4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

ఈ పద్యాన్ని చదివినారా

🚩 ఈ పద్యాన్ని ఎప్పుడైనా చదివినారా ~ లేక విన్నారా?

🚩తిరుమలరాయలనే రాజుకు ఒకే కన్ను ఉండేదట!

అత‌నికిపొగడ్తలంటే చాలా ఇష్టమట!

తననుపొగిడినవారికి కా‌‌నుకలిచ్చేవాడట!

ఒకసారి హేమచంద్రుడనే కవి ~ ఎలా ఒంటికన్ను రాజును

మెప్పించాలాఅని ఆలోచించి ఇలా ఒక పద్యాన్ని చెప్పి మెప్పించాడట!

🔻"నిన్నాతి గూడ హరుడవు

అన్నాతిని గూడ నప్పుడ సుర గురుడవే

అన్నా! తిరుమల రాయా!

కన్నొక్కటి కలిగె గాని కౌరవ పతివె!"

💥💥💥

దీని అర్థమేమిటంటే : "నీ నాతి (రాణి) తో కలిసి వుంటే

నువ్వు పరమశివుడివే
(ముక్కంటివి అవుతావు తన ఒక కన్ను తన రాణి రెండు కళ్ళు కలిపి)!

రాణి దగ్గరలేకపోతే నీవు శుక్రాచార్యుడివే!
నీకు ఆ కన్నొకటి వుంది గానీ ~ లేకపోతే నీవు
ధృతరాష్ట్రుడివే ~ అంటే పుట్టు గుడ్డివే అని అర్థము.

ఈ పద్యాన్ని రాజు వినగానేపొంగిపోయి కవికి
ఘన సన్మానము చేసినాడట!

కవిగారి సమయస్పూర్తికిజోహార్లు.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

కామెంట్‌లు లేవు: