22, జూన్ 2023, గురువారం

మచ్చల నివారణ

 శరీరం పైన ఏర్పడు మచ్చల నివారణ కొరకు సులభ యోగాలు  -


       శరీరం పైన వివిధ కారణాల వలన అనేక రకాలైన మచ్చలు ఏర్పడును . అటువంటి మచ్చలు కొరకు ఇప్పుడు నేను చెప్పబోవు యోగాలలో మీకు ఏది సులభముగా అనిపిస్తే దానిని పాటించి సమస్య నుంచి బయటపడగలరు.


 మచ్చల నివారణాయోగాలు  -


 *  పచ్చి బొప్పాయిని గిల్లినప్పుడు వచ్చే పాలను రాయుచున్న మచ్చలు తగ్గును.


 *  అవిసె గింజల నూనెను ప్రతిరోజు రెండుపూటలా మచ్చల పైన రాయుచున్న మచ్చలు మాయం అగును.


 *  గోధుమపిండిని పులియబెట్టిన కడుగులో కలిపి మచ్చలపైన ప్రతినిత్యం పూయుచున్న మచ్చలు హరించును .


 *  జీడిమామిడి గింజల పైపెచ్చులు నలగగొడితే వచ్చే నూనెని మచ్చలపైన రాయుచున్న త్వరగా మచ్చలు హరించును .


 *  కొంచం నీటిలో పసుపు వేసి చిక్కగా కలిపి రోజూ రాయుచున్న శరీర మచ్చలు తగ్గును.


 * మంచి నాణ్యమయిన కుంకుమపువ్వు నీటితో తడిపి మచ్చల పైన పూయుచున్న మచ్చలు తగ్గును.


 *  ప్రతినిత్యం జాజికాయ అరగదీసి ఆ గంధాన్ని రెండుపూటలా మచ్చల పైన రాయుచున్న మచ్చల నివారణ అగును.


 *  నేలతంగేడు వ్రేళ్ళను తీసుకొచ్చి నీడలో ఎండించి ఎండిన వేళ్ళను నీటితో అరగదీయగా వచ్చిన గంధాన్ని మచ్చలపైన రెండుపూటలా రాయుచున్న మచ్చలు నివారణ అగును.


         నేను పైన చెప్పిన యోగాలు మచ్చల నివారణలో అత్యద్భుతముగా పనిచేయును కొన్ని రొజులపాటు విడవకుండా పాటించండి. మచ్చలు పోవడం కొంచం కష్టసాధ్యముగా ఉండును. పైన చెప్పిన ఔషధయోగాలలో మీకు సులభమయినది విడవకుండా వాడండి. తప్పక ఫలితాన్ని పొందుతారు.


     మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


    

హర్షంబొప్పగ

 శా.

హర్షంబొప్పగ నార్ద్ర వ్రాలె; ధరణిన్ వ్యాపించె సౌగంధ్యమున్;

కార్షవ్రాతము విత్తె; వేసవియు తా కాఠిన్యతన్వీడెగా; 

మర్షంబుప్పతిలంగ మారుతము సమ్మానించె దాక్షిణ్యమై;

వర్షాకాలదురంతహేల రమయై వచ్చెం ధరామార్గమున్ 


*శ్రీశర్మద* 

8333844664

భూమిపై 19 గంటలు మాత్రమే

 ఒకప్పుడు భూమిపై 19 గంటలు మాత్రమే ఉన్నాయనే సంగతి మీకు తెలుసా..


సుమారు ఒక బిలియన్ సంవత్సరాల క్రితం, భూమి( Earth ) యొక్క భ్రమణం వేగవంతంగా మారిందని, దీనివల్ల మన రోజుల వ్యవధి తక్కువ అయిందని తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

ఆ సమయంలో చంద్రుడు భూమికి దగ్గరగా రావడం, భూమిపై బలమైన గురుత్వాకర్షణ ప్రభావం చూపడం వల్ల ఇది జరిగిందని వారు అభిప్రాయపడ్డారు.

సాధారణంగా, చంద్రుడు భూమి నుంచి నెమ్మదిగా కదులుతాడు, కానీ కోట్ల సంవత్సరాల క్రితం అది భూమికి దగ్గరగా వచ్చింది.తత్ఫలితంగా, భూమి భ్రమణం వేగంగా మారి.

ఇప్పుడు ఒక రోజులో ఉన్న 24 గంటలకు బదులుగా అప్పుడు 19 గంటలు మాత్రమే ఉన్నాయని శాస్త్రవేత్తలు వివరించారు.

కాలక్రమేణా భూమి భ్రమణం ఎలా మారుతుందో చాలా ఏళ్లుగా శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు.ఇక్కడ భూమి భ్రమణం అంటే తన చుట్టూ తాను తిరిగే కాలం.ఈ భ్రమణం ఎంత వేగంగా జరిగితే అంత తక్కువ సమయంలో రోజు గడిచిపోతుంది.

అయితే గత బిలియన్ సంవత్సరాలలో, భూమిపై రోజుల వ్యవధి ప్రతి సంవత్సరం ఒక చిన్న మొత్తంలో పెరుగుతూ వస్తోందని వారు ఈ అధ్యయనంలో కనుగొన్నారు.అయితే, కొంతమంది శాస్త్రవేత్తలు మాత్రం భూమి భ్రమణం ప్రారంభం కావడానికి ముందు అది స్థిరమైన వేగంతో ఉండేదని చెబుతున్నారు.

భూమి భ్రమణం( Earth Rotation ), భూమిపై కాలం గురించి పరిశోధించడానికి, రాస్ మిచెల్, ఉవే కిర్షెర్ అనే ఇద్దరు భూభౌతిక శాస్త్రవేత్తలు భూమి చరిత్ర నుంచి భిన్నమైన ఆధారాలను పరిశీలించారు.గ్రహం చలించటం, వంగిపోవడం వంటి వాటి వల్ల భూమిపై వచ్చిన ఉష్ణోగ్రత మార్పుల రికార్డులను కూడా వారు అధ్యయనం చేశారు.

వాతావరణంలో ఆక్సిజన్ స్థాయిలలో ( Oxygen levels )పెద్ద పెరుగుదల వంటి భూమిపై కొన్ని పెద్ద మార్పుల తర్వాత ఈ స్థిరమైన భ్రమణం జరిగింది.ఈ పెరుగుదల ఓజోన్ పొరను సృష్టించింది.

ఓజోన్ పొర సూర్యుని హానికరమైన కిరణాల నుండి మనలను రక్షిస్తుంది.ఈ కాలం తర్వాత, భూమి భ్రమణం మళ్లీ మందగించడం ప్రారంభించింది.

⚜ శ్రీ పట్టాభిరామస్వామి ఆలయం

 🕉 మన గుడి : 




⚜ కడప జిల్లా : చల్లగిరిగెల


⚜ శ్రీ పట్టాభిరామస్వామి ఆలయం


💠 ఈ ఆలయంలో శ్రీ రామచంద్రస్వామి పద్మాసనంలో ఉండి , కోదండం లేకుండా, చిన్మయి ముద్రా ధ్యానంలో ఉన్మాడు.

సీతమ్మ వారు పద్మాసనంలో ఉండి పుష్పం పట్టుకొని ఉన్నారు.

లక్ష్మణస్వామి నిల్చుని కోదండం పట్టుకుని ఉన్నారు.

ఆంజనేయస్వామి ముని కాళ్లమీద కూర్చొని రెండు చేతులతో గ్రంథం పట్టుకుని సీతమ్మవారి  దగ్గర పడమటి ముఖంగా ఉన్నాడు .

ఇక్కడ రామచంద్రస్వామి ధ్యానం లో ఉన్నట్టు మరి ఎక్కడ లేరు .


💠 స్థలపురాణానికి వస్తే పరిక్షిత్తు మహారాజు కుమారుడు అయిన జనమేజయుడు ఇక్కడ వున్న సీతా లక్ష్మణ, ఆంజనేయ సమేత పట్టాభి రామచంద్రస్వామిని ప్రతిష్టించాడు.


💠 జనమేజయుడు తన తండ్రి పరిక్షిత్తు మరణానికి కారణమైన తక్షకుడనే పాము మీద కోపంతో సమస్త సర్పజాతిని అంతంచేసే సర్పయాగం చేసాడు.

అలా చేయడం వలన అమాయకులైన అనేక సర్పాలు ఆ యజ్ఞంలో పడి చావటం వలన జనమేజయ మహారాజుకు చాలా పాపం సంక్రమించింది.

బ్రాహ్మణుల సలహా ప్రకారం 101మందిరాలు స్థాపిస్తే సంక్రమించిన పాపానికి పరిహారం జరుగుతుందని తెలుసుకున్నాడు.


💠 ప్రతి దగ్గర తాను వుండడం కుదరని కారణాన ఆయన 101 భాణాలు వదిలి ఆయా ప్రదేశాలలో 101వైష్ణవ మందిరాలు బ్రాహ్మణ సహితుడై స్థాపించాడు.

అలా వెలసినదే చల్లగిరిగల తీర్థస్థలి.


💠 అయితే ఈ ప్రదేశంలోనే స్వామి వెలవడానికి వేరొక పౌరాణిక కారణం కలదు.

చల్ల అనగా మజ్జిగ, గిరి అనగా పర్వతం.

త్రేతాయుగ కాలమున ఈ పర్వత స్థానువులు ఎన్నో రమణీయమైన పుష్ప,ఫల భరితమైన వృక్షాలతో శోభాయమానంగా వుండి ఆకర్షణీయంగా వుండేవి.

వనవాస కాలమున రామచంద్రుడు సీతా, లక్ష్మణ సమేతుడై ఇక్కడ సేదతీరి,దప్పక గొని చల్ల(మజ్జిగ) త్రాగి దప్పిక తీరి పూర్ణసంతుష్టుడయ్యాడని స్థలపురాణం చెబుతోంది.


💠 ఇంకా ఇక్కడ రామానుజాచార్యులు, ఇతర ఆళ్వారులు ఇక్కడకు వచ్చి స్వామిని కీర్తించారని ఇక్కడ వున్న ఆళ్వారులు సన్నిది తెలుపుతోంది.

ఎక్కువమందికి తెలియక పోయినా ఈ స్థలం ఒంటిమిట్టకంటే ప్రాశస్త్యాన్ని చెందినదని అక్కడ నుంచి విచ్చేసిన పూజారులే అంగీకరించారు.


💠 బద్వేలు నుంచి చల్లగిరిగెలకు 25 కిమీ దూరం ,

పోరుమామిళ్ల నుంచి చల్లగిరిగెలకు 15 కిమీ దూరం ,

కడప నుంచి చల్లగిరిగెల 

కు 87 కిమీ.

ఇంకొక డాక్టరుని చూస్తా

 ఇంకొక డాక్టరుని చూస్తా 

ఒక పెద్దాయనకు రీనల్ ఫెయిల్యూర్,డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ రెటినోపతి, కార్డియాటిక్ మిసఫంక్షన్, లివర్ సోరోసిస్, మొదలైన వ్యాధులతో ఒక పెద్ద హాస్పిటల్లో చేరాడు,  ఆయన చుట్టూ, కొడుకులు, కూతుళ్లు, మనవలు, మనవారాళ్ళు అందరు ఆయనకు సేవలు చేయటానికి  వచ్చారు. ఒక్కొక్క డాక్టరు వచ్చి ఒక్కొక్క రోగానికి చికిత్స చేస్తూ వున్నారు. ఎవరు ఏ మందులు ఇస్తున్నారో పాపం అక్కడ వున్న కొడుకులకు తెలియటంలేదు.  ఏ డాక్టర్ ఏ మందులు, ఇంజక్షన్లు తెమ్మంటే అవి తెచ్చి ఇస్తున్నారు.  అప్పటికే హాస్పిటల్ బిల్లు డాక్టర్ల బిల్లులు లక్షలు దాటాయి.  ఎప్పుడు ఏ క్షణాన ఏ వార్త వినవలసి వస్తుందో నని భయం భయంగా అందరు ఎదురు చూస్తూవున్నారు. 

ఆయనను చూసే అందరు డాక్టర్లు మీటింగు పెట్టుకొని చివరకు ఒక నిర్ణయానికి వచ్చారు అదేమిటంటే ఆ పెద్దాయన ఇంకొక గంట లేక గంటన్నర మాత్రం బతకగలడు అనే ఉమ్మడి నిర్ణయానికి వచ్చి ఆ రోగితో వచ్చిన కొడుకులకు విషయం చెప్పారు. మీరు కావాలంటే అయన ఎవరినయిన చూస్తానంటే పిలిపించండి అని చెప్పారు.  చిన్నగా ఆ వార్త ఆ పెద్దాయన కొడుకు  నాన్న నీవు ఇంకొక గంట మాత్రం బ్రతుకుతావు నీవు ఎవరినయినా చూడదలుచుకుంటే చెప్పు పిలిపిస్తాం అని అన్నారు.  ఆ మాట విన్న ఆ పెద్దాయన ఏ మాత్రం బెదరకుండా చిరునవ్వుతో నాయనా "నాకు ఇంకొక డాక్టరుని చూడాలని ఉందిరా" అని అన్నాడు. ఇది చదవటానికి నవ్వు వచ్చేదిగా  ఉంటుంది. కానీ ప్రతి మనిషి అలవరచుకోవలసిం లక్షణం అదే అదేమిటో చూద్దాం. 

ప్రతి మనిషి రెండిటితో ఎప్పుడు ముడివేసుకుని ఉంటాడు అదేమిటంటే సుఖము, దుఖ్ఖము. మనిషి ఆలోచనలు వాటి ఫలితాలు ఎప్పుడు ఈ రెండిటిలో ఏదో ఒకదానికి తావు ఇస్తాయి. అది యెట్లా అంటే నిన్ను ఎవరైనా మెచ్చుకొని, పొగిడారనుకో అప్పుడు నీకు ఎంతో సంతోషం కలుగుతుంది అంటే అది సుఖం అన్న మాట.  అదే నిన్ను ఎవరైనా దూషించినా, కించపరచినా అవమానపరచిన వెంటనే నీకు కోపం వస్తుంది దాని పర్యవసానమే దుఃఖం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి మనిషి సదా ఈ రెండు మానసిక స్థితుల మధ్యనే ఉగిసలాడుతూ ఉంటాడు. దానివలన అనవసరపు ఆలోచనలు చివరకు అనేకవిధాల అనారోగ్య సమస్యలు వస్తూవుంటాయి. ఈ రెండిటిని సమతుల్యం చేయగల వానిని స్థితప్రగ్న్యుడు అంటారు.  ప్రతి సాధకుడు స్థితప్రజ్ఞత సాదించాలి. 

ఒకమనిషి ఒక గంటలో చనిపోతాడు అని తెలిస్తే వెంటనే ఎంతో ఆందోళన భయం చెప్పలేని బాధ కలుగుతాయి.  కానీ స్థితప్రజ్ఞత కలిగినవాడు మాత్రమే సరైన నిర్ణయం తీసుకోగలరు అదే పైన పెద్దాయన నిర్ణయం.  ఇంతమంది డాక్టర్లు వైద్యం చేస్తున్న ఆయనకు స్వస్థతను చేకూర్చలేక పోయారు ఇంకొక డాక్టరు అయన ఆయనను బ్రతికిస్తాడనేది ఆశా వాదం. ప్రతి మనిషి ఆశావాదిగా మాత్రమే తన జీవితాన్ని గడపాలి.  అప్పుడే జీవితాన్ని సాపీగా ఎలాంటి ఒడిదుడుకులనేనా ఎదుర్కొని ముందుకు సాగగలడు. 

భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే చాలామంది సాధకులు ప్రారంభంలో నాకు ధ్యానం మీద మనస్సు లగ్నత కలగటం  లేదు నేను సాధనను కొనసాగించలేను అని చిన్న చిన్న అవరోధాలకు భయపడి సాధనను ప్రారంభంలోనే మానుకునే సాధకులు ఎందరో.  కానీ ఏ సాధకుడు అయితే ఎలాంటి అవరోధాన్ని అయినా ఎదుర్కొని ముందుకు సాగుతాడో అతనే మోక్షాన్ని పొందగలడు. 

మన మహర్షులు మనకు త్రివిధమైన అవరోధాలను తెలిపారు అవి 1) ఆద్యాత్మికం 2) అది భౌతికము 3) అధి దైవికము ఈ మూడు అవరోధాలను ఏ సాధకుడు అయితే ఎదుర్కొని తన సాధనను కొనసాగిస్తాడో ఆ సాధకుడు మాత్రమే మోక్షాన్ని చేరుకోగలడు. 

ఇప్పుడే దృఢ సంకల్పం తీసుకో ఎలాంటి అవరోధాలు ఎదురైనా నేను నా సాధనను నిలిపి వేయను. ప్రతి నిత్యం నేను నా మనస్సును పరమేశ్వరుని మీదనే నిలుపుతాను.  ఎట్టి పరిస్థితిలోకూడా నేను నా దృష్టిని ఈశ్వరునిమీద నుంచి మరల్చను.  నేను అరిషడ్వార్గాన్ని పూర్తిగా నా స్వాధీనంలో ఉంచుకుంటాను.  ఐహికమైన ఎటువంటి ప్రలోభాలకు నేను  లొంగను. అనే దృఢచిత్తంతో వున్న సాధకునికి మోక్షము కారతలామలకాలము అవుతుంది ఇది సత్యం. 

సాధకుడు ముందుగా దేహ వ్యామోహాన్ని వదలాలి అప్పుడే సాధనలో ముందుకు వెళ్లగలడు.  

 ఓం తత్సత్

ఓం శాంతి శాంతి శాంతిః

ఇట్లు 

మీ భార్గవశర్మ

పౌరోహిత్యం

 పౌరోహిత్యం రజనిచరితం గ్రామణీత్వం నియోగమ్ 

శ్లో II

పౌరోహిత్యం రజనిచరితం గ్రామణీత్వం నియోగమ్ 

మాఠాపత్యం హ్యనృతవచనం సాక్షివాదః పరాన్నమ్ 

బ్రహ్మద్వేషః ఖలజరతిః ప్రాణినాం నిర్దయత్వం,

మాభూ దేవం మమ పశుపతే జన్మజన్మాంతరేషు.


ఓ పశుపతీ ! పౌరోహిత్యము, జాగరణము, గ్రామాధిపత్యము, నియోగము, మఠాధిపత్యము, అసత్యవాదిత్వము, సాక్షిగ బోవుట, పరాన్నభోజనము, బ్రాహ్మణ ద్వేషము, దుష్టసాంగత్యము, నిర్దయత్వము - యివి నాకు జన్మజన్మాంతరములకూ కలుగనీయవద్దు, స్వామీ !

దీనిని బట్టి చూస్తే మనం ఎంతపాపము చేస్తున్నామో......

అరుచుకుంటున్నారు

 ఒక రోజున ఒక సాధువు తన శిష్యులతో కలిసి గంగానది వద్దకు స్నానం చెయ్యడానికి వెళ్ళేడు.


      అక్కడ ఒక కుటుంబంలోని సభ్యులు కొంతమంది కోపంతో ఒకరిపై ఒకరు అరుచుకుంటున్నారు. 

ఆ సాధువు తన శిష్యులవైపు చూసి నవ్వుతూ వారిని ఇలా అడిగేడు.  

“కోపంలో ఉన్నప్పుడు మనుషులు ఒకరిపై ఒకరు ఎందుకు అరుచుకుంటారు?” ఒక్క క్షణం ఆలోచించిన తరవాత ఆ శిష్యులలో ఒకడు ఇలా సమాధానం చెప్పేడు, 

“మనం సహనాన్ని కోల్పోవడం వల్ల అరుస్తుంటాము”.  

“కాని మనుషులు పక్కనే ఉన్నప్పుడు అలా అరవలసిన అవసరం ఏముంది? 

మెల్లగా పక్కనే ఉన్నవాళ్ళకి నెమ్మదిగా చెప్పవచ్చు కదా” అన్నారు సాధువు.  మిగిలిన శిష్యులు కూడా వారికి తోచిన విధంగా సమాధానాలు చెప్పేరు, 

కాని ఎవరుచెప్పిన అభిప్రాయము సంతృప్తికరంగా లేదు.  

చివరకు సాధువు ఇలా వివరించేరు.  

ఇద్దరు వ్యక్తులు ఒకరిపట్ల ఒకరు కోపంగా ఉన్నప్పుడు వాళ్ళ హృదయాలు చాలా దూరం అయిపోతాయి. ఆ దూరాన్ని అధిగమించడం కోసం, వాళ్ళకి వినిపించడంకోసం అలా గట్టిగా అరుచుకుంటూ ఉంటారు. కోపం ఎక్కువయిన కొద్దీ తమ మధ్య పెరుగుతున్న దూరం కారణంగా మరింత గట్టిగా అరుచుకుంటారు.  

అదే ఇద్దరు వ్యక్తులు ప్రేమగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది?  

వాళ్ళు ఏమాత్రం అరుచుకోకుండా ఎంతో మెల్లగా, మృదుమధురంగా మట్లాడుకుంటూ ఉంటారు, 

ఎందుకంటే వారి హృదయాలు ఎంతో దగ్గరగా ఉంటాయి.  

కనుక ప్రేమలో ఉన్నప్పుడు మనుషుల హృదయాల మధ్య దూరం చాల తక్కువగా, అసలు దూరమే లేనట్లుగా ఉంటుంది.  

ఆ సాధువు తన శిష్యులకు ఇంకా ఈ విధంగా వివరించేరు.  

మనుషులు ఒకరినొకరు గాఢంగా ప్రేమించినప్పుడు ఏం జరుగుతుంది? 

వాళ్ళు మాట్లాడరు, ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటూ చాలా ప్రేమగా దగ్గరవుతారు. 

చివరకు వాళ్ళ్ళకు గుసగుసలతో కుడా అవసరం లేకుండా  ఒకరి కళ్ళలో ఒకరు కళ్ళు పెట్టి చూసుకుంటూ చూపులతోనే మాట్లాడుకుంటారు. 

అంతే ఆవిధంగా ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నప్పుడు వారి హృదయాలమధ్య అసలు దూరమే లేకుండా దగ్గరవుతాయి.  

ఆ సాధువు తన శిష్యులతో ఇంకా ఈ విధంగా అన్నాడు.  

“కాబట్టి మీరు వాదించుకునేటప్పుడు కోపంతో మీ హృదయలను దూరం చేసుకోకండి. 

మనుషుల మధ్య దూరం పెరిగే విధంగా మాట్లాడకండి, 

లేకపొతే ఆ దూరం ఎప్పటికీ దగ్గర కాలేనంతగా పెరిగిపోతుంది.”  

కోపం వచ్చినపుడు మాట్లాడకుండా మౌనంగా ఉండడం ఉత్తమమైన పద్ధతి. అటువంటి కోపంలో మట్లాడే మాటలు అవతలి వ్యక్తి హృదయంపై చెరగని ముద్ర వేస్తాయి. కోపం మనల్ని మనకి ప్రియమైన వారి నుండి దూరం చేస్తుంది.

ముక్తిని పొందుదాం!*

 

           *ముక్తిని పొందుదాం!*

                  ➖➖➖✍️


*ప్రతి జీవుడు తాను తల్లిగర్భములో ఉన్నప్పుడు ఏడవ మాసములో ఉన్నప్పుడు తనకు పూర్వజన్మ స్మృతులు పూర్తిగా గుర్తుకు వస్తాయి. తాను గత జన్మలలో భగవంతుణ్ణి సేవించకపోవడము వలననే ఇప్పుడు మరోసారి తల్లిగర్భములోనికి ప్రవేశించవలసి వచ్చిందని గుర్తిస్తాడు.*


*గర్భములో నరకయాతన ఉంటుంది. శిశువు తలక్రిందులుగా వ్రేలాడదీయబడి కదలాడానికి కూడా చోటు ఉండదు. అనేక క్రిములు కరుస్తూ ఉంటాయి .చర్మము ఏర్పడదు. తల్లి ఏవైనా కారము, ఉప్పు అధికముగా తిన్నట్లైతే వెంటనే గర్భములోని శిశువు ను బాధిస్తుంది. మలమూత్రాదులు త్రాగవలసి వస్తుంది. గర్భములో భరించరాని దుర్వాసన ఉంటుంది. ఇదంతా భరించరాని నరకము. మనమందరమూ ఈ గర్భస్త నరకాన్ని అనుభవించినవారమే.* 


*గర్భస్థ స్థితిలో జీవుడి పై మాయా ప్రభావము ఉండదు.  అప్పుడు జీవుడికి కృష్ణభగవానుడు గుర్తుకు వస్తాడు ."హే కృష్ణా నన్ను ఈ ఒక్కసారి ఈ గర్భ నరకములోనుంచి బయటపడవేయమని, తాను బయటకురాగానే నిరంతరం భగవంతుణ్ణి సేవిస్తానని వేడుకుంటాడు".  కానీ తల్లి గర్భములోనుంచి బయటపడగానే మాయా ప్రభావంలో పడి భగవంతుణ్ణి మరచిపోతాము.*


*ఈ వివరణ శ్రీమద్భాగవతం లో కపిలభగవానుడు తన తల్లి దేవహుతికి వివరించడము జరిగింది. కావున  మరోజన్మ ఉండకూడదని, మరోసారి గర్భస్థ నరకబాధను అనుభవించకూడదని మనము గుర్తించి శ్రీకృష్ణ భగవానుని నామాన్ని శ్రవణం చేస్తూ,  కీర్తిస్తూ, స్మరణం చేయడం వలన మన మరణ సమయంలో శ్రీకృష్ణభగవానుని స్మరించే అవకాశం ఉంటుంది.  మరణ సమయంలో శ్రీకృష్ణభగవానుని స్మరించినవారికి శాశ్వత ముక్తి లభిస్తుంది.*


*మనకు కలిగే నిజమైన దుఃఖములు - జన్మ, మృత్యువు, ముసలితనము, అనారోగ్యములు.* 


*మనము ఈ దుఃఖముల నుండి శాశ్వతమైన ముక్తి మార్గము గురించి ఆలోచించాలి. అసలు ఎందుకు మనకు ఇష్టం లేకపోయినా మనము దుఃఖబాధలకు గురవుతున్నామో ఆలోచించాలి.*


 *మనము గర్భావస్థలో ఉన్నప్పుడు భగవంతునికి ఇచ్చిన వాగ్ధానాన్ని మనము పాటించకపోవడం వల్లనే మనము మళ్లీ మళ్లీ జన్మలను పొందుతున్నాము. మనము దుఃఖములకు గురవుతున్నాము. మనము మరోసారి జన్మను పొందకపోవడమే మన అన్ని దుఃఖములకు శాశ్వత పరిష్కారం. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం మనము భగవంతుని నామాన్ని జపించడమే.  ఇదే  మన అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారం .*


*భగవంతునికి, భగవంతుని నామానికి బేధము లేదు.*


*కలియుగంలో ముక్తికి ఏకైక మార్గం హరినామ స్మరణ.*


*శ్రీ చైతన్య మహా ప్రభువు మనలను హరేకృష్ణ మహామంత్రము జపము, కీర్తనలు చేయమని సూచించారు. శ్రీకృష్ణభగవానుని ప్రేమతో భక్తియుతసేవలో పాల్గొనమని సూచించారు.* 9440652774.


*మహామంత్రం:*


*"హరేకృష్ణ   హరేకృష్ణ   కృష్ణకృష్ణ హరేహరే!* 

*హరేరామ హరేరామ రామరామ హరే హరే !! "*


*నిరంతరం జపం చేద్దాం. ముక్తిని పొందుదాం. శాశ్వతమైన ఆనందలోకమైన గోలోకంలో శాశ్వతంగా  నివసించే ప్రమోషన్ పొందుదాం.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺

గృహస్థాశ్రమమునే ఆశ్రయించి వుందురు

 శ్లోకం:☝️

*యథా వాయుం సమాశ్రిత్య*

  *సర్వే జీవంతి జంతవః l*

*తథా గృహస్థమాశ్రిత్య*

  *వర్తంత ఇతరాశ్రమాః ll*


భావం: ఎలా సర్వ జీవులు వాయువు నాశ్రయించి ప్రాణములతో నుంటూన్నవో అలాగనే అన్ని ఆశ్రమముల వారూ  గృహస్థాశ్రమమునే ఆశ్రయించి వుందురు. గృహస్తులే ఇతర (బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాస) ఆశ్రమముల వారందరినీ పోషించెదరని భావం.

చరిత్ర చెప్పిన సత్యం

 🙏🏻 *కామన్ సివిల్ కోడ్ ఎందుకు కావాలో ఒక చిన్న ఉదాహరణ తో చూద్దాం* 


.(ఉద్యోగ,ఆర్థికపరమైన) ది. దీని కన్నా ఇంకా ఎన్నో ముఖ్యమైన కారణాలు చాలా ఉన్నాయి. 

ఇక్కడ ఆనంద్  స్థానంలో ఏ వర్గం ఉందొ, భాషా అహ్మద్ స్థానం లో ఏ వర్గం ఉందొ ఊహించడం కష్టం కాదు

* **** *

ఇద్దరు

A:ఆనంద్ స్వామి  మరియు B:భాషా అహ్మద్

ప్రభుత్వ ఉద్యోగులు 

.

పక్క పక్కనే 

స్థలం కొని ఇళ్ళు కట్టుకుని నివసిస్తున్నారు.


 1970  లో ఇద్దరికి పెళ్లిళ్లు జరిగాయి.

ఆనంద్ స్వామి కి  1972 లో 1వ సంతానం, 1973 లో 2వ  సంతానం   మొత్తం ఇద్దరు పిల్లలు. ఆ తర్వాత  ప్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్.


భాషా అహ్మద్ కి 1972 లో1వ సంతానం

           1973 లో2

           1974 లో3

          1975 లో4వ

మొత్తం నలుగురు పిల్లలు.


1976 లో భాషా అహ్మద్  2 వ పెళ్లి చేసుకున్నాడు .         

   2 వ భార్యకు

            1977 లో1

             1978 లో2

             1979 లో3

              1980 లో4వ, మొత్తం 4 పిల్లలు

1982  లో మళ్ళీ 3 వ పెళ్లి

               1983 నుండి1987 వరకు ఇంకో 4 పిల్లలు


1988 లో 4 వ పెళ్లి  కేవలం 25సం౹౹ వయసు ఉన్న అమ్మాయి తో పెళ్ళి...

           1989 నుండి  1993 లోపు 3 గురు పిల్లలు..

4గురు భార్యలకు కలిపి మొత్తం 15 మంది సంతానం..


మంది ఎక్కువ అవడం తో పక్క పక్కనే ఉన్న వీరికి  ఇంటి గొడవలు. 

ఆనంద్ స్వామి తన స్వంత ఇల్లు అయినకాడికి బాషా ఆహ్మద్ కు అమ్మేసి వేరే చోటుకు షిఫ్ట్ ఆయ్యాడు.


2008 లో ఇద్దరూ రిటైర్ అయ్యారు.

ఇద్దరికీ పెన్షన్ వస్తోంది.

దురదృష్టవశాత్తు 202౦ లో ఇద్దరూ కరోనా తో చనిపోయారు


ఆనంద్ స్వామి భార్య కి పెన్షన్ వస్తుంది.


భాషా అహ్మద్ 4 గురు భార్యలకు పావు వంతున పెన్షన్స్ వస్తున్నాయి.

2022లో ఆనంద్ స్వామి భార్య పోయింది.

అదే సం౹౹లో భాషా అహ్మద్  మొదటి భార్య కూడా చనిపోయింది.

