12, అక్టోబర్ 2020, సోమవారం

తాంబూల విశేషాలు

   - 

తాంబూల విశేషాలు

 * తాంబూలమును భుజించిన తరువాత వేసుకొనవలెను . భోజనమునకు తరువాత మూడు నాలుగుసార్లు ఒక వక్క , నాలుగు ఆకులు , సున్నము వేసుకొని సేవించవలెను . 


 * వక్కకు , ఆకులకు సరిపోవునట్లు సున్నము రాచుకొని కషాయ రసం లేక కొంచము కారము ఉండునట్లు చూచుకొని తాంబూలము వేసుకొనవలెను . 


 * భొజనమునకు ముందు తాంబులం వేయకూడదు . తాంబూలం పిప్పిని మింగకుండా ఉమ్మివేయవలెను . 


 * తాంబులం వేసుకొనుటకు ముందు నోటిని శుభ్రముగా పుక్కిలించి తాంబులం వేసుకొన్నచో నోటికి రుచిని చేకూర్చి మంగళకరముగా ఉండును. 


 * తాంబులం నోటిలో వేసుకున్న తరువాత మొదటిసారిగా వచ్చిన తాంబూల రసము మింగిన విషసమానముగా ఉండును. రెండొవసారి వచ్చినది విరోచనకారి . ఆ తరువాత వచ్చు రసము అమృతతుల్యమైనది. చక్కగా జీర్ణం చేయును . రసాయనం . 


 * పాలు తాగిన వెంటనే తాంబులం వేసుకొన్నయెడల కుష్ఠు రోగము గాని ప్రమేహరోగము గాని , మూత్రరోగము గాని కలుగును.


 * పాలు , వెలగపండు , పనస , మామిడి , అరటి , చెరకుగడ , మద్యము , మాంస రసము , కషాయము , నెయ్యి , తేనె , కొబ్బరి నీరు వాడిన ఒక గంట వరకు తాంబులం వేసుకొనిన విషముగా పరిణమించును. 


 * నేత్రవ్యాధి , క్షయ , పాండువు , భ్రమ , మద్యపానం చేయుట వలన జబ్బు పడినవారు , అపస్మారము , శ్వాస , గుండెజబ్బు , రక్తపైత్యము , గ్రహణి , అతిసారం వంటి సమస్యలతో ఇబ్బందిపడువారు తాంబూల సేవన చేయరాదు . 


 * దెబ్బలు తగిలినవారు , పిత్తరోగము , రక్తవ్యాధులు కలిగినవారు , వేడిశరీరం కలిగినవారు , మూర్చ , క్షయరోగము కలిగినవారికి తాంబులం నిషిద్దం . సంధ్యాసమయం నందు తాంబూలసేవన చేయరాదు . 


 * తమలపాకు తొడిమ వ్యాధికారకము , చివర భాగము మంచిది . సున్నము నందు ఉంచిన ఆకు ఆయుక్షీణము . ఈనెలు బుద్దిని చెడగొట్టును . కావున ఆకుల యొక్క తొడిమలు , చివరలు , ఈనెలు వదిలి సున్నము పెట్టిన ఆకును పారవేచి తాంబూల సేవన చేయుట మంచిది . 


 * సున్నము పెట్టిన ఆకు చూర్ణపర్ణం అనబడును . పురుగులచే కొట్టబడి , రుచిలేనిది అయ్యి నల్లనిరంగు కలిగిన ఆకులు మంచివి కావు . రాళ్లు కలిగి , తెల్లగా ఉండక , ఎండిపోయిన పొడి సున్నము మంచిది కాదు . 


 * తాంబులం నందు వేయు పోకకాయ మంచి ప్రదేశము నందు పుట్టినది , గట్టిది , బరువు గలది , చిక్కనిది , పగలగొట్టినచో కుందేలు మాంసపు వర్ణము కలది మంచిది . 


 * తమలపాకును మాలిన్యము లేకుండా వస్త్రముతో తుడిచి ఈనె చీల్చి , సున్నము రాచి రెండువేళ్ళ పొడుగునా పార్శ్వములు మడిచి చుట్టి తీసికొనవలెను . 


 * పోకలు కషాయ , మధురరసములు కలవిగా ఉండును. ఋక్షగుణము కలవి . త్రిదోషములను పోగొట్టును . బాగుగా వండినది త్రిదోష హరము . వండని పచ్చి వక్క దోషములను ప్రకోపింపచేయను . కారముగా ఉండు తమలపాకు మంచిది . పండిన తమలపాకు సర్వదోషములను హరించును . విశేషముగా కఫవాతములను హరించి దోషములను బేధించి అగ్నిదీప్తిని కలిగించును. క్రిమిదోషములను పోగొట్టును . 


 * కర్పూర మిశ్రితమైన తాంబూలము మనస్సుకు సంతోషమును , మిక్కిలి సంభోగ శక్తిని , మదమును కలిగించును. ముఖరోగములను , క్రిమిరోగములను పోగొట్టును . కాచుతో కూడిన తాంబూల సేవన వలన ముఖరోగములు , క్రిమిరోగములు పోవుటయే కాక దంతములకు పటుత్వంను కలిగించును. నోటి దుర్గన్ధమ్ పోవును . వాతమును , శ్లేష్మమును హరించి దోషములను చేధించి రక్తమును , పైత్యమును పెంపొందించును . 



         పైన చెప్పినవే కాకుండగా మరెన్నో అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయి . వాటి గురించి నా గ్రంథాలలో సంపూర్ణముగా వివరించాను . 


  

   గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు . 


                 కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                         9885030034

కామెంట్‌లు లేవు: