*నిజముగా తమ ఆత్మోద్ధరణ కోరుకొనువారు ఎంతటి తీరికలేకుండా ఉన్ననూ తప్పక భగవంతుణ్ణి మరువకుండా నిరంతరం స్మరిస్తూ ఉంటుండాలి.
*మనం అనుకుంటూ ఉంటాం…! ఉదయం నుండి రాత్రి వరకు వివిధ రకాల బాధ్యతలను నిర్వహించడంలో సమయం గడచిపోతోందని, దేవుణ్ణి స్మరించడానికి సమయం దొరకడం లేదని...!
*ఐతే సమయం ఎవరి కోసమో ఆగదు.. మనమే సమయం కేటాయించుకోవాలి. ఆఫీసు లో ఉన్నా, వంటగదిలో ఉన్నా, పంటచేలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే ఆయా పనులు చేస్తూ కూడా భగవంతుణ్ణి స్మరించుకోవచ్చు.
*ఆయన గుణగణాలను పాడుకోవచ్చు. ఇలా సాధ్యమా అంటే! సాధ్యమే!!గుడిలో పూజారి పూజ చేస్తున్నపుడు నోటితో మంత్రాలు చదువుతారు, ఒక చేత్తో హారతి ఇస్తారు, మరో చేతితో గంట కొడుతుంటారు. ఈ మూడు పనులు ఒకేసారి చేస్తుంటారు.
*ఇందులో ఎలాంటి ఇబ్బంది, దోషము లేకుండా చేస్తుంటారు. ఇది కూడా అలానే! ఎక్కడున్నా సరే మన పని మనం సక్రమంగా చేసుకుంటూ కూడా దైవాన్ని స్మరించుకోవచ్చు, పాడుకోవచ్చు..
*కనుక సాకులు వెదకడం మానేసి సాధనకు ఉపక్రమించాలి. అప్పుడే సర్వేశ్వరుడు తన అనుగ్రహమును మనపై కురిపిస్తాడు.
.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి