28, సెప్టెంబర్ 2020, సోమవారం

మంత్రికి కరోనా… సీఎం జగన్ టెన్షన్…

 


విజయవాడ: దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‍కు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. తిరుమల బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్ పక్కనే వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా మంత్రి వారం పాటు తిరుమలలోనే మకాం వేసి ఏర్పాట్లు పూర్తి చేయించారు. బ్రహ్మోత్సవాలలో ఆయన పలువురు ప్రముఖులతో కలివిడిగా తిరిగారు. టీటీడీ ఛైర్మన్, ఈఓ, ముఖ్య అధికారులు, సీఎంవో అధికారులు, కర్ణాటక సీఎం, ఆ రాష్ట్ర అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. వీరిలో పలువురు హోం క్వారంటైన్ కు తరలినట్లు సమాచారం. 


ఈ నెల 25వ తేదీన విజయవాడ చేరుకున్న మంత్రి, స్వల్పంగా కోవిద్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు. కరోనా పాజిటివ్‍గా తేలడంతో కార్పొరేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించు కుంటున్నారు.

కామెంట్‌లు లేవు: