8, జనవరి 2025, బుధవారం

డెబ్బయి రెండేళ్ళ తండ్రి

 "మీ నాన్న చాదస్తాన్ని భరించలేక పోతున్నానురా... పైగా ప్రతిదానికీ నస..." అంటూ అరవై ఎనిమిది ఏళ్ళ తల్లి... తన నలభై ఆరేళ్ళ కొడుక్కి డెబ్బయి రెండేళ్ళ తండ్రి గురించి కంప్లయింట్ చేసింది.


కొడుకు ఓపికగా తల్లి చెప్పినది విన్నాడు..


"చెప్పిందే తొంభైసార్లు చెబుతాడు. ఇప్పుడే చెప్పారుగా అంటే, ఇంకొకసారి వినలేవా అని చికాకు పడతాడు. అడిగిందే అరవైసార్లు అడుగుతాడు. ఇందాక ఇచ్చానుగా అంటే, ఇంకోసారి ఇవ్వలేవా అని చిరాకు పడతాడు"..


అమ్మా.... పెళ్ళి చేసుకున్న కొత్తలో, నాన్న మీద నీకేమైనా కంప్లెయింట్స్ వుండేవా 


"లేదురా. ఆయన బంగారుకొండ" గతాన్ని తలచుకొంటూ అంది...


"పోనీ ఆయన నలభైయవ ఏట... నస పెట్టేవాడా ?"


"అబ్బే లేదురా..."


"పోనీ యాభైయవ ఏట నస పెట్టారా ?"


"ఊహూ"

"అరవైవ ఏటా

"లేదు.... ఈ మధ్యనే ఆర్నెళ్లుగా.....


"అమ్మా... నీకు పెళ్ళయిన కొత్తలోనో, షష్టిపూర్తి టైంలోనే నాన్న చనిపోయి ఉంటే. తట్టుకునేదానివి కాదా అమ్మ  ... ఇప్పుడు నాన్నగార్ని దేవుడు తనతో తీసుకెళ్ళే సమయం వచ్చింది - ఆయన వెళ్ళి పోవడం మనకి బాధ కలిగించడానికే దేవుడు ఆ వయసులో నస పెడతాడు.. నాన్న వెళ్ళిపోతున్నాడమ్మా... ఈ చివరి రోజుల్లోనే... మనం నిజమైన ఓర్చుని, సహనాన్ని, ప్రేమని అందించి తోడుగా ఉండాలి......


తల్లి కళ్ళ నిండా నీళ్ళతో తండ్రి లాంటి కొడుకు కేసి చూసింది. కొడుకు చిన్నపిల్లాడిగా కనబడుతున్న తండ్రికేసి చూశాడు..!!

వయసు మీరుతున్న చివరి మజిలీ లో వున్న ప్రతి తండ్రికి

తిరుప్పావై 24వ పాశురం*

 *తిరుప్పావై 24వ పాశురం*

🕉🌞🌏🌙🌟🔥


🕉🌞🌏🌙🌟


*24.పాశురం*

*ॐॐॐॐॐॐॐॐॐॐ*


      *అన్ణి వ్వులగ మళన్దాయ్! ఆడిపొత్తి;*

        *చ్చేన్ణజ్ఞ తైన్నిలజ్ఞేశేత్తాయ్! తిఱల్ పొత్తి;*

        *పోన్ణ చ్చగడ ముద్దైత్తాయ్! పుగళ్ పొత్తి;*

        *కన్ఱుకుడై యావేడుత్తాయ్! గుణమ్ పొత్తి;*

        *వెన్ణుపగై కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పొత్తి;*

        *ఎన్ణెన్ణున్ శేవగమే యెత్తిప్పఱై కోళ్వాన్* 

        *ఇన్ఱి యామ్  వన్దొన్  ఇరజ్గేలో రెమ్బావామ్!!*

    


*భావం* 


*ॐॐॐॐॐॐॐॐॐॐ*


ఆనాడు బలిచక్రవర్తి తనది కాని రాజ్యమును తానూ ఆక్రమించి దేవతలను పీడింపగా ఈ లోకమునంతను వాని వద్ద నుండి దానము పట్టి పాదములతో కొలచిన మీ దివ్య పాదారవిందములకు మంగళము. 


రావణుడు సీతమ్మను అపహరించుకొనిపోగా ఆ రావణుండు లంకకేగి సుందరమగు భవనములు కోటయు గల దక్షిణదిశన ఉన్న లంకలోనున్న రాక్షసులను చెండాడిన మీ బాహుపరాక్రమమునకు మంగళము. 


శ్రీకృష్ణుడు రక్షణకై ఉంచిన బండిపై ఆవేశించిన రాక్షసుని చంపుటకై ఆ బండికి తగులునట్లు కాలుచాచి నేలకూల్చిన మీ అప్రతిమ కీర్తికి మంగళం. 


వత్సముపై ఆవేశించిన అసురునితో వెలగచెట్టుపైన ఆవేశించిన అసురుని చంపుటకై ఒడిపెలరాయి విసిరినట్లుగా వెలగచెట్టుపైకి దూడను విసురునపుడు ముందు - వెనుకలకు పాదములుంచి నిలచిన మీ దివ్యపాదములకు మంగళం. 


ఇంద్రుడు తనకు యాగము లేకుండా చేసెనను కోపముచే రాళ్ళవాన కురియగా గోపాలురకు, గోవులకు బాధకలుగుచుండునట్లు గోవర్ధన పర్వతమును గొడుగువలె ఎత్తిన మీ వాత్సల్యమునకు మంగళము. 


శత్రువులను సమూలముగా పెకలించి విజయమును ఆర్జించి ఇచ్చెడి మీ హస్తమునందలి వేలాయుధమునకు మంగళము. 


ఈ ప్రకారముగా నీ వీరే చరిత్రములనే కీర్తించి పరయనెడి వ్రతసాధనము నందగ మేము ఈనాడు వచ్చినారము అనుగ్రహింపుము. 


అలనాడు బలివలన దుఃఖితులైన దేవతలను రక్షించుటకు రక్షించుటకు త్రివిక్రముడవై మూడు లోకాలను కొలిచిన వామనుడా! నీ రెండు పాదములకును మంగళము!


 సీతమ్మను అపహరించిన దుష్టడగు రావణుని లంకను గెల్చిన ఓ శ్రీరామా! నీ ధీరతకు మంగళము! బండి రూపంలో శకటాసురుడనేరాక్షసుడు నిన్ను చంపప్రయత్నింపగా వాని కీళ్ళూడునట్లు తన్నిన నీ కీర్తి ప్రభలకును మంగళము! దూడ రూపమున నిన్ను చంపవచ్చిన వత్సాసురుడనే రాక్షసుని.


వెలగచెట్టుగా దారికి ప్రక్కన నిల్చిన కపిత్డాసురుడనే రాక్షసుని ఒక్కసారిగా సంహరించిన నీ వంచిన పాదమునకు మంగళము! దేవేంద్రుడు రాళ్ళ వర్షమును కురిపించగా గోవర్దనగిరిని గోడుగుగా నెత్తి గోకులమును రక్షించిన నీ ఆశ్రిత రక్షణ గుణమునకును మంగళమగుగాక! శత్రువులను చీల్చి చెండాడునట్టి నీ చేతి చక్రమునకు మంగళ మగుగాక!


 ఇట్లు నీ వీర గాధలన్నేన్నింటినో నోరార సుత్తించును నీ నుండి మా నోమునకు కావాల్సిన పరికరములను పొందుటకై మేము నేడు యిచ్చటకు వచ్చి యున్నాము. కావున మా యందు దయచేసి వానిని కృపతో ప్రసాదింపుము. అని గోపికల్లెలరు స్వామిని వేడుకొన్నారు.


 *అవతారిక*


*ॐॐॐॐॐॐॐॐॐॐ*


ఈనాడు గోపికలు 'శయనాగారము నుండి ఇటు నడచివచ్చి సింహాసనమును అధిరోహింపుము.' అనుటతోడనే ఆశ్రిత సులభుడగు శ్రీకృష్ణుడు వారిమాట మీరలేక తన మంచము నుండి దివ్య సింహాసనము వరకు నడచి వచ్చెను. నీళాదేవియు ద్వారభూమి వరకు మంగళాశాసనము చేయుచు అనుసరించినది. గోపికలు నడచి వచ్చుచున్న స్వామిని చూచినారు.


స్వామి నీళాదేవితో కూడా వచ్చి, దివ్య సింహాసనమును అధిరోహించిరి. ఒక పాదమును పాదపీఠంపై నుంచి రెండవ పాదమును తొడపైనిడుకొని కూర్చుండిన సన్నివేశమును చూడగానే, శ్రీకృష్ణుని దివ్యపాదముల ఎర్రదనము గోపికల కంటపడినది


తాము కోరిన ప్రకారము నడుచుట చేతనే పాదములు కందినవని గోపికల హృదయము కలతచెందింది. వెలుపలికి వచ్చి సింహాసనమున కూర్చొని మేము వచ్చిన కార్యమును పరిశీలించుమని అర్థించిన గోపికలు 'పఱ' అను వాద్యమును కోరుతు మరచి మంగళము పాడుటకు ఉపక్రమించిరి. 


ఈ పాశురమున గోపికలు శ్రీకృష్ణపరమాత్మ వలన తమ కార్యము నెరవేర్ప జూచినవారై, ఆ ప్రభువు నడచివచ్చి ఆసనముపై కూర్చుండగానే ఆ పాదముల ఎర్రదనము చూచి తాము చేసిన అపచారమునకు ఖిన్నులై మంగళము పాదనారంభించిరి.


ప్రవత్తి చేసిన వారికి పరమ సులభుడు పరమాత్మ! ఆశ్రితులకు కొంగు బంగారమే! గోపికలంతా తన్ను తన తిరుమాళిగనుంచి వీరసింహము వోలె నడిచివచ్చి సింహాసనాన్నదిష్టి౦పమని కోరినట్లే స్వామి చేశాడు. స్వామి యందు భక్తులకు ప్రేమ అధికమైనపుడు భక్తసులభుడైన స్వామి వారేది చెపితే అదే చేస్తాడుకద!


 అలా సింహగమనంతో వచ్చిన స్వామిని చూచిన గోపికలు 'అయ్యో! స్వామికెంత శ్రమ కలిగినదో!' అని అందోళన పడి అత్యంత భక్తీ ప్రవత్తులతోను, వాత్సల్యంతోను స్వామి పాదాలకు మంగళా శాసనం చేయడానికి సిద్ధపడి, తాము వచ్చిన పనిని మరచిపోయారు. స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించిన ఆనందంతో మంగళాసనం పాడారు యీ (పాశురంలో)


 

*షణ్ముఖప్రియరాగము _ అదితాళము*


    ప ..     మంగళమగుగాక! జయమంగళం !!


అ...ప..    మంగళమగుగాక! శ్రీ పాదములకు!!

    

1.    చ..    లోకములలనాడు గొలిచిన పదములకు 

        లంక గెల్చిన యట్టి రాముధీరతకు

        శకటాసురుని గూల్చు నీ యశః ప్రభలకు 

        అకట వత్సాసురుని విసిరినా పడమూలకీల!!


2.    చ...    గోవర్దనాద్రినిన్ గొడుగుగా నెత్తిన 

        అవతారుడ! నీ కృపా రసమునకు

        అవని శాత్రవుల నవలీలగా ద్రుంచు

        దివ్యాయుధమును నిత్య మంగళము!!    

    

3.    చ....    ఈ విధిన్ మంగళాశాసము జేసి 

        నీ వీర గాథలే పాడి. కొనియాడి    

        నీ వోసగు వరములకు నిను జేరితమి నేడు.

        ఆ వాద్య మొసగుమా! దాసుల బ్రోవుమా!!


*ॐॐॐॐॐॐॐॐॐॐ*


*స్వామికి మగళం*

*ఆండాళ్ తిరువడిగళే శరణం*


*ॐॐॐॐॐॐॐॐॐॐ*


నిన్న మన వాళ్ళు స్వామిని లేచి రమ్మని చెప్పారుకదా, స్వామి వస్తుంటే ఆయనపాదాలను చూసారు అవి కంది పోయినట్లు అనిపించింది. 


పాదాలు స్వతాహా గులాబి రంగులో ఉంటాయి కానీ వీళ్ళకేమో వీళ్ళ పిలుపికి స్వామి నడిచి వచ్చినందుకు కంది పోయాయి అనుకుంటున్నారు. వీళ్ళేమి కోరి రాలేదు కదా. కేవలం శ్రీకృష్ణుణ్ణి చూసి అనందిద్దామని వచ్చారు. 


ఆయన సింహాసనం పై కూర్చొని, చిలిపి వాడు కదా, వీళ్ళను ఏడిపిద్దాం అన్నట్లుగా ఒక కాలు క్రింద పెట్టి *“సవ్యం పాదం ప్రసార్య”* ఎడమకాలు ప్రసరింపచేసాడు, *“శ్రిత దురితహరం దక్షిణం కుంచయిత్వా”* దానిపై కుడి కాలు ఉంచి వీళ్ళకు తన పాదాలు కనిపించేలా అడిస్తూ కూర్చున్నాడు.


ముఖారవిందం పదారవిందం అన్నీ అరవిందములవలే సుకుమారము, సౌగంద్యము, కోమలత్వము కల్గినవి కదా, ఆయన పాదాలని చూసి అయ్యో ప్రేమ ఉంది అని నటిస్తూ మేం కూడా నీ పాదాలు కందిపోయేలా చేసామే అంటూ భాదపడ్డారు. వెంటనే స్వామి దివ్య పాదారవిందాన్ని మొదలుకొని  మంగళం పాడుతున్నారు.


ఈ రోజు పాశురాన్ని మంగళాశాసన పాశురం అంటారు. భగవంతుణ్ణి తెలుసుకున్న జీవుడికి రెండు రకాల దశలు ఉంటాయి మొదటిది జ్ఞాన దశ, రెండోది ప్రేమ దశ. జ్ఞాన దశలో భగవంతుడు ఎట్లాంటివాడో, తనూ ఎట్లాంటివాడో  తెలుసుకోవడం.


భగవంతుడు చాలా గొప్పవాడు, జగత్తును రక్షించేవాడు అని తెలుసుకోవడం. చేతనో ఏ జ్ఞానం లేనివాడు, భగవంతుడు రక్షిస్తే తప్ప రక్షణ లభించదు అని తెలుసు కుంటాడు. ఇక ఈ జ్ఞానం పండితే క్రమంగా ప్రేమ లేక భక్తి దశగా మారుతుంది.


 ఈ దశలో భగవంతుని కున్న శక్తిని మరచి ఆయన కున్న సౌకుమార్యం సౌశీల్యం అనే గుణాలనే చూస్తాడు. ఇక తను అజ్ఞానిని అని మరచి తనే భగవంతుణ్ణి రక్షించుకోవాలని అనుకుంటాడు. ఒకనాడు జ్ఞానం కల్గినప్పుడు భగవంతుడు  తనని రక్షించేవాడని భావించే అతను, భక్తితో ఈ నాడు తాను భగవంతుణ్ణి రక్షించుకోవాలి అన్నట్టుగా మారుతాడు.


 ఏదైన ఒక వస్తువు విలువైనది అని మనకు తెలిస్తే మనం ఎట్లా అయితే రక్షించుకుంటామో అట్లానే. అందుకే మనం ఆలయాల్లో తలుపులు, తాళం అని ఇలా చేస్తుంటాం, జగత్ రక్షణ చేసే వాడికి మనం రక్షణ ఏంటి కనుక. అది ప్రేమచే చేస్తాం. దృష్టిదోషం తొలగుగాక అని, కర్పూరం ఎట్లా అయితే హరించుకు పోతుందో అట్లా దోషాలన్ని హరించుగాక అని మంగళం పాడుతాం. 


గోదాదేవి కి ఈ విషయం వాళ్ళ నాన్న గారు తెలిపారు. విష్ణుచిత్తులవారు మధురానగరం వెళ్ళి పాండ్య రాజ్య సభలో భగవత్ తత్వాన్ని నిరూపిస్తారు. అందుకు వారిని ఏనుగుపై అంబారీ చేసి ఊరేగిస్తుంటే భగవంతుడు ఆయనకు ప్రత్యక్షమైనాడు. వీళ్ళ కంటికి నీవు కనపడితే నీకు దృష్టి దోషం తగులును అని మంగళం పాడారు.

 పల్-ఆండు అనేక సంవత్సరాలు, పల్-ఆండు అనేక సంవత్సరాలు  పలకోటి నూరు- ఇలా కోట్ల సంవత్సరాల వరకు నీకు మంగళం, శంఖానికి, చక్రానికి, పక్కన అమ్మకి అంటూ ఇలా మంగళం పాడారు. శ్రీరామాయణంలో కూడా రాముని పరాక్రమం తెలిసినవారుకూడా రామునికి ఎన్నో సార్లు మంగళం పాడారు.


 జగత్ కారణ తత్వం దేవకీ గర్భంలో ఉందని తెలిసి కూడా, ఆ చతుర్ హస్తాల్లో ఉన్న కృష్ణుడిని చూసి కంసునికి తెలిస్తే నీకే ఉపద్రవం వస్తుందోనని అన్నీ వెనక్కి దాచేసుకో అని దేవకీ అంటుంది. ఇవి ప్రేమతో చేసేవి. మన ఆలయాల్లో హారతి ఇచ్చే సంప్రదాయం కూడా ఇలా వచ్చిందే. అయితే హారతిని కళ్ళకు హద్దుకోరాదు.


హారతిని ఆర్పి పక్కన పెట్టి, ఎవరికైతే దృష్టిదోషం తీస్తామో వారికి కళ్ళు, పాదాలు కడిగి ఆచమనం చేయిస్తాం.  నీకు మంగళం అవుగాక అనేదే దీని అర్థం. ఈ జగత్తుకు పరమాత్మ వేరు కదా ,ఆయన క్షేమంగా ఉంటే లోకం అంతా క్షేమం, ఇక ఆయనను కోరాల్సిన అవసరం ఏంటి కనుక. 


ఆండాళ్ ఏనాడో ఆయన నడిచివచ్చినందు పాదాలు కందిపోయాయని మంగళం పాడుతుంది. వీళ్ళకు కాలంతో ప్రమేయం లేదు, ఎందుకంటే కాలం అనేది కూడా ఒక గాజు గోడ లాంటిదే. వీరి ముందేనా అంతా జరుగుతున్నది అని పరమ భక్తులు భావిస్తారు.


 *"అన్ఱివ్వులగమ్"* ఆనాడు వామనుడై లోకాలను *"అళందాయ్"* కొలిచిన, ఒక్కసారి అంతలా పెరిగినందుకు నీ పాదాలు ఎంత కందిపోయాయే!   *"అడి"* ఆ పాదాలకు *"పోత్తి"* మంగళం.


*"శెన్ఱ్"* వెళ్ళి *"అంగు"* అక్కడ ఉన్న *"త్తెన్-ఇలంగై"* దక్షిణ దిక్కున అందంగా ఉన్న లంకా నగరాన్ని పాలించే రావణాసురున్ని *"శెత్తాయ్"* సంహరించిన *"తిఱల్"* నీ భుజ భలానికి *"పోత్తి"* మంగళం.


*"పొన్ఱ"* తారుమారు అయ్యేలా *"చ్చకడం"* శకటాసురున్ని *"ఉదైత్తాయ్"* తన్ని అంతమొందిచ్చావు, ఏడు నెలల బాలుడవి, *"పుగర్"* నీ కీర్తికి *"పోత్తి"*  మంగళం.


*"కన్ఱు"* దూడ రూపంలో ఉన్న వత్సాసురున్ని *"కుణిలా"*


కర్రలా మార్చి వెలగ పండులో దాగిఉన్న కపిత్తాసురునిపై *"వెఱిందాయ్"* గిరగిరా తిరిగి విసిరిపాడేసి *"కరిల్"* నీ పాదానికి *"పోత్తి"* మంగళం.


*"కున్ఱు"* పర్వతాన్ని *"కుడైయా"* గొడుగులా  *"వెడుత్తాయ్"* ఎత్తి పట్టి అందరిని దరిన చేర్చుకున్న నీ *"కుణమ్"* సౌశీల్య గుణానికి *"పోత్తి"* మంగళం.


ఆండాళ్ స్వామిచేసిన ఇన్ని కార్యాలను కీర్తించిందికదా, ఎక్కడైనా దృష్టిదోషం తగులుతుందేమోనని, ఇవన్నీ చేసింది కృష్ణుడు కాదు అన్నట్లుగా *"వెన్ఱు"* గెలిచి *"పకై కెడుక్కుమ్"* విరోదభావం లేకుండా చేసే *"నిన్ కైయిల్"*  నీ హస్తంలో ఉన్న *"వేల్"* శూలాయుదానికి, తండ్రి నందగోపుడి వద్ద ఉన్న ఆయుదం *"కూర్వేల్"*   ఇదేకదా, ఆ శూలానికి *"పోత్తి"* మంగళం.


*"ఎన్ఱెన్ఱ్"* ఎల్లప్పుడు *"ఉమ్ శేవకమే"* నీ చరితమునే *"యేత్తి"* కీర్తించేలా *"ప్పఱై"* ఆ వాయిద్యాన్ని *"కొళ్వాన్"* తీసుకుంటాం. *"ఇన్ఱు"* ఈ రోజు *"యాం"* మెం ఎందుకు *"వందోం"* వచ్చామో *"ఇరంగ్"*  తెలుసుకొని అనుగ్రహించు అంటూ ఈరోజు స్వామిని అడుగుతున్నారు.


నిన్న స్వామిని లేపి ఆసనంపై కూర్చోబెట్టారు, ఈ రోజు దృష్టి దోషం తొలగటానికి మంగళం పాడుతున్నారు.  విగ్రహ రూపంలో ఉండే భగవంతుని వద్ద కూడా ఇంత సేవ జరుగుతుంది .ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మన ఇంట్లో కావచ్చు, మందిరంలో కావచ్చు విగ్రహం అంత శక్తి కలది, ఇది మన ఆండాళ్ మనకు తెలుపుతుంది.


*ॐॐॐॐॐॐॐॐॐॐ*


*తిరుప్పావై 24 వ పాశురము తెలుగు పద్యానువాదము*

*రచన*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి* 

*ॐॐॐॐॐॐॐॐॐॐ*


 *సీసమాలిక*.

*మంగళమని పాడ ముంగిట నిలబడి* 

       *బలి గర్వ మణచిన వామనునకు*

*సీతమ్మ తల్లిని చెరబట్టిన వాడు* 

          *బాహు బలము చూసి పతనమయ్యె*

*శకటాసురుని శక్తి ప్రకటించ నీయక*

        *నేలపై కూల్చెను కాలు సాచి*

*మూడడుగుల చేత ముల్లోకముల యందు*

        ,*విక్రమ రూప త్రివిక్రముండు*

,*గోవర్ధన ధరుడై గోవుల రక్షించె*

        *గోపల్లె వారల గోవులెల్ల*

*రాళ్ళ వర్షము నుండి రక్షింప నెంచెను*

        *గోవర్ధనోద్ధారి గోటి చేత*

*వత్సాసురుని లీల వారింపగా నెంచి* 

      *వడిసెల రాయిగా పారవేసె*

*మంగళమ్ము యనుచు మగువ లెల్లను గూడి*

        *స్వామి చెంతను చేరి సన్నుతింప*

*స్వామి నిద్రను వీడి స్వాగతింపడు యేల*

,*కృష్ణ! పరను మాకు కృపను చేయు!!*

 

*తే.గీ. భండనంబున వ్రేటు ప్రచండ రీతి* 

*బెదర గొట్టెను భీతితో బెదురు నట్లు*

*స్వామి గుణముల నెదిరింప సాధ్య పడక*

*మరలి రాలేక మరణమే శరణమనిరి*

*శ్రద్ధ భక్తిని కల్గించి బుద్ధి నిమ్ము*

*శ్రీధరుని మానసంబున స్థిరము కమ్ము!!*


🕉🌞🌎🌙🌟

డు రకాలుగా మాట్లాడుతుం

 n🙏🕉️శ్రీమాత్రేనమః.శుభోదయం🕉️🙏 🔥రెండు చెవులు ఒకే శబ్దాన్ని వింటాయి.. రెండు కళ్ళు ఒకే దృశ్యాన్ని చూస్తాయి.. రెండు నాసికలు ఒకే వాసన పిలుస్తాయి.. కానీ అదేమి మాయ రోగమో ఉండే ఒక్క నాలుక మాత్రం రెండు రకాలుగా మాట్లాడుతుంది🔥ఒక పక్షి పైకి ఎగిరితే మిగతా పక్షులు కూడా పైకి ఎగిరి అనందపడతాయి.. కానీ జ్ఞానమున్న మనుషులు ఏమిటో మరి.. ఒకడు పైకి ఎదుగుతుంటే వాడిని కిందకి తొక్కలని విశ్వప్రయత్నం చేసి అనందపడతారు...అందుకే ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికి ఉన్న దగ్గరే ఉండిపోతారు🔥మనిషి నివసించే ఇంటిని మారుస్తాడు.. నడుపుతున్న వాహనాన్ని మారుస్తాడు.. మాట్లాడుతున్న ఫోన్ ను మారుస్తాడు..చివరికి స్నేహుతులను కూడా మారుస్తాడు. కాని తనను తను మార్చుకోలేడు..అందుకే దుఃఖం మరియు నిరాశ లో ఉంటాడు🔥శరీరానికి మరణం ఒక్క సారి మాత్రమే..కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారి మరణమే.. అందుకే మనుషుల మీద కోపంతో మనస్సును ఎక్కువ పాడుచేసుకోకూడదు.. ఎందుకంటే మనుషులు ఎక్కువ సేపు నీతో ఉండరు.. కానీ మనస్సు ఎప్పటికి నీదగ్గరే ఉంటుంది🔥🔥మీ *అల్లo రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్& జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయిన వారు రాలేని వారు కొత్తవారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593.9182075510🙏

అసలు మనది కాదు

 అసలు మనది కాదు.. ఆఖరూ కాదు


తెలుగులో ఒద్దికగా ఒదిగిపోయిన పరభాషా పదాలెన్నో..


భారతీయ భాషల్లో తెలుగుకు విశిష్ట స్థానం ఉంది. ఇది ద్రావిడం నుంచే వచ్చినా.. ఉత్తర భారతీయ భాషల కంటే విశేషంగా సంస్కృత భాషా ప్రభావం కలిగి ఉంది. పరభాషల నుంచి వందలకొద్దీ పదాలను స్వీకరించి తన పద సంపదను సుస్థిరం చేసుకుంది. తెలుగుకు హిందీ, ఉర్దూలతో సన్నిహిత సంబంధా లున్నాయి. నేడు మనం తెలుగు కింద వాడుతున్న అనేక పదాలు హిందీ, హిందూస్థానీ భాషల నుంచి వచ్చి చేరినవి. 'అసలు' మనది కాదు, 'ఆఖరూ' తెలుగు పదం కాదు. ఇలా తెలుగులో ఒద్దికగా ఒదిగిపోయి.. తెలుగు భాషగా వ్యవహారంలోకి వచ్చిన, మనం నిత్యం వాడుతున్న పరభాషా పదాలను 1934లోనే దిగవల్లి వేంకట శివరావు తన పారిభాషిక నిఘంటువులో ఏర్చి కూర్చారు.



డక్కా


ఖర్చు


ముక్కీ


ఆసలు


ఖాయము


తకరారు


ఆఖరు


ఖులాసా


తగాదా


ఆటకా


తనభా


యించు


గరీబు


తనిఖీ


మజిలీ


షరతు


మజూరి


షరా


మరమ్మతు


షుమారు


మాపు


సబబ


మామూలు


సర్దారు


ఆదాలతు


గస్తీలు


తమాషా


తయారు


గుమాస్తా


తరం


अभ अ


మాలు


సరకు


మినహా


సరిహద్దు


యింపు


సర్కారు


ముక్తసరు


సలహా


అల్మారా


గులామ్


తరహా


మునసబు


సంజాయిషీ


ఆయకట్టు


ఆసామి


గైరుహా


జరు


తలారి


తహసీలు


మూజు


సవారి


వాణీ


సవాలు


చట్టము


దారు


ముస్తాబు


సాదా


ఈనాము


చలానా


తాకీదు


మేర


సామాను


చలామణి


మోజు


సాలు


యించు


చిల్లర


తాను


ఎకాఎకీ


చీటీ


తారీఖు


కంగాళ


చాకిరి


తుపాకీ


తెలుగు


మోతాదు


సావుకారు


రంగు


సిపాయి


రద్దు


సిఫారసు


చెల్లు


తుఫాను


రవాణా


సిబ్బంది


కట్టుబడి


తూలు


సిరా


sa


జనాభా


దగల్బాజీ


దుబారా


కబురు


జప్తు


దగా


దుబాసీ


పాయకానా


బందు


బందూకు


రహదారి


సిలుకు


రాజీ


సీదా


జబర్దస్తీ


దపా


నకలు


పితూరి


బందోబస్తు


రుజువు


శివారు


ఖరారు


దరఖాస్తు


నగదు


పీపా


బకాయి


రుసుము


సిస్తు


కలం


జమా ఖర్చు


చరవాజ


నగారా


పీర్లు


బట్వాడా


సోబతి


కలాయి


జవాబు


దర్గా


నమోదు


పుకారు


బడాయి


రైతు


సుబా


కవాతు


اكدالك


దర్జా


నమూనా


జాబితా


దర్బారు


నవారు


పురసత్తు


పోరంబోకు


బత్తా


లంగరు


సుస్తీ


బర్తరపు


లాలూచి


సుమారు


కిరాణా


జామీను


దరిమిలా


నాజూకు


పకీరు


బలాదూరు


లావాదేవి


స్వారీ


కిరాయి


జాగీరు


దర్యాప్తు


నిఘా


ఫర్మానా


బాక్


లూటీ


హద్దు


కిస్తీ


దస్కతు


నౌకరు


పాయిదా


బాతాఖాని


హవాలా


కుమ్మక్


దస్తరము


పంకా


బిచానా


వకీలు


హవేలీ


కుళాయి


దస్తావేజు


పంపు


యించు


బురకా


వజీరు


హాజరు


కూపీ


జుల్మానా


దస్తూరి


పక్కా


ఫిర్కా


వాపసు


హుండీ


ఖైదు


దాఖలు


పరగణా


ఫిర్యాదు


బేడీలు


హుజూరు


కైపు


టపా


పరవా


బంగళా


భరతం


వస్తాడు


హుషారు


కొత్వాలు


టోకు


దినుసు


పరాయి


బంజరు


శిస్తు


హైరాణా


కౌలు


దివాణము


బందరు


మంజూరు


శివారు


హోదా

7, జనవరి 2025, మంగళవారం

విష్ణు సహస్రనామ స్తోత్రము*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

 *విష్ణు సహస్రనామ స్తోత్రము*

           *రోజూ ఒక శ్లోకం*

*అర్థం, తాత్పర్యం, ఆడియోతో*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*శ్లోకం (12)*


*వసుర్వసుమనాః సత్యః*

*సమాత్మాసమ్మితః సమః ।*


*అమోఘః పుణ్డరీకాక్షో*

*వృషకర్మా వృషాకృతిః ॥* 


*ప్రతి పదార్థం:~*


*105) వసుః - సర్వ భూతములయందు వశించువాడు; సమస్త భూతములు తనయందు గలవాడు;*


*106) వసుమనాః - పరిశుద్ధమైన మనస్సు గలవాడు.*


*107) సత్యః - సత్య స్వరూపుడు, నిజమైనది, మూడు కాలములలో నుండునది, నాశనము లేనిది;*


*108) సమాత్మా - సర్వప్రాణుల యందు సమముగా వర్తించువాడు.*


*109) సమ్మితః - భక్తులకు చేరువై భక్తాధీనుడైనవాడు.*


(అసమ్మితః ---

పరిచ్చేదింపబడజాలనివాడు;

అంత్యము, హద్దు లేనివాడు)


*110) సమః - అన్నింటియందును సమభావముగలవాడు;*


*111) అమోఘః - భక్తుల స్తుతులను ఆలకించి ఫలముల నొసగువాడు.*


*112) పుణ్డరీకాక్షః - పద్మనయునుడు, తామరపూవు వంటి కన్నులు గలవాడు;*


*113) వృషకర్మా - ధర్మకార్యములు నిర్వర్తించువాడు.*


*114) వృషాకృతిః -ధర్మమే తన స్వరూపముగా గలవాడు, మూర్తీభవించిన ధర్మ స్వరూపుడు*


*తాత్పర్యం :~*

 

*సమస్త భూతములును తనయందే గలవాడును. శ్రేష్ఠమైన మనసు కలవాడును, సర్వ కాలములందు వుండువాడును. నాశ రహితుడును, వికార రహితుడై అన్నిటి యందును సముడై యున్నవాడును, తామరపువ్వు వంటి నేత్రములు కలవాడును, ధర్మమే ఆకారముగా కలవాడును. మూర్తీభవించిన ధర్మస్వరూపుడును అగు శ్రీమన్నారాయణుడికి శిరస్సు వంచి వందనం మొనర్చుచున్నాను*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*(ఏరోజుకా రోజు ఇచ్చిన శ్లోకం  కంఠస్థం వచ్చేదాకా మననం చేద్దాం)*


*సూచన: కృత్తిక నక్షత్రం 4వ పాదం జాతకులు పై 12వ శ్లోకమును నిత్యం కనీసం 11 పర్యాయములు పఠించడం ద్వారా వారు సకల శుభాలను పొందగలరు.*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*ఓం నమో నారాయణాయ!*

*ఓం నమః శివాయ!!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

తిరుప్పావై 23 వ పాశురము

 తిరుప్పావై  23 వ పాశురము

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🍃🌷పాశురము:


మారి మలై మురైంజిల్ మన్ని క్కిడందుఱంగుం 

శీరియ శింగం అరివుత్తు త్తీవిరిత్తు

వేరి మయర్ పొంగ ఎప్పాడుం పేరుందుదఱి

మూరి నిమిరుందు మురంగి ప్పుఱప్పట్టు 

పోదరుమా పోలే నీ పూవైప్పూ వణ్ణా  ఉన్ 

కోయిల్ నిన్ఱు-ఇంగనే పోందరిళి క్కోప్పుడైయ

శీరియ శింగాశనత్తిరుందు యాం వంద

కారియం ఆరాయ్-అందరుళ్-ఏలోర్ ఎమ్బావాయ్


⚜️🌷⚜️🌷⚜️🌷⚜️🌷⚜️🌷⚜️


ఈ రోజు ఆండాళ్ ఒక సింహం తన గుహలోంచి బయలుదేరి ఎట్లా వస్తుంది అనే అద్భుత వర్ణన ఈ నాటి పాటలో చేస్తుంది, అందుకే ప్రకృతి గురించి అధ్యయనం చేయాలన్నా తిరుప్పావై చదవాలి, సాహిత్యం తెలియాలంటే తిరుప్పావై లోకి రావాలి, ఉపమానోపమేయాల గురించి తెలియాలంటే తిరుప్పావై చదవాలి, ఇక ఇదీ అదీ అని నియమం లేదు అన్నట్లుగా సవాలు విసురుతుంది తిరుప్పావై. అన్నింటికి ఇది మూలం ఇక్కడి నుండే బయటకు వచ్చినవి మాత్రం మనకు సాక్షాత్కరిస్తుంది అని చెప్పవచ్చు.  


ఈ రోజు అమ్మ స్వామి సన్నిధానానికి చేరి స్వామిని మేల్కొల్పే పాశురం. భగవంతుణ్ణి చేరే వరకే శాస్త్రం, ఇక చేరిన తర్వాత ఇక శాస్త్రానికి ప్రాదాన్యం లేదు. లోకంలో మనకు తెలుసు ఎలగైతే వివాహం జరిగే వరకే శాస్త్రం ఇకపై శాస్త్రాలు వర్తించవు ఇరువురి ప్రేమ విషయంలో అట్లానే భగవంతుణ్ణి  చేరే వరకు ఎన్నో నియమాలు ఉంటాయి, ఎన్నో రకాల పరిక్షలు ఉంటాయి. ఇక భగవంతుణ్ణి సన్నిధానానికి చేరాక ఇక  భగవంతుడు భక్తుల పట్ల సర్వాత్మనా చెందే ఉంటూ తను వాళ్ళు ఆదేశించినట్లు ప్రవర్తిస్తూ ఉంటాడు.


ఈ విషయాన్ని మనం రామాయణంలో గమనించవచ్చు. రాముడు విభీషనుణ్ణి అనుగ్రహించాల్సి వచ్చింది. మొడట తన అభిప్రాయం చెప్పడం లక్ష్మణ, సుగ్రీవాదులను ఒప్పించటం, తరువాత సుగ్రీవుణ్ణి పంపి విభీషనుణ్ణి రప్పించటం ఒక పెద్ద ప్రక్రియ సాగింది. “లొచనాభ్యాం పిభన్నివ” అంటూ ఒక కంటి చూపుతో తను విభీషనునికి రక్షణ ఇవ్వటంలో జరిగిన కాల విలంబనని తెలుపుతూ దగ్గరకు తీసుకున్నాడు. అలాగే మనవాళ్ళంతా స్వామి సన్నిధానానికి చేరగానే స్వామి తన స్వతంత్రాన్ని పక్కకు పెట్టాడు. శరణు అంటూ వచ్చిన విభీషనుడికి రాముడే దాసుడై విభీషనుడు చెప్పినట్లూ చేసాడు. విభీషనుడు రాముడిని చేరటానికి శరణాగతే మార్గం అయ్యినందున, అదే మార్గం రాముడికీ చెప్పాడు. సముద్రుడికి శరణాగతి చేయ్యటం ఆ సముద్రుడు అర్హుడా కాడా కూడా చూడలేదు రాముడు. ఇదీ స్వామి తత్వం భక్తుల విషయంలో. తన స్వతంత్రాన్ని పక్కన పెట్టేస్తాడు. 


అందుకే మన వాళ్ళు నిన్న స్వామిని ఎట్లా కళ్ళు తెరియాలో ఆదేశించారు. ఈ రోజు పాటలో గోదాదేవి స్వామిని లేచి, క్రమంగా నడచి వచ్చి సింహాసనం పై కూర్చోని తమ మొరలని ఆలకించమని ప్రార్థిస్తుంది. “క్కోప్పుడైయ శీరియ శింగాశనత్తిరుందు” నీకు తగిన అద్భుతమైన సింహాసనం ఉంది, దానిపై కూర్చుని ఉంటే మేం అడిగినవి తప్పక ప్రసాదిస్తావు,  దానిపై నీవు కూర్చొంటే “యాం వంద కారియం ఆరాయ్-అందరుళ్” మెం ఒక కార్యార్తులమై వచ్చాం, మేం ఎం చేయదల్చుకున్నామో తెలుసుకొని మేం ఎట్లా చెయ్యలో మాకు తెలుపు. 


ఈ ప్రక్రియలో భాగంగా గోదాదేవి స్వామిని ఎట్లా లేచిరమ్మని చెబుతుంది అనేది ఒక అద్భుతమైన వర్ణన. గోదాదేవి యొక్క తిరుప్పావై కొన్నింటిని తనతో పాటు సమానంగా తీసుకొని వస్తుంది. అందులో ఒకటి పై పై కి కనిపించే కృష్ణ-గోపికల కథ. రెండవది తిరుప్పావై సారాంశమే వేదం కనుక తత్వాన్ని సాక్షాత్కరించుకోవడానికి జరిగే ప్రక్రియ ఏమిటి అనేది చెబుతుంది. ఇక మూడవది మనం భగవంతుణ్ణి చూసే స్థానానికి వెళ్ళేప్పుడు మనల్ని మనం ఎట్లా సిద్దం చేసుకొని వెళ్ళవలె అనేది తెలుపుతుంది. భగవంతుణ్ణి ఈ ప్రకృతి మండలాల్లో చూడగలిగే స్థానం విగ్రహా రూపకంలోనే కదా, అది మన ఇంట్లో ఆరాధన చేసుకొనే విగ్రహం ఐనా కావచ్చు లేక ఆలయాల్లో ఉన్న అర్చా మూర్తి ఐనా కావచ్చు. అప్పుడప్పుడు మన ఆలయాల్లో భగవంతుడు బయటికి వస్తూ ఉండే ఆ పద్దతి ఏంటి, ఇక నాలుగవది శ్రీకృష్ణుడు తన భవనంలోంచి ఎట్లా రావాలి ఇవన్నీ తెలుపుతు వస్తుంది ఆండాల్ తల్లి.


ఇక స్వామి ఎలా రావాలో చెబుతూ వానా కాలంలో కొండ గుహల్లో నిదురించే సింహం తనంతట తాను మేలుకాంచి బయటికి వచ్చే ప్రక్రియ ఎట్లా ఉంటుంది అనేది వర్ణిస్తుంది. “మారి” వానాకాలం అనగానే విడిగా ఉన్నవారికి దుఃఖాన్ని ఇస్తుంది, కలిసిన వారికి ఆనందాన్ని ఇస్తుంది, వైరాలని మరిపిస్తుంది. యుద్దాలు చేసేవారు కూడా వానా కాలంలో ఆపేస్తారుకదా. సుగ్రీవుడు రాజ్య సుఖాలతో హాయిగా ఉంటే, రాముడు మాల్యాద్రి పర్వతం పై ఉండి తనకు జరిగిన సీతా విరహాన్నీ లక్ష్మణ స్వామికి విన్నపించుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం మనం కూడా ఒక వానాకాలంలోనే ఉన్నాం మరొక వానా కాలం కోసం ప్రతిక్షిస్తున్నాం.  ఏ వానా కాలంలో ఉన్నాం అంటే రక రకాల దుఃఖాలను సంతతమూ వర్షించే ఈ భూమి పై ఉన్నాం కదా “బహుదా సంతత దుఖ:వర్శిని  బవ దుర్దినే అద:స్కలితం” అంటారు మన యామునాచార్యులవారు.  


ఈ సంసారం అనే అరణ్యంలో దారి తప్పి సంచరిస్తున్నాం, “అవివేక ఘన అంద ద్విగ్ముఖే”అవివేకం అనే కారు మబ్బులు జ్ఞానమనే సూర్యున్ని కప్పుకొని దారి తప్పి పోయాం. వివేకం అంటే విడదీసి బ్రతకటం, దేన్ని విడదీసి అంటే ఆత్మను మరియూ శరీరాన్ని వేరుగా చూసి బ్రతకడం, ఇలా బ్రతకక పోవడమే అవివేకం, దీనివల్ల నిరంతరం దుఃఖం వర్షింస్తుంది, సూర్యుడు కనిపించడం లేదు. మనలోని అజ్ఞానం మనల్ని ఎప్పటికి వదిలి ఉండని అచ్యుత భానున్ని కనిపించకుండా చేస్తుంది. మరి ఆ మబ్బుల్ని మన అంతట మనం తొలగించుకోగలమా, లేదు కదా, మరి ఆ సూర్యుడే తనంతట తాను మనకు కనిపించే ప్రయత్నం చేయాలే తప్ప మనం ఆయనను చూడలేం. అందుకే “మాం అవలోకయా అచ్యుత” అని ప్రార్థిస్తారు. నేను నిన్ను చూడలేను, నీవే ఆటంకాలు తొలగించు. అలా  ప్రార్థిస్తూ మరొక వాన కావాలని మన పూర్వులు కోరుతున్నారు, అదేంటంటే ....


“త్వదీక్షణ సుదా సింధు విక్షేప పసీకరైహి|

కారుణ్య మారుతా నీతైహి శీతలైహి అభిషించమాం||”


"హే భగవన్! నీ చూపులే సాగరాలు, అందులో కారుణ్యం అనే గాలులు వీస్తుంటాయి, ఆ గాలుల వల్ల సముద్ర జలాలు గాలిలో  తేలుతూ ఒడ్డున ఉండే వారికి సోకి ఎంతటి ఆహ్లాదాన్ని ఇస్తాయో అలాగే నీ చల్లని నేత్రాల ద్వారా నీదయని కురిపించి ముంచెత్తు".   ఈ వానను కోరుకుంటున్నారు. 


అలాంటి వానాకాలంలో “మలై మురైంజిల్” పర్వతపు గుహల్లో “మన్ని క్కిడందుఱంగుం” మన్నికగా కాల్లు ముడుచుకొని పడుకొని నిదురించే “శీరియ శింగం” నిద్రలో కూడా పరాక్రమాన్నీ వీడక ఉండే సింహం. శక్తి తేజస్సు ఎప్పటికి కల్గిన సింహం. సింహం తనంతట  తానూ లేచి రావాల్సిందే కాలం లేపినప్పుడు, కానీ ఎవ్వరు దానిని లేప తగరు.  ఆండాళ్ తల్లి ఈ సింహం ఎలాగైతే మృగరాజైనట్లుగా సాక్షాత్తు జీవులకు రారాజైన ఆ భగంతుడిని భావిస్తుంది. సింహం ఎలాగైతే గుహల్లోంచి బయటకు రావడం అనేది మన ఆలయాల్లోంచి ఉత్సవమూర్తి బయటకు రావడమా అన్నట్లుగా చెబుతుంది. “శీరియ శింగం” శ్రీతో కూడుకున్న స్వామి. అయితే స్వామి సంకల్ప విశిష్టుడై ఉంటాడు కదా, సృష్టికి పూర్వదశ కూడా నిర్గుణ దశ కాదు అని ఉపనిషత్తులు చెప్పినట్లుగానే ఆండాల్ అది “శీరియ శింగం” అని చెబుతుంది.


“అరివుత్తు” ఆ సింహం తనంతట తాను లేచి “త్తీవిరిత్తు” ఒక్క సారి తన తేజస్సును బయటకు నేత్రాల నుండి కనిపించేట్లుగా తెరిచింది.  “వేరి మయర్ పొంగ” తన జూలును గగుర్పాటు వల్ల ఒక్క సారి దులుపు కొని “ఎప్పాడుం పేరుందుదఱి” ఇటూ అటూ దొర్లుతూ,  “మూరి నిమిరుందు మురంగి ప్పుఱప్పట్టు” ఒక పెద్దగా గర్జిస్తూ  “పోదరుమా పోలే” అప్పుడది బయలుడేరినట్లే  నీవూ అట్లా రావాలి. 


సృష్టి పూర్వ దశ నుండి సృష్టి  తరువాత దశ వరకు ఆండాళ్ స్వామిని సింహం తో పోలుస్తుంది. ఆది ఎట్లా అని చాందోగ్య ఉపనిషత్ వర్ణిస్తుంది. సృష్టి కి ముందు భగవంతుడు ఒక సంకల్పం చేస్తాడట. ఆసంకల్పం “తడైక్షత భహుష్యాం ప్రజా యేయేతి” నెనే నానుండి అనేకమందిని తీద్దును గాక అనుకుంటాడట. ఇక సృష్టి చేయడం ఎలా అంటే త్రివుత్కరణం అని చెబుతారు.


మొదట తనలోంచి తేజస్సుని తీస్తాడు, తేజస్సులోంచి జలాన్ని తీస్తాడు,  జలంలోంచి పృథ్విని తీస్తాడు. ఇక వీటిని సగం సగం సగం భాగాలుగా చేస్తాడు. ప్రతి రెండో భాగాన్ని మల్లీ సగం సగం చేస్తాడు. ఇప్పుడు ప్రతీదీ ఒక పెద్ద భాగం గా రెండు చిన్న భాగాలుగా ఉంటాయి. ఇక అన్ని భాగాలు ఒక్కో దానిలో వచ్చేట్లుగా పంచి మూడింటిని సిద్దం చేస్తాడు. అయితే ప్రతీదాంట్లో ఏదో ఒక భాగం ఎక్కువగా ఉండి మిగతావి రెండు తక్కువగా కల్గి ఉంటాయి. 


ఇవన్నీ కల్పి ఒక అండం క్రింద తయారు చేస్తాడు. దీన్నే బిగ్ బ్యాంక్ అని ఇప్పటి వాళ్ళు చెబుతున్నారే అది. “యుగప్పత్ సృష్టికార్యం”  ఒక చిటికెలో సృష్టికార్యం జరిగి పోయింది, అనేక కోట్ల అండాలు బయటకు వస్తాయి. అలా బయటకు వచ్చిన ఒక అండంలో ఒక గోళంలో మనం ఉన్నాం. ఈ బయటకు వచ్చిన ప్రతి అండంలో ఒక బ్రహ్మ ను పెడుతాడు. ఆ బ్రహ్మ శరీరంలోంచి పదకోండు ప్రజాపతులను బయటికి తీస్తాడు. ఇంతవరకు తాను నేరుగా చేస్తాడు. దీన్నే అద్వారక సృష్టి అంటారు. బ్రహ్మకు వేద ఉపదేశం చేసి, ఇక పై బ్రహ్మ ద్వారా సృష్టి చేస్తాడు. ఇది సద్వారక సృష్టి. ఇక బ్రహ్మ సృష్టించాక అన్నీ వస్తువులలో అంతర్యామి అయ్యి తానుంటాడు.


ఈ కార్యాన్నంతా ఆండాళ్ తల్లి ఇక్కడ చెబుతుంది. ఒక శీరియ సింహం అంటే సంకల్ప విశిష్టుడైన స్వామి, సింహం ఎలాగైతే తనంతట తాను లేచిందో, సృష్టి ఎవరో ప్రేరేపిస్తే చేసేది కాదు, తనంతటా తానూ ఐచ్చికంగా చేసేది. ఇక సింహం ఎలాగైతే తన తీక్షణమైన కళ్ళు తెరిచీందో పరమాత్మ తనలోంచి తేజస్సును బయటికి తీస్తాడు. సింహం తన జూలును విప్పార్చి తన పరిమళాన్ని అన్నివైపులా వెదజల్లినట్లే, అయితే శాస్త్రం “గందవతీ పృథ్వీ” అని చెబుతుందికదా, పరమాత్మ పరిమలం కల భూమిని దానిలోంచి నీటిని బయటికి తీస్తాడు. ఇక సింహం పడి అన్నివైపులా పొర్లుతున్నట్లుగా పరమాత్మ త్రివుత్కరణం చేసాడు. ఇక సింహం ఎలాగైతే సాగిందో పరమాత్మ తన సృష్టికార్యాన్ని సాగించాడు. ఏర్పడ్డ ఒక్కో అండంలో ఒక్కో బ్రహ్మను ఉంచాడు. సింహం ఎలాగైతే గర్జించిందో తాను బ్రహ్మకు వేదాలని ఉపదేశం చేసాడు. ఇక సింహం తన యాత్రను ముందుకు సాగించినట్లే, పరమాత్మ అన్నింటిలో అంతర్యామియై ఉన్నాడు. ఈక్కడ గోదాదేవి నాభిస్తానంలో పవళించి ఉన్న ఆ అంతర్యామిని తన హృదయ సింహాసనంలో కి నిలిచి ఉండేలా రమ్మని భావిస్తుంది. 


ఆలయాల్లో ఉత్సవ విగ్రహం పురపాడు కి బయలుదేరినట్లు గా కూడా భావిస్తుంది. గర్భాలయాల్లో ఉండే మూర్తి కదలడు కనుక కదిలే రూపంలో ఉత్సవ విగ్రహంగా మనకు దర్శనం ఇస్తాడు. “నీ పూవైప్పూ వణ్ణా” అదసీ పుష్పం వంటి సౌందర్యం కల వాడా,  “ఉన్ కోయిల్ నిన్ఱు” నీ కోవల నుండి, అంటే ఓంకారమనేదే స్వామి ఇల్లు కదా ఆ వేద తత్వమనేది బయటికి రావాలి తన స్థానాన్ని ప్రదర్శించాలి. ఇక ఆలయాల్లోంచి ఉత్సవ మూర్తి బయటికి రావాలి, ఒక శ్రీకృష్ణుడు తన మందిరంలోంచి బయటికి రావాలి ఇన్నింటిని ఆండాళ్ భావిస్తోంది. “ఇంగనే పోందరిళి” ఇలానే రావాలి అని చెబుతుంది, మన ఆండాల్ “అన్నవయల్ పుదువై ఆండాళ్” పరమహంసలే నడక నేర్ప గలిగేది కద, తాను శ్రీకృష్ణుడి కూడా నేర్పుతుంది.  


“క్కోప్పుడైయ శీరియ శింగాశనత్తిరుందు” అలంకృత సింహాసనంపై కూర్చొనమని ప్రార్థిస్తుంది ఆండాళ్. ఇక్కడ సింహాసనం అంటే మన హృదయ సింహాసనం, జ్ఞాన, అజ్ఞాన, ఐశ్వర్య, అనైశ్వర్య, ధర్మ, అధర్మ, వైరాగ్య ఇహ్యాదులు అన్నీ కలిసి ఉండే ఈ ఆసనంలోంచి సృష్టికి కావల్సిన సృజ్య వస్తువులు వస్తూ ఉంటాయి, ఇక ఆలయాల్లో అయితే దర్మ పీఠాసనం అంటారు, ఇక శ్రీకృష్ణ భవనంలో సింహాసనం ఇన్నింటినీ భావిస్తూ ఆండాళ్ శ్రీకృష్ణున్ని దానిపై కుర్చొమ్మని చెబుతుంది.


🌷ఆండాళ్ తిరువడిగలే శరణం..శరణం..🙏🙏

మొగలిచెర్ల అవధూత

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర..*


*ఆత్మ త్యాగం..కపాలమోక్షం..*


*(అరవై మూడవ రోజు)*


ఒక వారం రోజుల పాటు ఎవ్వరినీ ఆశ్రమానికి రావొద్దన్న శ్రీ స్వామివారు కఠోర సాధన లో పూర్తిగా లీనమై పోయారు..ప్రధాన గది లో గల నేలమాళిగ లోనే తపస్సు కొనసాగించారు..


1976, మే నెల 6వతేదీ నాటి ఉదయం 9గంటల వేళ.. గొర్రెలు కాచుకునే ఎరుకలయ్య అనే మొగలిచెర్ల గ్రామానికి చెందిన వ్యక్తి..కుతూహలం కొద్దీ..ప్రహరీ గోడ మీదుగా ఆశ్రమం లోకి తొంగి చూసాడు..ఆశ్రమ వరండా ముందు వున్న పందిరి క్రింద..శ్రీ స్వామివారు పద్మాసనం వేసుకొని నిటారుగా కూర్చుని ధ్యానం లో వున్నారు..అలా ధ్యాన ముద్రలో ఆరుబైట శ్రీ స్వామివారు ఎన్నడూ కూర్చోలేదు..


ఎరుకలయ్య కొద్దిసేపు అక్కడే తచ్చాడి..మళ్లీ చూసాడు..శ్రీ స్వామివారు అదే స్థితి లో అలానే కూర్చుని వున్నారు..ఈరోజు స్వామి బైట తపస్సు చేసుకుంటున్నాడేమో..అనుకోని ఎరుకలయ్య తన పని లో తానుండి పోయాడు..కానీ మధ్యాహ్నం ఒంటి గంటప్పుడు ఎరుకలయ్య..మళ్లీ చూసాడు..ఈసారి శ్రీ స్వామివారి దేహం ప్రక్కకు ఒరిగి ఉన్నది..ఎరుకలయ్య కు ఎందుకో అనుమానం వచ్చింది..ఒక్క నిమిషం లోనే అతని మనసు కీడు శంకించి..వెంటనే🥰 ఆలస్యం చేయకుండా పరుగు పరుగునా.. మొగలిచెర్ల చేరి..శ్రీధరరావు గారి ఇంటికి వెళ్లి..శ్రీధరరావు గారితో..తాను చూసిన విషయాన్ని మొత్తం చెప్పేసాడు..


శ్రీధరరావు ప్రభావతి గార్లకు ఒక్కసారిగా అనిపించింది..శ్రీ స్వామివారు తాను అనుకున్న విధంగా ప్రాణత్యాగం చేసారేమో..అని..వెంటనే బండి సిద్ధం చేయమని చెప్పారు..ఈలోపల..శ్రీధరరావు గారి కుమారుడు ప్రసాద్, మరికొంతమంది గ్రామస్థులు సుమారు 30 మంది గబ గబా ఆశ్రమానికి నడచి వెళ్లారు..


ఆశ్రమం పైన..నిండుగా రామ చిలుకలు వాలి ఉన్నాయి..ప్రధాన ద్వారం తీసుకొని లోపలికి వెళ్లి చూసేసరికి..శ్రీ స్వామివారు పద్మాసనం లోనే వున్నారు కానీ..దేహం ఎడమ ప్రక్కకు ఒరిగి ఉన్నది..శ్వాస లేదు..


శ్రీ స్వామివారి శరీరం ప్రక్కనే..కమండలం నీటితో నిండి ఉన్నది..కమండలం ప్రక్కన..ఒక చిన్న రాయి క్రింద..ఒక చీటీ..పెట్టి ఉన్నది..అందులో.."నేను శ్రీ దత్తాత్రేయ స్వామి అవతారంగా మారిపోయాను.. ఇక నుంచీ నన్ను అందరూ దత్తాత్రేయ స్వామి అని వ్యవహరించండి..శనివారాల్లో తప్ప మిగిలిన అన్నిరోజుల్లో నా మందిర ద్వారాలు తెరచి ఉంచండి.." అని వ్రాసి వున్నది.. 


ప్రసాద్ తో సహా చూసిన వారందరూ శ్రీ స్వామివారు మరణించారని భావించారు..శ్రీ స్వామివారి దేహాన్ని ముట్టుకోవడానికి అందరూ జంకారు..


శ్రీధరరావు గారి ఇంటి ప్రక్కనే కాపురం వుండే గోపిశెట్టి బలరామయ్య అనే వ్యక్తి "స్వామి వారి శరీరాన్ని ..మనం  సరిగ్గా ఉంచాలి కదా.." అంటూ..తన రెండు చేతులతో శ్రీ స్వామివారి దేహాన్ని ఎత్తుకొని..వరండాలో గోడకు ఆనించి..శ్రీ స్వామివారు కూర్చున్న పద్మాసనం స్థితి లోనే ఉంచాడు..అప్పటికి కూడా శ్రీ స్వామివారి శరీరం బిగుసుకుపోలేదు..మామూలు గానే ఉన్నది..


మరి కొద్ది సేపటికే.. శ్రీధరరావు ప్రభావతి గార్లు వచ్చారు..శ్రీ స్వామివారిని చూసి వారికి దుఃఖం ఆగలేదు..శ్రీధరరావు గారు త్వరగా తేరుకొని..ఒక మనిషిని పిలచి..శ్రీ స్వామివారి సోదరులకు కబురు అందించి..వారిని వెంటబెట్టుకు రమ్మనమని చెప్పి పంపారు..ఈలోపల మొగలిచెర్ల గ్రామస్థులు అందరూ అక్కడ గుమిగూడారు..అప్పటికి సమయం మధ్యాహ్నం 4 గంటలు కావొస్తోంది..


ఆరోజు ఉదయం తిథి..వైశాఖ శుద్ధ సప్తమి..శ్రీ స్వామివారు చెప్పిన వారం రోజుల గడువు ఆరోజుతో ముగిసింది..శ్రీ స్వామివారు తనను సజీవ సమాధి చేయమని పదే పదే  చెప్పిన మాటల్లోని అంతరార్ధం అప్పటికి ఆ దంపతులకు అర్ధమైంది..


క్రమంగా సాయంత్రం కావొచ్చి..చీకట్లు వ్యాపిస్తున్నాయి..శ్రీధరరావు గారు ఇక చేయవలసిన ఏర్పాట్ల గురించి ఆలోచించసాగారు..రెండు మూడు పెద్ద పెట్రోమాక్స్ లైట్ల ను తెప్పించారు..శ్రీ స్వామివారి కుటుంబ సభ్యుల రాక కోసం ఎదురు చూడసాగారు..రాత్రి 9.30 గంటల ప్రాంతంలో శ్రీ స్వామివారి సోదరులు తల్లి వచ్చారు..పద్మయ్య నాయుడు తనకు శ్రీ స్వామివారు తనతో  చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకొని..శ్రీధరరావు గారితో ఆ సారాంశమంతా వివరించి చెప్పారు.. 


రాత్రి 11 గంటల సమయం..అప్పుడు..ఎవ్వరూ ఊహించని సంఘటన జరిగింది..


శ్రీ స్వామివారి కపాలమోక్షం..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

మొగలిచెర్ల అవధూత

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర..*


*అంతుపట్టని అంతరంగం..*


*(అరవై ఒకటవ రోజు)*


శ్రీ స్వామివారు ప్రాణత్యాగం చేయడానికే నిశ్చయించుకున్నారని శ్రీధరరావు దంపతులు నిర్ణయించుకున్నారు..శ్రీ స్వామివారి ఆశ్రమం నుంచి తిరిగివచ్చిన తరువాత..ప్రభావతి గారు దుఃఖం ఆపుకోలేక పోయారు.."అమ్మా..నన్ను నీ పెద్ద కుమారుడిగా భావించుకో.." అని శ్రీ స్వామివారు చెప్పిన మాటలు ఆవిడ చెవుల్లో మారుమ్రోగుతున్నాయి..ఆమాటే శ్రీధరరావు గారితో చెప్పుకొని కళ్లనీళ్లు పెట్టుకున్నారు..


"ప్రభావతీ..సాధకులు.. సన్యాసులు.. అవధూతలు..భవబంధాలకు దూరంగా ఉంటారు..వారు తాము ఈ జన్మలో తమకు నిర్దేశించిన కార్యాన్ని పూర్తి చేసుకొని వెళ్ళిపోతారు..మనబోటి గృహస్థులం మాత్రం ఈ లంపటం లోంచి బైటపడలేము..మనసు స్థిర పరచుకో..మనమూ ఏ వార్త వినడానికైనా సిద్ధపడి ఉండాలి..ఆ మహనీయుడి సాంగత్యం మనకు ఇంతకాలం ప్రాప్తి!..అదే ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశం అనుకుందాము.." అని ఊరడించారు.. ప్రక్కరోజు నుంచి ఆ దంపతులు తమ పనుల్లో తాము మునిగిపోయారు..


ఆ మరుసటి రోజు సాయంత్రం..శ్రీ స్వామివారు ఏప్రిల్ 30 వతేదీనాడు తనను కలువమని శ్రీధరరావు గారికి చెప్పి పంపారు..సరిగ్గా నాలుగు రోజుల గడువుంది 30 వ తేదీకి..ఇన్నాళ్ల తమ పరిచయం లో శ్రీ స్వామివారు ప్రత్యేకంగా ఇలా తేదీ చెప్పి ఆరోజే కలువమని చెప్పలేదు..ఏ వార్త వినాల్సి వస్తుందో అని కొద్దిగా అయోమయానికి గురయ్యారు ప్రభావతి శ్రీధరరావు గార్లు ..సరే!..అంతా భగవదేచ్ఛ!..జరగాల్సింది జరుగుతుంది..అనుకోని ఊరుకున్నారు..


ఈలోపల శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టారు గారు ఒక ఉత్తరం వ్రాసారు  తాను వ్రాసిన "సాయి లీలామృతం" గ్రంధాన్ని పంపుతున్నాననీ..ఆ గ్రంధాన్ని

పారాయణం చేసి అభిప్రాయం తెలుపమని..ఆధ్యాత్మిక గ్రంథ రచనలో తమకు సహకరించమని.. ప్రభావతి గారికి ఆ ఉత్తరం ద్వారా కోరారు..ప్రభావతి గారు తమ జవాబులో..శ్రీ స్వామివారి గురించి వివరంగా తెలియచేసి..తానిప్పుడు రచనలు చెయ్యడం దాదాపుగా మానుకొన్నాననీ..సాయిలీలామృతాన్ని పారాయణ చేసి అభిప్రాయం త్వరలోనే తెలుపుతాననీ..వీలైతే భరద్వాజ మాస్టారు గారిని ఒకసారి మొగలిచెర్ల కు వచ్చి, శ్రీ స్వామివారిని దర్శించమని సవినయంగా వ్రాసారు..మాస్టారు గారు కూడా త్వరలోనే వస్తానని జవాబు వ్రాసారు..


ఆరోజుకు ప్రభావతి గారికి తెలియదు..శ్రీ భరద్వాజ మాస్టారు గారు వెలిగించిన శ్రీ శిరిడీ సాయిబాబా జ్యోతి ఆంధ్రరాష్ట్రం నలుచెరుగులా దేదీప్యమానంగా వెలుగును విరజిమ్మబోతోందనీ..శ్రీ భరద్వాజ మాస్టారు గారి ఆధ్వర్యంలో ఏర్పడిన "శ్రీ సాయిబాబా మిషన్ " ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందనీ.. వారి "సాయిబాబా" పక్షపత్రిక లోనే మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్రను ధారావాహికంగా తాను వ్రాయబోతాననీనూ..


"అమ్మా!..నీవు నా చరిత్ర వ్రాస్తావు కదూ..నువ్వే వ్రాస్తావులే!.." అని శ్రీ స్వామివారు పలికిన పలుకులు ఆ తరువాతి కాలంలో..శ్రీ భరద్వాజ మాస్టారు గారి స్పూర్తితో నిజమయ్యాయి..తెలుగు ప్రజలకు అవధూతల చరిత్రలను పరిచయం చేసిన శ్రీ భరద్వాజ మాస్టారు గారికి మనం ఎంతగా ఋణపడి ఉన్నామో కదా!..


ఏప్రిల్ 30వతేదీ నాడు శ్రీ స్వామివారు తమను కలువమని చెప్పిన ప్రక్కరోజు..ఒంగోలు నుంచి కొంతమంది అధ్యాపకులు ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ఒక బస్సు వేసుకొని శ్రీ స్వామివారిని దర్శించాలని మొగలిచెర్ల కు వచ్చారు..ముందుగా తెలుపకుండా ఉన్నఫళాన వచ్చేస్తే ఎలా అని శ్రీధరరావు గారు వాళ్ళను సున్నితంగా అడిగి..శ్రీ స్వామివారు ఎవ్వరినీ కలవొద్దని చెప్పిన వైనం వాళ్లకు తెలియచేసారు..వాళ్ళందరూ ముక్తకంఠంతో.."ఇంతదూరం వచ్చాము..అక్కడిదాకా వెళదాము..మా ప్రాప్తం ఎలా వుంటే..అలా జరుగుతుంది.." అన్నారు..శ్రీధరరావు గారూ సరే నని చెప్పి..అదే బస్సులో వాళ్ళతో పాటు ఆశ్రమానికి వెళ్లారు..


ఆశ్రమం బైట..ప్రధాన ద్వారానికి కూడా కొద్దిదూరంలో..శ్రీ స్వామివారు నిలబడి వున్నారు..పాదుకలు ధరించి..దండ కమండలాలు చేతబూని..అచ్చం మహర్షి లా గోచరించారు..వచ్చిన వారందరూ బస్సు దిగి..శ్రీ స్వామి వారిని చూసి చేతులు జోడించి..దగ్గరకు వచ్చి పాదాలకు నమస్కారం చేయబోయారు..పాద నమస్కారాలు వద్దని సైగ ద్వారా వారించి..కొద్ది నిముషాల పాటు నిలబడి..కళ్ళతోనే తాను వెళుతున్నట్లుగా సంకేతం ఇచ్చి..ఆశ్రమం లోపలికి వెళ్లిపోయారు..మళ్లీ అందరూ బస్సు ఎక్కి..శ్రీధరరావు గారిని వారింటివద్ద దింపుతూ.."మాకింతే ప్రాప్తం!..మహనీయుడి దర్శనానికి నోచుకున్నాము..వాక్కు వినలేకపోయాము.." అన్నారు..శ్రీధరరావు గారు చిరునవ్వు నవ్వి వారికి వీడ్కోలు చెప్పి పంపారు..


శ్రీధరరావుగారికి ఎంత ఆలోచించినా అర్ధం కాని విషయమేమిటంటే..శ్రీ స్వామివారు సరిగ్గా వాళ్ళు వచ్చే సమయానికి ఆశ్రమం బైటకు వచ్చి నిలుచుని వున్నారే!..ఆయనకు ముందుగా వీరందరూ వస్తున్న సంగతి తెలీదు కదా?


అదే సాధకుడికి..సంసారికి ఉన్న తేడా!..అవధూతల అంతరంగాన్ని అంచనా వేయడం కష్టతరం..


ఏప్రిల్ 30 వ తేదీ భేటీ గురించి..రేపటి భాగం లో..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం... లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..సెల్ : 94402 66380 & 99089 73699).

విద్యయా అమృతమశ్నుతే*

 *విద్యయా అమృతమశ్నుతే* 



విద్యద్వారా అమృతత్వం లభిస్తుంది(వేదవాక్యం)


విద్యవల్ల ఏం సంపాదించాలి? వెంటనే 'ధనం సంపాదించాలి' అని

తడుముకోకుండా సమాధానమిస్తారు. విద్యకు ధనమే పరమ ప్రయోజనం అని భావించడం చేత విద్య కూడా వ్యాపార రంగమైపోయింది. దానితో రాజకీయ వాదుల హస్తాలు సోకి ఆ రంగం కూడా కలుషితమయింది. అలాంటి వ్యవస్థలో నుంచి ఎటువంటి సంస్కారాలు లభిస్తాయి!.


( ధనం ద్వారా వచ్చే సుఖం కన్నా, ధర్మం ద్వారా లభించే సుఖంలో

సంతృప్తి, శాంతి ఉంటాయి. జీవితంలో లభించే సుఖాలకు దూరంగా ఉండమని, వ్యర్థమైన విరక్తిని బోధించలేదు మన ధర్మం. హాయిగా బ్రతకమంది. ఆనందంగా బ్రతకమంది. అయితే ఆ ఆనందం అర్థవంతం కావాలి. ఏ వ్యక్తికీ హాని కలిగించనిదై ఉండాలి. అలాంటి అర్థవంతమైన అవగాహన కలిగించేదే విద్య. ఆ అవగాహనతో ఆర్జించేదే ధనం. ఆ లక్ష్యం కోసం వినియోగం కావడమే దాని ఉద్దేశం. ఆ వినియోగం వల్ల లభించే ఆనందమే జీవిత సార్థకం.)


చివరకు తల్లిదండ్రులు కూడా విద్య ద్వారా డబ్బును సంపాదించే యంత్రాలుగా పిల్లలను తీర్చిదిద్దే ప్రయత్నంలో తలమునకలై ఉన్నారు.


కానీ మన ఆర్షధర్మం (ఋషులు ఏర్పరచిన మార్గం) విద్యకు లక్ష్యాలను చాలా చక్కగా నిబంధించింది.


విద్యా దదాతి వినయం

వినాయత్ యాతి పాత్రతా |

పాత్రత్వాత్ ధనమాప్నోతి

ధనాత్ ధర్మం తతస్సుఖమ్ ||


విద్యవల్ల 'వినయం' రావాలి. వినయం అనే మాటకు అణకువ,విధేయత-అనే

అర్థాలే కాక 'జ్ఞానం' అనే అర్థముంది. విజ్ఞానిని వినీతుడు అని అంటారు.


విద్య వల్ల ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. ఆ ప్రవర్తనకు కూడా

వినయమనే పేరు. ఇక్కడ 'వినయ' శబ్దానికి ఈ అర్థాలన్నింటినీ తీసుకోవచ్చు. విద్య వల్ల విధేయత, విజ్ఞానం, ప్రవర్తనాసరళి లభిస్తాయి. దాని ద్వారా అర్హత, ఆ అర్హత

వల్ల ధనం, ఆ ధనం వల్ల ధర్మం, ధర్మం ద్వారా సుఖం. ఈ వరుసలో ఉన్న ఔచిత్యం ఎంత గొప్పది!


విద్యకీ, ధనానికీ మధ్య వినయమా, పాత్రతా ఉన్నాయి. ధనానికీ, సుఖానికీ మధ్య ధర్మం ఉంది.


ఈ మధ్యలోని ముఖ్య విషయాలను గమనించక విద్య నుంచి ధనం, ధనం నుంచి సుఖం అనే 'జంపింగ్' వ్యవహారం వల్ల వ్యక్తిత్వానికి అవసరమైన వినయం, పాత్రత,

ధర్మం అనే విలువలకు నీళ్ళొదులుతున్నాం. ఈ పద్ధతి వ్యక్తినీ, సమాజాన్నీ కూడా

క్రమంగా బలహీనపరుస్తుంది.


ఇక్కడ విద్యకీ లక్ష్యం, ధనానికి లక్ష్యం రెండూ చెప్పారు. ధనం వల్ల

సంపాదించవలసినది ధర్మం. ధర్మం ద్వారా సుఖాన్ని సంపాదించాలి. ఎంత నిశితమైన అవగాహన ఇందులో ఉందో గమనించారా?


ఈ ఒక్క శ్లోకాన్ని విద్యార్థులూ, విద్యాలయాలూ గమనిస్తే విలువలుగల విద్యావ్యవస్థను సాధించవచ్చు. ధనానికి ముందూ వెనకా ఉత్తమ లక్షణాలుంచారు.

ఆ లక్షణాల వల్ల వ్యక్తి నియంత్రణ సాధ్యపడుతుంది. సమాజానికి భద్రత ఉంటుంది.


ధర్మాన్ని ఆచరించడానికి తగిన వనరులు లేక చాలామంది అసహాయులైపోతారు.

కానీ ధర్మాచరణకు తగిన సంపాదన కలిగి ఉండడం భాగ్యం. ఆ భాగ్యాన్ని

వినియోగించుకోవడమే ధనాన్ని ధర్మం కోసం ఖర్చుచేయడం.


ధనం ద్వారా వచ్చే సుఖం కన్నా, ధర్మం ద్వారా లభించే సుఖంలో సంతృప్తి, శాంతి ఉంటాయి. జీవితంలో లభించే సుఖాలకు దూరంగా ఉండమని, వ్యర్థమైన విరక్తిని బోధించలేదు మన ధర్మం. హాయిగా బ్రతకమంది. ఆనందంగా బ్రతకమంది. అయితే ఆ ఆనందం అర్థవంతం కావాలి. ఏ వ్యక్తికీ హాని కలిగించనిదై ఉండాలి. అలాంటి

అర్థవంతమైన అవగాహన కలిగించేదే విద్య. ఆ అవగాహనతో ఆర్జించేదే ధనం. ఆ లక్ష్యం కోసం వినియోగం కావడమే దాని ఉద్దేశం. ఆ వినియోగం వల్ల లభించే ఆనందమే జీవిత సార్థకం.


సమాజపు శాశ్వత సౌఖ్యం కోసం పరితపించే బుద్ధి ఉన్నవారు ఈ విధంగా ఆలోచిస్తారు.


ఒక్క శ్లోకంలో వ్యక్తి జీవిత మార్గనిర్దేశాన్ని ఇంత సమగ్రంగా బోధించిన మన సనాతనధర్మానికి మోకరిల్లవలసిందే.


విద్యకు ప్రాధాన్యమిచ్చిన గురుపీఠం మనదేశం. భౌతిక సుఖాలను కూడా

లక్ష్యపెట్టకుండా అరణ్యాలలో వాసం చేస్తూ జీవితమంతా జ్ఞాన సముపార్జన కోసం వెచ్చించి మహాతపస్వులు-"విద్యయా అమృతమశ్నుతే" విద్య ద్వారా అమృతత్వం లభిస్తుందని బోధించారు. సౌఖ్యాలనూ, సౌకర్యాలనూ పరిగణించకుండా తపస్సులా విద్యాభ్యాసం చేయాలని మన సంప్రదాయం. విద్యను వ్యాపారం చేసే దుష్ట సంస్కృతిలోనే ఈ సుఖసౌకర్యాల ఆలోచనలు పుడతాయి.


నిరంతర అధ్యయనం వల్లనే నిరంతర ధర్మం, తద్వారా సుఖం వర్థిల్లుతాయి.

సత్యస్పృహతో అసలైన ఆనందాన్ని పొందాలంటే విద్య ధనాల ముందు వెనుకనున్న సులక్షణాలను సాధించవలసిందే.

మకరి- మహాయోగి యైనదా?

 శు భో ద యం🙏


మకరి- మహాయోగి యైనదా?


" పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియో

న్మాదంబున్పరిమార్చి బుధ్ధిలతకున్ మారాకుహత్తించి ని

ష్కేద బ్రహ్మ పదావలంబనగతిన్ క్రీడించు యోగీంద్రు మ

ర్యాదన్ నక్రము విక్రమించె కరిపాదాక్రాంత నిర్వక్రమై; 


భాగ-గజేంద్రమోక్షణము-బమ్మెఱపోతన! 


    భాగవతంలో గజేంద్రమోక్షణమొక అద్భుత ఘట్టము. పోతన తనకవితా చాతుర్యమును వెలయించి దీనిని మిగుల నపురూపముగాతీర్చిదిద్దినాడు."కరి-మకరుల పోరుసందర్భములోనిది" ప్రస్తుత పద్యరత్నము. 


            కరిని గెలువగోరి మకరి యోగీంద్రునివలె సాధనచేయుచున్నదట!


       యోగసాధనచేయునప్పుడు యోగి పాదములను నేలపై సమముగానుంచి ప్రాణాయామమునకుపక్రమించి వాయుబంధనమొనరించి,బుధ్ధిని భగవంతుని యందు లగ్నమొనరించి భగవత్పాదారవిందములపైననే దృష్టిని కేంద్రీకరించి యేమరుపాటునువీడి సాధనగావించుచుండును. అదిగో ఆమాదిరిగా నున్నదట మొసలి సాధన! తనరెండు కాళ్ళను నేలపైనూదిపట్టి.గాలినిబిగబట్టి.యేమరుపాటులేక తాబట్టినగజేంద్రునిపాదములపైననే 

దృష్టినంతయుకేంద్రీకరించి, ఏమాత్రముపట్టువిడువక,,బ్రహ్మపదమునందగోరు యోగీంద్రునిసాధననుపమించుసాధనతో కరిని గెలువ మకరి యత్నించు చున్నదట! 


       ఆహా! పోతన కవీంద్రా! పశుయోనియగు కరియేడ? మహాయోగియేడ? దానిసాధన యోగిసాధనతో నుపమించి యద్భుతమును సృజియించినావుగదా! నీకు వేరెవరుసాటి? ఇదో స్వీకరింపుము మాప్ర ణామాంజలులు!


              స్వస్తి!🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