*"భాగవతం వింటే బాగవుతాం"*
శ్రీ పోతన భాగవత మధురిమలు
(8-583-ఆ)
సర్వమయినచోట సర్వధనంబులు
నడుగ లే దటంచు ననృతమాడు
చెనటి పందనేమి చెప్పఁ బ్రాణము తోడి
శవము వాఁడు; వాని జన్మ మేల?
భావము:- ఏ దానం దాత సంపద అంతటికి సమానమో, ఒక ప్రక్క అది అడుగుతూ; నేను అడిగేది స్వల్పమే సమస్త సంపదలూ కాదు అంటూ అబద్ధం చెప్పరాదు కదా. ఆ విధంగా చెప్పేవాడు నీచుడు, పిరికివాడు; వాడు ప్రాణమున్న పీనుగ; వాడి బ్రతుకు వ్యర్ధము.
శ్రీ అన్నమాచార్య కీర్తనతో శుభోదయం.
*శ్రీ కృష్ణం వందే జగద్గురుం*
ధర్మో రక్షతి రక్షితః
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి