21, నవంబర్ 2025, శుక్రవారం

సర్వం ఖల్విదం బ్రహ్మ*

  సర్వం ఖల్విదం బ్రహ్మ*

ఇది ఛాందోగ్యోపనిషత్తులోని ఒక మహా వాక్యం దీని భావం ఏమిటంటే ఈ సృష్టి అంతా కూడా బ్రహ్మమయమే బ్రహ్మ కానిది అంటూ ఏది లేదు అనేదే ఈ మహా వాక్యంలోని అర్థము దీనిని ఒక చిన్న కథ ద్వారా విశ్లేషిద్దాము.

*ఒకరోజు రామారావు ఒకరి ఇంటికి వస్తాడు. ఆ ఇంటి ఇల్లాలు ఎంతో రుచిగా జీడిపప్పు, పిస్తా వేసి పాయసం వండి పెడుతుంది. అతడు అంత రుచికరమైన పాయసం తిని ఆనందంతో పాయస పాత్రలోని గరిటకు నమస్కారం చేస్తూ నువ్వు నాకు భగవంతుడివి ఇంత రుచికరమైన పాయసం విస్తరిలో వేసావు అంటాడు…*

*వెంటనే ఆ గరిట నన్ను పొగిడితే ఏమీ ఉపయోగం లేదు. వడ్డించిన చేతికి నమస్కరించు మరింత పాయసం దొరుకుతుంది అంటుంది.*

* వడ్డించిన ఇల్లాలు ఇది నా గొప్పతనం కాదు నా భర్త కష్టపడి సంపాదించి తెస్తే నేను వండిపెట్టాను ఆయనకు నమస్కరించమంటుంది.*

*యజమాని ఇందులో నా గొప్పతనమేమి లేదు భూదేవి మహిమ ఆమె వలన పండిన పంటతో నేను ఆతిథ్యం ఇచ్చాను అంటాడు.*

*భూదేవి నాకు జలం ఆధారం ఆయనకు నమస్కరించు అనగా.. జలం ఆగ్నికి, అగ్ని వాయువుకు, వాయువు ఆకాశానికి ఇలా చివరకు మా అందరికి ఆధారభూతమైన వాడు ఒక్కడే ఆయనే “పరమాత్మ” ఆయనకు నమస్కరించమని చెబుతారు.*

*మనం తినే పాయసానికి పరమాత్మకు సంబంధం ఇదే..*

*సృష్ఠిలో ప్రతిదానికి మూలం ఆ పరబ్రహ్మమే.. మన దగ్గర ఎంత ధనమున్నా, కీర్తి ప్రతిష్టలున్నా వాటన్నిటిని సృష్టించిన వాడు, వాటన్నిటికి అధిపతి ఆ పరమేశ్వరుడే. ఈ సత్యం తెలుసుకొని ప్రతి సాధకుడు ఈ చరాచర జగత్తు మొత్తం పరబ్రహ్మ కలిగి ఉన్నాడు అనే భావనలోకి వచ్చి తను కూడా పరబ్రహ్మలో ఒక అంశం అని తెలుసుకొని పరబ్రహ్మలో లీనయినమయ్యే టందుకు అంటే మోక్షమార్గాన్ని ఎంచుకొని నిత్యం మోక్ష పదం వైపు పయనించాలని ఈ ఉపనిషత్తు ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాము.*

ఓం శాంతి శాంతి శాంతిః

 ఇట్లు 

మీ 

చేరువేల భార్గవ శర్మ

*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*


🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - హేమంత ఋతువు - మార్గశిర మాసం - శుక్ల పక్షం - ప్రతిపత్ - అనూరాధ -‌‌ భృగు వాసరే* (21.11.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

20, నవంబర్ 2025, గురువారం

పంచాంగము

 


అక్కడ దాచాను

  అక్కడ దాచాను

రామారావు ఒక ధనవంతుడు అతడు ఒక రోజు బ్యాంకుకు వెళ్లి 5 లక్షల రూపాయలు డ్రా చేసి దాన్ని బ్యాగులో పెట్టుకొని వెళ్లబోతుండగా అతని మిత్రుడు కనబడి మాట్లాడించాడు రామారావు ఏంటి హడావుడి, అంటే రేపు నేను ఢిల్లీ వెళుతున్నాను మా అమ్మాయి పెళ్లి విషయంలో  ఐదు లక్షలు మా వాళ్లకు ఇచ్చేది ఉంది అందుకనే నేను తొందరగా వెళ్ళాలి అన్నాడు ఈ సంభాషణ మొత్తం పక్కనే ఉన్నటువంటి కొండ కోచి అనేటువంటి ఒక దొంగ విన్నాడు వాడు అనుకున్నాడు ఓహో ఈయన రేపు ఢిల్లీకి వెళ్తున్నాడు ఐదు లక్షలు తీసుకొని పోతున్నాడు ఇతనితో పాటు ప్రయాణం చేసి ఆ ఐదు లక్షలు మనం కాజేయొచ్చు అని అనుకున్నాడు మరుసటి రోజు పొద్దున్నే రైల్వే స్టేషన్ కి వెళ్ళాడు రైల్వేస్టేషన్లో కూడా రామారావు క్యూలో నించుంటే రామారావు వెనకాలే ఈ దొంగ గారు కూడా నిల్చున్నాడు రామారావు టికెట్ తీసుకున్నాడు.అదే రైలుకి తను కూడా ఒక టికెట్ తీసుకున్నాడు రామారావు తో పాటు రామారావు ఎక్కిన బోగీలోనికి రామారావు పక్క సీటు సంపాదించాడు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు.  రామారావు మధ్య రాత్రి  వాష్ రూమ్ కి వెళ్ళవలసి వచ్చింది. అదే మంచి అదునుగా భావించి మన దొంగ గారు వెంటనే రామారావు సంచి రామారావు బ్యాగు రామారావు బిస్తరు మొత్తం తనిఖీ చేసి ఎక్కడ డబ్బులు దాచాడో చూసి అది కాజేసి వెంటనే పక్క స్టేషన్లో దిగిపోదామని ఎత్తుగడ వేశాడు కానీ అతను ఎంత వెతికినా కూడా ఒక్కచోట కూడా ఒక ₹100 నోటు కూడా కనబడలేదు ఆశ్చర్యం ఇదేంటి అని అని అనుకున్నాడు నిన్ననే విన్నది అబద్ధమా నా కళ్ళ ముందే 5 లక్షలు డ్రా చేసాడే మరి ఎక్కడ పెట్టినట్టు అని పరి పరివిధాలుగా ఆలోచించడం మొదలుపెట్టాడు కొండ గోచి పడుకున్నాడే గానీ నిరంతరం అతని మనసులో ఒకటే శోధిస్తున్నది ఏమిటి ఈ పక్కవాడు ఎంతకు నిద్ర పోవట్లేదు అనుకున్నాడు చిన్నగా రామారావు నిధుల్లోకి జారుకున్నాడు రామారావు నిద్రలోకి వెళ్లగానే మళ్లీ దొంగ గారు చిన్నగా అతని చెయ్యి ఇటు అటు కదిలిచ్చి జేబులో  ఆజేబు ఈ జేబు చూసి ప్యాంటు జేబులో చేయి పెట్టి అన్ని జేబులు వెతికాడు తరువాత  అతన్ని నకసిక పర్యంతం పరిశీలించాడు కానీ ఒక్కచోట కూడా అతనికి ధనం లభించలేదు ఇక నిరాశ చెందాడు తెల్లవారేసరికి ఢిల్లీ రానే వచ్చింది. అప్పుడు తెగించి అసలు విషయం రామారావు నే అడుగుదాం అని అనుకున్నాడు ఈ రామారావు డబ్బులు ఎక్కడ దాచిపెట్టాడు రామారావు తీసుకొని వస్తున్నాడు అన్నది మాత్రం సత్యం అందులో ఏమాత్రం అనుమానం లేదు అనుకోని ఎట్లాగో తెల్లవారింది ఆ డబ్బు తనకు లభించలేదు కనీసం అది ఎట్లా భద్రపరిచాడు అన్న విషయం అన్న తెలుసుకుందామని రామారావు ముందర ఓపెన్ అయ్యాడు అయ్యా నన్ను క్షమించాలి నేను మంచివాన్ని కాదు ఒక దొంగని మీ దగ్గర ఐదు లక్షల రూపాయలు ఉన్నట్లు గమనించి నిన్నటి నుంచి మిమ్మల్ని అనుసరిస్తూ వస్తున్నాను. ఇప్పటిదాకా నేను మీ దగ్గర డబ్బులు తీసుకొని పారిపోదామనే ప్రయత్నంలోనే ఉన్నా కానీ నా దురదృష్టం మీ డబ్బులు ఎక్కడ పెట్టారో నాకు కనబడలేదు నిజంగా మీరు డబ్బులు తెచ్చారా తేలేదా చెప్పండి అన్నాడు అదేమిటి నాయనా నేను డబ్బులు తేకుండా ఎట్లా ఉంటాను డబ్బులు తీసుకొని వెళ్తాననీ నిన్న మా మిత్రుడితో చెప్పాను కదా నువ్వు పక్కనే ఉండి అన్నీ విన్నావు కదా అన్నాడు అప్పుడు తెల్ల మొహం వేయడం కొండ గోచి పని అయింది వెంటనే అయితే డబ్బులు ఎక్కడ పెట్టారు సార్ అన్నాడు ఇగో ఇక్కడ పెట్టాను అని దొంగ తల దిండు కింది నుంచి డబ్బులు తీసి లెక్కపెట్టుకొని బ్యాగులో పెట్టుకున్నాడు ఇది సంగతి అప్పుడు అర్థమైంది నేను బయట అంత వెతికా గాని నా దగ్గర నేను వెతుక్కోలేదని తెల్ల మొహం వేశాడు దొంగ గారు. అసలు విషయాన్నీ అర్థం చేసుకోకుండా కొంతమంది ఈ కథ సాధ్యమా కాదా ఇందులో లోపాలు ఏంటి అని వెతకడం మొదలు పెడతారు వాళ్ళు అంతా ఐహికులు.  కేవలం సాధకులు మాత్రమే కిందిది చదివి అర్థం చేసుకొని అన్వయించుకుంటారు

సాధకులారా భగవంతుడు కూడా ఇదే రకంగా మనల్ని పరీక్షిస్తున్నాడు మనము నిత్యం గుళ్ళు గోపురాలు తీర్థాలు అంటూ ప్రయాణాలు చేసి అలసట చెంది ఉపవాసాలు చేసి ఆహారానికి అనేక చిక్కులు చికాకులు అనుభవిస్తూ తీర్థయాత్రలు చేస్తున్నాము గుళ్ళకి వెళ్తున్నాము పూజలు చేస్తున్నాము వ్రతాలు చేస్తున్నాం కానీ ఇదంతా బాహ్య ప్రపంచంలో మనం ఎంత ప్రయత్నం చేసినా భగవంతుడు మనకు ఎక్కడ లభ్యం కావట్లేదు నిజానికి ఆ భగవంతుడు బయట ప్రపంచంలో లేడు కేవలం కేవలం అంటే కేవలం మన హృదయ ప్రపంచం లోనే ఉన్నాడు హృదయ ప్రాకారంలోనే భగవంతుడు నెలకొని ఉన్నాడు ఆ భగవంతుడిని తెలుసుకొని భగవంతునిలో లీనం అవటమే మానవ లక్ష్యం ఇదే మనకు మంత్రపుష్పం తెలియజేస్తుంది

 ఓం శాంతి శాంతి శాంతిః

 ఇట్లు మీ చేరువేల భార్గవ శర్మ

పోతన --భాగవతము 🙏

 🙏పోతన --భాగవతము 🙏

                మొదటి భాగం 

ముందుగా పోతన పోతపోసిన పద్యరాజములు చూద్దాము. గజేంద్ర మోక్షం నుండి తీసుకున్నాను.

కొన్ని పద్యాలలో సగుణాన్ని, కొన్ని పద్యాలలో నిరాకార నిర్గుణాన్ని వర్ణించారు.శివ కేశవులకు అభేదం పాటించారు. భాగవతన్ని మోక్ష విద్య అని పేర్కొన్నారు. బీజాక్షర శక్తిని పద్యాలలో సమకూర్చారు. 

భక్త పోతన తన తపస్సుశక్తిని ధార పోసి, తెలుగు భాషలోని అక్షరాలలో ఉన్న అమృతాన్ని పిండి, తన రామ భక్తిని రంగరించి , భాగవత పద్యాలలోకి మంత్ర శక్తిని ఆవహింపచేసిన మహా గ్రంథం- భాగవతం

బతుకుతెరువు కోసమో లేదా రాజులిచ్చే అగ్రహారాల కోసమో కవులు కావ్యాలు రాస్తారన్న అపవాదు భాగవతానికి రాకూడదని, తనకున్న కాసింత పొలాన్ని పండించుకుని ఎంతో నిరాడంబరంగా జీవించిన మహా ఋషి, మహా యోగి రాసిన మహా గ్రంథం - భాగవతం

భగవంతుడు అను భద్ర శబ్దమునకు అర్థము, ఆకృతి గా అతిశయించి నిలబడగలిగిన రామభద్రుడు, శ్రీరామనారాయణుడే స్వయంగా పోతనచే రాయించుకున్న మహా కావ్యం - భాగవతం

సాక్షాత్తూ శ్రీకృష్ణుడే స్వయంగా భాగవతం నా అక్షర స్వరూపంగా ఉంటుందని వెల్లడి చేసిన మహా గ్రంథం - భాగవతం

భక్తి వైభవాన్ని, గొప్పతనాన్ని పతాకస్థాయిలో మేరు పర్వత శిఖరాలు దాటించి, వైకుంఠం అంచుల దాకా తీసుకెళ్ళి వివరించిన మహా కావ్యం- భాగవతం

లక్ష్మీ దేవి కౌగిటిలో ఉన్నా కూడా, పరమాత్మున్ని తన భక్తుల రక్షణకై పరుగులు పెట్టించిన లీలలు తెలిపే గ్రంథం (గజేంద్ర మోక్షం) - భాగవతం

ఏ శ్రీమన్నారాయణుని పాద పద్మములచే పునీతమైన భూమాత రోమాంచితమైనపుడు నిక్కబొడుచుకున్న రోమాలే, ఈ పచ్చదనమంతా అని అప్పుడు మోహపరవశయై రంజిల్లగా, ఆనంద పరవశయైన భూమాత రాల్చిన ఆనంద భాష్పధారలే ఈ సెలయేరులన్నీ అని అట్టి శ్రీహరి పాదారవిందముల శుభ చిహ్నముల వైభవాన్ని కీర్తించే మహా కావ్యం - భాగవతం

పోతన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే 

పోతన బ్రహ్మ ,పోతన విష్ణువు, పోతన శివుడు పోతన శక్తి.సాక్షాత్తు పోతన గారే పరబ్రహ్మ స్వరూపము.

పృథుశక్తిన్ గజ మా జలగ్రహముతోఁ బెక్కేండ్లు పోరాడి, సం

శిథిలంబై, తన లావు వైరిబలముం జింతించి, మిథ్యామనో

రథమిం కేటికి? దీని గెల్వ సరి పోరంజాలరా దంచు స

వ్యథమై యిట్లనుఁ బూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితోన్..

భావము:- గజరాజు గొప్పబలంతో అనేక సంవత్సరాలు యుద్ధం జేసి చేసి చివరికి చితికిపోయాడు. తన సత్తువ శత్రువు బలం సరిపోల్చుకొని ఆలోచించుకొన్నాడు “అనవసర ప్రయత్నాలు నాకు ఎందుకు. దీనిని జయించటం, సరిసమంగా పోరాడటం రెండు నాకు సాధ్యంకాదు.” అని దుఃఖించాడు. పూర్వజన్మల పుణ్య ఫలం వలన కలిగిన మేలైన ఙ్ఞానం వల్ల అతడు ఈ విధంగా అనుకోసాగేడు.

"ఏరూపంబున దీని గెల్తు? నిటమీఁ దేవేల్పుఁ జింతింతు? నె

వ్వారింజీరుదు? నెవ్వరడ్డ? మిఁక ని వ్వారిప్రచారోత్తమున్

వారింపం దగువార లెవ్వ? రఖిలవ్యాపార పారాయణుల్

లేరే?మ్రొక్కెద దిక్కుమాలిన మొఱాలింపం బ్రపుణ్యాత్మకుల్ 

- ఏ = ఏ; రక్షిస్తారు? ఈ మహామొసలిని ఆపేశక్తి కలవారు ఎవరు? సర్వకార్యాలలో దిట్టలు గొప్పపుణ్యాత్ములు దిక్కులేని నా మొర వినేవారు లేకపోతారా. అట్టి వారికిమొరపెట్టుకుంటాను.


నానానేకపయూధముల్ వనములోనంబెద్దకాలంబు స

న్మానింపన్ దశలక్షకోటి కరిణీనాథుండనై యుండి మ

ద్ధానాంభః పరిపుష్ట చందన లతాంతచ్ఛాయలం దుండ లే

కీనీరాశ నిటేల వచ్చితి? భయం బెట్లోకదే యీశ్వరా!


భావము:- చాలాకాలం నుంచి అడవిలో ఎన్నో ఏనుగు గుంపుల గౌరవాన్ని పొందుతు ఉన్నాను. పదిలక్షలకోట్ల ఆడ ఏనుగులకు నాథుడుగా ఉన్నాను. నా దానజలధారలతో బలంగా పెరిగిన మంచి గంధంచెట్ల నీడలలో సుఖంగా ఉండకుండ, నీటిమీద ఆశతో ఇక్కడకి ఎందుకు వచ్చాను. భగవంతుడా! చాలా భయం వేస్తోంది. ఎలానో ఏమిటో.

ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;

యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం

బెవ్వఁ;డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ

డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.

భావము:- ఈ లోకమంతా ఎవరి వల్లనైతే పుడుతుందో; ఎవరిలో కలిసి ఉంటుందో; ఎవరి లోపల లయం అయిపోతుందో; ఎవరు పరమాత్ముడో; ఎవరు సృష్టికి ప్రధానకారణమై ఉన్నాడో; ఎవరైతే పుట్టడం, గిట్టడం, వాటి మధ్య అవస్థలు లేని శాశ్వతుడో; తుది, మొదలు మధ్య లేని అనంతుడో; ఎవరైతే సమస్తమైన సృష్టి తానే అయ్యి ఉంటాడో; అటువంటి స్వయంభువు, ప్రభువు ఐన భగవంతుణ్ణి నే శరణు కోరుతున్నాను.


ఒకపరి జగములు వెలి నిడి

యొకపరి లోపలికిఁ గొనుచు నుభయముఁ దానై

సకలార్థ సాక్షి యగు న

య్యకలంకుని నాత్మమూలు నర్థిఁ దలంతున్.

భావము:- ఒకసారి లోకాలను సృష్టి చేసి, ఇంకొకసారి తనలో లయం చేసుకుంటు, ఆ లోకాలు రెండు తానే అయ్యి, అన్ని విషయాలను సాక్షీభూతంగా ఆలోకిస్తూ, ఆత్మలకు ఆత్మ అయిన ఆ పరమాత్మను ఆసక్తితో ధ్యానం చేస్తాను.


లోకంబులు లోకేశులు

లోకస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెం

జీకటి కవ్వల నెవ్వం

డేకాకృతి వెలుఁగు నతని నేసేవింతున్.


భావము:- లోకాలు, లోకాలను పాలించేవారు, లోకాలలో ఉండేవారు అందరు నశించిన అనంతరం; ఆ కారు చీకట్లకు ఆవతల అఖండమైన రూపంతో ప్రకాశించే ఆ దేవుణ్ణి నేను సేవిస్తాను.


నర్తకుని భంగిఁ బెక్కగు

మూర్తులతో నెవ్వఁ డాడు? మునులు దివిజులుం

గీర్తింప నేర? రెవ్వని

వర్తన మొరు లెఱుఁగ? రట్టివాని నుతింతున్.

భావము:- అనేక వేషాలు వేసే నటుడి లాగ పెక్కు రూపాలతో ఎవరు క్రీడిస్తుంటాడో? ఋషులు దేవతలు ఎవరి గొప్పదనాన్ని వర్ణించ లేరో? ఎవరి ప్రవర్తన ఇతరులకు అగోచరంగా ఉంటుందో? అట్టి ఆ మహాదేవుణ్ణి నేను సంస్తుతిస్తాను.


ముక్తసంగులైన మునులు దిదృక్షులు

సర్వభూత హితులు సాధుచిత్తు

లసదృశవ్రతాఢ్యులైకొల్తు రెవ్వని

దివ్యపదము వాఁడు దిక్కు నాకు..


భావము:- ప్రపంచంతో సర్వ సంబంధాలు వదలివేసిన మునులు, భగవద్దర్శనం కోరేవారు, సమస్తమైన జీవుల మేలు కోరేవారు, మంచి మనసు కలవారు సాటిలేని వ్రతాలు ధరించి ఎవరి పాదాలను సేవిస్తారో అట్టి భగవంతుడు నాకు దిక్కు అగు గాక.

                       సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

పొద్దుతిరుగుడు మొక్కతో ఉపయోగాలు -

 పొద్దుతిరుగుడు మొక్కతో ఉపయోగాలు -


 * పొద్దుతిరుగుడు మొక్కల్ని పీకేసిన తరువాత ఎండించి , శుభ్రం చేసుకుని మెత్తగా దంచి ఆ చూర్ణం ఒక చెంచా మోతాదు రోజూ రెండుపూటలా తీసుకొంటే చర్మవ్యాధుల మీద బాగా పనిచేస్తుంది .


 * మొక్క సమూలంగా దంచిన ఈ చూర్ణానికి అమీబియాసిస్ వ్యాధిని తగ్గించే గుణం ఉంది.


 * కడుపులో క్రిములను పొగొట్టును.


 * పొద్దుతిరుగుడు మొక్కని సమూలంగా ఎండించి దంచిన పొడిని గాని , పచ్చి మొక్కని దంచి పిండిన రసాన్ని గాని కొద్దిగా తీసుకొంటే దగ్గు తగ్గుతుంది . మూత్రవ్యాధులలో కూడా బాగా పనిచేస్తుంది .


 * దీని గింజలు ప్రొటీన్లకు పుట్టిల్లు. నేతిలో ఈ గింజల్ని వేయించి పైపొట్టు ఒలిచి మెత్తగా దంచి ఆ పొడిని పాలలో కలిపి తాగితే మీకు అంతకు మించిన బలకరమైన ఆహారం మరొక్కటి ఉండదు.


 * ఇందులో 50 % కొవ్వు పదార్దాలు ఉన్నాయి. అందుకని ఈ గింజల్ని సన్నగా చిక్కి పొతున్నవారికి పెట్టినట్లు అయితే మంచి ఒళ్ళు చేస్తారు .


 * ఎప్పుడూ నీరసం , అలసట కలిగి ఉండి ఏ పనిచేయలేని అశక్తత ఉన్నవారు పొద్దుతిరుగుడు గింజల్ని తీసుకోవడం వలన శరీరంలో నీరసం , అలసటని తగ్గించి శక్తిని పెంచును.


 * పొద్దుతిరుగుడు గింజలలో "లైనోలిక్ యాసిడ్ " అనే రసాయన పదార్థం ఉన్నది. ఇది కొలెస్ట్రాల్ ని రక్తంలో పెరగకుండా చూస్తుంది. అందుకని వేరుశెనగ నూనె కంటే పొద్దుతిరుగుడు నూనెని ఆహారంలో వాడుకోవడం మంచిది .


 * B విటమిన్ ఇందులో ఎక్కువుగా ఉండును. అందుకని నీరసం మీద బాగుగా పనిచేస్తుంది . పొద్దుతిరుగుడు నూనె వాడటం మాత్రమే కాదు పొద్దుతిరుగుడు గింజలని తినవలెను .


 * రక్తక్షీణత , ఉపిరితిత్తుల జబ్బులలో కూడా పొద్దుతిరుగుడు గింజలు ఎక్కువ మేలు చేస్తాయి .


      మరింత విలువైన సులభ ఔషధ చికిత్సల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


     గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         

                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

కార్తీకపురాణం - 30 వ అధ్యాయము*

 🌴🌹🪔🕉️🛕🕉️🪔🌹🌴

      🌷 _*గురువారం*_🌷

🕉️ *నవంబర్ 20, 2025*🕉️


*కార్తీకపురాణం - 30 వ అధ్యాయము*


🕉🕉🕉🕉🕉🕉️🕉️🕉️             

                

 🔱 *(చివరి అధ్యాయం)*🔱


*కార్తీకవ్రత మహిమ్నా ఫలశ్రుతి*

```

నైమిశారణ్య ఆశ్రమములో శౌనకాదిమహామునుల కందరకు సూతమహాముని తెలియజేసిన విష్ణుమహిమను, విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి, వేయినోళ్లకొనియాడిరి. శౌనకాది మునులకు ఇంకను సంశయములు తీరనందున, సూతునిగాంచి, “ఓ ముని తిలకమా! కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై, అత్యాచారపరులై జీవించుచు  సంసారసాగరము తరింపలేకున్నారు. అటువంటివారు సులభముగా ఆచరించు తరణోపాయమేదైనా కలదా? ధర్మములన్నింటిలో మోక్షసాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తినొసంగు ఉత్తమదైవమెవరు? మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపు మాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతోనున్నాము. కావున దీనిని వివరించి తెలియజేయు"మని కోరిరి.


అంత సూతుడా ప్రశ్న నాలకించి “ఓ మునులారా! మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగమందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసారసాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్షసాధనము కాగలవు. కార్తీకవ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటె ఘనమైనదని శ్రీహరి వివరించియున్నాడు. ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతియేకాదు, సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యముకాదు. అయినను సూక్షముగా వివరించెదను.


కార్తీకమాసమందు ఆచరించవలసిన పద్ధతులను జెప్పుచున్నాను. శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీకమాసమున సూర్యభగవానుడు తులారాశి యందున్నప్పుడు శ్రీహరి ప్రీతికొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగ నదీస్నానము చేయవలెను. దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజింపవలెను. తనకున్న దానితో కొంచమైనా దీపదానం చేయవలయును. ఈ నెలరోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమునగాని, శివాలయమునగాని ఆవునేతితో దీపారాధన చేయవలెను. ప్రతి దినము సాయంకాలము పురాణపఠనము చేయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వసౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులారాశియందున్న నెలరోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తివుండికూడా ఆచరించకగాని, లేక, ఆచరించువారలను ఎగతాళి చేసినగాని, వారికి ధనసహాయము చేయువారికి అడ్డుపడిన వారును ముందు అనేక కష్టముల పాలగుటయేగాక వారి జన్మాంతర మందు నరకములో యమకింకరుల చేత నానా హింసలపాలుకాగలరు. అంతియేగాక అట్టివారు నూరుజన్మలవరకు ఛండాలాది హీన జన్మలెత్తుదురు.


కార్తీక మాసములో కావేరి నదిలోగాని, గంగా నదిలోగాని, అఖండ గౌతమినదిలోగాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్టతో ఆచరించిననూ ఇహమందు సర్వసుఖములను అనుభవించుటయేగాక, జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు.


సంవత్సరములోవచ్చు అన్ని మాసములకన్నా కార్తీకమాసము ఉత్తమోత్తమమైనది అధికఫలదాయకమైనది. హరి హరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీకమాస వ్రతము వలన జన్మజన్మలనుండి వారలకున్న సకలపాపములు హరించి, మరుజన్మలేక, వైకుంఠమందుగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతమాచరించవలెననెది కోరిక పుట్టి దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీకమాసమన్న కార్తీక వ్రతమన్నా అసహ్యము కలుగును.


కాన, ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యమును చేతులారా విడువక ఆచరించవలెను. ఇటుల నెలరోజులు చేయలేని వారు కార్తీకశుద్ద పౌర్ణమినాడు అయినను తమశక్తి కొలదీ వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి, జాగరణము వుండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెలరోజులు చేసిన ఫలముతో సమానఫలము కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో ఎప్పటికినీ తరగని పుణ్యము లభించును. ఈ నెల రోజులు ధనవంతుడైనను, బీదవాడైనను మరెవ్వరైనను సరే శ్రీహరినామస్మరణ చేయుచు, పురాణములు వింటూ, పుణ్యతీర్థములను సేవిస్తూ దానధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకంబును. ఈ కథను చదివిన వారికిని వినిన వారికిని శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయును.```


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందలి*


   

  *ముప్పైవ అధ్యాయము*  

        _*ముప్పైవ రోజు*_ 

          *(ఆఖరి రోజు)*

 *పారాయణము సమాప్తం*


           🌷 *సేకరణ*🌷

      🌹🌷🌷🌷🌷🌹

              *న్యాయపతి*

           *నరసింహా రావు*

🙏🌹🍁🕉️🛕🕉️🍁🌹🙏

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - శరదృతువు - కార్తీక మాసం - కృష్ణ పక్షం - అమావాస్య - విశాఖ -‌‌ గురు వాసరే* (20.11.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

జీవితం ధన్యం

 🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం 🕉️🙏 🔥 * *ఆశలన్నీ చచ్చిపోయాక ఆకాశమంత ప్రేమ చూపిన వ్యర్ధమే.. ఆరోగ్యం చెడిపోయాక ఆయుష్ మిగిలిన వ్యర్ధమే.. కష్ట కాలం గడిచిపోయాక కనికరం చూపిన వ్యర్ధమే.. ఉన్నప్పుడు తెలియని విలువ కోల్పోయాక తెలుసుకున్న వ్యర్థమే.. కరిగిపోతే తెలుస్తుంది కొవ్వొత్తి విలువ.. గడిచిపోతే తెలుస్తుంది కాలం విలువ.. దూరమైతే తెలుస్తుంది మనిషి విలువ.. విడిపోతే తెలుస్తుంది బంధం విలువ.. మనల్ని అహిష్టంగా దూరం పెట్టే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం దూరం అవ్వడం మంచిది.. మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఏది ఎక్కువ తెలుసుకోకూడదు.. ఎవరిని ఎక్కువ చదవకూడదు.. ఎక్కడ నా సొంతం అనే భావన ఉండకూడదు*🔥 ఏది శాశ్వతం కాదు ఈ లోకంలో.. గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది.. నిన్న అనేది తీరిపోయిన రుణం.. రేపు అనేది భగవంతుడు ఇచ్చిన సమయం.. కావలసినవారు ఎందరు ఉన్న మనశ్శాంతి లేని జీవితం వ్యర్థం.. అసంతృప్తి జీవితం గడపడం చాలా దుర్బలం.. పూరి గుడిసె బ్రతుకైనా కంటి నిండా నిద్రపోయే మనిషి జీవితం ధన్యం🔥🔥మీ


19, నవంబర్ 2025, బుధవారం

పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరీ

 🙏పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరీ🙏


ఈ వ్యాసం సులభం కాదు. ఏకాగ్రతతో జాగ్రత్తగా చదవాలి. అప్పుడే అర్ధమవుతుంది.

ముందుగా వాగ్దేవతల ప్రార్ధనతో ప్రారంభిద్దాం

ఆ వాగ్దేవతల అనుగ్రహముతో ఈ వ్యాసం చదువుదాము.

దేవీంవాచ మజనయంత దేవాస్తాం విశ్వరూపాః వశవోవదంతి! 

సానోమంద్రేష మూర్జం దుహానా దేనుర్వాగస్మా నుపసుష్టుతైతు. 

అమ్మవారు దేవతలకందరికి కామధేనువు వంటి విశ్వరూపమైన (అనంతమైన ) పదజాలం సృష్టించి ఇచ్చారు. ఆ పదజాలం మమ్ములను ఆశ్రయించి ఉండి రక్షించుగాక.


చత్వారి వాక్పరిమితా పదాని తానీ

విడుర్బ్రాహ్మాణా యే మనీషిణిః

గుహాత్రీణి నిహితా నేజ్గయంతి

తురీయం వాచో మనుష్యా వదంతి ||

భావం 

వాక్కుకు నాలుగు స్థితులు వుంటాయని విజ్ఞాలకు తెలుస్తుంది.అవియే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరీ వీటిలో మొదటి మూడు స్థితులలోని వాక్కు గుహలోనే వుంటుంది. బయటకు రాదు. నాల్గవ స్థితిలోని వాక్కునే మనుష్యులు పలుకుతున్నారు. అని పై మంత్రానికి అర్థం

-

మనలో మాట పలకాలన్న భావం స్ఫురింపచేసేదే “పరా”. మాట పలికే ముందు ‘పర’ ప్రేరితమై భావాత్మకంగా గోచరించేదే ‘పశ్యంతీ’. ఆ భావం మాటలుగా కూర్చుకున్న స్థితి ‘మధ్యమా’ ఆ తరువాత శబ్దరూపంలో పైకి వినబడేదే ‘’వైఖరీ! యోగశాస్త్ర పరంగా వీటి యొక్క ప్రయాణం గురించి చెప్పాలంటే, మూలాధారం నుండి నాభి, హృదయం , కంఠ, నాలుకలు. వీటన్నింటికీ మూలమైన నాదం కూడ సరస్వతీరూపమే. ఇక, భావప్రకటన కోసం చెట్లు ‘పరా’ వాక్కుని, పక్షులు ‘పశ్యంతీ’ వాక్కును, జంతువులూ ‘మధ్యమా’ వాక్కును, మనుషులు ‘వైఖరీ’ వాక్కును ఉపయోగిస్తారు


పరాస్థితిని - సంకల్పము గాను, పశ్యంతి స్థితిని భావము గాను, మధ్యమా స్థితిని సంకేతము గామ, వైఖరి స్థితిని - ఉచ్చారణ గాను - సమన్వయ పరచుకోవచ్చును

మరొక సందర్భంలో ఈ విధంగా చెప్పబడింది


‘పరా వృక్షేషు సంజాతా, పశ్యంతీ భుజగీషుచ, మధ్యమావై పశుశ్చైవ, వైఖరీ వర్ణ రూపిణీ’’.


 చెట్టు నుంచి సృష్టింపబడుతున్న చిగుళ్లు, ఆకులు, కొమ్మలు, పూలు, ఫలాలు వస్తాయి కదా . కాని తన వల్లనే వస్తున్నాయని చెట్టు గుర్తించదు. పాముకు చూడటానికి కళ్లేగాని, వినడానికి ప్రత్యేకం ఒక శ్రవణేంద్రియం అనేది లేదు. పశువు ‘‘అంబా’’ అంటుంది. కాని, అంబను (అమ్మవారిని ) తెలుసుకొనలేదు. 

పరబ్రహ్మతత్త్వ విచారణ సందర్భంలో వాక్కు నాలుగు విధాలుగా చెప్పారు. 1. పరా, 2. పశ్యంతి, 3, మధ్యమ, 4. వైఖరి. మనిషి అక్షర సముదాయాన్ని ఏర్పరచుకొని, వాటి సహాయంతో అంతులేని సాహిత్యాన్ని సృష్టించుకొన్నాడు. కాని, దృగ్గోచరమైన సృష్టికి మూలాన్ని అన్వేషించడానికి సతమతం అవుతున్నాడు. తెలుసుకొనలేక పోతున్నాడు.


 పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరీ శబ్దాలకు నిర్వచనం చెప్పే సందర్భంలో ఇచ్చిన ఈ నాలుగు ఉపమానాలు వరుసగా ఈ పదాలకు వర్తిస్తాయి. మరొక విధంగా కూడా ఈ పదాలకు అర్థం చెప్పారు.

 ఏదైనా ఒక పనిని తలపెట్టినప్పుడు తలపునకు పూర్వస్థితి ‘‘పరా వాక్కు’’. తలపు ‘‘పశ్యంతీ వాక్కు’’. ఆలోచన కార్యరూపం ధరించే ముందున్న ఊహస్థితి ‘‘మధ్యమ వాక్కు’’. తలపు కార్య రూపం ధరించడం ‘‘వైఖరీ వాక్కు’’. ‘‘పరా’’ విత్తు మొలకెత్తడానికి ముందు స్థితి.

అంటే, విత్తు భూమిలోపడి, ఉబ్బి, మొలకెత్తడానికి సిద్ధంగా ఉన్నస్థితి. మొలక విత్తులోనుంచి పైకి రావడం, అంటే ఆలోచన మొలకెత్తడం ‘‘పశ్యంతి’’. అవుతుంది.మొక్క ఎదిగి, వృక్షంగా మారడం ‘‘మధ్యమ’’ స్థితి. పూత పూయడం, పూలు ఫలాలు కావడం, పరిపూర్ణం చెందడం ‘‘వైఖరి’’

ఇక మానవుల విషయానికి వస్తే...

మానవుడు పుట్టినప్పుడు మూడు నెలల లోవు పసివాడు పరా రూపంగా ఉంటాడు. కనీసం కళ్ళుకూడా పూర్తిగా తెరవని స్థితి.

తరువాత కొన్ని నెలలు పశ్యంతి రూపంలో ఉంటాడు కేవలం చూస్తాడు. ప్రతిక్రియ చేయడు. 6 మాసాల తరువాత క్రమముగా ప్రతిక్రియ చేస్తాడు అరవడం, నవ్వడం, కొట్టడం, కరవడం మొదలగునవి. ఇలా ప్రతిక్రియ చేయడం మధ్యమా లక్షణాలు. తరువాత క్రమముగా అనంత పదజాలన్నీ ఉచ్చరిస్తాడు ఇది వైఖరీ లక్షణం.

ఇంక వాక్కు విషయానికోస్తే...

పరా వాక్కు : పరావాక్కు స్థానం మూలాధార చక్రం మరియు సహస్రార మధ్యస్త "ఓంకారము" ఆది ప్రణవము. దానికి "సిద్ధి" అని పేరు. ఈ ప్రణవము క్రమంగా మూలాధారమందు అవ్యక్త వాక్కుగా నిలచినది. ఈ వాక్కు పరా శక్తికి అభిన్నము. ఏ వికారము లేనిది , నిత్యమైనది,

పరావాక్కు నిత్యతత్త్వం కలది అందుకే ""శబ్దబ్రహ్మ""అయింది. దీనినే 'నాదం' అనికూడా అన్నారు.మూలాధార చక్రంలోని కుండలిని దాని స్థానం. 

 ఆత్మానుభూతినిచ్చేది. దీనిలో లయమైన ఋషులు దివ్య జ్ఞానాన్ని పొందారు., ఇందులో లయమైన ఎవరైననూ అపార జ్ఞానాన్ని పొందుతారు. పరా వాక్కు యొక్క విభిన్న రూపాలే పశ్యంతి, మధ్యమా, వైఖరులు.

ఈ వాగ్రూపము అంతర విషయవాసనలను గ్రహిస్తుంది. యోగులకు, జ్ఞానులకు విద్యుత్ రూపంలో దర్శనమిస్తుంది. త్రికాల జ్ఞానాన్ని కలిగిస్తుంది. 


పశ్యంతి వాక్కు :

వాక్కు లో రెండవ దశ –,పరా వాక్కు కంటే మరింత సాంద్రీభవించి ఉన్న వాగ్రూపాన్ని 'పశ్యంతి" అంటారు . "మధ్యమా" కంటే మరింత సూక్ష్మంగా ఉండి, వినడానికి వీలు లేనిదానినే "పశ్యన్తి వాక్కు" అంటారు ."పశ్యంతి" అంటే సంస్కృతం లో చూడగలిగినది లేక ఊహించ గలిగినది అని అర్ధం .పురాతన గ్రంథాలలో శబ్దం అనుభవైక వేద్యం... అంటే తెలియ దగినది అని అర్ధం .శబ్దాన్ని ఎలా చూడగలం ?మనం ఎప్పుడైనా కలలో శబ్దం విన్నామా ? ఈ ప్రత్యేక పరిమాణం కల శబ్దాన్నే, కలలో వినబడే శబ్దాన్నే పశ్యంతి అన్నారు .నిజంగా ఇది మానసిక శబ్దం .ఇది చేతన ,పాక్షిక అచేతన స్థితులలో వినిపించనిది .అది ఉపచేతన శబ్దం .అది మన మానసిక నాణ్యత కు చెందినదే కానీ... పంచేంద్రియ నాణ్యతలకు అంటే నాలుక ,గొంతు ,నోరు ల నాణ్యతలకు అందనిది .

మనము మాట్లాడవలసిన మాటకు అక్షరాలు సమకుర్చడం, పదాలు తయారుజేయడం పశ్యంతీలో జరుగుతుంది.


మనం "రామా, కృష్ణా శివా, అమ్మా . అంటూ ఉంటే... అది వైఖరి నాదం .మనం మన కళ్ళు ,నోరు మూసుకొని ఆ నామాన్ని మానసికంగా ఉచ్చరిస్తే అది మానసికంగా రంగు ,రూపాలను అంతరిక లోచనం తో దర్శించటమే "పశ్యంతి వాక్కు" .బాహ్య ప్రపంచానికి సంబంధం లేకుండా వినగలిగిన శబ్దమే పశ్యంతి .


మధ్యమా వాక్కు :

వైఖరి వాక్కు కంటే మరింత సూక్ష్మమైనది, మధ్యమ వాక్కు .వైఖరి శబ్దం యొక్క మిక్కిలి సూక్ష్మ అభివ్యక్త ధ్వని. కానీ మధ్యమా, వైఖరుల కంటే మరింత సూక్ష్మమైన నాదం .గుసగుస శబ్దంగా వినిపించేది మధ్యమ శబ్దం .అది వినికిడిపై ప్రభావం చూపలేదు .మధ్యమ శబ్దం లో అతి తక్కువ కంపనాలు కలిగి గుస గుస శబ్దమే వినిపిస్తుంది .రెండు వస్తువుల ఘర్షణ వలన శబ్దోత్పత్తి జరుగుతుంది .కాని "మధ్యమా నాదం" లో ఏ రెండు వస్తువుల తీవ్ర రాపిడి వలనకూడా వినబడేటంత శబ్దం జనించదు. "ఠక్ ఠక్" అనేట్లు శబ్దం పుట్టించితే, దాన్ని స్థూల శబ్దం అంటారు . మధ్యమ అంటే మధ్యగా ఉన్నశబ్దం . .రెండిటికి మధ్యగా ఉన్నదే."మధ్యమా" .మధ్యమా శబ్దమే గుసగుసలుగా వినిపిస్తుంది . ఇది ఆకాశంలో సంచారం చేస్తూ ఉంటుంది. నిరంతర జప శీలుర పరిణతుల స్థాయిని బట్టి ఇది దహరాకాశంలో వ్యాప్తి చెందుతుంది. సాధకుల/యోగుల స్థాయిని బట్టి, సూక్ష్మ దేహాన్ని దాటి వ్యాప్తి చెందుతుంది.

పశ్యంతి లోని పదాలకు ఇక్కడ రసము నిర్దేశం జరుగుతుంది. అంటే మాట్లాడు మాట కోపంగానా? హాస్యంగానా? శాంతంగానా? అలాగే నిష్ఠురాది భావములా? అని మరియు భాష కూడా నిర్ణయించేది మధ్యమాలోనే 

వైఖరి వాక్కు :


నాలుగవ వాగ్దశనే "వైఖరి" అంటారు . "వైఖరి" లో శబ్దం వినిపిస్తుంది ,ఉత్పత్తి అవుతుంది కూడా .మనం మాట్లాడే భాష అంతా వైఖరియే.వైఖరీ వాక్కు కఠినంగా ఉంటుంది. కఠోరంగా కూడా ఉంటుంది. రెండు వస్తువుల ఘర్షణ వలన వైఖరి "శబ్దోత్పత్తి" జరుగుతుంది . .


మొత్తం మీద మనకు తెలిసింది ఏమిటి అంటే –పరా అంటే ఆత్మ నాదం .మధ్యమ అంటే స్వర అవయవాల సూక్ష్మమైన నాణ్యత .వైఖరి కూడా భౌతిక అవయవాల వలన ఏర్పడిన సూక్ష్మ శబ్దమే . 

    నిత్యమైన శబ్దబ్రహ్మం మనం నోటితో ఉచ్చరించి, చెవులతో వినే లౌకిక శబ్దంగా పరిణమించడంలో నాలుగుదశలు చెప్పారు. 


పరా పశ్యంతీ దశలలోని శబ్దాన్ని ఉన్నత స్థాయి యోగులు తప్ప మన సాధారణ ఇంద్రియజ్ఞానంతో మనం గ్రహించలేకపోచ్చును. జపాదులవల్ల మధ్యమాదశలోని వాక్కును గుర్తించవచ్చును. ఇక వైఖరీవాక్కు ఒక్కటే మనకందరికీ తెలిసింది.


పరావాక్కు నిత్యతత్త్వం కలది.

     శబ్దబ్రహ్మము మూలాధార చక్రంలోని కుండలినియే దాని స్థానం. దీనినే 'నాదం' అనికూడా అన్నారు. పశ్యంతీ వాక్కు జననేంద్రియము వెనుకభాగమున స్వాధిస్థాన ములోను, బొడ్డుదగ్గర ఉండే మణి పూరక చక్రంలో ఉంటుంది. ఈ స్థితిలో ఉన్న వాక్కుపశ్యంతియే.ఈ పరా,పశ్యంతీ వాక్కులు రెండూ సూక్ష్మస్ఫోటములు అంటారు..అంటే మూలధార స్వాధిష్టాన మణిపూరక స్థానములలో ఉండేవి. హృదయ ప్రదేశంలోని అనాహత చక్రంలో ప్రవేశించిన తరువాత మధ్యమా వాక్కుఅంటారు అనాహత చక్రం మధ్యమా వాక్కుకు నెలవు. కంఠ ప్రాంతంలోని విశుద్ధ చక్రంలో ఆవిర్భూతమయ్యే వైఖరీవాక్కు బాహ్యము.


ఏదైనా సంకల్పం కలగగానే దాన్ని ఒక 'భావం లోకి మార్చుకోడం జరుగుతుంది. భావంలోకి మార్చబడిన వాక్కును పశ్యంతి వాక్కు' అంటారు..


భావంలోకి మార్చబడిన దాన్ని వ్యక్తం చెయ్యడానికి సంకేతాలతో ఒక 'భాష" లోకి మార్చుకోడం జరుగుతుంది. మనస్సులోనే జరిగే ఈ సంకేతాల భాషారూపంలో వున్న వాక్కును మధ్యమా వాక్కు అంటారు.


మనస్సులో ఒక భాషలో వున్న వాక్కును భౌతికంగా నోటితో ఉచ్చరిస్తే - అప్పుడు వ్యక్తమయిన వాక్కును ' వైఖరీ వాక్కు అంటారు. ఈ స్థితిలో వున్న వాక్కునే ఎదుటివారు వినగలరు. ఇంతకు పూర్వం మూడు స్థితులలోని వాక్కును వినలేరు. ఈ నాలుగు స్థితులను వరుసగా - పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరీ వాక్కు స్థితులంటారు.


   పరాస్థితిని - సంకల్పము గాను, పశ్యంతి స్థితిని - భావము గాను, మధ్యమా స్థితిని సంకేతము గాను, వైఖరి స్థితిని - ఉచ్చారణ గాను - సమన్వయ పరచుకోవచ్చును.


     లలితా సహస్ర నామావళిలో, అమ్మవారి ఒక నామం "వైఖరీ రూపా" అని ఉంటుంది.

.

   శబ్దములు కంపనములు కనుక అవి స్పష్టమైన రూపాలను జనింపజేస్తాయి. జగత్తులో ప్రతి శబ్దం ఒక రూపాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఒక నిర్దిష్టమైన మంత్రాన్ని సరైన రీతిలో, ఉచ్ఛారణ చేసినపుడు, జపించినపుడు... ఏర్పడే శబ్ద తరంగాల ప్రకంపనాలు అత్యున్నత దశలో ప్రత్యేకమైన దేవతా రూపాలను సృజిస్తాయి.

వాక్కు దేవతా రూపం. కాబట్టి వాక్కును జాగ్రత్తగా ఉపయోగించాలి.


    శబ్ద బ్రహ్మము నుండి పుట్టిన పరా వాక్కు, మరల పశ్యంతిగా ఆవిర్భవించింది. మరల మధ్యమగా మారి వైఖరిగా విస్తరించింది.


   పరా-పశ్యంతి-మధ్యమా-వైఖరికి సంబంధించి మరొక కోణం చూద్దాం.

మొదట మనకు సంభాషణ చేయాలి అన్న తలంపు పుడుతుంది. అంటే స్పందన ప్రారంభం అవుతుంది. ఈ శక్తి సహస్రారంలో ఉన్న చంద్ర మండలంలో గల శక్తి. మాటలాడాలన్న ఇచ్ఛా శక్తికి, జ్ఞాన శక్తి మరియు క్రియా శక్తి...తోడవ్వాలి కదా! యోగ పరంగా ఈ స్పందనా శక్తి "ప్రాణ శక్తి". ఈ శక్తిని లలితాదేవి గానూ, శబ్ద బ్రహ్మం గానూ భావిస్తారు. సహస్రారంలో పుట్టిన ఈ శక్తి మూలాధారాన్ని చేరుతుంది. మూలాధారం నుండి మరల, ఒకానొక కుండలినీ శక్తి రూపంలో పైకి బయలుదేరుతుంది. ఇది వాక్కు యొక్క మూల రూపం. ఈ స్థితిలో ఉన్న శక్తి పేరు "పరా". ఇదే మొదటి వాగ్రూపము. ఈ శక్తి స్వాధిష్ఠానానికి వస్తే, ఆ రూపం "పశ్యంతి". ఈ స్థితిలో శబ్ద శక్తి మనస్సు ఆధీనంలో ఉంటుంది. మనస్సు సంకల్ప వికల్పాత్మకం. ఈ ప్రభంజనంతో ఆ వాగ్రూప శక్తి విశుద్ధ చక్రం వైపుకు పరుగు తీస్తుంది. ఈ విశుద్ధ చక్రం చేరేలోగా...ఈ శక్తిని బుద్ధి అడ్డుకుంటుంది. ఈ స్థాయిలో వాక్కును "మధ్యమా" అంటారు. ఇక్కడ మనస్సు చెప్పే మాటకు బుద్ధి ఒక రూపం కల్పిస్తుంది. భాషా స్వరూపం కూడా ఇక్కడే తయారవుతుంది. మధ్యమా రూప స్పందనా శక్తి...పూర్తి వాక్య రూపం ధరిస్తుంది. ఇక్కడే అకారాది...క్షకారాంత రూపం తయారవుతుంది. ఇలా పూర్తి అయిన మధ్యమా రూపం విశుద్ధ చక్రం వైపుకు పయనిస్తుంది. 


   ఈ విశుద్ధ చక్రంలోనే... శబ్ద బ్రహ్మ రూపమైన శక్తి...వైఖరీ వాక్కుగా మారుతుంది. ఇంతవరకు పూర్తి అర్థవంతంగా తయారైన శబ్దం...వరుస క్రమంలో బయటికి వస్తూ...ఒక్కో కండరాన్ని కదిలిస్తూ...మనం వినే శబ్ద రూపంగా బయటకు వస్తుంది. ఏ వైఖరితో రావాలో నిర్ణయిస్తుంది కనుక, ఇక్కడ దీని రూపం "వైఖరీ వాక్కు".


      మన ఋషులకు వాక్కు యొక్క నాలుగు రకాలు, నాలుగు దేవతా రూపాలుగా దర్శనమిచ్చాయి. ఐం బీజాక్షరం వాగ్భకూటం ఐం లో అ + ఈ +అ +o అనేవి వరుసగా - పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరీ అని చెప్పబడింది.అయితే ఈ వాక్కు అనేది మనుజులకే కాదు. సృష్టిలో స్థావర జంగమాలన్నిటికీ ఉన్నది. రాయి,రప్పలలో "పరా" రూపంలోనూ, చెట్టు, చేమ, వృక్షాలలో "పశ్యంతి" గానూ, జంతువులలో "మధ్యమా" గానూ కూడా ఉంటుంది 

వైఖరి మానవులకే సాధ్యం అయింది


ఇక శ్రీచక్ర విషయానికి వస్తే

పరా వాక్కు బిందు స్థానం. త్రికోణంలో పశ్యంతీ వాక్కు., వసుకోణం మధ్యమా, మిగిలిన చక్రాలు అంటే దశార యుగ్మము నుండి చతురస్రం వరకు వైఖరి వాక్కు.జాగ్రత్తగా అర్ధం చేసుకొండి.


 ప్రాణంలో పరా వాక్కు, మనస్సులో పశ్యంతి వాక్కు , ఇంద్రియములందు, మధ్యమ వాక్కు వాక్ప్రటన యందు వైఖరీ వాక్కు ఉంటాయని శాస్రం చెబుతోంది . బయటకు కనబడే చెట్టుకు కనబడని వేరు ఉన్నట్లుగా , వైఖరీ వాక్కుకు లోపల పరా, పశ్యంతి, మధ్యమా ఉన్నాయి. కంఠం నుంచి పెదవి వరకు వరకు ఉన్న ఎనిమిది స్థానాలలో ఈ వశిన్యాది దేవతలు ఉన్నారు. ఈ శరీరమే ఒక శ్రీ చక్రం. వశిన్యాది ఎనిమిది దేవతలు మన శరీరంలోనే ఉండి మనకు వాక్కు కలిగిస్తున్నారు. ఈ భావనతో అమ్మని ఆరాధిస్తే దివ్యమైన అనుభూతి కలుగుతుంది.


పరమేశ్వరుని మాయాశక్తి సంకల్ప రూపమైనది. మొదటిది పరా. .(పరస్య శక్తి )పరమాత్మతో ఏకమై ఉన్నప్పుడు అది నిశ్చలం. పరమాత్మ నాశ్రయించి ఉంటే అది కేవలం పర. తన్ను తాను పరామర్శించుకొంటే పశ్యంతి. క్రిందికి దిగి సృష్టికి అభిముఖమైతే మధ్యమ. సృష్టిగా మారిపోతే వైఖరి. పరాదశలో ఉన్న ఆ వాక్కు లేదా శబ్దం పరమమైన అర్థాన్నే చెబుతుంది. వాక్కు పరమం. అది చెప్పే అర్ధమూ పరమమే. ఇవే ప్రకాశ విమర్శలని పేర్కొంటారు . అర్ధాన్ని ఎంతెంత విమర్శిస్తూ పోతే అంతంత దాని ప్రకాశం బయట పడుతుంది. పూర్తిగా విమర్శిస్తే పూర్తిగా అనుభవానికి వస్తుంది. అదే బ్రహ్మానుభవం. ఇది శబ్దార్థ సహాయంతోనే మానవుడు సాధించాలి .


వశిన్యాది అష్ట దేవతలు శ్రీచక్రంలోని సప్తమావరణము లో ఉన్న వాగ్దేవతలు. పరా, పశ్యంతి మధ్యమా, వైఖరి అని నాలుగు విధములైన వాక్కులు – ఎనిమిది విధములైన వశిన్యాది వాగ్దేవతారూపం ధరించాయి (వశినీ, కామేశ్వరీ, మోదినీ, విమలా, అరుణ, - జయినీ, కౌళినీ, సర్వేశ్వరీ వాగ్దేవతలు) . చక్రేశ్వరి త్రిపురాసిద్ధా దేవి .. ఈ వాగ్దేవతలు అక్షారల్లోని ఎనిమిది వర్గలకు అధికారిణులు

ఎనిమిది వర్గలు :: అ - క - చ - ట - త - ప - య - శ మొత్తం ఎనిమిది 

మరొక విషయం చూద్దాము 

. వజ్రేశ్వరీ నామం లో ‘అతి రహస్య శక్తి దాగి ఉన్నది ’ 

శ్రీ చక్రంలో భూపురం నుండి లెక్కించినపుడు - శ్రీచక్రంలో కేంద్రం వద్దగల బిందువు, నవమావరణం అవుతుంది. 

దీనికి ముందుండే ఎనిమిదవ ఆవరణమైన త్రికోణం యొక్క మూడు శీర్షాల వద్ద ముగ్గురు 'అతి రహస్యశక్తు' లుంటారు. 

వారే - కామేశ్వరి, వజ్రేశ్వరీ , భగమాలిని. 


ఈ ముగ్గురిలో రెండవ శక్తి పేరు వజ్రేశ్వరీ. వజ్రశరీర రూపంలో ఉండునది - అని అర్థం. 


మనలో విశుద్ధ చక్రానికి అధిష్టాన దేవత ఈ వజ్రేశ్వరీదేవి 


విశుద్ధ చక్రం ద్వారానే సర్వ వాజ్మయం వ్యక్తం కావాలి. కాబట్టి, ఈ ' వజ్రేశ్వరీ' వాక్కుకు సంబంధించి ఉంటుంది. అందుకే 'వాగ్యై వజ్రః ' అంటారు. వాక్కుకు సంబంధించి 'వజ్రేశ్వరీ' ధ్యానం చేస్తే వాక్ శక్తి స్ఫుటంగా ఉంటుంది. దీనికి సంబంధించిన మంత్ర బీజాక్షరాలు కూడా ఉన్నాయి. వజ్రేశ్వరీ కి సంబంధించిన బీజాక్షరం 'జ్రీం'. ఈ జ్రీం కి ముందు ప్రణవ బీజం, తర్వాత కామరాజబీజం కలిపితే 'ఓం క్లీం, జ్రీం ' అవుతుంది. దీన్ని 'వజ్ర మంత్రం' అంటారు. స్ఫూటంగా వాక్కు వ్యక్తమవ్వాలంటే ఈ వజ్రేశ్వరీ మంత్రాన్ని 'ఓం క్లీం జ్రీం వజ్రేశ్వర్యై నమః అని జపిస్తారు. ఇంద్రుడు జపించి వజ్రాయుధం పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ మంత్రాన్ని గురూపదేశం లేకుండా చేయరాదు. 


లలితా సహస్రం లోని శ్లోకాన్ని స్పృశించి వ్యాసం ముగిస్తాను 


""పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా 

మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ""


శ్రీచక్రంలో బిందు స్థానమే 'పరా'. పరాను ప్రత్యక్ (స్వస్వ రూపంలో అంటే బ్రహ్మ )గానే సాధన చేస్తే ' చితి ' గా అర్ధం అవుతుంది. అంటే చైతన్య రూపంగా తెలుస్తుంది. పశ్యంతి రూపాన్ని పరదేవతగా అభివర్ణించారు. శ్రీచక్రంలో త్రికోణ రూపమే పశ్యంతీ. ఆ పైన ఉండే అష్ట త్రికోణ చక్రమే ‘ మధ్యమా '. ఆపైన అన్ని ఆవరణలూ కలుపుకుని ' వైఖరీ '' అని తెలుసుకుంటున్నాము. ఈ నాలుగు రూపాలూ కలిసి ' భక్తుడి మనసు అనే ఆడ హంస ' - అని లలితా సహస్ర నామంలో వశిన్యాది వాగ్దేవతలు వర్ణించారు. మళ్ళీ ' హంస ' అన్న మాట పరమాత్మ స్వరూపాన్నే సూచిస్తుంది. అంటే - పరా దేవతని ప్రత్యక్చితీ రూపంలోనూ, భావ రూపంలో పశ్యంతీ గానూ, జప రూపంలో మంత్రాలను మనస్సులో అనుకోవడం మధ్యమాగా తెలుసుకుని, , ఆ ప్రాణశక్తి అయిన అమ్మవారిని వైఖరి గాను భావించడం జరుగుతుంది.

                         స్వస్తి 

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ 

-