ఆనంద్ స్వామి  కుటుంబానికి పెన్షన్  ఆగిపోయింది. (పిల్లలు settled అవ్వడం వల్ల/మేజర్ అయితే)


కానీ భాషా అహ్మద్ మిగిలిన ముగ్గురు భార్యలకు(1,2,3వ) 1/3 వంతున పెన్షన్ వస్తుంది. ఇంకో 10 ఏళ్లకు భాషా అహ్మద్ 2 వ భార్య చని పోతుందనుకుంటే

మిగతా ఇద్దరికి 1/2  హాఫ్ పెన్షన్ ఆ తర్వాత

ఇంకో 10 ఏళ్లకు 3 వ భార్య పోతే

4 వ భార్య కు 100% పెన్షన్ వస్తూనే ఉంటుంది. ఈ నాలుగవ బార్య తన పెళ్లి నాటికి వయస్సు 25 yrs కాబట్టి ఇంకో 20 ఏళ్ళు ఆవిడకు  పెన్షన్ వస్తుంది (ప్రభుత్వ సొమ్ము)


ఇక్కడ ఆనంద్ స్వామి కుటుంబానికి 2025 లోనే పెన్షన్ ఆగిపోతుంది. కానీ భాషా అహ్మద్ ఫామిలీ కి 2050 తర్వాత కూడా పూర్తి పెన్షన్ వస్తుంది..

ఒకేసారి చేరిన ఇద్దరి ప్రభుత్వ ఉద్యోగుల మధ్యే ఇంత వ్యత్యాసం ఉంటే ఎన్ని వేల మంది భాషా అహ్మద్ లు ఈ దేశంలో  ఉద్యోగాల్లో ఉన్నారో ఎంత ప్రభుత్వ సొమ్ము (ప్రజల టాక్స్) తింటున్నారో ఊహించండి..

అంతేకాక భాషా అహ్మద్ కుటుంబ సభ్యులు ఇంకా జీవితంలో సెటిల్ కాలేదు కనుక వారి కుటుంబ సభ్యులకు నెలకి 25 కిలోలు చొప్పున 100 కిలోలు బియ్యం ఇతర రేషన్ ఉచితం.

ఇది కాక Govt schemes ద్వారా ఇతర సదుపాయాలు ఉంటాయి.

వాళ్ళ voters list బట్టి కానుకలు (రంజాన్ తోఫాలు) కూడా వస్తాయి

ఇక్కడ ఆనంద్ స్వామి మరియు భాషా అహ్మద్ ఇద్దరూ ఆరోగ్యవంతులైనా ఆనంద్ స్వామి కి లేని అవకాశాలు/లాబాలు భాషాఅహ్మద్ కి ఇవ్వ వలసి వచ్చింది ? ఎందుకంటే ముస్లీం పర్సనల్ లా వల్ల, 

అది కనుక continue అయితే ఇంకొక 20 years తర్వాత ఆనంద్ స్వామి మతం జనాభా తగ్గి భాషాఅహ్మద్ జనాభా పెరిగి పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల లో లాగ హిందువులను తరిమివేస్తారు.


ఆ మధ్య  ఒక live example చూడండి 1960 లో బర్మా నుండి వచ్చిన 4 సభ్యులున్న కుటుంబం ఇప్పుడు 1000 మందితో విస్తరించింది(రాజమండ్రి లో) ఓ తెలుగు సినీ కామెడియన్ ఇంటర్వూలో చెప్పినట్టు..


భాషాఅహ్మద్ పిల్లల పిల్లలు గురించి చెప్తే,మనకి ఇంకా బీపీ... వస్తుంది.


ఇది ఇలాగే కొనసాగితే ఈ దేశం లో ఒక వర్గం వారు చంపబడతారు,, లేదా మతం మారుతారు, లేదా దేశం వదిలి పారిపోయి పరాయి దేశాల్లో హీనంగా (2nd class citizens గా) బ్రతుకుతారు..ఇది తధ్యం.


ఒక కోణంలో మాత్రమే మనం టచ్ చేసిచూశాం...


'UCC యూనియన్ కామన్ సివిల్ కోడ్' ఎందుకు కావాలో చాలా య

కారణాలు ఉన్నాయి.


డబ్బు కావాలంటే కష్టపడి సంపాదించుకోవచ్చు. కానీ దేశాన్ని, సమాజాన్ని, కుటుంబాన్ని, సంస్కృతి ని, సంప్రదాయాలను చివరికి ప్రాణాలను తిరిగి తెచ్చుకోలేము.


కొందరు ఇలా జరుగుతుందా ? అని  మరికొందరు నా కుటుంబం వరకు రాలేదు కదా అని మౌనంగా వుంటారు. కానీ వారి ఉదాశీనత ఒక జాతి ని అంతమొందిస్తుంది  అని తెలుసుకోలేకపోతున్నారు.


కాబట్టి  'UCC యూనియన్ కామన్ సివిల్ కోడ్' కావాల్సిందే.


అడవిలో క్రూర జంతువులు తక్కువుగా, సాధు జంతువులు ఎక్కువుగా ఉంటే అది చాలా కాలం ఉంటుంది. అలా కాకుండా క్రూర జంతువులు ఎక్కువై సాధు జంతువులు తక్కువైతే అడవి లో ఏ జంతువులు బ్రతకలేవు


ఇది చరిత్ర చెప్పిన సత్యం