1, సెప్టెంబర్ 2020, మంగళవారం

హాలయ పక్షంలో

🙏♦మహాలయ పక్షం అంటే ఏమిటి బాబు అని ఒక 68 సంవత్సరాల పెద్దావిడ నన్ను అడగటం ఆశ్చర్యం కలిగింది .... అందుకే నాకు తెలిసిన విషయాలు అందిస్తున్న.
కర్ణుడు భూలోకంలో గడిపి.. స్వర్గానికి వెళ్లిన పక్షమే మహాలయ పక్షం!
***********************************************************************

🔹 భాద్రపద బహుళ పాడ్యమి నుంచి ప్రారంభమై మహాలయ అమావాస్యతో పూర్తవుతుంది.
🔹 ఈ మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి,
🔹 మీ పితృదేవతలను స్మరించి,
🔹 వారికి నమస్కారము చేస్తూ,
🔹 ” నేను పితృ పక్షము పాటించుటకు అశక్తుడను. కావున నన్ను మన్నించి, మీ దీవెనలు అందచేయండి’ అని మనస్సులో ప్రార్ధన చేయడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి.
🔹 ఇంకా మహాలయా పక్షమున పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించవచ్చు.
🔹 భాద్రపదమాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఎంత విశిష్టమైనదో,
🔹 బహుళ పక్షం పితృదేవతా పూజలకు అంత శ్రేష్ఠమైనది.
🔹 పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని, మహాలయ పక్షమని పేరు.


♦ఈ పక్షం ముగిసే వరకు..
🔹 ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను నిర్వహించాలి.
🔹కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతిచెందారో, ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి.
 🔹తండ్రి జీవించి, తల్లిని కోల్పోయినవారైతే ఈ పక్షంలో వచ్చే నవమినాడు తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించాలి.
🔹 తల్లీతండ్రీ ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి.
🔹 ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్య నైనా చేసి తీరాలి.


♦దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి...
🔹 మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది.
🔹 ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి, దప్పిక కలిగాయి.
🔹 ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది.
🔹పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు.
🔹 ఆశ్చర్యం! ఆ పండు కాస్తా బంగారపు ముద్దగా మారిపోయింది.
 🔹ఆ చెట్టుకున్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది.
🔹ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పికయినా తీర్చుకుందామనుకుని..
🔹 సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు.
🔹 ఆ నీరు కాస్తా బంగారపు నీరుగా మారిపోయింది.
 🔹స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది.
🔹 దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి, తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా...
🔹 ‘‘కర్ణా! నీవు దానశీలిగా పేరు పొందావు.
🔹 చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు.
🔹 అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు గానీ,
🔹కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు.
🔹 అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది’’అని అశరీరవాణి పలుకులు వినిపించాయి.


♦కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్రాధేయపడగా,
🔹 ఆయన కోరిక మేరకు దేవరాజయిన ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు.
🔹 నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి,
🔹అతడిని పెంచిన మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు.
 🔹ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరాడు.
🔹అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు.
🔹 పితరులకు తర్పణలు వదిలాడు. తిరిగి అమావాస్యనాడు స్వర్గానికెళ్లాడు.


♦ఎప్పుడైతే కర్ణుడు తిరిగి వచ్చి భూలోకంలో..
🔹 అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది
🔹ఆకలి తీరింది.
🔹 కర్ణుడు భూలోకంలో గడిపి, తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షమని పేరు.
🔹ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.🙏🙏

కామెంట్‌లు లేవు: