19, అక్టోబర్ 2020, సోమవారం

 *ప్రతిరోజూ  సంధ్యావందనం*


నిత్యకర్మకు ఫలితం ఉండదు. రోజూ స్నానం చేయడం, రోజూ సంధ్యావందనం చేయడం, వీటికి ప్రత్యేక ఫలితాలు ఉండవు.

*చేయకపోతే దోషాలుంటాయి*

రోజూ ఎందుకు చేయడం అంటే చిత్తశుద్ధి కొరకు. నైమిక్తిక కర్మ అంటే ప్రత్యేకంగా ఒక తిథినాడు చేసేటటువంటి పని. ఆ తిథినాడు ఆ పని చేస్తే ఒక ప్రత్యేకమైన ఫలితం వస్తుంది. దీపావళి పండుగనాడు తెల్లవారు ఝామున తలస్నానం చేస్తే గంగానదిలో స్నానం చేసినట్లే. ఎందుకంటే గంగ ఆ రోజున భూమండలంలో అన్ని నదుల నీళ్ళల్లోకి వస్తుంది. అందుకని ’జలే గంగా’. ’తైలే లక్ష్మీ’ - ఒంటికి నూనె రాసుకుంటే లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఆరోజున. అలక్ష్మి బయటికి వెళ్ళిపోతుంది. నైమిక్తిక తిథినాడు చేసేపనికి ప్రత్యేక ఫలితాలు ఉంటాయి. నిత్యం చేసే కర్మకి చిత్తశుద్ధి ఒక్కటే దాని ప్రయోజనం. 

కాబట్టి నిత్యకర్మ చిత్తశుద్ధి కొరకు.

నైమిక్తిక కర్మ పరమ పుణ్యాన్ని సంపాదించుకోవడం కోసం. 

ఇది నిత్యకర్మకీ, నైమిక్తిక కర్మకీ తేడా.

కామెంట్‌లు లేవు: