19, అక్టోబర్ 2020, సోమవారం

భారతం

 ఈకథ భారతం లో వుందో లేదో నాకు తెలియదు .కానీ ఆడపిల్లలు వద్దనుకునే వాళ్లకి ఈ కథ గుణపాఠం గా వుంటుందనిపించింది. 

పూర్వం ఒక అడవిలో ఒక తోడేలు నివసిస్తూ వుండేది.అదిదగ్గర వున్న గ్రామాల్లోకి వెళ్లి పిల్లల్ని ఎత్తుకొని వచ్చి 

తినేసేది.అలా ఒక రోజు అమ్మాయిని ఎత్తుకొని వచ్చింది.ఆ పాపను చూస్తే దానికి చంపబుద్ధి కాలేదు.ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకుంది.అడవిలోని తేనే,పళ్ళు తినిపించి  

పెంచి పెద్ద చేసింది.ఆ అమ్మాయికి యుక్తవయసు వచ్చాక ఒక యువకుడిని తెచ్చిఅతనికి ఆ అమ్మాయిని కన్యాదానం చేసింది. 

ఆ కన్యాదాన ఫలం వల్ల ఆ తోడేలు సగర చక్రవర్తిగా పుట్టింది.

సగరుడు ఒకసారి కొలువు తీరి వుండగా నారదుడు వచ్చి నీవు పూర్వజన్మ లో తోడేలువి.ఒక అమ్మాయిని చంపకుండా పెంచి కన్యాదానం చేసావు ఆ పుణ్య ఫలం వల్ల 

ఈ జన్మలో చక్రవర్తి వై పుట్టావు. అని చెప్తాడు.

అప్పుడు సగరుడు ఒక్క కన్యను దానం చేసినందువల్లనే చక్రవర్తిగా పుడితే చాలామంది ఆడ పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే యింకా యెంత పుణ్యమో నని ఆలోచించి తనకు 

60వేల కన్యలు పుట్టాలని కోరుకుంటూ బ్రహ్మ దేవుడిని గురించి తపస్సు చేస్తున్నాడు.సగరుడు పదహారువేల కన్యలకు తండ్రి యై 

వారందరికీ పెళ్ళిళ్ళు చేస్తే ఆ పుణ్య ఫలం వల్ల అతనికి యింద్ర పదవి లభిస్తుందని, తన పదవికే మోసం వస్తుందని ఆలోచించిఇంద్రుడు సరస్వతీ దేవిని ప్రార్థించి సగరుడు 

బ్రహం దేవుణ్ణి వరం కోరేటప్పుడు అతని నాలుకపై వుండి 60వేల పుత్రికలు అనే బదులు పుత్రులు అనేట్టుగా చేయమని కోరాడు.సరస్వతీ దేవి అలాగే చేస్తాను అని అభయమిచ్చింది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాగానే సగరుడు 60000 పుత్రికలు అనకుండా 60000 మంది పుత్రులు కావాలని కోరాడు.తన పొరపాటు గుర్తించే సరికి ఆలస్యమై పోయింది.చేసేదిలేక వెనుదిరిగాడు సగరుడు.

సగరుడికి 60000 వేల మంది పుత్రులు జన్మించారు.వారంతా పెరిగి పెద్దవా రైన తర్వాత 

సగరుడు కన్యాదాన ఫలం దక్కక పోతే నేమి అశ్వమేధయాగం చేస్తాను అని నిర్ణయించుకున్నాడు.అశ్వమేధ యాగ సమయం లో 

ఇంద్రుడు ఆ అశ్వాన్ని దొంగిలించి పాతాళం లోని ఒక గుహలో దాస్తాడు. అక్కడ కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ వుంటాడు.ఆయనకు ఒక వరముంది తన తపస్సు భగ్నం 

చేసిన వాళ్ళను ఆయన కోపంతో చూస్తే ఎదుటి వాళ్ళు భస్మమై పోతారు.

సగరుడు అశ్వాన్ని వెతికేందుకు తన తమ్ముళ్ళను పంపిస్తాడు.వాళ్ళు భూమండల మంతా వెతికి వెతికి అశ్వము ఎక్కడ వుందో కనుక్కోలేక తిరిగి వస్తారు.సగరుడు తన 

60 వేల మంది పుత్రులను పంపిస్తాడు అశ్వాన్ని వెదుకుతూ 

భూలోకం లో కనబడక పొతే పాతాళం లో వుంటుందేమో నని వారు భూమిని త్రవ్వుతూ పోతారు. పదహారువేల మంది త్రవ్వుతూ పోతే పెద్ద 

ఆఖాతము ఏర్పడుతుంది.త్రవ్వుతూ పోతూ ఆ గుహ వరకు చేరుకుంటారు.అక్కడ కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ వుంటాడు.అతనికి దగ్గరలోనే యాగాశ్వము ఒక స్తంభానికి 

కట్టి వేయబడి వుంటుంది.అది చూసి వాళ్ళు కోపోద్రిక్తు లై మునిని దూషిస్తూ ఓ!దొంగ మునీ మా యాగాశ్వమును దొంగిలించి యిక్కడ తపస్సు చేస్తున్నట్లు 

నటిస్తున్నావా?అని గట్టిగా అరుస్తారు.దీర్ఘ తపస్సులో వున్న కపిలుడు మాట్లాడడు. వారికి కోపం వచ్చి ఆయనను కొడతారు.అప్పుడు కపిలుడికి తపో భంగ మై కళ్ళు తెరుస్తాడు. 

ఆ 60 వేల మంది సగర పుత్రులు భస్మ మై బూడిదగా మారుతారు.

ఆ విషయము నారదుడి వల్ల తెలుసు కొని సగరుడు చాలా దుఖిస్తాడు. వాళ్లకు పుణ్యలోకాలు కలుగాజేయాలనుకుంటాడు.నారదుడు వచ్చి గంగను గూర్చి తపస్సు చేసి

గంగను ఆ భస్మరాసి మీదపారేట్టుగా చేస్తే వారికి పుణ్యలోకాలు కలుగు తాయని చెప్తాడు.సగరుడు వెయ్యేండ్లు తపస్సు చేసి తపస్సు చేస్తూనే మరణిస్తాడు.తరువాతి తరం వారు కూడా ప్రయత్నించి విఫలు లవుతారు.

.సగరుడికి మూడో తరం వాడైన భగీరథుడు గంగను గూర్చి తపస్సు చేసి ఆమెను మెప్పిస్తాడు.ఆమె నేను ఆకాశము నుండి క్రిందకు దూకితే నా వేగమునకు భూమి ఓర్వలేదు.నన్ను భరించే శక్తి పరమ శివుడికి మాత్రమే వుంది.ఆయనను ప్రసన్నం చేసుకొని రా అని చెప్తుంది. భగీరథుడు ఈశ్వరుడిని గూర్చి తపస్సు చేస్తాడు.శివుడు ప్రత్యక్ష మై గంగను నేను భరిస్తాను అంటాడు.

అప్పుడు గంగ ఆకాశము నుండి శివుని శిరస్సు మీదకు దూకుతుంది.శివుడు గంగను తన జటాజూటం లో బంధిస్తాడు.భగీరథుని కోరిక మేరకు తన ఒక జటవిప్పుతాడు.అందు 

లోనుంచి గంగ ఒక పాయగా భగీరథుని వెంట వస్తూ వుండగా జహ్నువు అనే ఋషి ఆశ్రమము మీదుగా ప్రవహిస్తూ ఆ ఆశ్రమాన్ని ముంచి వేస్తుంటే జహ్ను ముని కోపం తో 

గంగను తనగొంతులో బంధిస్తాడు.భగీరథుడు జహ్ను మునిని ప్రార్థించి గంగను విడిచి పెట్టమంటాడు.

ఆయన తన చెవి నుండి గంగను వదులు తాడు. .అందుకే గంగ కు జాహ్నవి అనే పేరు  

వచ్చింది. గంగ భగీరధుడి వెంట వచ్చి ఆ భస్మ రాసుల మీదుగా ప్రవహిస్తుంది.అప్పుడు సగరపుత్రులకు ఉత్తమ లోకాలు సంప్రాప్త మవుతాయి.

భగీరథుడు క్రిందకు తెచ్చినాడు కాబట్టి గంగ భాగీరథి అయింది.

సగరపుత్రులు త్రవ్విన ఆఖాతాన్ని పూడ్చడానికి ఇంద్రుడు పెద్ద వర్షము కురిపించి ఆ 

ఆఖాతాన్నినీటితో నింపి వేస్తాడు. అదే యిప్పుడు మన సముద్రము.సగర పుత్రుల చేత త్రవ్వబడినది కాబట్టి సముద్రానికి సాగరము అనే పేరు వచ్చింది..

--------------------------- --------------------------------

కామెంట్‌లు లేవు: