15, అక్టోబర్ 2020, గురువారం

తల్లిపాలలో కలుగు దోషాలు -

 తల్లిపాలలో కలుగు దోషాలు - శిశువుకు కలుగు ఉపద్రవాలు - 3 . 


   అంతకు ముందు పోస్టు నందు వాత , పిత్త , కఫ దోషాల వలన తల్లిపాలలో కలుగు దోషాల గురించి కొంత వివరించాను. ఇప్పుడు అలా దోషం పొందిన పాలు తాగడం వలన శిశువు కు కలుగు ఉపద్రవాల గురించి సంపూర్ణముగా వివరిస్తాను . 



 * వాతదోషం పొందిన పాలు తాగుట వలన శిశువుకు కలుగు దుష్ప్రభావాలు - 


    తల్లి యందు వాతం పెరుగుట వలన స్తన్యం యొక్క రుచి చెడిపోవును . ఇలా దోషమును పొందిన స్తన్యమును సేవించిన బాలుడు కృశించును. శిశువు వృద్ది చెందుటకు చాలాకాలం పట్టును . వాతప్రభావం వలన స్తన్యము నురుగుతో కూడుకుని ఉండును. స్తన్యము కష్టము మీద బయటకి వచ్చును. ఇట్టి స్తన్యము సేవించిన శిశువుకు కృశించిన స్వరము , మలమూత్ర బంధనం జరిగి వాతదోషము వలన శిరోరోగము , పీనసరోగము ( పీనస రోగము అనగా ముక్కు వెంట నీరు కారుతూ ఉండును ) సంభంవించును . 



 * పిత్త దోషం పొందిన పాలు తాగుట వలన శిశువుకు కలుగు ఉపద్రవాలు - 


       తల్లి యందు పిత్తము పెరుగుట వలన స్తన్యము పచ్చగా లేదా నలుపు రంగుతో వచ్చును. ఇట్టి స్తన్యమును తాగిన శిశువుకు శరీరవర్ణం మారును . చెమటయు , మలస్రావము ఎల్లప్పుడూ వేడిగా ఉండును. శరీరము ఎల్లప్పుడూ వేడిగా ఉండును . స్తన్యము నందు ఇష్టము లేకపోవుట జరుగును . పిత్తదోషము పొందిన స్తన్యమును సేవించు శిశువుకు పాండురోగము , కామెర్ల వ్యాధి సంభంవించును . 


 * కఫ దోషం పొందిన పాలు తాగుట వలన శిశువుకు కలుగు ఉపద్రవాలు - 


       తల్లి యందు కఫము పెరుగుట వలన స్తన్యము జిడ్డుగా , జిగటగా ఉండును. ఇట్టి స్తన్యము సేవించిన శిశువుకు వాంతి , బాధ , నోటి నుండి చొల్లు కారుట , ఆయాసము , దగ్గు , నోటి నుంచి అతిగా నీరు వూరుట , నేత్రములు వాచుట , మందముగా ఉండటం వంటి సమస్యలు కలుగును. 



       తరవాతి పోస్టు నందు దోషము పొందిన స్తన్యమును శుద్ది చేయు చికిత్సలు మరియు తీసుకోవలసిన ఆహారం గురించి వివరిస్తాను . 


    గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు . 


                 కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                         9885030034

కామెంట్‌లు లేవు: