1, సెప్టెంబర్ 2020, మంగళవారం

హిందూ ధర్మం.





ప్రపంచంలో ఒకే ఒక ధర్మం భగవంతుడిని తెలుసుకునే విధానాన్ని తెలిపింది. అదే మన హిందూ ధర్మం. మనం హిందువులుగా జన్మించటం మన పూర్వ జన్మ పుణ్య ఫలం. ఇప్పుడు హిందూ మతం మీద ఇతర మతస్తుల దాడి చేస్తూవుంటే మన హిందువులు హిందుత్వం మీద అవగాహనా రాహిత్యం వల్ల వారు ఇతర మతస్తులు చెప్పేది నిజమని నమ్ముతున్నారు. అందునా కొందరు బ్రాహ్మలు హిందుత్వం మీద కావలసిన జ్ఞానం లేక హిందూ వైదిక్ విజ్ఞానం మీద సరైన అవగాహన లేకపోవటంతో మన హిందుత్వాన్ని ప్రశ్నించే విధంగా తయారవుతున్నారు. అదే బ్రాహ్మలు వారి విధి విహిత నిత్య నియమిష్టిక కర్మలను సకాలంలో చేస్తూ ఉంటే వారు ఈ విధంగా విమర్సించరు. మనం మన పూర్వికులు మనకు సూచించిన మార్గాన్ని తూచా తప్పకుండ ఆచరించటమే మనం చేయవలసిన విధి. మన సంస్కృతి సాంప్రదాయాల ప్రాముఖ్యత, వాటి విశిష్టత సాటివారికి వివరించి ఈ సమాజాన్ని ధర్మ బద్దంగా గడపేటట్లు చేయటం బ్రాహ్మణుల విధి. కానీ కొంతమంది మన సంప్రదాయాల జ్ఞానాన్ని తెలుసుకొనే దానికి ఎక్కువ శ్రర్ధ చూపక ఇతరుల మాయ మాటలకు లోనయి మన సంస్కృతిని మన ధర్మాన్ని చివరికి మన దేముళ్ళని మన వారే విమర్శిస్తున్నారంటే మనం ఇప్పుడు యెంత ప్రమాదకార స్థితిలో ఉన్నామో తెలుస్తున్నది. . 

రాముడు, క్షత్రియుడు, శ్రీకృష్టుడు యాదవుడు, హనుమంతుడు మర్కటం అని అంటమే కాక యితర మత సన్యాసులను దేముడిగా అభివర్ణిస్తూ వారు మన ధర్మానికి గ్లాని చేయటమే కాక యితరులను కూడా ధర్మము నుండి వైదొలిగేటట్లు చేస్తూ వారి మతమే మంచిదని ప్రచారం చేస్తున్నారు. సహస్రనామాలు, శతనామాలు కల్పించి మన సంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నారు. ఈ ప్రమాదాన్నుంచి మన సనాతన ధర్మాన్ని కాపాడవలసిన భాద్యత మన అందరిమీద వున్నది.

మనం ఏమి చేయాలి.

1) ప్రతి హిందువు మన సనాతన హిందూ ధర్మాన్ని గౌరవించాలి. ఇతరులు గౌరవించేట్లు ప్రయత్నించాలి.

2) మనం యితర మతాల వారిని చులకనగా చూడవద్దు. కానీ మన ధర్మాన్ని కానీ మన హిందుత్వాన్ని కానీ ఏ మతస్తుడైన చులకన చేసి మాట్లాడిన కువిమర్శ చేసిన ఊరుకోకూడదు. వారికి ధీటైన సమాధానం చెప్పాలి. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి ప్రతి హిందూ తన నిత్యా దైనందిత కార్యక్రమాలలో భాగంగా శ్రీ కృష్ణ భాగవానుడు మానవాళి మనుగడకు అర్జనునికి ఉపదేశించిన " భగవత్ గీతను" పారాయణ చేయటం అలవాటుగా చేసుకోవాలి. భగవత్ గీత ఎవరైతే చదివి ఆకళింపు చేసుకుంటారో వారు హిందుత్వం మీద పట్టు కలిగి వుంటారు. భగవానుడు మానవుడు ఎలా ఉండాలి, ఏమి చేయాలి యెట్లా చేయాలి అనే అన్ని విషయాలను ప్రతి మానవుడు అర్ధం చేసుకునేట్లు బోధించారు. భగవత్ గీత హిందువులందరికి పారాయణీయ గ్రంధము మరియు గీతా సారం అమృత తుల్యం. ప్రతి వాడు ఆచరించాలి. కృష్ణ భగవానుడు యాదవుడు అనే భావం మానుకోవాలి స్వామి సాక్షాత్ విష్ణు దేముడి అవతార పురుషుడిగా మాత్రమే భావించాలి.



3) రాముడిని క్షత్రియుడిగా చూడటం మానుకోవాలి. రాముడు ఒక ఆదర్శ పురుషుడు. రామాయణం కూలంకుషంగా చదవాలి రామాయణమును విమర్శించకుండా అందులో వున్న జ్ఞానాన్ని ఆకళింపు చేసుకోవాలి.



4) శ్రీమత్ మహా భారతం ఈ ఇతిహాసం మనం సమాజంలో ఎటువంటి మనస్తత్వాలు కలిగిం మనుషులను నిత్యం ఎదుర్కొంటున్నామో అవి అన్ని ఇందులో వున్నాయ్. ఏ మానవుడు శ్రీమత్ మహా భారతంను క్షుణ్ణంగా పఠించి అవగాహన చేసుకుంటాడో అతడు తన జీవితాన్ని ఎటువంటి వడిదుడుకులు లేకుండా సాఫీగా నడుపుకోగలడు.



5) వేదాలు అవి మాములు మనుషులు పాటించేటటువంటి సామాన్యుమైన విషయాలు కావు. కాబట్టి సాధ్యమైనంత వరకు వేదపండితుల ద్వారా మాత్రమే మనం వేదాల మహోన్నతిని తెలుసుకోగలం. ఒక పండితుడు కేవలం ఒక వేదం మాత్రమే చదవగలరు అంటే అవి యెంత ఉత్కృష్టమైనగో గమనించండి.



6) మనకు అష్టా దశ పురాణాలూ అంటే 18 పురాణాలు వున్నాయ్ అవి చదవ వచ్చు కానీ చాలా సమయం కావాలి. పౌరాణికుల ద్వారా మనం పురాణాలగూర్చి తెలుసుకోవాలి.



7) స్వర్గం, నరకం, పాపం, పుణ్యం ఇవి అన్ని సామాన్యు మానవుల సాధారణ జ్ఞ్యానం. అన్నిటికి మించిన బ్రహ్మ జ్ఞానం మన హిందూ ధర్మంలో వుంది. అది మనకు ఉపనిషత్తుల వల్ల లభ్యమవుతుంది. ప్రతి మానవుడు, ఏ కులజుడైన, స్త్రీ, పురుష తారతమ్యం లేకుండా పొందవలసిన జ్ఞానం. ఎవరైతే బ్రహ్మ జ్ఞానం పొందుతారో వారు జీవన్ముక్తులు. కోటికి ఒక్కరికి మాత్రమే బ్రహ్మ జ్ఞానం పొందాలనే ఉద్దేశం కలుగుతుంది అటువంటి వారిలో కోటికి ఒక్కరు మాత్రమే ఆ అనంత జ్ఞానం పొందగలుగుతారు అని మనకు శ్రీ కృష్ణ భగవానుడు గీతలో తెలిపారు.



హిందువులు విగ్రహారాధకులు అనే భావాన్ని ఇతర మతస్తులు చేస్తున్నారు. దయచేసి తెలుసుకోండి హిందువులు విగ్రహారాధకులు కారు, కానీ విగ్రహారాధకులు అదేమిటని మీరు అడగ వచ్చు. విగ్రహ ఆరాధన మనకు ఆరాధన పరంపరలో ఒక ప్రాధమిక స్థాయి. దీనిని వివరించా ప్రయత్నిస్తా. మనం చిన్నప్పుడు లెక్కలు నేర్చుకోవటానికి మన గురువులు మన వేళ్ళ మీద గణించటం నేర్పుతారు. ఆలా నేర్చుకొని తరువాత మనం వేళ్ళు లెక్కించకుండా లెక్కలు చేయ గలుగుతాము. ఇప్పుడు చెప్పండి లెక్కలు చేయటానికి చేతి వేళ్ళు అవసరమా. కాదు కానీ లెక్కలు నేర్చుకోటానికి మాత్రమే చేతి వేళ్ళు ఆసరాగా ఉపయోగ పడుతాయి. అదే మాదిరిగా అంటకారణ శుద్ధి కోసం మాత్రమే మనం విగ్రహారాధన చేయాలి. కానీ విగ్రహారాధనే పరమావధిగా భావించకూడదు. ఆలా భావిస్తే మనం ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించలేము.

ఒక సాధకునికి విగ్రహారాధనతో అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుందో అప్పుడు తనంతట తానె విగ్రహారాధన మాని జ్ఞ్యాన మార్గాన్ని అనుసరిస్తారు. ఈ విధంగా మనం సాధన చేయాలి.

బ్రహ్మ జ్ఞానాన్ని పొందటానికి మనకు అనేక వేదాంత గ్రంధాలు వున్నాయ్. అందులో ప్రముఖమైనవి ఉపనిషత్తులు.



హిందూ ధర్మ ఆపరమైన జ్ఞాన సంపద కలిగిన ఏకైక ధర్మం ఈ ప్రపంచంలో వున్నది. హిందువులకు వున్న జ్ఞాన సంపద మరే మతస్తులకు లేదు. హిందుత్వం గూర్చి తెలియని అమాయకులను చూసి యితర మతస్తులు మాయ మాటలు చెప్పి మత మార్పులు చేస్తున్నారు. కాబట్టి హిందూవులమైన మనమందరము ముందుగా హిందువా మహోన్నత జ్ఞానాన్ని గూర్చి తెలుసుకొని యితరులకు భోదించాలి. మనం వేరే మతస్తులం మన మతంలోకి రమ్మని పిలవము. అదే విధంగా మనం వేరే మతాల్లోకి వెళ్ళకూడదు.

హిందూ ధర్మం సమాధులను పూజించే విధానాన్ని కండిస్తుంది. అదే మన విధానం ఐతే మనం శ్రీరాముడి, శ్రీ కృష్ణుని ఇంకా అనేక సాధువుల, సత్పురుషుల సమాదులని ఆలయాలుగా చేసి పూజించేవారము. దయచేసి ఎవరైనా సమాధి పూజ, సమాధి మందిరం అని మిమ్మలిని ప్రలోభ పెడితే ప్రలోభపడొద్దు.

జై హిందు

ఓం శాంతి శాంతి శాంతిః

సర్వే జన సుఖినోభవంతు,

కామెంట్‌లు లేవు: