు కనీసం నాలుగు గంటల పాటు సెల్‌ ఫోన్‌ వాడితే అంతే సంగతులు. ఈవిధంగా మొబైల్‌ను వాడితే ఇతరులతో పోల్చుకుంటే వారిలో స్పెర్మ్‌ కౌంట్‌ సగానికి సగం తగ్గుతుందని పరిశోధనల్లో దేవ్‌రా డేవిస్‌ చెప్పడం గమనార్హం.


మొబైల్‌ రేడియేషన్‌ మధ్య స్పెర్మ్‌లను ఉంచితే అవి బలహీనపడడమే కాకుండా సన్నబడి వేగంగా ఈదలేకపోతున్న విషయం తమ పరిశోధనలో తేలిందని ఆమె పేర్కొన్నారు. తక్కువ శక్తితో కూడిన రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్‌మిట్టర్‌లైన మొబైల్‌ ఫోన్లు మైక్రోవేవ్‌ రేడియే షన్‌ను సృష్టిస్తాయి. సెల్‌ ఫోన్‌ రేడియేషన్‌ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందనీ ఈ విషయంలో సెల్‌ఫోన్‌ కంపెనీలు ఏం చేస్తా యో చూడాల్సిందేనని ఆమె పేర్కొన్నారు. మొబైల్‌ ఫోన్లను ఎక్కువగా వాడ డం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలున్నాయనీ ఇవి ఆరోగ్యవంతమైన పిల్లలు కలిగే అవకాశాలను నీరుకారుస్తాయని ఆమె హెచ్చరిస్తున్నారు. ఇవి మనకు దీర్ఘకాల సమస్యలను సృష్టిస్తూ మనుషుల మెదడు, శరీరాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయని దేవ్‌రా డేవిస్‌ పేర్కొన్నారు.


      కొంతకాలానికి వాటిలో ట్యూమర్లు ఏర్పడిన విషయం బయటపడి అందరూ నిర్ఘాంతపోయారు. కనుక సెల్‌ ఫోన్లతో జాగ్రత్త పడక తప్పదు.


15నిమిషాలు సెల్‌ఫోన్‌ మాట్లాడితే బ్రెయిన్‌ కేన్సర్‌


    : మొబైల్‌ ఫోన్‌లలో ఎక్కువ సమయం సంభాసించే వారికి బ్రెయిన్‌ కాన్సర్‌ వచ్చే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వినియోగదారులకు ఓ హెచ్చరిక చేసింది. 15 నిమిషాల పాటు ఏకధాటిగా మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడితే తప్పనిసరిగా బ్రెయిన్‌ కాన్సర్‌ వస్తుందని, తాజా అధ్యయనంలో వెల్లడైనట్లు డబ్ల్యుహెచ్‌ఓ పేర్కొంది. దాదాపు 13 దేశాలలో మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులపై పరిశోధనలు నిర్వహించగా, ఈ ఆందోళనకర విషయం వెలుగుచూసిందని తెలిపింది. ఓ రోజులో 15 నిమిషాలు మొబైల్‌ ఫోన్‌లో సంభాషణలు జరిపినా బ్రెయిన్‌ ట్యూమర్‌ వచ్చే అవకాశా లున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.


మొబైల్ తో మతిమరుపు :


ఏ వయస్సులో ఉన్నా , ఎవ్వరి చేతిలో చూసినా సెల్ ఫోన్‌ కనిపించాల్సిందే . క్షణాల్లో విషయాలు తెల్సుకోగల ఈ సంకేతికవిప్లవం మంచిదే అయినా .. అతి అనర్ధదాయకం అన్న సూత్రం ఇక్కడా పనిచేస్తుంది . ఎక్కువగా మొబైల్ ఫోన్లు వాడేవారిలో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది . అంతేకాదు -రియక్షన్‌ సమయమూ నెమ్మదించి తప్పుల్ని ఎక్కువగా చేస్తుంటారు . 12 , 14 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మద్య గల విద్యార్ధులపై " మొనష్ యూనివర్సిటీ " పరిశోధనలు నిర్వహించగా ... ఎన్నో విషయాలు వెళ్ళడైనాయి. ఎక్కువగా మొబైల్ ఫోన్లు వాడేవారిలో శీఘ్రగతి తగ్గిపోయినట్లు , జ్ఞాపకశక్తి తగ్గిపోతున్నట్లు , శీఘ్రగతి తగ్గిపోతున్నట్లు , తప్పులు ఎక్కువగా చేస్తున్నట్లు గుర్తించారు .


సెల్ ఫోన్‌ తో తంటా ? :


సెల్ పోన్‌ అవసరమే కాని అతిగా ఉప్యోగించడము అనర్ధము అంటున్నది ప్రపంచ ఆరోగ్యసంస్థ . భారతదేశము లోని కొన్ని పరిశోధన సంస్థలు సెల్ పోన్‌ తో వచ్చే అనారోగ్యము మీద అధ్యయనము చేసాయి. 20 నిముషాలు పాటు విడవకుండా సెల్ ఫ్ఫ్న్‌ మాట్లాడితే చెవి లోపలి ఉష్ణోగ్రత ఒక డిగ్రీ మేరకు పెరుగుతుంది . సె ఫ్ఫ్న్‌ వాడకం పెరిగిన కొద్దీ మెదడు మీద దాని ప్రభావము పడుతుంది . మెదడులో కణితలు (Tumours) ఏర్పడడానికి కారణము సల్ ఫోన్‌ వాడకము అని నిర్ధారించారు . 9 నిముషాలు సెల్ ఫోన్‌ లో మాట్లాడడము అంటే మక్రోవేవ్ ఒవెన్‌ లో ఒక సెకను పాటు తలపెట్టినటే అని నిర్ధారించారు మన శాస్త్రజ్ఞులు . మానసిక సమస్యలు పెరుగుదలకు, పురుషులలో పెరుగుతున్న వంధ్యత్వానికి కూడా సెల్ ఫోన్‌ కారణము అంటున్నారు .


సిగ్నల్స్ సరిగా లేనిచోట సెల్ ఫోన్‌ వాడవద్దు . సెల్ ఫోన్‌ జేబులో పెట్టకంది ... జేబులో పోన్‌ పెట్టుకునే పురుషులు దానిని స్విచ్ ఆఫ్ చేయండి . గర్భిణీ స్త్రీలు సెల్ ఫోన్‌ వాడకాన్ని ఎంత తగ్గిస్తే అంతమంచిది. సెల్ కాల్స్ 6 నిముషాలకు మించి వాడడము ఆరోగ్యానికి హానికరము .


సెల్ ఫోన్‌ తో చెవులకు చిక్కు : 


ఎక్కువసేపు సెల్ ఫోన్‌ లో మాట్లాడే వారికి మిగిలిన శబ్దాలు వినబడడము మానేస్తాయి. సెల్ ఫోన్‌ లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే రోడ్డు ప్రమాదాలు జరగడం అందరికీ తెలినదే ... దీనికి కారణము మెదడు రెండుపనులు మీద ఒకేసారి దృష్టి పెట్టలేక పోవడమే . రెండవ కారణము సెల్ ఫోన్‌ లో వచ్చే ధ్వనుల స్థాయి..ధ్వని తప్పించి మిగిలిన స్థాయి ధ్వనులను వినడం , విన్నా గ్రహించడం చెవులు చెయ్యలేకపోవడం . ఎక్కువగా చెవిలో గుసగుసలు చెప్పుకునే అలవాటు ఉన్నవారికి ఇటువంటి వినికిడి సమస్యే వస్తుంది్స్


సెల్‌ఫోన్లతో మరో ప్రమాదం జన్యుమార్పులు కలిగే ప్రమాదము


సెల్‌ఫోన్లు వచ్చినప్పటి నుండీ వాటిని వాడటం వల్ల వచ్చే అనేక ప్రమాదాల గురించి తెగవార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిలో కొన్ని ఊహాత్మకమైనవి. కొన్ని నిజమైనవే. ఆ క్రమంలో ఇప్పుడు పరిశోధకులు సెల్‌ఫోన్ల వల్ల వచ్చే మరో ప్రమాదాన్ని కనుగొన్నారు. అధికంగా సెల్‌ఫోన్లు వాడటం వల్ల శరీర కణాలలో ఆక్సిడేషన్‌ ఒత్తిడి పెరిగి, జన్యుమార్పులు కలిగే ప్రమాదముందని తేలింది. ఆక్సిడేషన్‌ ఒత్తిడివల్ల విషపూరిత పైరోక్సైడ్‌లు, ఫ్రీరాడికల్స్‌ కలిసి కణాల కేంద్రకంలో ఉండే డి.ఎన్‌.ఎ.తో సహా ఉన్న అన్ని భాగాలనూ తీవ్రంగా ప్రభావితం చేస్తారు. ఈ కారణంగా క్యాన్సర్‌ కణితి వంటివి ఏర్పడే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు.  


గర్భిణులూ సెల్‌ మాట్టాడవద్దు 


                              -గర్భంతో భర్తకు దూరంగా ...పుట్టింట ఉండటం కాస్త కష్టమే. కానీ అంతా అయినవారు ఉన్నా మనసెరిగిన మారాజు చెంతనలేడన్న లోటు తీర్చుకునేందుకు పూర్వకాలంలో ఉత్తరాలు రాసుకుంటే ...ఇప్పుడు ఆ జంటల మధ్య దూరాన్ని తగ్గించే బాధ్యత సెల్‌ఫోన్లే తీసుకున్నాయని చెప్పాలి. దీంతో అదే పనిగా అవసరం ఉన్నా లేకున్నా సెల్‌ఫోన్లతో గర్భంతో ఉన్నవారు ఎక్కువగా తన భర్తతో మాట్లాడేస్తున్నారు.గర్భంతో ఉండే మహిళలు సెల్‌ ఫోన్‌తో ఎక్కువగా మాట్లాడితేj పుట్టబోయే బిడ్డకు ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పరిశో ధకులు. ఈ విషయమై కాలిఫోర్నియా, దక్షిణ కాలిఫోర్నియా లకు చెందిన శాస్త్రజ్ఞుల బృందం జరిపిన తాజా అధ్యయనంలో ఈ నిజం వెలుగు చూసినట్లు వెల్లడించారు. కాలిఫోర్నియాలో దాదాపు 30 వేల మంది చిన్నారులపెై వివిధ రకాల పరీక్షలు జరిపి, శోధించగా వారిలో 50శాతం మందికి పెైగా రేడియేషన్‌ ప్రభావానికి గురెైనట్లు తేలిందని తేల్చి చెప్పారు.అందుకు కారణం ఆ బిడ్డల తల్లులు గర్భంతో ఉన్నప్పుడు ఎక్కువగా సెల్‌ఫోన్‌ వాడటమే ప్రధానంశంగా తేల్చి చెప్పారు. పుట్టగానే ఆ రేడియేషన్‌ ప్రభావం పెైకి కనిపించదని, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించినా వయసు పెరుగుతున్న కొలది అవలక్షణాలు బెైటకు వస్తున్నట్లు తాము గుర్తించినట్లు శాస్త్రవేత్తల బృందం స్పష్టం చేసింది. తల్లి గర్భంతో ఉన్నప్పుడు రేడియేషన్‌ ప్రభావానికి గురయ్యే చిన్నారులు 30 శాతంగా నమోదు కాగా... చిన్నారుల ముద్దు మాటలకు ముచ్చటపడి సెల్‌ ఫోన్లలో మాట్లాడించడం వల్ల 20 శాతం మంది రేడియేషన్‌ ప్రభావానికి 


గురవుతున్నారని, దీని వల్ల ఈ చిన్నారు లు ఏడేళ్ల వయసుకు వచ్చేసరికి వారి ప్రవర్తనలో అసాధారణ మార్పులు కల్గడమే కాకుండా ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఎదుర్కొంటున్నట్లు గమనించామని పరిశోధకులు చెబుతున్నారు.


గర్భిణులు నిరిష్టకాల పరిమితిలో అవసరానికి అనుగుణంగా మొబెైల్‌ వినియోగిస్తే తప్పుకాదని, రోజులో కావా ల్సిన వారితో మూడు, నాలుగుసార్లు సంభాషించుకో వచ్చని... అయితే అది కూడా నాలుగు నిమిషాలకు మించకుండా ఉండాలని, అంతకన్నా ఎక్కువ సేపు మాట్లాడితే పుట్టే బిడ్డపెై రేడియేషన్‌ ప్రభావం అధికంగా ఉండటం తధ్యమని హెచ్చరిస్తున్నారు. మరి పుట్టే పిల్లల భవిష్యత్‌ని తామే అంధ కారంగా మార్చకుండా...కొన్నాళెైనా సెల్‌ ఫోన్లకి దూరంగా ఉంటే మంచిదేమో? మీ సమాచారం కన్నా మీ బిడ్డ క్షేమం కూడా ముఖ్యమే కదా.✍️


.                      🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

మాతృభాషా దినోత్సవ

 *అంతర్జాతీయ మాతృభాషా      దినోత్సవ సందర్భంగా*

(ఎల్లనాడుల అమ్మనుడి పొద్దేడుక కైకట్టుగా)

.....*ఇన్ని మాతృభాషా దినోత్సవాలు అవసరమా*....

అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సందర్భంగా నాదొక చిన్న మాట .మనకు ఇన్ని మాతృభాషా దినోత్సవాలు అవసరమా !?అని ఆలోచిస్తే ,నిజంగా అవసరమే, ఎందుకంటే మనం ఎప్పుడూ జీవన సమరంలో జీతభత్యాల కోసం  పరుగిడుతూనే ఉంటాం .అయితే ఈ ఒక్క రోజైనా మాతృభాష గురించి మనలో కొందరైనా ఆలోచిస్తారని ,ఆవేశిస్తారని ఇలాంటి రోజులు జరుపుకోవాలని భాషావేత్తల అభిప్రాయం. కనుక ఇలాంటి దినోత్సవాలు చాలా అవసరం.


మనిషిగా మనం జన్మనిచ్చిన అమ్మ ఒడిని ,మొదటగా మాట నేర్పిన అమ్మనుడిని మరిచిపోకూడదు. అమ్మ గురించి చెప్పాలంటే అమ్మ మమతానురాగాలు చవి చూడాలి. అమ్మనుడి గురించి చెప్పాలంటే ఆ మాతృభాషా సౌందర్యాన్ని, ఆ భాష గొప్పదనాన్ని తెలుసుకోవాలి.

భాషించినది భాష (నుడివినది  నుడి), భాష ( నుడి) మానవుని భావాలను, ఆలోచనలను, అభిప్రాయాలను ,తలపులను ఇతరులకు తెలియజేయడానికి అదొక మాధ్యమం ( తెన్నువ) .మనిషి పుట్టినప్పుడు శిశువు తొలిసారిగా ,తన వారి ననుసరించి, తన సమూహంలో, సహజంగా, ప్రకృతి పరంగా ,తన పరిసరాలలోని భాషని ,విని , కని అనుకరించే మొదటగా మాట్లాడిన భాష మాతృభాష.


ఎవరి అమ్మవారికి గొప్ప అన్నట్లుగా, ఎవరి మాతృభాష వారికి గొప్పే కదా! కనుక ఎవరు అమ్మనుడిని వారు తప్పక రక్షించుకోవాలి. ఇంగ్లీష్ వారి వలసవాదం వలన, వారు కాలిడిన ,ఏలిన సీమలలో అనేక భాషలు ,అనేక సంస్కృతులు ,ఇంగ్లీషు ప్రభావం వలన, వారి మత ప్రభావం వలన కనుమరుగైనవి. ఒక భాష నశిస్తే, ఆ భాషకు చెందిన జాతి ,జాతి భావన ,సంస్కృతి ,సాంప్రదాయాలు కూడా నశిస్తాయి. ఇది చరిత్ర చెప్పిన, నిరూపించిన సత్యం .అంటే మన అమ్మనుడిని మనమే కాపాడుకోవాలి .ఎవరి భాషను వారే రక్షించుకోవాలి. రాబోయే తరాల కోసం భాషను పదిలపరుచుకోవాలి .పరిరక్షించుకోవాలి.


అందుకే ఇతర భాషల ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకొని, అమ్మనుడిని పరీక్షించుకోవాలనే  తలంపుతోనే,ఆ భాష జాతి నైతిక బాధ్యతగా ,ప్రతి మనిషి కర్తవ్యం గా ,అమ్మనుడిని రక్షించుకోవాలoటూ గుర్తు చేయడానికే , ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఏర్పాటు చేయడమైనది.


బంగ్లాదేశ్ లో తమ మాతృభాష బంగ్లాను నిలబెట్టుకోవడానికి ఉద్యమ నడిపి ఆ ఉద్యమంలో ప్రాణాలర్పించిన నలుగురి యువకుల ప్రాణత్యాగానికి గుర్తుగా ఫిబ్రవరి 21ని  ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం గా ప్రకటించింది.


ప్రపంచంలో దాదాపు 6000 పైచిలుకు భాషలు ఉన్నాయి .వాటిలో సొంత లిపి ఉన్న భాషలు దాదాపు 400 లోపే. కొన్ని భాషలకు ఇప్పటికీ సొంత లిపిలు లేవు .కనుక అమ్మనుడిని అందరూ కాపాడుకోవాలని, రేపటి జాతికి భాషను పునరoకితం చేయాలనే,ఉద్దేశంతో ఈ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకోవాలని ఆవశ్యకత ఎంతైనా ఉంది.


తల్లి ఒడిలో, తొలి బడిలో వెలసిన నుడి ,వెలిగిన నుడి ,నేర్చిన నుడి ,గుండె లోతుల నిలిచిన నుడి, మన అమ్మనుడి, అన్ని భాషల కన్నా అమ్మనుడి గొప్పది. దానిని గౌరవించాలి .నేర్చుకోవాలి, తన వారికి నేర్పాలి ,అప్పుడే ఆ భాష అంతరించిపోకుండా ఉంటుంది.


అయితే మనదేశంలో ఎక్కువగా తెలుగు ప్రాంతాలలో డాలర్లు మోజుతో ,ఇంగ్లీషు డాబుసరితో మాతృభాషను విస్మరించి , ఆంగ్లమాధ్యమం వైపు తల్లిదండ్రులు పరిగెడుతున్నారు, పిల్లలను బలవంతంగా పరిగెత్తిస్తున్నారు.

పరభాష లు నేర్వడం తప్పుకాదు. ముందు కనీసం ప్రాథమిక విద్య అయిన అమ్మనుడిలో ఉండాలి. ఎందుకంటే అమ్మనుడిలో విద్యార్థికి( నేర్వరి) పాఠము సులభంగా అర్థమవుతుంది. తన భాషలో చదివితే ,ఎక్కువ అవగాహనతో వివరణ అవుతుంది.

మాతృభాష గొప్పతనాన్ని గురించి, చదువు మాతృభాషలో ఉంటే ఎంత ఉపయోగకరమో ,విద్యార్థికి ఎంత  వికాసవంతంగా ఉంటుందో, ప్రముఖులు గాంధీజీ ,రవీంద్రనాథ్ ఠాగూర్ ,నేతాజీ ,స్వామి వివేకానంద ఎందరో మహానుభావులు వివరించారు. మన దురదృష్టం అవన్నీ చెవిటి వాడి ముందుఊదిన శంఖములా అయిపోయాయి .ఇప్పుడు చాలామంది ఇంగ్లీష్ మీడియం పిల్లలను పరిశీలిస్తే ,అటు ఇంగ్లీషు రాదు, ఇటు తెలుగు రాదు. ఇప్పటి ప్రభుత్వాలు కూడా తెలుగు భాషను తమ ఓట్ల కోసం, రాజకీయం కోసం వాడుకుంటూ ,అమ్మనుడికి వెన్నుపోటు పొడుస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఇలాగే సాగితే ఐక్యరాజ్యసమితి వారు ఈ మధ్య ప్రకటించిన ఒక నివేదిక ప్రకారం రాబోయే 30 సంవత్సరాలలో మరుగయ్యే భాషలలో తెలుగు ఒకటనే మాట నిజం కాబోతుందేమోనని అనుమానంగా ఉంది. అవును నిజమే, ఇప్పటి పిల్లలలో 90% ఇంగ్లీష్ మాద్యములో చదువుతున్నారు ,వారికి తెలుగు రాయడం, చదవడం రాదు. ఇక తెలుగు అక్షరాలతో పనేముంది. ఇలాగే సాగితే ముందు తరాలు వారు తెలుగు అక్షరాలను మ్యూజియంలో (ముట్టు చూపులి )లో చూడవలసి వస్తుంది .


అందుకే ఆంగ్ల ఉద్యోగి మేకలే గొప్పదైన హిందూ సంస్కృతిని ,జాతిని చూసి, వీరిని జయించడం చాలా కష్టమని భావించి ,ఈ జాతిని నాశనం చేయాలంటే ,మొదటగా వారి మాతృభాషను నాశనం చేస్తే చాలు అని చెప్పాడు. అందుకే ఇంగ్లీషును ,వారి మతాన్ని జనంపై రుద్దారు. ఫలితం చూస్తూనే ఉన్నాము.

మాతృభాష అమ్మ పాలు లాగా మధురమైనది. పరభాష డబ్బా పాలవలే కల్తీకి అవకాశం ఉంటుంది. మన మాతృభాష కళ్ళు ఉంటుంది .పరభాష కళ్ళజోడు వంటిది .కళ్ళుంటే కదా కళ్ళజోడుకుతో పని. కనుక మనం మొదటగా అమ్మనుడిని కాపాడుకోవాలి ,మాతృభాషను ప్రేమించాలి, పర భాషలను ఆదరించాలి ,అవసరానికి పరభాషను నేర్చుకోవడంలో తప్పేమీ లేదు .మనం ఇతర భాషలకు వ్యతిరేకం కాదు .అలాగే ఏదైనా ఒక కొత్త మాట ఇతర భాషలు నుండి వస్తే దానికి మొదటగా మన అమ్మ నుడి నుండే కొత్త మాటను పుట్టించాలి. ఆ పనిని హిబ్రూ ,చైనా,జపాన్ ,కొరియా , తమిలులు ,కన్నడిగులు చేస్తున్నారు. అయితే మన తెలుగువారు ఇంగ్లీష్ మాటను సంస్కృతికరణ చేస్తున్నారు. చక్కగా ఆలోచిస్తే అచ్చ తెలుగులో మాటలను పుట్టించవచ్చు.

ఈమధ్య తెలుగు భాషా పరిరక్షణకు, అనేక వేదికలు ,సంస్థలు ముందుకు వచ్చి ఎంతో కొంత కృషి చేస్తున్నారు .అయితే తెలుగు నాట జరిగిన, జరుగుతున్న అనేక ప్రపంచ తెలుగు మహాసభలలో ఎలాంటి పురోగతి లేదని భావించవచ్చు. వారు కేవలం తీర్మానాలకు ,ఒకరిపై ఒకరు పొగడ్తలతో వేదికను అలంకరిస్తున్నారు .నిజానికి ఎవరు ప్రజలతో మమేకమై ,ప్రజా ఉద్యమాలకు బాసటగా నిలబడి ఉద్యమించడం లేదనీ,అటువంటప్పుడు తీర్మానాలు, ప్రణాళికలు కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయని  తెలుగు భాషావేత్తల అభిప్రాయం. ఏది ఏమైనా ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సందర్భంగా ,మనందరం ఒకసారి మాతృభాష గురించి మీకు మాట్లాడుకోవడానికి అవకాశం వస్తుందని పరస్పర భావాలను  ఒకరినొకరు పంచుకోవడానికి సహకరిస్తుoదని అనడంలోఎలాంటి అనుమానం లేదు.


అయితే ఇప్పటికీ ,కొన్ని దేశాలలో మొదలిడు చదువు (ఎల్కేజీ) నుండి పెనుపాటి చదువు ( పీజీ) వరకు

సాంకేతిక, వైద్య చదువులుఅన్నీ కూడా వారి మాతృభాషలోనే జరుపుతున్నారు.

కనుక మనమంతా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సందర్భంగా అమ్మనుడిని కాపాడుకోవాలి. అలాకాకుండా పరభాష వ్యామోహంలో పడితే, పరభాషను నేర్చి ,దాని వెంట ప్రాకులాడితే ,అనుకోకుండా ఆ భాషతో పాటు, ఆ భాష వారి సంస్కృతి ,సాంప్రదాయాలు మెల్లగా మనలోనికి ప్రవేశిస్తాయి. ఒకసారి చూస్తే మనకే అర్థమవుతుంది. ఇంగ్లీషు ప్రభావం వలన ,వారి మతము ,వారి తిండి ,వారి కట్టుబొట్లు ,వారి సంస్కృతి సాంప్రదాయాలు అన్ని వచ్చి మన సంస్కృతినీ  పక్కకు నెట్టి ,అవి ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి .నిజమా !కాదా!?


కాబట్టి మన జాతి మన సంస్కృతి నిలవాలంటే, మన మాతృభాషలను నిలబెట్టుకోవాలి, మాతృభాష  నిలబడాలి, కలబడాలి, కనబడాలి, వినబడాలి అప్పుడే ఆ భాష వలన జాతి, జాతి వలన దేశము ఒక విశిష్టమైన గౌరవాన్ని పొందుతాయి. జై మాతృభాష. జై జై అమ్మనుడికి కైమొడ్పులు.

*రాఘవ మాస్టారు కేదారి*

పండితుడు

 శ్లోకం:☝️

*ప్రవృత్తవాక్ విచిత్రకథ*

 *ఊహవాన్ ప్రతిభానవాన్ l*

*ఆశు గ్రంధస్య వక్తా చ*

 *యః స పండిత ఉచ్యతే॥*


భావం: మంచి మాటకారి, తన ప్రసంగ చతురతతో ప్రజలను ఆకర్షించగల వ్యక్తి, గ్రంథాలలో విషయాలను త్వరగా గ్రహించి వివరించగల వ్యక్తి, తార్కికంలో నైపుణ్యం ఉన్న వ్యక్తిని పండితుడు అంటారు.

శివయ్య ఇచ్చిన

 🌹🌹శివయ్య    ఇచ్చిన🌹🌹🌹

🌹🌹 శరీరం తిప్పలు, 🌹🌹🌹

☘️☘️☘️☘️🕉️☘️☘️☘️☘️

సూర్యరశ్మి అనేక ప్రదేశాల్లో కిరణాలు ప్రసరింప చేస్తున్న దాని కాంతి నీరున్న చోట ఎక్కువగా అంతకన్నా ఎక్కువ అద్దంలోనూ ప్రతిబింబిస్తుంది! అది నీటి, అద్దం గొప్పదనం కాదు! సూర్యభాగవానుడి గొప్పదనం!  అదే విధముగా నీకు కుదిరితే ఒకరి సంతోషానికి కారణం కావాలి! కాని ఒకరి భాధకు కాని కన్నీళ్లకు కాని కారణం కాకు! ఎందుకంటే అది ఎప్పుడైనా తిరిగి నిన్ను కన్నీళ్లకు గురించేస్తుంది ప్రతి మనిషి మనకంటే, ఉన్నవాళ్ళతో పోల్చుకునే దానికంటే, మనకంటే లేనివారితో పోల్చుకొని తృప్తి పడితే జీవనం శాంతంగా సాగిపోతుంది! మానవ శరీరంలో అన్ని వ్యాధులకన్నా అహంకారం,

తొందరపాటు తనం,మనిషిని

ఇది సోకిన వారు వాళ్ళు సంతోషంగా ఉండలేరు! మానసికంగా కుంగిపోయి, ఎదుటివారిని కూడ సంతోషంగా ఉండనివ్వరు!

ఒక్క విషయం మనం చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగ పదితుంది అలాగే మనo చేసిన మంచి పనికూడా ఏదో ఒక రోజు మనకు ఉపయోగ పడుతుంది! చివరికి చెడిపోయిన గడియారం కూడ రోజుకి రెండు సార్లు కరెక్ట్ సమయాన్ని చూపిస్తుంది! అలాగే ఎన్ని తెలివి తేటలు ఉన్న పరమేశ్వరుడు ఉత్తమ జన్మ ఇచ్చినందుకు సార్ధకత చేసుకొని, పరమేశ్వర లీలలు ఎలా ఉంటాయంటే అన్ని ఉన్న వానికి దురాశని ఇచ్చి, మధ్యతరగతి వానికి ఆరాటన్ని ఇచ్చి ఏమి లేని వారికి అత్మాభి మానాన్ని ఇచ్చి మాయ లీలలు, లీలగా చూపించే శివయ్య మా స్థితి గతులు మార్చవయ్య! శివయ్య నీవిచ్చే ధైర్యం అంటే ప్రమాదాన్ని లెక్క చేయక పోవడం కాదు! ప్రమాదాన్ని సరిగా మేము అంచనా వేయలేక పోవడం,

అధికమించక పోవడం!


సర్వం    శివార్పణ      మస్తు


కాశీనాధుని సుబ్రహ్మణ్యం

సిద్ధాంతిగారు, విజయవాడ

🌹🌹🌹🌹🕉️🌹🌹🌹🌹

☘️☘️☘️☘️🕉️☘️☘️☘️☘️

భగవద్గీత



🌹భగవద్గీత🌹               


మూడవ అధ్యాయము కర్మయోగము నుంచి 8 వ శ్లోకము. పదచ్ఛేద , టీకా , తాత్పర్య సహితముగా.

    

నియతం కురు కర్మ త్వం 

కర్మ జ్యాయో హ్యకర్మణః ౹

శరీరయాత్రాఽపి చ తే 

న ప్రసిద్ధ్యేదకర్మణః ll(8)


నియతమ్ , కురు , కర్మ , త్వమ్ , 

కర్మ , జ్యాయః , హి , అకర్మణః ౹

శరీరయాత్రా , అపి , చ , తే , 

న , ప్రసిధ్యేత్ , అకర్మణః ౹౹(8)


త్వమ్ = నీవు ;

నియతమ్ = విధ్యుక్తమైన ;

కర్మ = కర్తవ్యకర్మను ;

కురు = చేయుము ;

హి = ఏలననగా ;

అకర్మణః = కర్మలనాచరింప కుండుట కంటె ;

కర్మ = కర్మలను చేయుటయే ;

జ్యాయః = శ్రేష్ఠము ;

చ = మఱియు ;

అకర్మణః = కర్మలనాచరించక పోవుటచే ;

తే శరీరయాత్రా అపి  = నీ శరీరనిర్వహణ కూడా ;

న ప్రసిద్ధ్యేత్ = కొనసాగదు .


తాత్పర్యము :- నీవు శాస్త్రవిహిత కర్తవ్య కర్మలను ఆచరింపుము. ఏలనన కర్మలను చేయకుండుట కంటెను చేయుటయే ఉత్తమము. కర్మలను ఆచరింపనిచో నీ శరీర నిర్వహణము కూడా సాధ్యము కాదు. (8)   


      ఆత్మీయులు అందరికి శుభోదయం

               Yours Welwisher

Yennapusa Bhagya Lakshmi Reddy 

Advocate AP High Court Amaravathi