28, జనవరి 2021, గురువారం

సొంత ఇల్లు కొనుక్కోవటం ఎలా

సొంత ఇల్లు కొనుక్కోవటం ఎలా  

పూర్వం మన పూర్వికులు ఒక గ్రామమంలో ఒక పెద్ద ఇల్లు కలిగి  ఉమ్మడికుటుంబముగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ ఉమ్మడి కుటుంబాలు లేవు అందరు ఒకరు లేక ఇద్దరు పిల్లలు కలిగి వాళ్ళని చదివిస్తే వాళ్ళు పల్లెలు వదిలి పట్టణాలకు చేరారు. ఇక్కడ వాళ్ళు సొంతః ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నిస్తుంటారు. 

ఇప్పటి పరిస్థితిలో హైద్రాబాదు శివార్లలో ఇల్లు కొనాలంటే కనీసం 50 లక్షలపైనే. కొంతమంది జీతాలల్లో పొదుపు చేసిన డబ్బు కొంత పెట్టి మిగిలిన దానిని అప్పు తీసుకొని కొనుక్కుంటున్నారు. ఐతే కొంతమంది వారి జీతాలు వలసినంత లేకపోవటంతో వారిదగ్గర వున్న డబ్బుతో ఇల్లు కొనలేకపోతున్నారు. ఇక ఉన్న ఆ 4,5 లక్షలు బ్యాంకులో దాచుకున్న దానికి వచ్చే వడ్డీకి డబ్బు ఎక్కువగా పెరగదు. ఇక ప్రైవేటు వ్యక్తులకు ఎక్కువ వడ్డీ కి ఇస్తే వాళ్ళు అసలుకూడా కట్టకుండా ఎగ్గొట్టే వాళ్ళు చాలామంది వున్నారు. అంతే కాదు వాళ్ళదగ్గరినుండి డబ్బు రాబట్టుకోటానికి కోర్టులచుట్టూ తిరిగిన అవి ఎప్పటికి వస్తాయో రావో కూడా తెలియదు.  కాబట్టి ఇల్లు కొనాలనే కోరిక తీరటం చాలా తక్కువ అవుతుంది. మరి ఏమి చేయాలి?

ఇప్పుడు డబ్బులు వృద్ధి చెందాలంటే ఒక మంచి ఆలోచన చేయాలి. అది స్థలాలమీద పెట్టుబడి పెట్టటం. మన హైద్రాబాదు చుట్టూ ప్లోట్ల రేట్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి. అవి ఎంతగా పెరుగుతున్నాయంటే మీరు ఏ బ్యాంక్ లో ఫిక్సడ్ డిపాసిట్ చేసినా రానంతగా వృద్ధి చెందుతుంది అంటే అతిశయోక్తి కాదు. 

నాకు తెలిసిన ఒక మిత్రుడు హైద్రాబాదు శివారులో కడ్తాలు దగ్గర రెండు సంవత్సరాల క్రితం రూపాయలు 2 వేలు గజం చప్పున కొన్న ప్లాట్ రేటు ఇప్పుడు 8 వేలు గజంగా పలుకుతుంది. అంటే రెండు సంవత్సరాలలో 4 రేట్లు ధర పెరిగిందని మనకు తెలుస్తున్నది. అంతే కాదు ఇంకా రేటు పెరిగే అవకాశం కూడా వుంది. దీనిని విశ్లేషిస్తే 

రెండు సంవత్సరాలు అంటే 24 నెలలు లేక ఉజ్జాయింపుగా 30 నెలలు అనుకుందాము. అంటే అప్పుడు పెట్టిన పెట్టుబడి ఒక 100 గజాలకు 2 లక్షలు అనుకోండి ఆ 2 లక్షలు ఇప్పుడు 8 లక్షలు అయ్యిన్ది అంటే 8-2=6  అంటే 2 లక్షలమీద పెరుగుదల 30 నెలలలకు 6 లక్షలు అంటే ఒక లక్షకి అంటే 6/2=3 అంటే 1లక్షకు 3 లక్షల లాభాము 30 నెలలకు అంటే నెలకు 200,000/30=  6666 అంటే 66% అన్న మాట ఇప్పుడు చెప్పండి మనం ఏ బ్యాంకులో దాచుకుంటే మనకు నెలకు 66% వడ్డీ వస్తుంది. మనం అధిక వడ్డీకి మనకు తెలిసిన వారికి ఇచ్చినా కూడా ఎక్కువాలో ఎక్కువ 10% వడ్డీ ఇస్తారు. అదికూడా నమ్మకం తక్కువ. మనం బంగారం మీద పెట్టుబడి పెట్టిన కూడా వృద్ధి ఇంత ఉండదు. కాబట్టి మనకు అన్నివిధాల ప్లాట్ మీద పెట్టుబడి ఎక్కువ లాభాన్ని చేకూరుస్తుంది. కాబట్టి ప్లాట్ కొనుక్కోటం ఒక్కటే ఎక్కువ వృద్ధిని చేకూరుస్తుంది. 

ప్లాట్ ఎక్కడ కొనాలి. 

హైద్రాబాదుకు ఆనుకొని 10,20 కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు ప్లాట్లు గజం 30 వేలు పైన వున్నాయి ఆ 30 లక్షలు ఉంటే సొంత ఇల్లు కాకపోయినా ఏదైనా అపార్టుమెంట్లో flat  కొనుక్కోవచ్చు. కాబట్టి ఈ పెట్టుబడి అంత లాభదాయకం కాదు. కాబట్టి పట్టణ శివారు గ్రామాలల్లో చేసే వెంచరులో గజం 5 నుండి 8 వేలు వున్నా ప్లాట్ కొంటె ఒకటి రెండు సంవత్సరాలలో నేను పైన చెప్పిన విధంగా మీకు వృద్ధి లభించ గలదు. ఉదా: మీరు ఒక 10 లక్షలు పెట్టుబడి పెట్టారనుకోండి అది మీకు ఒక రెండు సంవత్సరాలలో 40,60 లక్షలు అయితే మీరు ఆ డబ్బుతో ఇంకా తక్కువ పడితే కొంత లోను తీసుకొని సొంత ఇల్లు కానీ అపార్ట్మెంట్ కానీ కొనగలరు. ఈ విధంగా చేసినట్లయితే సులువుగా సొంత ఇల్లు కొనుక్కోవచ్చు. 

మీరు నమ్మకమైన రియల్ ఎస్టేటు కంపినేని ఎంచుకోండి.  మీరు కోన దలుచుకున్న ప్లాటుని బౌతికంగా చూసి దానికి సంబందించిన E .సి ని 30 సంవత్సరాలది చుడండి.  సదరు ప్లాట్ వున్న వెంచరుపై కోర్టు కేసులు లేవని నిర్ధారణ చేసుకొని ఆ వెంచరుకు మెయిన్ రోడ్డుకు సరైన రోడ్డు ఉన్నదా చుడండి. అది అప్రూవ్డ్ వెంచరా కాదా అని చుడండి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీరు కొనే ప్లాట్ నమ్మకమైనదిగా భావించ వచ్చు అప్పుడు మీరు పెట్టె పెట్టుబడికి రక్షణ కలిగి వున్నట్లే. 

ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలంటే సరైన సలహా కోసం సంప్రదించగలరు. 





అభావః

 శ్లోకం:- డా౹౹ సూరం శ్రీనివాసులు


అభావః ప్రాగ్రూపః ప్రతియుగపి తస్యోభయగతిం

విధిత్సు ర్బన్ధోఽ సౌ భవతి పరమాత్మా ;జగదపి౹

భవేద్యావద్బన్ధ స్తదవధి న మిథ్యాఽవిదితం నః

కుతో వా ధాతస్త్వం భవసి విఫలస్సర్జనగతౌ౹౹


తాత్పర్యం : సూరం చంద్రశేఖరం 


ప్రాగభావం, దాని ప్రతియోగి(కార్యం)..ఈ ఉభయగతుల 

స్థితిని కలిగించడం కోసం రెండింటికి మధ్య బంధం 

ఏర్పడుతుంది. ఆ బంధమే పరమాత్మ.ఆ బంధమెంత 

కాలం ఉంటుందో అంత కాలం జగత్తు కూడా ఉంటుంది. 

అప్పుడది మిథ్య ఎలా అవుతుంది? కానీ ఆ విషయం 

మాకు తెలియట్లేదు. విధాతా ! సృష్టిగతిని ఇలా కొనసాగిస్తూ

నువ్వెందుకు విఫలుడవవుతున్నావు

ఎవరు భరిస్తున్నారో

 ఎవరు భరిస్తున్నారో ఆలోచించండి.


(1) లక్ష ట్రాక్టర్ల ఊరేగింపు.

400 కి.మీ.దూరం.

(2) ప్రతి 10 కి.మీలకు ఒక లీటరు డీజల్ వినియోగం.

(3) ఒక లీటరు డీజల్ ధర 84 రుపాయలు.

(4) ఒక్కోక్క ట్రాక్టరుకు 40 లీటర్ల వినియోగం. లక్షట్రాక్టర్లకు 40లక్షల లీటర్ల డీజల్ అవసరం.

(5) డీజల్ పై ఖర్చు 84x4,000,000 =   33,60,00,000 = ముప్పై మూడు కోట్ల అరవై లక్షలు.

(6) ఒక్కోట్రాక్టరుకు రోజుకు బాడుగ Rs 1500/-

(7) లక్ష ట్రాక్టర్లలో రైతుల స్వంతంగా కలవి = 50 వేలు.

(8) 50 వేల ట్రాక్టర్లకు బాడుగ

50000 x 1500 = 7,50,00,000 = 7 కోట్ల 50 లక్షలు

(9) ఒక్కో ట్రాక్టర్ డ్రైవరు బత్తారోజుకు 800.

(10) 50 వేలమంది డ్రైవర్లకు బత్తా 50,000 x 800 = 40,00,000 =  40 లక్షలు

(11) ఒక్కో ట్రాక్టరులో 5మంది వస్తే, మొత్తం లక్ష ట్రాక్టర్లుకు కలిపి = 5,00,000 = ఐదు లక్ష మంది.

(12) ఒక్కొక్కరికి ఉదయం టిఫిన్ ఖర్చు = 50 రూపాయలు

(13) ఐదు లక్షలమందికి 5,00,000 x 50 = 2,50,00,000 = రెండు కోట్లా యాభైలక్షలు.

(14) మధ్యాహ్న భొజనం ఒక్కొక్కరికి Rs 75.

(15) 5 లక్షల మందికి 5,00,000 x 75 = 3,750,0,000 = మూడుకోట్ల డెబ్బై ఐదు లక్షలు.

(16) బ్యానర్లు, మైకులు ఒక్కో ట్రాక్టరుకు Rs 500.

(17) 50 వేల ట్రాక్టర్లకు

50,000 x 500 =  2,50,00,000 = రెండుకోట్ల యాభైలక్షలు.

(18) కాఫీ, టీలు, స్నాక్స్ వగైరాలు, 2,50,000 మందికి ( వచ్చేవారి సంఖ్య మొత్తం = 5 లక్షలు)

(19) ఒక్కొక్కరికి 25 రుపాయలు = 2,50,000 = 25 =62,50,000 = అరవై రెండు లక్షలా యాభైవేలు

(20) సభాసమావేశము కొరకు = రెండుకోట్లు

(21) హజరయ్యే రాజకీయనాయకులు చిన్నా పెద్దాకలిసి = 5 వేలు.

(22) వారి వాహనాలు, గన్ మెన్లు, డ్రైవర్లు, అటెండరులు,  డీజల్, భోజనాలు వగైరాలు కలిపి ఒక్కోనాయకుడి ఖర్చు Rs 5,000. 5 వేల మందికి 5,000 x 5000 = 2,50,00,000 = రెండుకోట్ల యాభైలక్షలు.

ఒకరోజు ర్యాలి మొత్తం వ్యయం = 46 కోట్లా,82 లక్షల, 75 వేల రుపాయలు


ఈ ఖర్చంతా ఎవరు భరిస్తున్నారు.స్వదేశీ రైతులా?

విదేశీశక్తులా ?

దేశాన్ని అస్తిరపరిచేటందుకు పూనుకొన్న చైనా, పాక్, దేశాలే కదా!


ఇవికాక ప్రభుత్వం ఏర్పాటు చేసే బందోబస్తు వ్యయం ఉండనేవుంది. ప్రజలు ఈ  ఖర్చును పన్నుల రూపంలో చెల్లించాలి కదా!

ఆలోచించండి.

మాఫియా

 ఈ రోజు రైతుల పేరుతో చేసిన విధ్వంసానికి వాడిన ఒక్కో ట్రాక్టర్ ఖరీదు అక్షరాల 35 లక్షలు . మానస్టర్ ట్రక్కులకి వాడే పెద్ద పెద్ద టైర్లు ట్రాక్టర్లకి వాడారు ఎత్తైన బారికేడ్ల మీద నుండి వెళ్ళడానికి . వీలుగా ఈ టైర్లను వాడారు..!! 


35 లక్షల రూపాయలు విలువ చేసే ట్రాక్టర్ ఓ రైతు నష్టపోతే  ఆ రైతు బతుకుతాడా..?? 


ప్రభుత్వం తీసుకు వచ్చే  రైతు చట్టం ఒక పంజాబ్ రైతులకు మాత్రమే నష్టం జరుగుతుందా మరి మిగత రైతులుకు జరగడం లేద..?? దేశంలో రైతుల అంటే పంజాబీలేనా ..?? 


రైతులు మారణాయుధాలు చేతబూని ధర్నా చేస్తారా..?? ఇదో పెద్ద మాఫియా..! 


రెండు నెలలుగా రోజూ 1000 మందిని AC బస్సుల్లో తీసుకురావడం తీసుకువెళ్లడం లాంటి ఖరీదయిన పనులు డ్రగ్ మాఫియానే చేయగలదు అంతే కానీ నిజమయిన రైతు ఆ పని చేయలేడు .!


వీరంతా రైతుల ముసుగులో ఉన్న ఖలిస్తాన్ తీవ్రవాదులు ఇదో పెద్ద కుట్ర.!! 


మేలుకో భారతీయుడా మేలుకో .!! జైహింద్

: 1 lakh tractor Rally

 Claim: 1 lakh tractor Rally 

Length: 400 km

Average: 10km per liter

Diesel price: Rs 84 per liter

Average diesel: 40 liters per tractor


 *Total Diesel: 40 Lakh Liters*

 *Total Price: Rs.33,60,00,000*(Thirty three crores sixty lakhs)

 *Total liter diesel required = 4 Million liter*

 *Cost 330 Million Ind Rupees ..*


If Poor farmer can afford 33.6 crores of rupees on one event, how much spent on agitation ?


Probably this much diesel and one lakh tractors work would have produced one year's food to all 11lakh farmer families in Panjab ! 


That means Agricultural market brokers are still have lot of money to disturb farmers & farm produce !


4 million liters diesel burnt on a day might create huge pollution to smash delhi !


*Is China filling pockets of brokers ?*


 *Any layman understand the sponsored program !*

రామాయణం 199

 రామాయణం 199

.................

రామా ఏల నీవు ఇలా బేలవైతే ,నీవంటి ధీరునికి దుఃఖము శోభనివ్వదు .

ఇదుగో చూడునాభార్యను వాలి అపహరించలేదా ? 

వానరుడ నైన నేను శోకిస్తున్నానా చూడు ,

.

ఆ రావణుడు ఎవ్వడో ఎక్కడ ఉంటాడో వాని సామర్ధ్యమేమో, వానిపరాక్రమమేమో  ,నాకు తెలవదు కానీ ,ముల్లోకాలలో ఎచ్చట ఉన్నా వాని ఆచూకి కనుగొని నీ సీత నీకు దక్కునట్లు చేసెదను .ఇది నా ప్రతిజ్ఞ .

.

ఆపత్సమయమందు, కానీ ధననాశము కలిగి నప్పుడు కానీ ప్రాణాపాయ స్థితి కలిగినప్పుడు కానీ ధైర్య వంతుడు తన బుద్ధితో బాగుగా ఆలోచించుకొనును కానీ కృంగిపోడు.

.

ఎవడు మూఢుడై తన వశములో తానుండక నిత్యమూ దైన్యములో కొట్టుమిట్టాడుకొనునో వాడు ఎక్కువ బరువు వేసిన ఓడ నీటిలో మునుగునట్లు మునిగి పోవును .

.

అని సుగ్రీవుడు అంజలి ఘటించి శోకములో మునిగిపోయి దీనుడై రోదిస్తున్న శ్రీరాముని ఓదార్చెను .

.

సుగ్రీవుని మాటలకు తన సహజ స్థితి ని పొందినవాడై రాముడు సుగ్రీవుని గాఢముగా ఆలింగనము చేసుకొనెను .

.

సుగ్రీవా !ప్రేమతో హితము గోరు స్నేహితుడు ఏమి పలుకవలెనో అవి నీవు పలికినావు .నీ వంటి బంధువు ఇటువంటి సమయములో ఎవరికీ లభించడు కదా!

.

సుగ్రీవా నీవు రాక్షసుని జాడ కనుగొనుటకు ప్రయత్నించుము ,

నేనేమి చేయవలెనో నాకు నీవు చెప్పుము ,

మంచి సుక్షేత్రమైన పొలములో వేసిన పంట చేతికొచ్చినట్లు నీ కార్యము సఫలము కాగలదు .

.

సత్యముపై ఒట్టు పెట్టి పలుకుచున్నాను నీ కార్యము నెరవేరినట్లే అనుకొనుము .అని పలికిన రాముని పలుకులకు సంతసించినవాడై సుగ్రీవుడు  మనస్సులో తనపని నెరవేరినట్లే అని అనుకొనెను .

.

అంత ఇరువురు మిత్రులూ ఏకాంతములో కూర్చొని   తమ సుఖదుఖములను గూర్చి ముచ్చటించుకొనసాగిరి.

.

జానకిరామారావు వూటుకూరు

రామాయణమ్ 198

 రామాయణమ్ 198

............................................................................................

రామా మేమందరమూ ఒకరోజు పర్వతముపై కూర్చొని ఉండగా ఒక స్త్రీ తన ఉత్తరీయమును ,శ్రేష్టమైన అలంకారములను జారవిడిచినది . ఆ స్త్రీ ఆ రాక్షసుని ఒడిలో ఆడుపాము వలే దోర్లుచూ మిక్కిలి బాధతో రోదించుచూ మాకు కనపడినది .

.

ఆమె జారవిడిచిన నగలన్నిటినీ మేము భద్రపరచితిమి  ,నేను వాటిని తీసుకొని వచ్చెదను నీవు గుర్తింపుము . 

.

మిత్రమా ఆలస్యమెందులకు త్వరగా తీసుకొని రమ్ము  అని రాముడు పలుకగా సుగ్రీవుడు వాటిని తానె స్వయముగా గుహలోనికి వెళ్లి తీసుకొని వచ్చి ఆయన ముందుంచాడు .

.

ఆ అలంకారములు ,ఉత్తరీయము చూసిన వెంటనే రాముని కన్నులు పొగమంచు కప్పిన చంద్రుడి వలె బాష్పముచేత ఆవరింపబడినవి .

.

ఒక్కసారిగా హా !సీతా  అంటూ ఏడుస్తూ నేలపై బడి మూర్చిల్లి నాడు .

.

మరల కొంతసేపటికి తేరుకొని మాటిమాటికీ తన గుండెలకు ఆ నగలను దగ్గరకు చేర్చుకొని కలుగులో కోపముతో బుసలుకొట్టే పాములాగా నిట్టూర్పులు విడుస్తూ కన్నులనుండి ఎడతెరిపిలేకుండా కన్నీరు కారుస్తూ ప్రక్కనే ఉన్న లక్ష్మణుని వైపు చూస్తూ కడు దీనంగా విలపించసాగాడు .

.

లక్ష్మణా ఇదుగో ఈ అలంకారాలు చూడు పచ్చిక మీద పడటము వలన విరిగిపోకుండా పూర్వమువలెనే ఉన్నవి .

.

అప్పుడు లక్ష్మణుడు,

 అన్నా ! నాకు కేయూరాలు కానీ ,కుండలాలు కానీ తెలువవు ,

కానీ ఆవిడ కాలి నూపురాలను మాత్రము నేను గుర్తించగలను.

.

నిత్యమూ ఆవిడ పాదాలకు వందనము చేయుదును కావున అవి నేను గుర్తుపట్టగలను.

.

నిస్సందేహముగా అవి ఆవిడవే ! 

.

సుగ్రీవుడా ,నా ప్రాణాధిక అయిన సీతను రావణుడు ఎటువైపుగా తీసుకొని వేళ్ళినాడో నీవు చెప్పగలవా!

 వానిని ఇప్పుడే యమ సదనమునకు పంపగలను అని రాముడు  కోపముతో సుగ్రీవుని వైపు తిరిగి పలికినాడు .

.

NB

( లక్ష్మణుడన్న ఈ మాటలు ప్రాచ్య పాఠమునందు లేవని పెద్దల అభిప్రాయము ).

.

వూటుకూరు జానకిరామారావు

రామాయణమ్ 197

 రామాయణమ్ 197

......

శ్రీరామ సుగ్రీవ ఆలింగనమయినపిదప హనుమంతుడు రెండుకర్రలనుండి అగ్నిని పుట్టించి ,ఆ అగ్నిని పుష్పములతో పూజించి అలంకరించి శ్రద్ధతో ఆ అగ్నిని రామసుగ్రీవుల మధ్య ఉంచగా వారిరువురూ ప్రదక్షిణము చేసి అగ్ని సాక్షిగా మిత్రులయ్యారు.

.

"త్వం వయస్యోసి హృద్యో మే ఏకం దుఃఖం సుఖం చ నౌ"..

.

రామా ! ఇప్పుడు నీవు నాకు ప్రేమ పాత్రుడవైన మిత్రుడవు ఇకపై మన సుఖదుఃఖములు ఇరువురికీ సమానములు.

.

అంత సుగ్రీవుడు చక్కగాపుష్పించి మెత్తటి ఆకులు పువ్వులు గల ఒక మద్దిచెట్టు కొమ్మ విరిచి దానిపై రామునికి సుఖాసనమేర్పరచి తానుకూడా ఆయన పక్కనే కూర్చున్నాడు.

.

అప్పుడు హనుమంతుడు ,నిలబడియున్న లక్ష్మణునకు ఒక చక్కని గంధపు చెట్టు కొమ్మ విరిచి దానిమీద ఆసనము ఏర్పాటు చేసెను.

.

అందరూ కూర్చొన్న తరువాత సుగ్రీవుడు రామునితో రామా ! నా అన్న వాలి నా భార్యను అపహరించి నన్ను అవమానించి రాజ్యమునుండి వెళ్ళగొట్టినాడు.

.

అతనికి భయపడి ఇతరులెవ్వరూ ప్రవేశించలేని ఈ భయంకరారణ్యములో ప్రవేశించి నివాసమేర్పరచుకొన్నాను.

.

రామా ! వాలివలన నాలో ఏర్పడిన భయాన్ని తొలగించుము .అని వేడుకొన్న సుగ్రీవుని చూసి చిరు నవ్వుతో మిత్రమా ! స్నేహానికి ఉపకారమే ప్రయోజనము అను విషయము నేనెరుగుదును. నీ భార్యను అపహరించిన వాలిని నేను చంపివేయగలను.

.

రామా ! నీ పలుకులు నా హృదయములో మరల సంతోషాన్ని నింపినవయ్యా నా అన్న మరల ఇంకెప్పుడూ నన్ను బాధించకుండాయుండునట్లుచేయుమయ్యా అని సుగ్రీవుడుమరల పలికినాడు.

.

NB

.

Fair weather friendship కాదు రామసుగ్రీవులది ,ఒకరి అవసరాలను మరొకరు గుర్తించి పరస్పర ఉపకారము చేసుకొనుట అనేటటువంటిది స్నేహముయొక్క లక్ష్యము..

.

 అన్నీబాగున్నపుడు స్నేహము మనిషి కష్టాలలో ఉన్నపుడు ముఖము చాటెయ్యడం ఇది స్నేహము అనిపించుకోదు.

.

తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పదివేలు చేరుకదరా సుమతీ! ....ఇలాంటి స్నేహాలు ఇప్పుడు కోకొల్లలు

.

జానకిరామారావు వూటుకూరు

రామాయణమ్ 196

 రామాయణమ్ 196

......

రామా !సుగ్రీవుని వద్దకు వెళ్ళెదము అని హనుమంతుడు పలుకగా , లక్ష్మణుడాయనను గౌరవించి రామునితో ఇలా అన్నాడు.

.

అన్నా ! ఈయన మాటలాడిన తీరు చూసినట్లయిన వీరికి కూడా మనవలన ఏదో ఒక పని జరుగవలసి యున్నట్లుగా తోచుచున్నది .

ఇక మన కార్యము సిద్ధించినట్లే !.ఈయన పలుకులలో విశ్వసనీయత కనపడుచున్నది . 

.

లక్ష్మణుడు అన్నతో ఆ విధముగా పలికిన తరువాత హనుమ తన సన్యాసి రూపము విడిచి అన్నదమ్ములిరువురినీ తన మూపుపై కూర్చుండబెట్టుకొని సుగ్రీవుని వద్దకు తీసుకొని పోయెను.

.

సుగ్తీవునకు రామలక్ష్మణుల గురించి చెప్పి ఆయన వద్దకు వారిని తీసుకొనిపోయాడు.

.

సుగ్రీవా, ఈయన రాముడు! సత్యపరాక్రముడు ,ఇక్ష్వాకు వంశమందు జన్మించిన వాడు .

దశరధకుమారుడు ,ధర్మాత్ముడు,

తండ్రి ఆజ్ఞపాటించి భార్యా సోదర సమేతముగా అడవులకు వచ్చినాడు .

.

ఇదుగో !ఈయన లక్ష్మణుడు ,అన్నను అనుసరించి వచ్చినవాడు .

అన్నకు తగ్గ తమ్ముడు.

.

రాముని భార్యను రావణుడపహరించగా ఆమెను తిరిగి పొందుటలో నీ సహాయము అర్ధించి వచ్చినాడు.

.

వీరు నీ స్నేహము కోరుచున్నారు.

వీరిని స్వీకరించుము .

.

అనిపలికిన హనుమంతుని మాటలు విని వారిరువురినీ ఆనందముగా చూస్తూ ,రామా ! నీ గురించి హనుమ అంతా చెప్పినాడు.నీవు ధర్మాత్ముడవనీ సత్యపరాక్రమము కలవాడవనీ గొప్పతపఃసంపన్నుడవనీ తెలిపినాడు.

.

ఓ ప్రభూ వానరుడనైన నాతో స్నేహము కోరుచున్నా వనగా అది నాకు గొప్ప సత్కారము .

.

రామా ఇదుగో నా చేయి చాపుచున్నాను స్వీకరించవయ్యా! .

.

సుగ్రీవుని ఈ మాటలు విన్న రాముడు మిక్కిలి ఆనందముతో ఆయన చేయి తన చేతితో దృఢముగా పట్టుకొని ఆయనను దగ్గరకు తీసుకొని తన బాహువులతో గాఢముగా కౌగిట బంధించినాడు.

.

వూటుకూరు జానకిరామారావు

రామాయణమ్ 195

 రామాయణమ్ 195

.........

హనుమంతుడు ఒక్కసారి ఆగి ఆలోచించాడు .

.

ఒక ప్రయోజనమాశించి ఈ మహాపురుషుడు ఇచటికి వచ్చినాడు ,ఈయన వలన సుగ్రీవుని కార్యము కూడా నెరవేరగలదు. సుగ్రీవునికి రాజ్యము కూడా లభించగలదు. ఈ విధంగా ఆలోచించి హనుమంతుడు రామునితో ఇలా అన్నాడు .

.

పంపాపరిసరములలో ఉన్న అత్యంత భయంకరము, దుర్గమము అయిన ఈ అరణ్యములోనికి మీరేల ప్రవేశించారు.

ఇక్కడఅతిభయంకరమైన  విషసర్పములు ,నానాక్రూరమృగములు 

సంచరించుచున్నవి .ఇటువంటి అడవిలోకి నీవు,నీతమ్ముడు ఎందుకు ప్రవేశించారు.

.

అప్పుడు లక్ష్మణుడు ఆయనకు తమ గురించి అంతా విశదీకరించి ,కబంధుడు తమకు సుగ్రీవుని గురించి తెలిపిన విషయము చెప్పి సుగ్రీవుని సహాయము ఆశించి వచ్చామని తెలిపాడు.

.

లక్ష్మణుడు పలికిన ఈ మాటలు విని హనుమంతుడు,.... బుద్ధిమంతులు ,క్రోధమును జయించినవారు,జితేంద్రియులైన మీ వంటి వారి దర్శనము అదృష్టవశముననే లభించును.అట్టి మిమ్ములను సుగ్రీవుడు తప్పక చూడవలెను .

.

సుగ్రీవుడు తన అన్న అయిన వాలిచేత అవమానింపబడి రాజ్యమునుండి వెడలగొట్టబడినాడు.వాలి సుగ్రీవుని భార్యను అపహరించినాడు.అతడు వాలికి భయపడి అరణ్యములో కాలము గడుపుచున్నాడు.

.

రామా ! సూర్యపుత్రుడైన సుగ్రీవుడు మాతో కలిసి సీతాన్వేషణమున మీకు సహాయము చేయగలడు.

.

NB

సుగ్రీవుడు  వాలికి భయపడి అడవిలో దాక్కున్న వాడు .మరి కబంధుడు అలాంటి వాడిగురించి ఎందుకు చెప్పాడు ? వాలి అతనికంటే గొప్ప వాడుకదా ! 

.

మొదటి కారణము వాలి అధర్మపరుడు ధర్మాత్ముడైన రాముడు వాలి సహాయము స్వీకరించడు.

.

రెండవకారణము ..సమాన శీల వ్యసనేషు సఖ్యం ...ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం ఎప్పుడు చిగురిస్తుంది అంటే ఇద్దరి శీలము ఇద్దరి బాధ ఒకటే అయి ఉండాలి .

సుగ్రీవుడు శీలసంపద కలిగిన ధర్మాత్ముడు పైగా రాముని వలెనే భార్యను పోగొట్టుకొని ఆ బాధ కూడా రాముని లాగానే అనుభవిస్తున్నాడు .

Empathy  is more important for any friendship to become strong.


.

జానకిరామారావు వూటుకూరు

.