3, ఆగస్టు 2026, సోమవారం

భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                        షష్ఠమోధ్యాయః

                        ధ్యాన యోగము



యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా ।

యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి ।। 20 ।।



ప్రతిపదార్థ:



యత్ర — ఎప్పుడైతే; ఉపరమతే — ఆంతర సుఖాన్ని రమించునో; చిత్తం — మనస్సు; నిరుద్ధం — నియంత్రించబడిన; యోగ-సేవయా — యోగ అభ్యాసము చేత; యత్ర — ఎప్పుడు; చ — మరియు; ఏవ — నిజముగా; ఆత్మనా — పవిత్రమైన మనస్సు ద్వారా; ఆత్మానం — ఆత్మ; పశ్యన్ — దర్శించుచూ; ఆత్మని — ఆత్మ యందే; తుష్యతి — సంతృప్తి గా ఉండును.



తాత్పర్యము: 



ఎప్పుడైతే, మనస్సు, ప్రాపంచిక కార్యకలాపాల నుండి నిగ్రహింపబడి, యోగాభ్యాసము ద్వారా నిశ్చలంగా ఉండునో, అప్పుడు ఆ యోగి పరిశుద్ధమైన మనస్సు ద్వారా ఆత్మను దర్శించగలడు మరియు ఆంతర ఆనందంలో రమించును.



వివరణ:


ధ్యానం చేసే పద్ధతిని మరియు ధ్యానం యొక్క పరిపూర్ణ సిద్ధి స్థితిని వివరించిన పిదప, శ్రీకృష్ణుడు ఇక ఇప్పుడు, దాని పరిశ్రమ యొక్క ఫలితాలను తెలియపరుస్తున్నాడు. మనస్సు ఎప్పుడైతే శుద్ధి చేయబడుతుందో, అప్పుడు వ్యక్తి ఆత్మను శరీర-మనో-బుద్దుల కంటే వేరుగా తెలుసుకోగలుగుతాడు. ఉదాహరణకి, గ్లాసులో మురికి నీరు ఉంటే, దానిగుండా మనము చూడలేము. కానీ, ఆ నీటిలో పటిక వేస్తే, మురికి వేరైపోయి క్రిందికి దిగి, నీరు స్వచ్ఛంగా అయిపోతుంది. అదే ప్రకారంగా, మనస్సు మురికిగా ఉన్నప్పుడు, అది ఆత్మ దర్శనాన్ని తెలియకుండా చేస్తుంది; మరియు ఆత్మ యొక్క శాస్త్ర పరిజ్ఞానం, పుస్తకజ్ఞాన స్థాయిలోనే ఉండిపోతుంది. కానీ ఎప్పుడైతే, మనస్సు పవిత్రం అవుతుందో ఆత్మ అనేది అంతర్గత విజ్ఞానం ద్వారా నేరుగా అనుభవం లోనికి వస్తుంది.

కామెంట్‌లు లేవు: